కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్ తగిలింది. రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచిన మీనాక్షి నామినేషన్ ను తిరస్కరించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి మీనాక్షితో పాటు మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. నామినేషన్ల గడువు ముగిసిన నేపథ్యంలో ఇక మీనాక్షి రాజ్యసభకు వెళ్లడం దుస్సాధ్యమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ కోటాలో మూడు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు …
Read More »పవన్-లోకేష్… బాధ్యత పంచుకున్నారు!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. జనసేన పార్టీ అధినేతగా పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు. తాజాగా తొలిసారి ఒకే సమయంలో ఇద్దరు నేతలుకూడా విశాఖలో పర్యటించారు. సోమవారం సాయంత్రం విశాఖలోని స్టీల్ప్లాంట్ జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మృతి చెందడం తో పాటుపలువురు గాయపడ్డారు. వీరిని …
Read More »రేపు విశాఖకు వైఎస్ జగన్
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించనున్న ఆయన… ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పలకరించనున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కూడా ఆయన సందర్శించే అవకాశాలు ఉన్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ …
Read More »రూ.25 లక్షల పరిహారం… ఓ శాశ్వత ఉద్యోగం
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్తితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్లాంట్ లో ద్రవ ఉక్కును తరలిస్తున్న సమయంంలో దానిని తీసుకెళుతున్న బకెట్ లకు రంద్రం పడి ద్రవ ఉక్కు కిందిపడిపోయి ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ప్లాంట్ ఉధ్యోగులు, కార్మకులపై ఆ ద్రవ ఉక్కు …
Read More »మీనాక్షి కోసం డీకే క్యాంపు
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా సిద్ధంగానే ఉంటారని చెప్పాలి. తాజాగా జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల వేళ… మధ్యప్రదేశ్ లో పోరాడి మరీ గెలవాల్సిన రాజ్యసభ సీటును దక్కించుకునేందుకు పార్టీ సిద్ధం కాగా.. అందుకు తన వంతుగా సాయం చేసేందుకు డీకే రంగంలోకి దిగిపోయారు. మధ్యప్రదేశ్ కోటాలో టీపీసీసీ ఇంచార్జీగా పనిచేస్తున్న మీనాక్షి నటరాజన్ బరిలోకి …
Read More »స్టీల్ ప్లాంట్ బాధితుల పరామర్శలో ఎందుకీ రచ్చ?
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ క్రమంలో ప్రమాదంపై పరిశీలన జరపడంతో పాటుగా ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ఓదార్పుతో పాటు క్షతగాత్రుల ఫ్యామిలీలను పరామర్శించే నిమిత్తం మంగళవారం పొద్దున్నే లోకేశ్ విశాఖలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కేజీహెచ్ ఆసుపత్రి వద్ద మృతుల కుటుంబాలను పరామర్శిస్తున్న సమయంలో …
Read More »కాంగ్రెస్ మంత్రితో బీజేపీ ఎంపీ భేటీ!
జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితి. అలాంటిది కాంగ్రెస్ మంత్రితో బీజేపీ ఎంపీ భేటీ అంటే ఒకింత స్పెషలే కదా. ఈ స్పెషల్ సోమవారం భాగ్యనగరి హైదరాబాద్ లో చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి వచ్చిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య… తెలంగాణ కేబినెట్ లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్న పొన్నం ప్రభాకర్ తో …
Read More »శోక సంద్రంలో ‘విజయోత్సవం’ వద్దబ్బా
ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరి రెండేల్లు అవుతోంది. మూడు పార్టీల కలయికతో ఏర్పడిన కూటమి… 2024 ఎన్నికల్లో అత్యంత కష్టతరమైన పరిస్థితుల్లో ధైర్యంగా ఎన్నికలకు వెళ్లి… అధికారం దక్కించుకున్న తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ లెక్కన కూటమి సర్కారు కొలువుదీరి రెండేళ్లు పూర్తి అయిన సమయాన… మూడు పార్టీల కూటమి విజయోత్సవాలు చేసుకోవాలి కదా. తప్పనిసరిగా చేసుకోవాల్సిందే. అయితే విజయోత్సవాల ప్రారంభానికి ఓ రోజు ముందుగా ఏపీకే తలమానికంగా నిలుస్తున్న …
Read More »వైసీపీలో హాట్ టాపిక్: ఈ నియోజకవర్గాల మాటేంటి ..!
గత ఎన్నికల సమయంలో కొందరు నాయకులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో వారు ఓడిపోయారు. అయితే.. ఆ తర్వాత పలువురు నేతలు.. పార్టీ మారారు. అలాంటి నియోజకవర్గాల్లో ఇప్పటికీ వైసీపీ రాజకీయాలు ఒకదారికి రాకపోవడం గమనార్హం. ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిని సరిదిద్దాలన్న సూచనలు వస్తున్నా.. ఇప్పటికీ.. పార్టీ అధిష్టానం పట్టించుకోకపోవడం గమనార్హం. దీంతో ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటనేది వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. జగ్గయ్యపేట.. ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన సామినేని …
Read More »సత్యనారాయణ సంతసం.. మాట నెరవేర్చిన చంద్రబాబు!
సత్యనారాయణ గారూ.. రేపు సిద్ధాంతం వస్తున్నా.. అక్కడ కలుద్దాం. అంటూ 96 ఏళ్ల వృద్ధుడు సత్యనారాయణకు ఆదివారం సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా ఇచ్చిన హామీని నెరవేర్చారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని సిద్ధాంతంలో పర్యటించిన చంద్రబాబు సుదీర్ఘ సమయం ఇక్కడే గడిపారు. రైతులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం.. పొలాలను పరిశీలించారు. అలానే వారికి పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా అందించారు. ఈ కార్యక్రమాలతోను సుమారు సమయం సాయంత్రం …
Read More »‘హిట్లర్’ రచ్చకు ఫుల్ స్టాప్ ఎప్పుడో…?
తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇప్పుడు హిట్లర్ పేరుపై రచ్చ సాగుతోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య హిట్లర్ పేరు ఆధారంగా సాగుతున్న వాదోపవాదాలు రచ్చను తలపిస్తున్నాయి. ఇప్పటికే ముగ్గురు కీలక నేతలు ఈ వ్యవహారంపై తమదైన శైలిలో వ్యాఖ్యలు చేయగా… ఆ వ్యాఖ్యలపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చ నడుస్తోంది. అసలు ఈ హిట్లర్ రచ్చకు ఫుల్ స్టాప్ అనేది ఎప్పుడు అంటూ పలువురు …
Read More »ప్రమాదంపై రాజకీయాలేల బాసూ…!
ఏపీకి బ్రాండ్ గా కొనసాగుతున్న విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు అక్కడిక్కడే చనిపోయారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు ఆందోళన రేకెత్తిస్తోంది. అయితే ఈ ప్రమాదంపై అందరికంటే ముందుగా స్పందించిన వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రమాదం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో భాగంగానే జరిగిందన్న …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates