Political News

కూటమి అభ్యర్ధిగా నల్లారి ?

జనజీవన స్రవంతి నుండి దాదాపు పదేళ్ళుగా దూరంగా ఉంటున్న నేతలు కూడా రాబోయే ఎన్నికల పుణ్యమాని వెలుగులోకి వస్తున్నారు. ఇలాంటి వాళ్ళల్లో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒకళ్ళు. ఇపుడు విషయం ఏమిటంటే టీడీపీ, జనసేన పొత్తులోకి బీజేపీ కూడా వచ్చి చేరబోతోందనే ప్రచారం అందరికీ తెలుసింది. పొత్తు చర్చల్లో సీట్ల సంఖ్య, పోటీచేయబోయే నియోజకవర్గాలే కీలకం. ఇదిగనుక సెట్ అయ్యిందంటే చంద్రబాబునాయుడు ఎన్డీయేలో పార్టనర్ అవుతారు. …

Read More »

బొత్సపై బాబు గంటాను దింపుతారా?

మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించినట్లేనా ? అవుననే పార్టీలో సమాధానం వినిపిస్తోంది. విషయం ఏమిటంటే గంటా మీడియాతో మాట్లాడుతు తాను రాబోయే ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లాలోనే పోటీ చేస్తానని చెప్పారు. చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసే ఉద్దేశం లేదని స్పష్టంగా ప్రకటించారు. విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో గంటాను విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో పోటీ చేయమని చంద్రబాబునాయుడు ఆదేశించారు. అయితే అక్కడ పోటీ …

Read More »

షాక్: రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి

హైదరాబాద్ నగర శివారులో షాకింగ్ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యువ ఎమ్మెల్యే, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (37) దుర్మరణం పాలయ్యారు. కారు ప్రమాదంలో ఆమె ఘటనాస్థలంలోనే మృతి చెందారు. ఆమె ప్రయాణిస్తున్న కారు పటాన్ చెర్వు ఓఆర్ఆర్ వద్ద ప్రమాదానికి గురైంది. అతి వేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రెయిలింగ్ ను ఢీ కొట్టింది. దీంతో.. ఆమె అక్కడికక్కడే మరణించారు. ఆమె పీఏ …

Read More »

టార్గెట్ @14 : రేవంత్ మ‌రిన్ని నిర్ణ‌యాలు

పార్ల‌మెంటు ఎన్నిక‌లే ల‌క్ష్యంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నా రు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 17 స్థానాల‌కు గాను.. 14 చోట్ల విజ‌యం ద‌క్కించుకుని తీరాల‌ని నిర్ణ‌యించుకున్న సీఎం రేవంత్‌.. దీనికి సంబంధించి వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల్లో మ‌రో రెండు హామీల‌ను అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ …

Read More »

ఔను.. మ‌మ్మ‌ల్ని వాళ్లే పిలిచారు: టీడీపీ క్లారిటీ

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో బీజేపీతో క‌లిసి ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న టీడీపీ ఆదిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే టీడీపీ అదినేత చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్ద‌ల‌ను క‌లిసి వ‌చ్చారు. అయితే..త‌ర్వాత దీనిపై ఏం జ‌రిగిందనేది మాత్రం బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు పూర్తిగా మౌనం దాల్చారు. మ‌రోవైపు బీజేపీ కూడా కేంద్రం పెద్ద‌లు తీసుకునే నిర్ణ‌యాన్ని బ‌ట్టి తాము న‌డుస్తామ‌ని చెప్పిందే త‌ప్ప‌.. …

Read More »

జ‌గ‌న్ ఇంటి ముట్ట‌డి- ష‌ర్మిల మ‌రో పిలుపు

ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. తాజాగా మ‌రో పిలుపునిచ్చారు. శుక్ర‌వారం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఇంటిని ముట్ట‌డిస్తామ‌ని ఆమె తెలిపారు. తాజాగా విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జ‌గ‌న్ నిరంకుశ ధోర‌ణిని ప్ర‌తి ఒక్క‌రూ గ‌మ‌నించాల‌ని అన్నారు. మెగా డీఎస్సీ కోసం ఉద్య‌మిస్తున్న విద్యార్థుల‌ను ప‌ట్టించుకోకుండా.. వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని అడిగితే పోలీసులు ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారని ప్ర‌శ్నించారు. మెగా డీఎస్సీ పేరుతో …

Read More »

టీడీపీలో జీఎస్‌.. వైసీపీకి భారీ దెబ్బేనా…!

ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైన నేప‌థ్యంలో జంపింగులు కామ‌న్‌గా మారిపోయాయి. టికెట్లు ద‌క్క‌ని వారు.. త‌మ‌కు న‌చ్చ‌ని సీటును ఇవ్వ‌లేద‌ని భావిస్తున్న‌వారు.. పార్టీలు మారుతున్నారు. ఈ జంపింగులకు ఎవ‌రూ అతీతులు కాకుండా పోయారు. ఇదిలావుంటే.. వైసీపీకి ఇప్ప‌టి వ‌ర‌కు అన్ని విధాలా అండ‌గా ఉన్న గెదెల శ్రీను.. ఉర‌ఫ్ జీఎస్‌గా పిలుచుకునే యువ పారిశ్రామిక వేత్త‌.. త్వ‌ర‌లోనే టీడీపీలో చేర‌నున్న‌ట్టు తెలిసింది. ఉత్త‌రాంధ్ర‌కు చెందిన జీఎస్‌.. ఇటీవ‌ల శంఖారావం స‌భ‌కు వ‌చ్చిన …

Read More »

ఈ ఈక్వేషన్లను నాగబాబు దాటుతారా?

మిగిలిన పార్లమెంట్ సీట్ల సంగతిని పక్కన పెట్టేస్తే ఉత్తరాంధ్రలోని అనకాపల్లి లోక్ సభకు నాగబాబు పోటీ చేయటం దాదాపు ఖాయమైపోయింది. ఈ విషయం నాగబాబు ప్రకటనల్లోనే స్పష్టంగా తెలుస్తోంది. అయితే జనసేన నేతల్లో మొదలైన ప్రశ్న ఏమిటంటే నాగబాబు అనకాపల్లిలో గెలవగలరా ? అని. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఉన్నన్ని కులాలు ఇంకెక్కడా ఉండవు. మిగిలిన నియోజకవర్గాలను వదిలేసినా అనకాపల్లిలో తూర్పుకాపులు, కొప్పుల వెలమలు చాలా బలమైన సామాజికవర్గాలు. ఈ రెండు …

Read More »

‘మీ క‌న్నా చంద్ర‌బాబే న‌యం’ – షర్మిల

“మీ క‌న్నా చంద్ర‌బాబే న‌యం జ‌గ‌న‌న్న‌గారూ” అంటూ.. ఏపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల వ్యాఖ్యానించారు. తాజాగా డీఎస్సీ ఉద్యోగాల విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌ను నిలువునా మోసం చేసింద‌ని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో చ‌లో సెక్ర‌టేరియెట్‌కు ఆమె పిలుపునిచ్చారు. అయితే.. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. అనుమ‌తులు లేవ‌ని తేల్చి చెప్పారు. అంతేకాదు.. అనుమ‌తులు లేక‌పోయినా నిర‌స‌న కొన‌సాగిస్తామంటూ.. రోడ్ల మీద‌కు వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌ను పోలీసులు అరెస్టు …

Read More »

విడ‌ద‌ల ర‌జ‌నీపై టీడీపీ షాకింగ్ ఈక్వేష‌న్‌

వైసీపీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై చంద్ర‌బాబు సేమ్ టు సేమ్ అస్త్రం వేసేందుకు రెడీ అవుతున్నారు. ప్ర‌స్తుతం చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యేగా ఉన్న ర‌జ‌నీపై అక్క‌డ తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌న్న అంచ‌నాల నేప‌థ్యంలో ఆమెను ఎలాగైనా అసెంబ్లీలో ఉండేలా చూడాల‌ని జ‌గ‌న్ నిర్ణయించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమెను గుంటూరు వెస్ట్ సీటుకు మార్చారు. గుంటూరు వెస్ట్ ఇన్‌చార్జ్‌గా నియ‌మితులైన ఆమె ప్ర‌చారాన్ని స్పీడ‌ప్ చేసేశారు. వెస్ట్‌లో ర‌జ‌నీని ఓడించాలంటే ఎవ‌రిని రంగంలోకి …

Read More »

చింత‌ల‌పూడి తెర‌పైకి ఫ్రెష్ క్యాండెట్‌ను దింపిన చంద్ర‌బాబు

నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల ఎంపిక‌లో స్పీడ్ పెంచిన చంద్ర‌బాబు రెండు రోజుల వ్య‌వ‌ధిలో రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కు కొత్త ఇన్‌చార్జ్‌ల‌ను నియ‌మించారు. ఈ రెండూ ఏలూరు జిల్లాలోనివే కావ‌డం విశేషం. ముందు నూజివీడుకు మాజీ మంత్రి, ప్ర‌స్తుత పెన‌మ‌లూరు ఎమ్మెల్యే కొలుసు పార్థ‌సారథిని నియ‌మించ‌గా… అదే జిల్లాలోని చింత‌ల‌పూడి ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ సీటుకు ఎన్నారై సొంగా రోష‌న్‌కుమార్‌ను నియ‌మించారు. గ‌త మూడున్న‌ర సంవ‌త్స‌రాలుగా పార్టీకి ఇన్‌చార్జ్ అంటూ ఎవ్వ‌రూ లేకుండా దిక్కూమొక్కూ లేకుండా …

Read More »

ఖాన్ క‌ల‌క‌లం.. విజ‌య‌వాడ టీడీపీలో అర్ధ‌రాత్రి హ‌డావుడి!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా విజ‌యం ద‌క్కించుకుని తీరాల‌ని భావిస్తున్న ప్ర‌ధాన ప్ర‌తిపక్షం టీడీపీ.. ఆ దిశగా జ‌న‌సేన‌తో ఇప్ప‌టికే పొత్తు పెట్టుకుంది. రాబోయే రోజుల్లో బీజేపీతోనూ చేతులు క‌ల‌పాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చింది. అయితే.. ఈ పొత్తులే.. పార్టీకి విచ్చుక‌త్తులుగా మారుతున్నాయి. చాలా చోట్ల నాయ‌కులు.. ఆగ్రహంతో ర‌గిలిపోతున్నారు. త‌మ‌కు టికెట్ లేకుండా చేస్తారా? అంటూ.. వారి వారి మార్గాల్లో అధిష్టానం పై ఒత్తిడి పెంచుతున్నారు. ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని నూజివీడులో అబ్య‌ర్థిని …

Read More »