Political News

పీఎంవో పేరు-భ‌వ‌నం కూడా మార్పు.. అవేంటంటే!

దేశంలో పురాత‌న, బ్రిటీష్ కాలం నాటి పేర్ల‌ను, ఊర్ల‌ను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్ర‌భుత్వం తాజాగా గ‌వ‌ర్న‌ర్ల భ‌వ‌నాల‌కు సోమ‌వారం పేర్లు మార్చిన విష‌యం తెలిసిందే. కొన్ని ద‌శాబ్దాలుగా రాజ్ భ‌వ‌న్‌లుగా పేర్కొంటున్న గ‌వ‌ర్న‌ర్ల బంగ‌ళాల‌కు..’లోక్ భ‌వ‌న్లు’గా పేరు మార్చింది. ఈ ఆదేశాలు త‌క్ష‌ణ‌మే అమల్లోకి వ‌చ్చిన‌ట్టు తెలిపింది. ఈ ప‌రంపర‌లో తాజాగా ప్ర‌ధాన మంత్రి నివాసం, కార్యాల‌యం పేరునుకూడా మార్పు చేసింది.. ఇక …

Read More »

‘రాజధాని రైతులను ఒప్పించాలి కానీ నొప్పించకూడదు’

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌పంచ స్థాయి మ‌హాన‌గ‌రంగా నిర్మించాల‌ని నిర్ణ‌యించుకున్న సీఎం చంద్ర‌బాబు.. ఆదిశ‌గా వ‌డి వ‌డిగా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా రాజ‌ధాని ప్రాంతంలో రెండో ద‌శ భూస‌మీక‌ర‌ణ‌కు సిద్ధ‌మ‌య్యారు. దీనికి సంబంధించిన జీవోను ప్ర‌భుత్వం తాజాగా విడుద‌ల చేసింది. అయితే..దీనికి ముందు సీఎం చంద్ర‌బాబు సంబంధిత రాజ‌ధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ(సీఆర్ డీఏ) అధికారుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. రైతుల‌ను మెప్పించి.. ఒప్పించాల‌ని వారికి సూచించారు. రైతులను బెదిరించ‌డం.. …

Read More »

‘డెత్ సెల్‌’లో ఇమ్రాన్‌.. పాక్ ర‌ణ‌రంగం!

పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని, ప్ర‌ముఖ క్రికెట‌ర్ ఇమ్రాన్ ఖాన్ మృతి చెందిన‌ట్టు గ‌ట్టి న‌మ్మ‌కం ఏర్ప‌డుతోంద‌ని ఆయ‌న కుమారులు సులేమాన్‌, ఖాసీంలు పేర్కొన‌డంతో పాకిస్థాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు రోడ్ల మీద‌కు వ‌చ్చారు. ఇమ్రాన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ప్ర‌భుత్వం ఏదో దాచిపెడుతోందంటూ.. ప్ర‌తిప‌క్షాలు కూడా పార్ల‌మెంటు ముందు ఆందోళ‌న‌కు దిగ‌డం మ‌రింత చ‌ర్చ‌నీయాంశం అయింది. 2023 నుంచి రావ‌ల్పిండిలోని అడియాలా జైల్లో ఇమ్రాన్ బంధీగా ఉన్నారు. ఈ …

Read More »

‘పవన్ ఒకసారి చేగువేరా అంటాడు, ఒకసారి సనాతన ధర్మం అంటాడు’

కోనసీమ ప్రాంతం వల్లే ఉమ్మడి ఏపీ విడిపోయిందేమోనంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారం రేపాయి. ఈ క్రమంలోనే పవన్ పై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ పై మాజీ మంత్రి, బీఆర్ ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ ఒకసారి చేగువేరా అంటాడని, ఒకసారి సనాతన ధర్మం అంటాడని..ఆయనకే ఓ …

Read More »

పవన్ పై కాంగ్రెస్ ఫైర్… వైసీపీకి పండగే!

కోనసీమ కొబ్బరి తోటలు ఎండిపోవడానికి దిష్టి తగలడం, తెలంగాణ నాయకుల పదే పదే ఇక్కడి పచ్చదనం గురించి మాట్లాడడమే కారణమని, తెలంగాణ విభజన కూడా కోనసీమ పచ్చదనం వల్లే జరిగిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చేసిన కామెంట్లు తెలంగాణలో రాజకీయ కాక రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ పై తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జడ్జర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ …

Read More »

పార్టీ మార్పు వార్తల నేపథ్యంలో విడదల రజినీ వార్నింగ్

మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత విడదల రజిని పార్టీని వీడిపోతారంటూ రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రతిసారీ తన నియోజకవర్గాన్ని మార్చడంతో కలత చెందారని, దీంతో వైసీపీకి గుడ్బై చెబుతున్నారనే కథనాలు వచ్చాయి. అయితే ఈ రోజు పల్నాడులో వైసీపీ నేతలు నిర్వహించిన ఓ ప్రెస్మీట్లో ఆమె మాట్లాడారు. తనపై వస్తున్న ఊహాగానాలపై స్పందిచలేదు కానీ.. ఎప్పటి లాగే టీడీపీపై, కూటమి ప్రభుత్వంపై నిప్పులు …

Read More »

పార్ల‌మెంటులో ‘యాప్‌’ రగ‌డ‌.. అస‌లేంటిది?

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల్లో రాజ‌కీయ ప‌ర‌మైన అంశాలు తీవ్ర చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి. అధికార విపక్ష స‌భ్యుల మ‌ధ్య పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు, వాకౌట్‌లు, ప్ల‌కార్డుల ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇలా.. అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఈ ప‌రంప‌ర‌లో అనూహ్యంగా రాజ‌కీయేత‌ర విష‌యంపై ఉభ‌య స‌భ‌ల్లోనూ తీవ్ర ర‌గ‌డ చోటు చేసుకుంది. అదే.. సంచార్ సాథీ ఫోన్ ‘యాప్‌’. దీనిపై పెద్ద ఎత్తున మంగ‌ళ‌వారం ఉభ‌య స‌భ‌ల్లోనూ వివాదం చెల‌రేగింది. దీంతో …

Read More »

‘కోటి’ సంత‌కాల‌పై కుస్తీ.. వైసీపీ వ్యూహాత్మ‌క లోపం

కోటి విద్య‌లు కూటి కొర‌కే.. అన్న‌ట్టుగా కోటి సంత‌కాలు సేక‌రించి.. ఏపీలో వైద్య కాలేజీల‌ను రాజ‌కీయంగా త‌న‌వైపు తిప్పుకోవాల‌ని భావించిన వైసీపీకి సంత‌కాల మాటేమో కానీ.. కోటి తిప్ప‌లు మాత్రం త‌ప్ప‌డం లేదు. ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం మెడిక‌ల్ కాలేజీల‌ను ప‌బ్లిక్‌-ప్రైవేట్‌-పార్ట‌న‌ర్‌షిప్‌(పీపీపీ) విధానంలో అభివృద్ది చేయాల‌ని నిర్ణ‌యించింది. త‌ద్వారా ప్ర‌భుత్వంపై భారం ప‌డ‌కుండా వాటిని పూర్తి చేయ‌డంతోపాటు, ప్ర‌జ‌ల‌కు మ‌రింత మెరుగైన వైద్య శాల‌ల‌ను అందుబాటులోకి తీసుకురావాల‌ని నిర్ణ‌యించింది. వాస్త‌వానికి …

Read More »

పవన్ సారీ చెప్పకపోతే… సినిమాటోగ్రఫీ మినిస్టర్ వార్నింగ్

తెలంగాణ నాయకులు పదే పదే గోదారి పచ్చదనం గురించి మాట్లాడడం, దిష్టి తగలడం వల్లే పచ్చటి కోనసీమ కొబ్బరి తోటలు ఎండిపోయి తలలు లేని మొండాలుగా మిగిలాయి అంటూ ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. పవన్ వి మైండ్ లెస్ వ్యాఖ్యలంటూ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఇప్పటికే ఆ వ్యాఖ్యలను ఖండించారు. …

Read More »

ఏపీలో ఫిల్మ్ టూరిజం… కూటమి మాస్టర్ ప్లాన్

ఏపీలో ఫిల్మ్ టూరిజానికి ప్రోత్సాహం ఇవ్వాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. దేశంలోనే సినిమా షూటింగ్‌ లకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా ఏపీని నిలిపేందుకు ప్రణాళికలను రూపొందిస్తోంది. ఏపీని దేశంలోనే సినిమా షూటింగ్‌లకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా మారుస్తామని చెబుతోంది. విశాఖపట్నం, భీమునిపట్నం మరియు కాకినాడ వంటి స్వచ్ఛమైన బీచ్‌ల నుండి గోదావరి మరియు కృష్ణ నదుల సుందరమైన తీరాలు ఇక్కడ ఉన్నాయి. తిరుపతి, శ్రీశైలం వంటి …

Read More »

నేత‌లు తీరు.. బాబు ఆనందించిన క్ష‌ణాలు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌ర‌చుగా పార్టీ నాయ‌కులు, ఎమ్మెల్యేలపై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనికి కార‌ణం.. వారు త‌న మాట వినిపించుకోవ‌డం లేద‌ని, తాను చెప్పిన‌ట్టు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కురావ‌డం లేద‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. ముఖ్యంగా ప్ర‌తి నెలా 1వ తేదీన అమ‌లు చేస్తున్న ఎన్టీఆర్ భ‌రోసా పింఛ‌న్ల పంపిణీ విష‌యంలో నాయ‌కులు నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని కూడా చెబుతున్నారు. కేవ‌లం గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల సిబ్బంది మాత్ర‌మే …

Read More »

రాజ‌కీయాల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన టీడీపీ ఎంపీ

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ ఎంపీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే 2029 ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌డం లేద‌న్నారు. అయితే.. ఇదేదో తాను ప్ర‌జ‌ల‌కు వ్య‌తిరేకంగానో.. పార్టీకి వ్య‌తిరేకంగానో తీసుకున్న నిర్ణ‌యం కాద‌ని ఆయ‌న చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి త‌న వార‌సుడు రంగంలోకి దిగుతున్నార‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌లు త‌న వార‌సుడిని త‌న‌ను ఆశీర్వ‌దించిన‌ట్టుగానే ఆశీర్వ‌దించాల‌ని ఆయ‌న కోరారు. ప్ర‌జ‌ల కోసం త‌మ కుటుంబం అనేక ప‌నులు …

Read More »