Political News

ప్ర‌జాపాల‌న‌కు రెండేళ్లు: ఉత్స‌వాల నేప‌థ్యం.. మంచీ-చెడులు ఇవీ!

తెలంగాణ‌లో ప‌దేళ్ల పాటు వేచి చూసి.. 2023 ఎన్నిక‌ల్లో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ పాల‌న చేప‌ట్టి.. ఈ నెల(డిసెంబ రు) 9వ తేదీకి రెండు సంవ‌త్స‌రాలు పూర్తికానున్నాయి. అప్ర‌తిహ‌త బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ ఆధిప‌త్యానికి, పాల‌న‌కు చెక్ పెట్టి.. సీఎం రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌లో అధికార ప‌గ్గాలు చేప‌ట్టి.. రెండేళ్లు పూర్త‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే డిసెంబ‌రు 1 నుంచి 9వ తేదీ వ‌ర‌కు ‘ప్ర‌జాపాల‌న …

Read More »

గ‌డువుకు ముందే.. కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి

సాధార‌ణంగా కేసుల నుంచి త‌ప్పించుకుంటున్న కొంద‌రు నిందితులు పోలీసులు, కోర్టుల ఆదేశాల‌ను కూడా విస్మ‌రిస్తున్నారు. వీరిలో వైసీపీకి చెందిన నాయ‌కులు కూడా ఉన్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లా ప‌ల్నాడు ప్రాంతానికి చెందిన మాచ‌ర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయ‌కుడు పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి , ఆయ‌న సోద‌రుడు వెంక‌ట్రామిరెడ్డిల‌పై జంట హ‌త్య‌ల కేసు న‌మోదైంది. ఈ కేసులో వారు ఏ8, ఏ9గా ఉన్నారు. అయితే.. కొన్నాళ్ల‌పాటు త‌ప్పించుకుని తిరిగి.. హైకోర్టు నుంచి …

Read More »

మోదీ vs ప్రియాంక – ఏంటి ఈ ‘డ్రామా’ పాలిటిక్స్?

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర‌స్థాయిలో ఫైర్ అయింది. పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు సోమ‌వారం ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష  పార్టీల‌ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి మీడియాతో మాట్లాడారు. పార్ల‌మెంటులో `డ్రామాలు` చేయొద్ద‌ని.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు ముందుకు రావాల‌ని ఆయ‌న సూచించారు. ముఖ్యంగా కొత్త త‌రం ఎంపీల‌కు స్ఫూర్తిదాయ‌కంగా ఉండేలా కార్య‌క్ర‌మాలు అమ‌లు చేయాల‌ని.. అరుపులు కేక‌ల‌తో నినాదాలతో స‌భాకార్య‌క్ర‌మాల‌కు …

Read More »

సూపర్ సిక్స్ కోసం కూటమి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిందో తెలుసా?

ఏపీ సీఎం చంద్ర‌బాబు వైసీపీ నేత‌ల‌పై ప‌రోక్షంగా సెటైర్లు గుప్పించారు. “న‌న్ను లైట్‌(తేలిక‌గా) తీసుకున్నారు. సూప‌ర్ సిక్స్ హామీలు ఇస్తే.. అవి అమ‌లు కావ‌ని ప్ర‌చారం చేశారు. కానీ.. సూప‌ర్ సిక్స్ హామీల‌ను స‌క్సెస్ చేశాం. దీంతో వాళ్లు లైట్‌(ప‌లుచ‌న‌) అయిపోయారు“ అని వ్యాఖ్యానించారు. తాజాగా ఏలూరు జిల్లాలో నిర్వ‌హించిన ప్ర‌జా సేవలో(ఎన్టీఆర్ భ‌రోసా పింఛ‌న్ల పంపిణీ) పేరిట నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ల‌బ్ధిదారుల‌కు …

Read More »

ఇవేం మాటలు అంబటి… ఓడినా మైండ్ సెట్ మారదా?

దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా దరిద్రపుగొట్టు రికార్డు ఏపీ సొంతం. విభజన నేపథ్యంలో అటు ఇటు కాకుండా పోయిన ఏపీకి ఎప్పటికి రాజధాని సమకూరుతుందన్న ప్రశ్న సగటు ఆంధ్రోడ్ని వెంటాడి వేధిస్తోంది. నిజానికి రాజధాని అంశంపై జగన్ సర్కారు వ్యవహరించిన తీరు.. ఆ పార్టీ నేతలు బాధ్యత లేకుండా మాట్లాడిన మాటలు ఆ పార్టీని దారుణంగా దెబ్బ తీశాయి. 2019 ఎన్నికలకు ముందు అమరావతిని కంటిన్యూ చేస్తామని చెప్పిన జగన్.. …

Read More »

‘స‌ర్’ కోసం టీడీపీ ఆరాటం.. రీజనేంటి?

ఇత‌ర రాష్ట్రాలు వ‌ద్దని గోల చేస్తున్న ‘స‌ర్‌’ ప్ర‌క్రియ‌పై ఏపీ అధికార పార్టీ టీడీపీ సానుకూలత వ్య‌క్తం చేయడం.. ఎంత వేగంగా అయితే.. అంత వేగంగా ఏపీలో స‌ర్ ప్ర‌క్రియను ప్రారంభించేలా కేంద్రాన్ని కోర‌తామని.. ఆపార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయులు చెప్ప‌డం విశేషం. కేంద్ర ఎన్నిక‌ల సంఘం చేప‌ట్టిన స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్‌(స‌ర్‌) ద్వారా 2001కి ముందు ఓటు హ‌క్కు ఉన్న ప్ర‌తి ఒక్క‌రి నుంచి ఆధారాలు సేక‌రిస్తారు. దీని …

Read More »

H-1B వీసాలు రద్దు చేస్తే అమెరికాకే నష్టం: ఎలాన్ మస్క్

అమెరికాలో ఉద్యోగం చేయాలనేది ప్రతి భారతీయ టెక్కీ కల. కానీ మారుతున్న నిబంధనలు, ట్రంప్ సర్కార్ ఆంక్షలతో ఆ కల చెదిరిపోతుందేమో అనే భయం అందరిలో ఉంది. సరిగ్గా ఈ సమయంలో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు భారతీయ టెక్కీలకు పెద్ద ఊరటనిచ్చాయి. జెరోధా కో ఫౌండర్ నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మస్క్, H-1B వీసాల ఆవశ్యకత గురించి కుండబద్దలు కొట్టారు. ఈ …

Read More »

కార్యకర్తలను పట్టించుకోకపోతే.. ?

తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు అగ్రస్థానం ఉంటుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మన సందర్భాల్లో గుర్తు చేస్తుంటారు. నిన్నటి పార్టీ నేతల టెలికాన్ఫరెన్స్లో ఆయన ఆ విషయాన్ని పునరుద్ఘాటించారు. కార్యకర్తలను పట్టించుకోకుండా, ప్రజల్లో ఉండకపోతే మనం ఎంత చేసినా ప్రయోజనం ఉండబోదని తేల్చి చెప్పారు. పొలిటికల్ గవర్నెన్స్ అనేది కూటమి ప్రభుత్వ విధానమని ఆయన స్పష్టం చేశారు. నిరంతరం ప్రజల్లో ఉంటేనే మంచి నేతలుగా రాణించగలరు.. ప్రజా సమస్యలను …

Read More »

ఆ విష‌యంలో చంద్ర‌బాబుది 5వ స్థానం… మ‌రి ప‌వ‌న్?

దేశంలో అత్యంత ధ‌న‌వంతులైన ఎమ్మెల్యేల జాబితా, అదేస‌మ‌యంలో అతి త‌క్కువ సంప‌ద ఉన్న ఎమ్మెల్యేల జాబితాల‌ను తాజాగా ఏడీఆర్‌(అసోసియేష‌న్ ఫ‌ర్ డెమొక్ర‌టిక్ రిఫార్మ్స్‌) విడుదల చేసింది. వాస్త‌వానికి ప్ర‌తి ఆరు మాసాల‌కు ఒక‌సారి ఈ జాబితాను ఈ సంస్థ విడుద‌ల చేస్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా విడుద‌ల చేసిన జాబితాలో ఏపీ సీఎం చంద్ర‌బాబు ఐదో స్థానంలో ఉన్నారు. అయితే.. ఆయ‌న అంద‌రి ఎమ్మెల్యేల జాబితాలో 5వ స్థానంలో ఉన్న‌ప్ప‌టికీ.. …

Read More »

బంగ్లాదేశ్‌కు దిక్కెవరు?

బంగ్లాదేశ్ రాజకీయాలు ఇప్పుడు మరింత చిక్కుల్లో పడ్డాయి. దేశాన్ని ఇన్నాళ్లు శాసించిన ఇద్దరు ఉక్కు మహిళలు ఇప్పుడు సీన్లో లేకపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఒకవైపు మాజీ ప్రధాని షేక్ హసీనా ఇండియాలో తలదాచుకుంటే, మరోవైపు ఆమె ప్రధాన ప్రత్యర్థి, మాజీ ప్రధాని ఖలీదా జియా చావుబతుకుల మధ్య పోరాడుతున్నారు. ఈ ఇద్దరు లేని బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మాజీ ప్రధాని, BNP …

Read More »

క్యూర్‌-ప్యూర్‌-రేర్‌… రేవంత్ సరికొత్త మంత్రం

తెలంగాణ అభివృద్ధికి, విజ‌న్‌-2047 సాకారానికి `క్యూర్‌-ప్యూర్‌-రేర్‌` అనే మంత్రుల‌ను ప‌ఠిస్తున్న‌ట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. విజ‌న్ తెలంగాణ‌-2047లో రెండు ప్ర‌ధాన అంశాలు ఉన్నాయ‌ని తెలిపారు. 1) విజ‌న్‌, 2) వ్యూహం. ఈ రెండు ప్ర‌ధాన అంశాల‌ను సాకారం చేసుకునే దిశ‌గా ప్ర‌భుత్వం అడుగులు వేస్తుంద‌ని చెప్పారు. సంప‌దను సృష్టించి..పేద‌ల‌కు పంచేకార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌నున్న‌ట్టు తెలిపారు. దీనికిగాను పెట్టుబ‌డుల‌ను ఆహ్వానించాల‌ని పెద్ద ఎత్తున పారిశ్రామికీక‌ర‌ణ‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు చెప్పారు. …

Read More »

అమరావతి రైతులపై చంద్రబాబు స్పెషల్ ఇంట్రస్ట్

ఏపీ రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు తానే స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. రాజధాని ఒక మునిసిపాలిటీగా మిగిలిపోకూడదనే సంకల్పంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటికే ఇచ్చిన 33 వేల ఎకరాల భూములకు తోడు మరొ 44 వేల ఎకరాలను రైతుల నుంచి సేకరించాలని యోచిస్తున్నామని, దీనికి రైతులు సహకరించాలని కోరారు. రైతుల సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించి …

Read More »