Political News

ఆ విషయంపై నోరు విప్పిన పవన్

వైసీపీ హ‌యాంలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం చంద్ర‌బాబు, ఇత‌ర మంత్రులు మాత్రమే మాట్లాడుతున్నారు. అయితే.. తొలిసారి.. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. వైసీపీ ఆర్థిక అరాచ‌కాల‌పై స్పందించారు. అసెంబ్లీలో బ‌డ్జెట్‌పై జ‌రిగిన చ‌ర్చ‌లో  కీల‌క ప్ర‌సంగం చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. వైసీపీ రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశ‌నం చేసింద‌ని.. దీంతో రాష్ట్రం 30 ఏళ్ల‌పాటు వెన‌క్కి వెళ్లిపోయింద‌ని విమ‌ర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చేశార‌ని వ్యాఖ్యానించారు. …

Read More »

వాహ్ డిప్యూటీ సీఎం… మళ్ళీ అభినందించాల్సిందే

రాష్ట్రంలోనే కాదు.. ఒక‌ర‌కంగా చెప్పాలంటే దేశంలోనే తొలిసారి.. ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ రికార్డు సృష్టించార‌నే చెప్పాలి. గ‌త 20 మాసాల కాలంలో త‌న శాఖ‌ల‌కు సంబంధించి చేసిన అభివృద్ధి ప‌నుల‌ను వివ‌రిస్తూ పుస్త‌కాలను ప్ర‌చురించారు. అయితే.. స‌హ‌జంగానే కొన్ని ప్ర‌భుత్వాలు ఇలా త‌మ అభివృద్ధిపై పుస్త‌కాలు వేయ‌డం తెలిసిందే. కానీ, తొలిసారి.. ఎక్క‌డా ఏ ప్ర‌భుత్వం చేయ‌ని విధంగా నియోజ‌క‌వ‌ర్గాల వారీగా చేప‌ట్టిన ప‌నుల‌పై పుస్త‌కాలు ముద్రించారు. …

Read More »

ప్రపంచవ్యాప్తంగా అణు ఆయుధాల లెక్కలివే.. ఏ దేశం దగ్గర ఎన్ని?

ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడుల నేపధ్యంలో మరోసారి న్యూక్లియర్ బాంబులపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 9 దేశాల దగ్గర అణు ఆయుధాలు ఉన్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. రష్యా, అమెరికా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, భారత్, పాకిస్థాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ తొమ్మిది దేశాల దగ్గర కలిపి సుమారు 12,300 కంటే ఎక్కువ అణు బాంబులు ఉన్నట్లు తాజా …

Read More »

మాదిగల కర్ణుడు సీఎం రేవంత్ రెడ్డి

మాదిగ స‌మాజానికి తాను క‌ర్ణుడిలాంటి వాడిన‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. మ‌హాభార‌తంలో మిత్ర ధ‌ర్మానికి క‌ట్టుబ‌డి క‌ర్ణుడు కౌర‌వుల వెంటే తుది వ‌ర‌కు ఉన్నాడ‌ని ఆయ‌న గుర్తు చేశారు. అలానే తానుకూడా మాదిగ సోద‌రుల‌కు అండ‌గా ఉంటాన‌ని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు ప్ర‌భుత్వం నుంచి అన్ని సంక్షేమ ఫ‌లాలు సంపూర్ణంగా అందించాలన్న‌దే త‌న కృత నిశ్చ‌య‌మ‌ని చెప్పారు. “గ‌తంలో ఎవ‌రో ఎస్సీల‌కు ముఖ్య‌మంత్రి పీఠం …

Read More »

వైసీపీ మ‌ద్యం కుంభ‌కోణం: 441 కోట్ల ఆస్తులు అటాచ్‌!

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంలో సుమారు 4 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా అక్ర‌మాలు జ‌రిగిన‌ట్టు ఈ కేసును విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు అంచ‌నావేశారు. ఈ క్ర‌మంలో ప‌లువురిని అరెస్టు చేసి విచారించారు. ఇంకా, విచారించాల్సిన వారి జాబితా కూడా పెద్ద‌దిగానే ఉంది. మ‌రోవైపు నాటి అక్ర‌మాల్లో ప్ర‌ముఖ పాత్ర ఉన్న వారి ఆస్తుల‌ను కోర్టు ఆదేశాల మేర‌కు అటాచ్ చేస్తున్నారు. తాజాగా 441 కోట్ల …

Read More »

ఈసారైనా నమ్మొచ్చా కొలికపూడి?

టిడిపి ఎంపీ, ఎమ్మెల్యే మధ్య రేగిన వివాదం ముగిసినట్లేనా? కొలికపూడి శ్రీనివాసరావు, కేశినేని చిన్ని మధ్య నెలకొన్న విభేదాలు సమస్య పోయినట్లేనా..? ఈ ప్రశ్నలకు స్వయంగా ఎమ్మెల్యే కొలికపూడి సమాధానం చెప్పారు. తిరువూరు నియోజకవర్గంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న రాజకీయ వివాదాలు ముగిసినట్లేనని ఆయన తెలిపారు. అసెంబ్లీ లాబీలో ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అల్లా శ్రీనివాసరావును కలిసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో చోటు చేసుకున్న …

Read More »

అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి.. ఏం చేస్తారు?

ప్ర‌ముఖ ఎన్నారై నాయ‌కుడు, టీడీపీ ఎన్నారై విభాగాల స‌మ‌న్వ‌య క‌ర్త‌గా ఉన్న కోమ‌టి జ‌యరాంకు.. టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీకే ప‌రిమితం అయిన జ‌య‌రాంకు.. తొలిసారి.. చంద్ర‌బాబు అధికారికంగా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆయ‌న విదేశీ ప్రత్యేక ప్రతినిధిగా నియ‌మితుల‌య్యారు. ఉత్త‌ర అమెరికా వ్య‌వ‌హారాల‌కు సంబంధించి ఆయ‌న ప్ర‌భుత్వానికి స‌ల‌హాలు ఇవ్వ‌నున్నారు. ఈ మేర‌కు గురువారం నిర్ణ‌యం తీసుకున్న నేప‌థ్యంలో …

Read More »

బీఆర్ ఎస్ ఎందుకు వెన‌క్కి త‌గ్గింది?!

తెలంగాణ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ కాంగ్రెస్ త‌ర‌ఫున ఇద్ద‌రు నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. ఇప్ప‌టికే ఎంపీగా ఉన్న జాతీయ నాయ‌కుడు అభిషేక్ మ‌ను సింఘ్వీ.. మ‌రోసారి నామినేష‌న్ వేశారు. ఇక‌, సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి కూడా.. నామినేష‌న్ వేశారు. అయితే.. మ‌రెవ‌రూ.. పోటీలో లేనందున‌.. ఇక‌, వీరి ఎన్నిక కూడా లాంఛ‌నం కానుంద‌ని అధికారులు చెబుతున్నారు. వాస్త‌వానికి.. రెండు స్థానాలు …

Read More »

సభకు బొత్స… లోకేష్ ఆత్మీయ పలకరింపు

ఇటీవల అనారోగ్యంతో బాధపడి కోలుకున్న ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఆయనను ఆత్మీయంగా పలకరించారు. సభలో చోటుచేసుకున్న ఈ సంఘటన రాజకీయ హుందాతనానికి ఉదాహరణగా నిలిచింది. సభా కార్యక్రమాల మధ్యలో బొత్స సత్యనారాయణను ఉద్దేశించి “బొత్స సత్యనారాయణ గారు నమస్కారం” అంటూ మంత్రి లోకేష్ పలకరించారు. ఆయన వినకపోవడంతో మండలి చైర్మన్ జోక్యం చేసుకుని …

Read More »

తెలంగాణ కాంగ్రెస్‌లో పరకాల చిచ్చు!

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో తాజాగా పరకాల నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో 2023లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక్కడ నుంచి రావూరి ప్రకాశ్ రెడ్డి గెలిచారు. ప్రస్తుతం ఆయనే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే గత కొన్నాళ్లుగా ఈ నియోజకవర్గంపై కన్నేసిన మంత్రి కొండా సురేఖ కుటుంబం తాజాగా మరింత దూకుడు ప్రదర్శించింది. పరకాల గడ్డపైనే కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంతేకాదు …

Read More »

తిరుమ‌ల‌లో కేక్ క‌టింగ్‌ ఏంటమ్మా మాధురి?

తిరుమ‌ల తిరుపతి దేవ‌స్థానం ప‌విత్ర‌త‌పై ఇప్ప‌టికే చ‌ర్చ సాగుతున్న నేప‌థ్యంలో దీనికి మ‌రింత సెగ పెంచేలా.. గురువారం ప‌లు ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. త‌మిళ‌నాడుకు చెందిన ఓ కొత్త జంట‌.. తిరుమ‌ల శ్రీవారి ఆల‌యం మ‌హా గోపురం ముందు..ఫొటో , వీడియో షూట్ చేసుకుంది. దీంతో పాటు.. కొంద‌రు యూట్యూబ‌ర్లు.. ఇక్క‌డే రీల్స్ చేశారు. ఈ ఘ‌ట‌న‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డంతో తిరుమ‌ల తిరుప‌తి అధికారులు చ‌ర్య‌లు ప్రారంభించారు. దీంతో …

Read More »

నామినేష‌న్లు వేశారు.. మరి వాళ్ళ సంగతి?

తెలంగాణ‌లో రాజ్య‌స‌భ సీట్ల వ్య‌వ‌హారం ఒక కొలిక్కి వ‌చ్చింది. రెండు స్థానాల‌కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయ‌కుడు అభిషేక్ మ‌ను సింఘ్వీ, సీఎం స‌ల‌హాదారు.. వేం న‌రేంద‌ర్‌రెడ్డి గురువారం రెండు సెట్ల నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేశారు. ఈ ఎన్నిక‌లు ఈ నెల 16న జ‌ర‌గ‌నున్నాయి. ఎలానూ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు బ‌లం ఉంది కాబ‌ట్టి.. వీరి గెలుపు కూడా లాంఛ‌న‌మే. ఇద్ద‌రూ పెద్ద‌ల స‌భ‌కు వెళ్ల‌డం కూడా ఖాయ‌మే. అయితే.. …

Read More »