Political News

జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్

తనను తాను జంతు ప్రేమికుడిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించుకున్నారు. అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ జంతు సంరక్షణపై తన అభిమతాన్ని చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ ఈ రోజు విశాఖపట్నం పర్యటనలో ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను సందర్శించారు. పర్యటనలో ఆయన జూ పార్క్‌లోని నూతన ఎలుగుబంట్ల ఎన్‌క్లోజర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత నీటి ఏనుగులు, నల్ల ఎలుగుబంట్లు, పులులు, సింహాల ఎన్‌క్లోజర్లను సందర్శించి వాటి …

Read More »

లోకేష్ సంకల్పం… వాళ్లకు సోషల్ మీడియా బ్యాన్ అయ్యేనా?

సోషల్ మీడియా ప్రభావం వల్ల కలిగే నష్టాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అతిగా సోషల్ మీడియాను వాడటం వల్ల పిల్లలు మానసిక ఒత్తిడికి మరియు ఆందోళనకు గురవ్వడమే కాకుండా, ఇతరుల జీవితాలతో పోల్చుకుంటూ అభద్రతాభావానికి లోనవుతున్నారు. శారీరక పరంగా చూస్తే, నిరంతరం స్క్రీన్ చూడటం వల్ల నిద్రలేమి, కంటి సమస్యలు తలెత్తుతున్నాయి మరియు ఇది వారి చదువుపై ఏకాగ్రతను తగ్గించి విద్యా పనితీరు మందగించేలా చేస్తోంది. ఇదే అంశంపై ఏపీ ప్రభుత్వం …

Read More »

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కేసీఆర్

తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను కూడా ఈ కేసులో విచారణ జరిపేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు… కేసీఆర్ పీఏకు నోటీసులిచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, …

Read More »

ఎట్టకేలకు చెవిరెడ్డికి బెయిల్

ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎట్టకేలకు ఊరట లభించింది. ఆ కేసులో చెవిరెడ్డికి హైకోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది. భాస్కర్ రెడ్డితోపాటు సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులకు కూడా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. 2025 జూన్ 17న బెంగుళూరులో చెవిరెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 226 …

Read More »

ఇప్పుడు కేసీఆర్ వంతు?

బీఆర్ఎస్ హయాంలో ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రెండేళ్లుగా కార్తీక దీపం సీరియల్ లెక్క ఆ కేసు విచారణ కొనసాగుతూనే ఉందని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు సెటైర్లు కూడా వేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ కేసులో తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కూడా నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు …

Read More »

సంచలన బిల్లు: అసెంబ్లీకి రాకపోతే జీతం కట్

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. తాజాగా బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు బడ్జెట్ సమావేశాలపై మంత్రులతో చర్చించారు. ఇప్పటికే అన్ని శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు అందాయని, దీనిపై కసరత్తు కూడా పూర్తి కావొచ్చిందని అధికారులు వివరించారు. దీంతో వచ్చే నెల 11 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభిస్తే బాగుంటుందన్న సీఎం చంద్రబాబు సూచనలకు మంత్రులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అయితే ఈ …

Read More »

పిఠాపురం కోసం ఢిల్లీ వరకు.. కేంద్ర మంత్రులకు పవన్ విజ్ఞాపన

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. వచ్చే నెల 1 (ఆదివారం)న కేంద్ర వార్షిక (2026–27) బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న నేపధ్యంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. తొలుత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను, తరువాత రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను పవన్ కలిశారు. వారికి అరకు కాఫీతో పాటు …

Read More »

వైసీపీ మాజీ ఎంపీ నుంచే వైసీపీ కార్యకర్తకు బెదిరింపులా?

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో తమను బెదిరించారని పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ కేసులో నందిగం సురేష్ జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అధికారంలో లేకపోయినా సరే సురేష్ తీరు మారినట్లు కనిపించడం లేదు. తనకు ఇవ్వాల్సిన అప్పు అడిగినందుకు చంపేస్తానని నందిగం సురేష్ బెదిరిస్తున్నారని జగదీష్ అనే వైసీపీ కార్యకర్త …

Read More »

తెలంగాణలో మరో కుంభకోణం: హరీష్ రావు

తెలంగాణలో మరో కుంభకోణం జరుగుతోందని బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. దీని వివరాలను త్వరలోనే బయట పెడుతున్నానన్నారు. ఈ కుంభకోణంలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో మైక్రో బ్రూవరీలకు అనుమతులు ఇస్తున్నారని చెప్పిన ఆయన, ఈ క్రమంలో అవినీతి దందాకు తెరదీశారని విమర్శించారు. ముఖ్య నేతకు, మంత్రులకు కూడా దీంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో మైక్రో బ్రూవర్ల …

Read More »

ప్రెస్ మీట్ తర్వాత ఆమెపై సింపతీ పోయిందా?

జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నేడు మీడియా ముందుకు వచ్చిన ఆమె మరిన్ని ఆరోపణలు చేశారు. ఫేస్ బుక్ లో తనతో పరిచయమైన రోజే మూడు గంటలకు మాట్లాడిన శ్రీధర్…ఆ తర్వాత నంబర్ తీసుకొని టచ్ లో ఉన్నారని ఆమె తెలిపారు. ఆ తర్వాత ఒక …

Read More »

‘ఇంకో 3 ఏళ్లు కళ్లుమూసుకుంటే చాలు’

తాను మరో పాదయాత్ర చేయబోతున్నానని ఏపీ మాజీ సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి పాదయాత్రపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర సమయంలో ప్రతి 3 రోజులకు ఒక సారి ఏదో ఒక నియోజకవర్గంలో, మండలంలో బహిరంగ సభ పెడతానని, అందులో చంద్రబాబును కడిగేస్తానని అన్నారు. చూస్తూ చూస్తూ కూటమి పాలనలో రెండేళ్లయిపోయిందని, కళ్లు మూసి తెరిచే లోపు ఇంకో 3 ఏళ్లు …

Read More »

సీఎం కల నెరవేరకుండానే…

మహారాష్ట్ర రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన సీనియర్ నేత అజిత్ పవార్.. ఈ రోజు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రైవేట్ జెట్ ప్రమాదంలో ఆయన దుర్మరణం పాలయ్యారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఒక సంచలనం. ఆ రాష్ట్రానికి ఆయన ఆరుసార్లు డిప్యూటీ సీఎంగా పని చేయడం విశేషం. తన చాణక్యంతో అనేకసార్లు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన అజిత్.. ముఖ్యమంత్రి కావాలన్న కలను మాత్రం నెరవేర్చుకోకుండానే కన్నుమూశారు. రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్‌.. అజిత్‌కు పెదనాన్న.. …

Read More »