Political News

అనుకున్నట్టే.. ట్రంప్ ప్లేట్ ఫిరాయించేశారు!

నిల‌క‌డ‌లేని మాట‌లు… నిబ‌ద్ధ‌త లేని వ్య‌వ‌హారాల‌కు కేరాఫ్‌గా మారిన అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. 24 గంట‌ల్లో మాట మార్చేశారు. ప‌హెల్గామ్ ఉగ్ర‌దాడి విష‌యంపై తొలి రెండు రోజులు తీవ్రంగా స్పందించిన ట్రంప్‌.. ఈ విష‌యంలో భార‌త్ తీసుకునే ఏ నిర్ణ‌యానికైనా అమెరికా అండ‌గా ఉంటుంద‌ని తెలిపారు. అంతేకాదు.. ఉగ్ర‌వాద దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని.. ఇది ఎవ‌రు చేసినా త‌ప్పేన‌ని వ్యాఖ్యానించారు. ఇక‌, అమెరికా ప్ర‌తిష్టాత్మ‌క మీడియా న్యూయార్క్ …

Read More »

చంద్ర‌బాబు ఛాన్స్ ఇవ్వ‌ట్లేదు కానీ.. !

‘ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఛాన్స్ ఇవ్వ‌ట్లేదు కానీ.. ఇస్తేనా?’ ఇదీ.. సీఎంవోలో వినిపిస్తున్న మాట‌. దీనికి కార‌ణం.. కొంద‌రు స‌ల‌హాదారులు స‌చివాల‌యంలోనే తిష్ట వేస్తున్నారు. ఔన‌న్నా కాద‌న్నా.. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం అంత కాక‌పోయినా.. ప్ర‌స్తుత కూట‌మి స‌ర్కారు కూడా.. స‌ల‌హాదారుల‌కు పెద్ద పీటే వేసింది. లెక్క‌కు మిక్కిలి కాకున్నా.. కొంద‌రిని నియమించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న లెక్క ప్ర‌కారం.. 60-70 మంది వ‌ర‌కు స‌ల‌హాదారులు ఉన్నారు. …

Read More »

పాకిస్థాన్ ప‌న్నాగం.. స‌రిహ‌ద్దుల్లో షాకింగ్ ప‌రిణామాలు!

జ‌మ్ము క‌శ్మీర్‌లోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతం ప‌హ‌ల్గాంలో ఉగ్ర‌వాద దాడి జ‌రుగుతుంద‌ని పాకిస్థాన్‌కు ముందే తెలుసా? ఈ దాడి ప‌రిణామాల నేప‌థ్యంలో భార‌త‌దేశం త‌మ‌పై యుద్ధానికి దిగుతుంద‌ని ముందుగానే అంచ‌నా వేసుకున్నారా? ఎలాంటి ప‌రిణామాల‌నైనా ఎదుర్కొని.. భార‌త్‌ను ఇరుకున పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారా? అంటే.. తాజాగా భార‌త్-పాకిస్థాన్ స‌రిహ‌ద్దు ప్రాంతాల వెంబ‌డి ఉన్న ప‌రిస్థితిని అంచ‌నా వేసిన అమెరికా.. ఔన‌నే చెబుతోంది. పాకిస్థాన్ ముందుగానే అన్నీ సిద్ధం చేసుకుంద‌ని కూడా వివ‌రించింది. …

Read More »

ఎవరి ‘సజ్జల’ శ్రీధర్ రెడ్డి..? లిక్కర్ కేసులో అరెస్ట్!

ఏపీలో పెను కలకలమే రేపుతున్నమద్యం కుంభకోణంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పరిగణిస్తున్న ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం రాత్రి హైదరాబాద్ వచ్చిన ఏపీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు ఈ కేసులో ప్రమేయం ఉందని భావిస్తున్న సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేశారు. అనంతరం ఆయనను హైదరాబాద్ నుంచి …

Read More »

పొంగులేటి పేరుతో.. పైసా వ‌సూల్‌!

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పేరు చెప్పి వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే..ఈ వ‌సూళ్లు ఇప్ప‌టికిప్పుడు జ‌రిగిన‌వి కాద‌ని.. ఎప్ప‌టి నుంచో జ‌రుగుతున్న‌వేన‌ని తెలిసింది. మంత్రి పొంగులేటి వ్య‌క్తిగ‌త కార్యద‌ర్శుల‌మ‌ని చెబుతూ.. వ్యాపారులు, వాణిజ్య వేత్త‌ల‌ను క‌లుసుకుని.. వారి నుంచి భారీ మొత్తంలోనే సొమ్మును రాబ‌ట్టిన‌ట్టు పోలీసులు తెలిపారు. అయితే.. చిత్రం ఏంటంటే.. మంత్రి పొంగులేటి.. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాకు చెందిన నాయ‌కుడు. కానీ, ఆయ‌న …

Read More »

ఇలాంటి వారికి బెయిలా?: బోరుగ‌డ్డ‌పై సుప్రీం సంచ‌ల‌న కామెంట్స్‌

“ఏపీ ప్ర‌భుత్వం చెబుతున్న స‌మాచారాన్ని బ‌ట్టి.. అక్క‌డి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను బ‌ట్టి.. ఇలాంటి వారికి బెయిల్ ఇవ్వ‌డం కుద‌ర‌దు. ఏదైనా ఉంటే.. ఏపీ హైకోర్టులోనే తేల్చుకో“ అని వైసీపీ నాయ‌కుడు, సోష‌ల్ మీడియాలో బూతుల‌తో విరుచుకుప డ్డ బోరుగ‌డ్డ అనిల్‌కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ముఖ్యంగా త‌న త‌ల్లికి ఆరోగ్యం బాగోలేద‌ని.. న‌కిలీ వైద్య స‌ర్టిఫికెట్‌ను స‌మ‌ర్పించి.. ఏపీ హైకోర్టును త‌ప్పుదోవ ప‌ట్టించి.. మోస పూరితంగా …

Read More »

15 రోజులే గ‌డువు,వారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేయండి: చంద్ర‌బాబు

ఒక‌సారి చెప్పి చూశారు. రెండు సార్లు వార్నింగ్ ఇచ్చారు. మూడో సారి కేసులు పెట్ట‌మ‌ని ఆదేశించారు. అయినా.. వారు దారికి రాలేదు. పైగా మ‌రింతగా రెచ్చిపోతున్నారు. ఇక‌, ఏం చేస్తారు? ఈ క్ర‌మంలోనే సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేశారు. అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న రేష‌న్ డీల‌ర్లు, మిల్ల‌ర్లు, రేష‌న్ సంబంధిత ఉద్యోగుల‌పై రౌడీ షీట్లు ఓపెన్ చేయాల‌ని సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేశారు. తాజాగా వివిధ జిల్లాల్లో జ‌రుగుతున్న …

Read More »

ఈ సారి వారి కోసం క‌దిలిన‌.. నారా భువ‌నేశ్వ‌రి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి.. స్వచ్ఛంద కార్య‌క్ర‌మాల‌లో దూకుడుగా ఉంటున్న విష‌యం తెలిసిందే. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు రాజ‌కీయంగా కూడా స‌త్తా నిరూపించుకున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక‌.. ప్ర‌జా సేవ‌లో త‌న‌దైన కోణాన్ని ఆవిష్క‌రించారు. ఈ క్ర‌మంలో గ‌త నెల‌లో విజ‌య‌వాడ‌లో కేన్స‌ర్ బాధితుల కోసం.. త‌మ‌న్‌తో క‌లిసి.. మ్యూజిక‌ల్ క‌న్స‌ర్ట్ నిర్వ‌హించారు. దీని ద్వారా వ‌చ్చిన సొమ్మును కేన్స‌ర్ రోగుల చికిత్స‌.. వారికి సాయం …

Read More »

ఉగ్రవాదం వేరు ముస్లిం సమాజం వేరు: పవన్

జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు అశువులు బాసిన సంగతి తెలిసిందే. పర్యాటకులుగా కశ్మీర్ లోయలో అడుగుపెట్టిన ఆ 26 మందిని ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా తూటాలతో కాల్చి చంపారు. హిందువులను మాత్రమే ఎంచుకొని ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, ముస్లింలను వదిలేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాల్లో హిందూ, ముస్లిం వర్గాల మధ్య సున్నితమైన వాతావరణం ఏర్పడింది. టెర్రరిస్టులుగా మారిన …

Read More »

మోదీతో బాబు భేటీ… అమరావతి 2.0 కి ఆహ్వానం!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు… ప్రధాని నివాసంలో మోదీతో శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పెహల్ గాంలో జరిగిన ఉగ్రవాద దాడిపై ఇరువురు నేతల మధ్య కీలక చర్చ జరిగింది. 26 మందిని బలి తీసుకున్న ఈ దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు… ఉగ్రవాదులపై కేంద్రం తీసుకునే ఏ …

Read More »

విడదల రజినీకి షాక్.. విచారణకు సహకరించాలన్న కోర్టు

మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని అందిన కాడికి దండుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజినీకి శుక్రవారం హైకోర్టులో షాక్ తగిలింది. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్డపాడులో ఓ స్టోన్ క్రషింగ్ కంపెనీ యాజమాన్యాన్ని బెదిరించి… రూ.2.2 కోట్లను వసూలు చేశారంటూ రజినీ సహా ఆమె మరిది గోపీ, ఆమె పీఏ రామకృష్ణతో పాటు నాడు విజిలెన్స్ ప్రాంతీయ అధికారిగా పనిచేసిన ఐపీఎస్ అధికారి …

Read More »

పార్టీలు చూడం.. కఠినంగా శిక్షిస్తాం: పవన్ కల్యాణ్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓ మాట చెప్పారంటే… దానికి అనుగుణంగానే ముందుకు సాగుతూ ఉంటారు. ఈ విషయం ఇప్పటికే పలు సందర్భాల్లో నిరూపితం కాగా.. తాజాగా శుక్రవారం నాటి తన పిఠాపురం పర్యటనలోనూ ఇదే విషయాన్ని ఆయన మరోమారు నిరూపించారు. అక్రమ, అసాంఘీక కార్యక్రమాలను ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని చెప్పిన పవన్… వాటికి పాల్పడ్డ వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. అంతేకాకుండా అలాంటి వారి విషయంలో పార్టీలను చూడబోమని కూడా తెలిపారు. ఇలాంటి …

Read More »