Political News

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా లోకేష్ రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే.. ఆయ‌న ఏదైనా భారీ ప్రాజెక్టును ప్ర‌కటించ‌డానికి ముందు.. ప్ర‌జ‌ల‌కు స‌మ‌యం చెబుతున్న విష‌యం తెలిసిందే. అలానే.. ఒక‌టి రెండు రోజుల్లో ఉగాదికి తాను ప్ర‌కటించ‌బోయే భారీ ప్ర‌క‌ట‌న‌పైనా నారా లోకేష్ ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది. దీనికిపై పెద్ద ఎత్తున ఆయ‌న …

Read More »

లోకేశ్ పై జోగి వివాదాస్పద కామెంట్లు

కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టై 84 రోజుల పాటు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. బెయిల్ పై వచ్చీ రాగానే జోగి రమేశ్ తన నోటికి పని చెప్పారు. గతంలో కూడా పలుమార్లు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ లను దుర్భాషలాడిన జోగి రమేశ్…తాజాగా మరోసారి వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. …

Read More »

అంబటి ఇంటిపై దాడి… హై టెన్షన్

ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. అంబటిపై కేసు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, తనను తిట్టిన వారిని తిరిగి తిట్టానని, చంద్రబాబును తిట్టలేదని అంబటి రాంబాబు క్లారిటీనిచ్చే ప్రయత్నం చేసినా తెలుగు తమ్ముళ్ల ఆవేశం తగ్గలేదు. ఈ క్రమంలోనే గుంటూరులోని అంబటి రాంబాబు క్యాంపు కార్యాలయంపై, ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి …

Read More »

‘చంద్రబాబును తిట్టలేదు.. అరెస్ట్ చేస్తే చేసుకోండి’

ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబును అంబటి బూతులు తిట్టిన వైనంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే అంబటిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని గుంటూరు పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు ఆ గొడవపై స్పందించారు. తిరుపతి లడ్డూ తయారీలో …

Read More »

గ్రౌండ్ లెవెల్ పై రేవంత్ రెడ్డి దృష్టి

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. రెండు సంవ‌త్స‌రాల పాల‌న‌కు ఈ ఎన్నిక‌ల‌ను రిఫ‌రెండంగా భావిస్తున్న రేవంత్ రెడ్డి స‌ర్కారు.. ఈ క్ర‌మంలో స్థానిక పోరుపై బ‌ల‌మైన వ్యూహంతోనే ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకుంది. కేవ‌లం ప‌ది రోజులు మాత్ర‌మే ప్ర‌చారానికి స‌మ‌యం ఉండ‌డం, విస్తృత‌మైన ప‌రిధిలో ప్ర‌చారం చేయాల్సి ఉండ‌డంతో దీనికి సంబంధించిన ప్ర‌ణాళిక‌ల‌ను కూడా.. అదేస్థాయిలో సిద్ధం చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీలో ప‌రిస్థితి ఎలా …

Read More »

బాబు గారి మూడు కిలోమీటర్ల సైకిల్ ప్రయాణం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైకిల్ తొక్కడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆయన సైకిల్ తొక్కిన వేగం, ఉత్సాహం అక్కడి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. పర్యావరణ పరిరక్షణ, మహిళల సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 5,555 ఈ–సైకిళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురంలోని తన నివాసం నుంచి తూంసీలో నిర్వహించిన ప్రజావేదిక వరకు అంటే దాదాపు 3 …

Read More »

`సిట్` విచారణపై వ్యూహం రచిస్తున్న కేసీఆర్?

ఫోన్ ట్యాపింగ్ కేసులో  రెండు సార్లు నోటీసులు అందుకున్న తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఈ ద‌ఫా కూడా.. సిట్ ముందుకు వెళ్లేందుకు స‌సేమిరా అంటున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఇదే స‌మ‌యంలో సిట్ నోటీసుల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు కూడా ఆయ‌న ప్ర‌య‌త్నా లు చేస్తున్న‌ట్టు బీఆర్ ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. 1)  త‌న‌పై క‌క్ష క‌ట్టి.. ప్ర‌భుత్వం వేధిస్తోంద‌న్న కోణంలో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లడం: ప్ర‌స్తుతం …

Read More »

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. అయితే, జంతువుల కొవ్వు కలపలేదని సీబీఐ చెబుతోందని వైసీపీ నేతలు వాదిస్తుండగా…కెమికల్స్ తో పాటు జంతువుల కొవ్వు కలిసిందని చార్జిషీట్ లోని 35వ పేజీలో స్పష్టం ఉందని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే అది మహాపాపం అంటూ జగన్ ఫొటోలతో ఏర్పాటు …

Read More »

జనసైనికుల మనసు దోచుకున్న నారా లోకేష్

“మనకు అన్నీ బాగున్నప్పుడు అందరూ తోడుంటారు. కానీ కష్టకాలంలో అండగా నిలిచినవారే మనవారు. అలాంటి వారిని జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదు” అని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఈ మాటలను జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఉదహరిస్తూ ఆయన అనడంతో సభలో ఉన్న విద్యార్థులతో పాటు జనసైనికుల మనసును దోచుకున్నారు. కాకినాడ జేఎన్‌టీయూలో నిర్వహించిన ‘హలో లోకేష్’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్, వివిధ విభాగాలకు …

Read More »

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రాజ్యాంగంలోని 174వ అధికరణం ప్రకారం అసెంబ్లీ సమావేశాలకు సమన్లు జారీ అయ్యాయి. ప్రతిపక్ష హోదా అంశంపై ఇప్పటికే అసంతృప్తితో ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఈ సమావేశాలు మరో పరీక్షగా మారనున్నాయి. గతంలో అసెంబ్లీకి …

Read More »

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ప్రభుత్వానికి తాజాగా 14 పేజీల నివేదికతో పాటు లేఖను సమర్పించినట్టు తెలిసింది. కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో అప్పట్లో కీలక పదవుల్లో ఉన్న ముగ్గురు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిట్‌ ప్రభుత్వానికి సూచించినట్టు సమాచారం. సిట్‌ నివేదికలో …

Read More »

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత ప్రజలందరూ ఎదురుచూశారు. కానీ వాటన్నిటికీ చెక్ పెడుతూ ఒంటరి పోరాటానికే విజయ్ మొగ్గు చూపడంతో పొత్తు ప్రస్తావనే ఇక రావట్లేదు. ఇప్పుడు ఏకంగా తానే కింగ్ అవుతానంటూ దళపతి చేసిన వ్యాఖలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కింగ్ …

Read More »