Political News

ఏపీ బ‌డ్జెట్‌: లోకేష్‌- ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌కే ఎక్కువ సొమ్ములు!

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌ల‌కు ఆర్థిక మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ పెద్ద‌పీట వేశారు. వారు చూస్తున్న శాఖ‌ల‌కు అధిక మొత్తంలో సొమ్ములు కేటాయించారు. వాస్త‌వంగా ఏపీ వార్షిక బడ్జెట్ 3,32,205 కోట్ల రూపాయ‌లు కాగా.. దీనిలో 32 వేల 308 కోట్ల రూపాయ‌ల‌ను మంత్రి లోకేష్ సార‌థ్యంలోని పాఠ‌శాల విద్య‌కే కేటాయించారు. దీనివ‌ల్ల …

Read More »

అమ‌రావ‌తి-పోల‌వ‌రం ప‌రుగులు.. బ‌డ్జెట్ కేటాయింపులు ఇవీ!

ఏపీ ప్ర‌భుత్వం కీల‌కంగా భావిస్తున్న పోల‌వ‌రం సాగునీటి ప్రాజెక్టు, రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి ఇక‌, ప‌రుగులు పెట్ట‌నున్నాయి. తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ఈ రెండు ప్రాజెక్టుల‌కు భారీ ఎత్తున నిధులు కేటాయించారు. వేరే ప‌ద్దుల్లో చూపించ‌కుండా.. నేరుగానే ఆయా ప్రాజెక్టుల‌కు నిధులు కేటాయించ‌డం విశేషం. పోల‌వ‌రానికి 6105 కోట్ల రూపాయ‌ల‌ను, అమ‌రావ‌తికి 6000 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించారు. వాస్త‌వానికి గ‌త 2025-26 బ‌డ్జెట్లోనూ దాదాపు ఇంతే …

Read More »

బీఆర్ఎస్‌-కాంగ్రెస్‌లకు వాలంటైన్స్ డే శుభాకాంక్ష‌లు: బండి

బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు, కేంద్ర మంత్రి బండి సంజ‌య్.. అధికార కాంగ్రెస్‌, ప్రధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్‌ల‌పై సెటైర్లు పేల్చారు. ఈ రెండు పార్టీలకు వాలంటైన్స్ డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాన‌ని, వారి అక్ర‌మ సంబంధం.. ఇదే విధంగా కొన‌సాగాల‌ని.. ప్ర‌జ‌ల ఛీత్కారాలు కూడా ఇలానే ఉండాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్టు తెలిపారు. బీఆర్ఎస్‌-కాంగ్రెస్‌-ఎంఐఎం పార్టీలకు వాలంటైన్స్ డే శుభాకాంక్ష‌లు చెబుతున్నానన్నారు. కాంగ్రెస్‌తో సంసారం చేస్తూ.. బీఆర్ఎస్‌తో క‌న్నుకొడుతోందంటూ.. ఎంఐఎంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. “బీఆర్ …

Read More »

ఏపీ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌.. బ‌డ్జెట్‌కు పూజ‌లు!

ఏపీ చ‌రిత్ర‌లో.. ఆ మాట‌కు వ‌స్తే.. దేశ చ‌రిత్ర‌లోనే తొలిసారి బ‌డ్జెట్ కు పూజ‌లు చేయ‌డం.. దేవుడి చెంత‌న ఉంచ‌డం.. వంటివి ఆస‌క్తిగా మారాయి. ఏపీలో 2026-27 వార్షిక బ‌డ్జెట్‌ను శ‌నివారం(ఫిబ్ర‌వ‌రి-14) అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. అయితే.. సంప్ర‌దాయం ప్ర‌కారం.. తొలుత బ‌డ్జెట్ ప‌త్రాల‌ను(బుక్‌లెట్ అయినా.. డిజిట‌ల్ అయినా) స‌భా నాయ‌కుడు అయిన‌.. ముఖ్య‌మంత్రికి.. ఆర్థిక మంత్రి అందిస్తారు. ఆయ‌న ఆ బ‌డ్జెట్ ప్ర‌తుల‌ను తీసుకుని తిరిగి.. ఆర్థిక మంత్రికి …

Read More »

చ‌రిత్ర‌లో ఫస్ట్ టైమ్: బీఆర్ ఎస్ ఎంత వీకైందంటే!

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో భారత రాష్ట్ర సమితి ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. రాష్ట్రాన్ని సాధించామ‌ని, దశాబ్దాల ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలా చేసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టామ‌ని చెప్పుకొనే ఆ పార్టీకి 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుస దెబ్బలు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కలేదు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ ఎస్ తీవ్ర నిరాశనే ఎదుర్కొంది. 17 పార్లమెంట్ స్థానాల్లో ఒక్క …

Read More »

రోజుకు ఇద్ద‌రు చొప్పున‌.. 40 మంది ఎమ్మెల్యేకు బాబు క్లాస్‌!

రాజ‌కీయంగా కావొచ్చు.. ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునే విష‌యంలో కావొచ్చు.. అత్యంత వెనుక‌బ‌డిన ఎమ్మెల్యేలకు మార్గ‌నిర్దేశం చేసేందుకు టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు రెడీ అయ్యారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల సమయంలోనే వారితో చ‌ర్చించి.. వారి వెనుక‌బాటుకు కార‌ణాల‌ను వివ‌రించి.. మార్పు దిశ‌గా వారిని ముందుకు న‌డిపించ‌నున్నారు. దీనికి సంబంధించిన కార్యాచ‌ర‌ణ‌నుకూడా రెడీ చేసుకున్నారు. టీడీపీ త‌ర‌ఫున 2024లో 135 మంది ఎమ్మెల్యేలు విజ‌యం ద‌క్కించుకున్నారు. వీరిలో 40 మంది ఎమ్మెల్యే …

Read More »

తెలంగాణలో జనసేన, టీడీపీ బోణీ!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ నిలిచాయి. అయితే, ఈ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలతోపాటు అనూహ్య విజయాలు నమోదయ్యాయి. తెలంగాణలో జనసేన, టీడీపీ బోణీ కొట్టాయి. తెలంగాణలో ఒకప్పుడు బలంగా ఉన్న టీడీపీ కొంతకాలంగా బలహీనపడింది. ఈ క్రమంలోనే అక్కడ పూర్వ వైభవం కోసం పోరాడుతున్న టీడీపీ బోణీ కొట్టింది. ఖమ్మం జిల్లా మధిరలో తెలుగుదేశం …

Read More »

విజయోత్సాహంలో రేవంత్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. 116 మున్సిపాలిటీలకు గాను 64 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 13 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గెలుపొందగా…38 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ దక్కించుకుంది వార్డుల వారీగా 2582 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 1347 వార్డులు దక్కించుకుంది. బీఆర్ఎస్ 717 వార్డుల్లో,బీజేపీ 261 వార్డుల్లో, ఇతరులు 256 వార్డుల్లో విజయం సాధించారు. ఈ …

Read More »

బీజేపీకి మరింత దగ్గరవుతున్న సాయిరెడ్డి!

వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని కొద్ది నెలల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత యూ టర్న్ తీసుకున్న సాయిరెడ్డి…వైసీపీపై, జగన్ పై సునిశిత విమర్శలు చేయడం మొదలుబెట్టారు. లిక్కర్ స్కాం వ్యవహారంపై సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఈ క్రమంలోనే సాయిరెడ్డి బీజేపీలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. ఆ దిశగానే సాయిరెడ్డి సందర్భానుసారంగా …

Read More »

జగన్ తల్లిని అవమానించినా వదిలిపెట్టం… లోకేష్ వార్నింగ్!

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. చంద్రబాబును దూషించన అంబటిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తల్లిని దూషించిన అంబటిపై మండిపడ్డారు. అయితే, అంబటి వ్యాఖ్యలను జగన్ సమర్థించడం…రెండు మాటలన్నారు అని వెనకేసుకురావడం టీడీపీ శ్రేణులకు మరింత ఆగ్రహం తెప్పించింది. ఈ క్రమంలోనే శాసన మండలి సమావేశాల సందర్భంగా …

Read More »

ఆలయాలపై నిర్లక్ష్యం చేశారన్న పవన్ ఆరోపణలు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తిలో కీలక ప్రాజెక్టుగా భావిస్తున్న గిరి ప్రదక్షిణ రహదారి నిర్మాణాన్ని చేపట్టి రికార్డు స్థాయి వేగంతో పూర్తి చేశారు. 22 కిలోమీటర్ల ఈ రహదారిని శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వర్చువల్‌గా ప్రారంభించారు. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో నేరుగా అక్కడ పర్యటించే అవకాశం లేకపోవడంతో మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. సుమారు 8.9 …

Read More »

అందుకే నాకు కన్నీళ్లు ఆగలేదు: చంద్రబాబు

గత వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పాలకులు అసెంబ్లీలో అవమానించిన తీరుకు తాను కన్నీళ్లు పెట్టుకున్నానని అన్నారు. ఆ సమయంలో తనకు కన్నీళ్లు ఆగలేదని చెప్పారు. “2019-24 మధ్య నాలాగే చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి ఉంది. విశాఖకు వెళ్తే …

Read More »