Political News

మంత్రి తప్పుకి అసెంబ్లీలో సారీ చెప్పిన సీఎం

చట్టసభలను గతంలో చాలామంది నేతలు దేవాలయాలుగా భావించేవారు. ప్రజల జీవితాలను మార్చగలిగే చట్టాలను చేసేందుకు తమకు అధికారం ఇచ్చారని జవాబుదారీతనంగా ఉండే నేతలు గతంలో చాలామంది ఉన్నారు. కానీ, కాలగమనంలో చట్టసభలు వన్నె కోల్పోయాయి. చట్టసభలలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకోవడం, వీలైతే వారి కుటుంబ సభ్యులను కూడా చట్టసభలకు లాగడం, వ్యక్తిగత దూషణలు, వ్యక్తిత్వ హననాలు వంటివి ఈ తరం …

Read More »

తెలంగాణలో ఎన్ని ఓట్లు పోతాయి స‌ర్‌

కేంద్ర ఎన్నిక‌ల సంఘం చేప‌ట్టిన స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్ ప్ర‌క్రియ‌(స‌ర్‌) తెలంగాణ‌లో ముగిసింది. దాదాపు 2 మాసాల‌కు పైగానే ఈ ప్ర‌క్రియ‌ను చేప‌ట్టారు. మ‌ధ్య‌లో రెండు సార్లు పొడిగించారు. తాజాగా తుది జాబితాను రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం సోమవారం విడుద‌ల చేసింది. దీని ప్ర‌కారం.. 73 ల‌క్ష‌ల ఓట్లు న‌కిలీవ‌ని ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి సుద‌ర్శ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ప్ర‌స్తుతం విడుద‌ల చేసిన‌ జాబితాలో వీరి పేర్లు ఉంటాయ‌ని.. అయితే.. …

Read More »

అత‌ను జ‌న‌సేన నుంచి ఔట్… ఆమె బీజేపీలోకి

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ మీద లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు చేసి వార్త‌ల్లో నిలిచిన శ్ర‌ష్ఠి వ‌ర్మ.. రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఆమె కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరింది. సోమ‌వారం హైద‌రాబాద్‌లో తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు ఎన్.రామ‌చంద్ర‌రావు, సీనియ‌ర్ నేత ల‌క్ష్మ‌ణ్‌ల స‌మ‌క్షంలో శ్ర‌ష్ఠి భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరింది. రామ‌చంద్ర‌రావు.. శ్ర‌ష్ఠికి బీజేపీ కండువా క‌ప్పి పార్టీలోక …

Read More »

అప్పుడు ‘తెలంగాణ’ బిడ్డలు… ఇప్పుడు ‘తెలుగు’ బిడ్డలు

మల్లారెడ్డి విద్యాసంస్థలను ఏపీకి కూడా విస్తరించారు మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి. తిరుపతిలో మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీని ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కుటుంబ సపరివారసమేతంగా తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్నారు మల్లారెడ్డి. ఈ సందర్భంగా మన ఆంధ్రాలో కూడా మన తెలుగు బిడ్డలు మంచి ఇంజనీర్లు, డాక్టర్లు కావాలన్న తపనతో ఇక్కడ యూనివర్సిటీ పెట్టామని మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గతంలో …

Read More »

చిన్నారెడ్డి మరో జీవన్ రెడ్డి అవుతారా?

గ్రాండ్ ఓల్డ్ ట్రంక్ పార్టీ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. వరుసగా హ్యాట్రిక్ కొట్టి అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను గద్దె దింపేందుకు విఫల ప్రయత్నాలు చేస్తోంది. ఇక, ఎన్నో ఏళ్లుగా పార్టీని వేధిస్తున్న అంతర్గత కుమ్ములాటలు, అసమ్మతి స్వరాలు, ఆధిపత్య పోరు, అసంతృప్త నేతల బుజ్జగింపులను కంట్రోల్ చేయలేక సతమతమవుతోంది. తెలంగాణలో సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని ప్రకటించగానే కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు …

Read More »

మండలిలో దద్దమ్మ.. ఆంబోతు… వ్యాఖ్యలు

ఈ రోజు నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యారు. ఈ నెల 17 నుంచి 20 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. యథా ప్రకారం వైసీపీ సభ్యులు అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. అయితే, ఎప్పటిలాగే తమకు సంఖ్యా బలం ఉన్న మండలికి మాత్రం హాజరయ్యారు. ఈ క్రమంలోనే తొలి రోజు సమావేశాల సందర్భంగా మండలిలో డీఎస్సీపై వాడీవేడీ చర్చ జరిగింది. ఈ క్రమంలోనే మంత్రి అచ్చెన్నాయుడు, వైసీపీ ఎమ్మెల్సీ …

Read More »

నాకు కోర్టు అనుమతి అవసరం లేదు: లోకేష్

డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ అధినేత జగన్, వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ ఆరోపణలు నిరూపించాలని జగన్ కు విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్ ఛాలెంజ్ చేశారు. ఆ ఆరోపణలపై ఆధారాలతో చర్చకు రావాలని జగన్ కు లోకేశ్ మూడు సార్లు సవాల్ చేసినా జగన్ స్పందించలేదు. ఈ క్రమంలోనే ఈ రోజు అసెంబ్లీలో మరోసారి జగన్ కు లోకేశ్ సవాల్ విసిరారు. గొడ్డలి పార్టీ …

Read More »

మంత్రి కాకపోయినా నాగబాబుకు కేబినెట్ హోదా

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబుకు ఏపీ కేబినెట్ లో మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, సమీకరణాలు కుదరకపోవడం వల్ల చివరకు నాగబాబు ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా నాగబాబుకు మంత్రి పదవి లేకపోయినప్పటికీ కేబినెట్ హోదా దక్కిన వైనం చర్చనీయాంశమైంది. నాగబాబును ఏపీ పర్యావరణ, అటవీశాఖ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ …

Read More »

వైసీపీ స‌త్తాకు `బ్యాలెట్` టెస్ట్‌?

ఏపీలో వ‌చ్చే సెప్టెంబ‌రులో నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయ‌తీలు, న‌గ‌ర పంచాయ‌తీలు, మునిసిపాలిటీ, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హిస్తారు. అయితే.. దీనికి ప్ర‌భుత్వం అనుమ‌తించాల్సి ఉంద‌ని అధికారులు చెబుతున్నారు. వాస్త‌వానికి గ‌త ఏడాదే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌యం వ‌చ్చిన‌ప్పుడు.. ఈవీఎంల ద్వారా ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌నిఅప్ప‌టి కమిష‌న‌ర్ నీలం సాహ్ని ప్ర‌భుత్వానికి …

Read More »

కేటీఆర్ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారు

తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది. ఇటీవల తెలంగాణా భవన్ లో బీఆర్ఎస్ కార్యకర్తలు రక్తదానం చేశారని, కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపుతుంది.  వరంగల్ జిల్లా పరకాల లో ఆదివారం జరిగిన ప్రజా పాలన – ప్రగతి బాట కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇటీవల …

Read More »

భోగాపురం టూ సింగపూర్… బాబు గారి దిల్ ఖుష్

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వ‌స‌తుల‌తో నిర్మించిన అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర‌యం కార్య‌కలాపాలు ఆదివారం అర్ధ‌రాత్రి 12 గంట‌ల త‌ర్వాత నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు విశాఖప‌ట్నానికి వ‌స్తున్న జాతీయ‌, అంత‌ర్జాతీయ విమానాలు ఇక ఆదివారం అర్ధ‌రాత్రి తర్వాత నుంచి అల్లూరి విమానాశ్ర‌యానికే రానున్నాయి. ఈ మేర‌కు విమాన‌యాన సంస్థ షెడ్యూల్‌ను నిర్దేశించింది. దీంతో భోగాపురం విమానాశ్ర‌యంలో అధికారికంగా కార్యక‌లాపాలు సోమ‌వారం తెల్ల‌వారు జాము …

Read More »

కవితకు… షర్మిలకు.. పోలికా?

కవితకు, షర్మిలకు మధ్య పోలిక పెట్టొద్దని ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్యూలో టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత స్పష్టం చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కవిత తెలంగాణా మాజీ మంత్రి కేటీఆర్ చెల్లెల్లు కాగా షర్మిల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు. ఈ ఇద్దరు వచ్చిన రాజకీయ నేపథ్యం గురించి నెటిజన్లు చర్చించుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాజకీయాలలో రెండు ప్రధాన …

Read More »