Political News

ఇలాగైతే ఏ ఒక్క వైసీపీ ఇంచార్జీ పాస్ కాలేడు!

ఏపీలో విపక్ష వైసీపీ తన ప్రస్థానంలో ఎన్నడూ లేనంత దీన స్థితిలో కొనసాగుతోందని చెప్పాలి. 151 సీట్లతో అత్యంత బలంగా కనిపించిన వైసీపీ… 2024 ఎన్నికల్లో ఒకే దెబ్బకు 11 సీట్లకు పడిపోయిన వైనమే ఆ పార్టీ దీన స్థితిని కళ్లకు కట్టినట్టు చెబుతోంది. ఈ షాక్ నుంచి ఇంకా వైసీపీ ఇంచార్జీలెవరూ తేరుకోలేదనే చెప్పాలి. అలాంటి వారిపై ఇప్పుడు పార్టీ అదినేత హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి …

Read More »

లోకేశ్ బిగ్ అనౌన్స్ మెంట్ ఇదే

ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ అనౌన్స్ మెంట్ చేయబోతున్నాను అంటూ టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ చెప్పిన సంగతి తెలిసిందే. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేశ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరగుతున్న తొలి మహానాడు సందర్భంగా లోకేశ్ చేయబోతున్న ఆ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. ఈ క్రమంలోనే తన తాత ఎన్టీఆర్, తండ్రి సీబీఎన్ బాటలోనే మహిళలకు పెద్దపీట వేసేలాగా …

Read More »

గొడ్డలి పార్టీ నెవర్ అగైన్: చంద్రబాబు

ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు టీడీపీ మహానాడు కార్యక్రమం మంగళగిరిలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది హైబ్రిడ్ విధానంలో మహానాడు జరుగుతోంది. ఈ క్రమంలోనే తొలి రోజు మహానాడులో ప్రారంభోపన్యాసం చేసిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది వాహనాల హోరు తగ్గిందని…కానీ, టీడీపీ కార్యకర్తల్లో జోష్ తగ్గలేదని చంద్రబాబు అన్నారు. అయితే, మహానాడు నుంచి ప్రజల దృష్టిని …

Read More »

జ‌న‌సేనాని అర్థ‌మ‌వుతున్నారా ..!

రాజ‌కీయాల్లో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు.. పార్టీల‌కు బ‌ల‌మే. దీనిని ఎవ‌రూ కాద‌న‌రు. కానీ, సంఖ్యా బ‌లం ఉంటే స‌రిపోదు.. అధినేత వేసే అడుగులు.. తీసుకునే నిర్ణ‌యాలు.. చేసే వ్యూహాల‌ను కూడా.. కార్య‌క‌ర్త‌లు నాయ‌కులు అర్ధం చేసుకోవాలి. ఇది అర్ధం కానంత వ‌ర‌కు ఏ పార్టీ కూడా.. ముందుకు సాగే ప‌రిస్థితి ఉండ‌దు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో జ‌న‌సేన పార్టీకి కావాల్సినంత మంది కార్య‌క‌ర్త‌లు ఉన్నారు. వారు.. ప‌వ‌న్‌పై అభిమానంతో ఉన్నారా? లేక‌.. పార్టీపై …

Read More »

జగన్ ‘గ్రీవెన్స్’ మొదలెట్టినట్టేనా…?

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా ఫిర్యాదుల స్వీకరణను మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. మంగళవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ మాదిరిగా ఓ భారీ కార్యక్రమమే నడిచింది. జగన్ కు తమ సమస్యలను చెప్పుకునేందుకు పెద్ద సంఖ్యలోనే జనం వచ్చారు. వీరిలో జగన్ కు ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చిన వారి కంటే జగన్ ను కలిసి ఆయనతో ఫొటోలు తీసుకునేందుకు వచ్చిన వారే …

Read More »

కాలుష్యం విషయంలో పవన్ కాంప్రమైజ్ అవ్వరు బ్రో

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తూర్పుగోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న అక్కడి ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా కాలుష్య కాసారాలుగా మారిన ప్ర‌ధాన కాలువ‌ల నుంచి వ‌చ్చే నీరు ప‌విత్ర గోదావ‌రి న‌దిలో క‌లుస్తుండ‌డాన్ని గ‌మ‌నించారు. వాస్త‌వానికి.. అధికారులు ఈ స‌మ‌యంలో అంతా బాగానే ఉంద‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేయ‌గా.. క్షేత్ర‌స్థాయిలో న‌డుస్తూ.. ప‌రిస్థితుల‌ను తెలుసుకున్న ప‌వ‌న్‌.. కాలుష్యంపై క‌న్నెర్ర చేశారు. గోదావ‌రి నదిలోకి …

Read More »

నాగేశ్వర్ అరెస్టుపై పవన్ నిర్ణయం భేష్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆయా విషయాలపై తీసుకుంటున్న నిర్ణయాలు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఏ విషయంపై అయినా పవన్ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు కనిపించినా… ఆయా అంశాలపై ఆయన చాలా లోతుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలేనని చెప్పక తప్పదు. ఇందుకు ఉదాహరణగానే ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్టుపై పవన్ తీసుకున్న నిర్ణయమని చెప్పాలి. రాజకీయ విశ్లేషకుడిగా నాగేశ్వర్ ఏదో పొరపాటున అలా మాట్లాడి ఉంటారన్న పవన్… …

Read More »

విజయ్ కి వద్దన్నా పెరుగుతున్న మద్దతు

ఎక్కడైనా అదికార పార్టీ ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలను లాగేందుకు తనదైన శైలి అస్త్రాలను ప్రయోగిస్తుంది. అయితే తమిళనాట జరుగుతున్న పరిణామాలు మాత్రం పార్టీ ఫిరాయింపుల కిందకు రావనే చెప్పాలి. ఎందుకంటే.. అక్కడ కొత్తగా అదికారం చేపట్టిన విజయ్ పార్టీ టీవీకేకు వద్దన్నా మద్దతు పెరుగుతోంది. విజయ్ పిలవకున్నా కూడా ఆయా పార్టీల ఎమ్మెల్యేలు… తమ పదవులతో పాటు పార్టీలకూ రాజీనామాలు చేసి మరీ విజయ్ చెంతకు చేరుతున్నారు. ఈ …

Read More »

ఈసారి మహానాడు స్పెషల్ బ్రో

ఏపీలో అధికార కూటమి రథసారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ) తన వార్షిక వేడుక మహానాడు నిర్వహణకు సర్వం సిద్ధమైంది. బుధవారం మొదలుకానున్న ఈ వేడుక రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనుంది. ఏటా ఏదో ఒక ప్రాంతంలో తెలుగు నేల నలుమూలల నుంచి తరలివచ్చే లక్షలాది మంది టీడీపీ కార్యకర్తల సమక్షంలో జరిగే ఈ వేడుక… ఈ సారి మాత్రం హైబ్రిడ్ పద్ధతిలో జరుగుతోంది. ప్రధాని మోదీ …

Read More »

తేడా వస్తే మన తన చూడని పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్… ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో గడచిన రెండు రోజులుగా గోదావరి పుష్కరాల చుట్టూనే తిరుగుతున్నారు. గోదావరి పుష్కర ఏర్పాట్ల పరిశీలన కోసం ఆదివారం రాత్రి రాజమహేంద్రవరం చేరుకున్న పవన్… సోమవారం గోదావరి తీరాన్ని పరిశీలించారు. మంగళవారం కూడా ఆయన ఆ పరిసరాల్లోనే తిరుగుతున్నారు. ఈ సందర్భంగా తన సొంత పార్టీకి చెందిన నేత, మంత్రి కందుల దుర్గేశ్ కే క్లాస్ పీకారు. ప్రజల సంక్షేమం …

Read More »

కాపు నేతలకు పవన్ ఓపెన్ ఛాలెంజ్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గడచిన రెండు రోజులుగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ సాగుతున్నారు. ప్రభుత్వ పరంగానే కాకుండా రాజకీయాల పరంగానూ పవన్ నోట నుంచి నిజంగానే సంచలన వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి. గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్ల పరిశీలన కోసం ఆదివారం రాత్రి రాజమహేంద్రవరం చేరిన పవన్… సోమ, మంగళవారాల్లో పనులను పరిశీలించారు. ఈ రెండు రోజుల్లో సాయంత్రం అయ్యేసరికి ఆయన పార్టీ శ్రేణులతో …

Read More »

పోలీసుల కస్టడీకి బండి భగీరథ్!

పోక్సో కేసులో బండి భగీరథ్ మే నెల 16వ తేదీన అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. చర్లపల్లి జైల్లో భగీరథ్ జ్యుడీషియల్ రిమాండ్ పై ఉన్నారు ఈ నేపథ్యంలోనే అతడిని పోలీసులు కస్టడీకి కోరకపోవడంపై ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు పోలీసులు భగీరథ్ ను కస్టడీకి కోరారు. ఈ క్రమంలోనే భగీరథ్ ను మూడు రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ మల్కాజ్ …

Read More »