పేర్ని నాని. వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి. గత ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకొని వారసుడు కిట్టుకు అవకాశం ఇచ్చారు. అయితే..కూటమి ప్రభావంతోపాటు..స్థానికంగా పెరిగిన వ్యతిరేకత కూడా తోడై.. పేర్ని వారసుడు పరాజయం పాలయ్యారు. కానీ, చిత్రం ఏంటంటే.. రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజక వర్గాల్లో వైసీపీ ఓడిన చోట ఆ పార్టీ ఛాయలు.. ఆ పార్టీ నాయకులు వెనుకబడ్డారు. ఎక్కడా గళం వినిపించే నాయకులు కూడా …
Read More »భోగాపురంలో ఫ్లైట్ ల్యాండ్ అయ్యేది ఎప్పుడూ?
ఏపీకి సంబంధించి అందరూ ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి భోగాపురం ఎయిర్ పోర్టు. భారీగా చేపట్టిన ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే.. ఉత్తరాంధ్ర డెవలప్ మెంట్ మరోస్థాయికి చేరుకుంటుందన్న అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ అంతర్జాతీయ విమానాశ్రయంతో ఏపీలోని విశాఖకు.. మిగిలిన ప్రపంచానికి దూరం మరింత దగ్గర అవుతుందని చెప్పాలి. ఇప్పటికే ఎయిర్ పోర్టు పనులు 97 శాతం పూర్తయ్యాయి. తాజా అంచనాల ప్రకారం ఈ జులైలో కానీ లేదంటే ఆగస్టులో …
Read More »రఘురామ ఉంటున్న ఇల్లు ఎవరిదో తెలిస్తే షాకే!
ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి, ఆ పార్టీ తరఫున ఎంపీగా కూడా గెలిచిన రఘురామ కృష్ణం రాజు తర్వాత ఆ పార్టీకి బద్ధ శత్రువుగా మారిపోయిన సంగతి తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదికే మారిన ఆయన.. తర్వాతి నాలుగేళ్లు ఆ పార్టీ మీద అలుపెరగని పోరాటం చేశారు. బదులుగా ఆయన మీద ఏదో కేసు పెట్టి హింసించడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే ఇప్పుడు …
Read More »`అదే మీడియా` నిలబెట్టిన విషయం మరిచారా జగన్?!
వైసీపీ అధినేత జగన్.. రాష్ట్రంలోని ఓ వర్గం మీడియాపై తరచుగా విమర్శలు చేయడంతోపాటు.. వాటిని గేలి కూడా చేస్తుంటారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు.. ప్రకటనలు ఇచ్చే విషయంలోనూ.. కార్యక్రమాలకు పిలిచే విషయంలోనూ ఇలానే చేశారన్నవాదన ఉంది. అంతేకాదు.. ఒక్కసారి 2019, మేలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం.. ఆయన చేసిన ప్రసంగం వింటే కొన్ని ఆశ్చర్యకర ప్రకటనలు.. పిలుపులు గోచరిస్తాయి. రెండు పత్రికలు.. మూడు చానెళ్లను తన …
Read More »కవితకు `సీనియార్టీ` సంకటం.. సీరియస్!
బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత ఈ నెలలో కొత్త పార్టీని ప్రకటించనున్నారు. జెండా-అజెండాలపై ఆమె కసరత్తు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీపరంగా పుంజుకోవాలని అనుకుంటున్న ఆమె.. కేవలం కొత్తముఖాలపైనే ఆధారపడితే కుదరదు. వాస్తవానికి ఏ పార్టీకైనా ఇది సాధ్యంకాదు. ప్రజల బలం ఉన్న నాయకులు.. ప్రజల ఆమోదం ఉన్న నాయకులు ఏ పార్టీకైనా అవసరం అవుతారు. …
Read More »పట్టు వదలని తుమ్మల – నిన్న బాబు.. నేడు షా!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిజంగానే పట్టు వదలని విక్రమార్కుడి మాదిరిగా సాగుతున్నారు. గిరిజనుల సమస్యల పరిష్కారం దిశగా దృష్టి సారించిన తుమ్మల… అందుకు అడ్డుగా ఉన్న విలీన గ్రామాలను తిరిగి తెలంగాణకు తీసుకువచ్చే విధంగా వేగంగా పావులు కదుపుతున్నారు. ఈ దిశగా ఇప్పటికే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లిన తుమ్మల… తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు …
Read More »వాషింగ్టన్ డీసీని… మనమ్మాయి శాసిస్తుందా?
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం ఏమంటే.. వాషింగ్టన్ డీసీ చరిత్రలో తొలిసారి మేయర్ ఎన్నికల బరిలో దక్షిణాసియాకు చెందిన ఒకమహిళ నిలిచారు. మరో ఆసక్తికర అంశం ఏమంటే.. ఆమె తమిళ మూలాలున్న 31 ఏళ్ల యువతి. ఆమె పేరు.. రిని సంపత్. తమిళనాడులోని తేని ప్రాంతంలో పుట్టిన రిని సంపత్.. తన ఏడేళ్ల వయసులో …
Read More »పార్టీ పేరుతో పాటు గుర్తుతోనూ స్ట్రోక్ ఇవ్వనున్న కవిత?
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే కొత్త పార్టీని ప్రకటించనున్న ఆమె.. చాలా వ్యూహాత్మకంగా బీఆర్ ఎస్ను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. పార్టీ పేరు నుంచి పార్టీ గుర్తు వరకు ఆమె.. బీఆర్ ఎస్ పార్టీకి సెగ పెంచేస్తున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ ఎస్ పార్టీగా అవతరించి.. రాష్ట్ర సాధనకు కృషి …
Read More »‘అమరావతికి’ ఎమ్మెల్యే… సాధ్యపడుతుందా?
ఏపీలో కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల సంఖ్య దాదాపు 88 వరకు ఉంటుందన్న చర్చ నడుస్తోంది. రాష్ట్రాల వారిగా ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా చెప్పిన లెక్కల ప్రకారం.. సగం నియోజకవర్గాలు పెరగనున్నాయి. దీంతో ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 స్థానాలు.. ఏకంగా 263 కు చేరనున్నాయి. సరే.. పెరిగేవి.. తరిగేవి ఎలా ఉన్నా.. కొన్ని కొన్ని కీలక ప్రాంతాలపై తనదైన ముద్ర వేసేలా టీడీపీ అధినేత చంద్రబాబు …
Read More »సాక్షి కార్టూన్… చంద్రబాబుకు ప్లస్ అయ్యిందా?
ఏపీ రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు పిల్లిమొగ్గలు వేస్తున్నారంటూ.. జగన్ సొంత మీడియాలో ఓ కార్టూన్ వచ్చింది. కార్టూనిస్టు స్వేచ్ఛను ఎవరూ హరించలేదు. నిర్బంధాలు కూడా పెట్టలేరు. కానీ.. దీని వెనుక ఉన్న ఔచిత్యాన్ని మాత్రం ప్రశ్నించడంలో తప్పులేదు. అమరావతి నేమ్ బోర్డును పట్టుకున్న సీఎం చంద్రబాబు.. ఒకసారి నెత్తిమీద, మరోసారి కుడి వైపు.. ఇంకోసారి ఎడమవైపు.. మరోసారి.. తలకిందు లుగా పట్టుకుని ఉన్నట్టుగా ఈ కార్టూన్ గీశారు. దీని …
Read More »ఫారిన్ ట్రిప్ కు వెళ్లిన అర్చకులకు గర్భాలయంలో పూజలకు నో
విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు దేవస్థానాల ప్రధాన గర్భాలయాల్లో పూజలు నిర్వహించటానికి వీల్లేదంటూ దేవాదాయ శాఖ (ధార్మిక పరిషత్).. శృంగేరి శారదా పీఠం జారీ చేసిన మార్గదర్శకాలకు సంబంధించి తాజాగా హైకోర్టు పూర్తి స్పష్టత ఇచ్చింది. ధార్మిక పరిషత్.. శృంగేరి శారదా పీఠం మార్గదర్శకాల్ని దేవాదాయ శాఖ కూడా సర్క్యులర్ జారీ చేసింది. ఈ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలేం జరిగిందంటే.. ఫారిన్ ట్రిప్ లకు వెళ్లి వచ్చిన …
Read More »అజ్ఞాతంలో వైసీపీ మాజీ ఎంపీ?
వైసీపీ నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు నందిగం సురేశ్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారట. ఆది నుంచి నేరాలు, కేసులతో సహవాపం చేస్తూ సాగుతున్న సురేశ్.. ఎంపీ హోదాలో ఓ సంస్థకు చెందిన వ్యక్తెుల నుంచి రూ.25 లక్షలు తీసుకున్నారట. అయితే ఆ పనిని పూర్తి చేయకపోగా… డబ్బును కూడా వాపస్ ఇవ్వలేదట. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా… తుళ్లూరు పోలీసులు సురేశ్ పై కేసు నమోదు చేశారట. ఈ విషయం తెలుసుకున్న సురేశ్… తనను పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న భయంతో సురేశ్ అజ్ఞాతంలోకి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates