సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు సుస్మిత అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో సురేఖను మంత్రివర్గం నుంచి సీఎం రేవంత్ రెడ్డి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై కొండా సురేఖ ఇంకా స్పందించాల్సి ఉంది. సురేఖ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత ఆమె బీజేపీలో చేరతారంటూ పుకార్లు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే సురేఖకు ప్రజా శాంతి పార్టీ …
Read More »బ్రేకింగ్: కొండా సురేఖ బర్తరఫ్
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు సుస్మిత చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ పంచాయతీ ఢిల్లీకి చేరింది. నిన్న తీవ్రస్థాయిలో తర్జనభర్జనల మధ్య కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుబట్టారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే తాజాగా నేడు సురేఖను మంత్రివర్గం నుంచి రేవంత్ రెడ్డి బర్తరఫ్ చేస్తూ సంచలన …
Read More »జగన్ కు క్రెడిట్ చోరీ వ్యాధి ముదిరింది
రాష్ట్రంలో క్రెడిట్ వార్ ముదిరి పాకాన పడింది. ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలు రెండూ ఈ క్రెడిట్ మాదంటే కాదు మాదని ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఎవరి లెక్కలు వాళ్ళు వివరిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. భోగాపురం విమానాశ్రయం నుంచి మొదలుకొని వెలిగొండ, పోలవరం ప్రాజెక్టుల వరకు ఈ క్రెడిట్ వార్ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ మీద మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేసిన విమర్శలు సోషల్ మీడియాలో …
Read More »స్థానిక ఎన్నికలు వాయిదా పడవు
స్థానిక ఎన్నికలు వాయిదా పడాలని గొడ్డలి పార్టీ చేస్తున్న కుట్రలను తిప్పి కొడతామని, ఎన్నికలను వాయిదా వేసే ప్రసక్తే లేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కోర్టులో పెండింగ్లో వున్న సమస్యలను పరిష్కారించుకొని అక్టోబర్ చివరికల్లా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. స్థానిక ఎన్నికలు వాయిదా పడితే ఫైనాన్స్ కమిషన్ నిధులు నిలిచిపోతాయని, దాంతో రాష్ట్రం ఆర్ధికంగా నష్టపోవాలని గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తుందని విమర్శలు గుప్పించారు. …
Read More »రేవంత్ తో కారులో వచ్చి… భట్టితో కారులో వెళ్లి….
ఇప్పుడు తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కట్టకట్టుకొని ఢిల్లో మకాం వేసి వున్నారు. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ తదుపరి పరిణామాలు అధికార పార్టీలో ముసలం పుట్టించడం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న గ్రూపుల మధ్య గొడవలను కట్టడి చేయడానికి ఢిల్లీ పెద్దలు సంసిద్ధులు కావడంతో పంచాయితీ హస్తినకు చేరింది. మూడవ తేదీన ఢిల్లీకి రావాల్సిందిగా సీఎం రేవంత్ అండ్ కోకు పెద్దల నుంచి పిలుపు రాగా …
Read More »కంచుకోటలో కొత్త క్యాండెట్ను రెడీ చేస్తోన్న జగన్..?
రాబోయే ఎన్నికల వ్యూహాల్లో భాగంగా వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేస్తున్నారు. గత ఎన్నికల్లో చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అభ్యర్థుల గుణగణాల కంటే ఆర్థిక స్తోమతకే పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్న తరుణంలో, నంద్యాల లోక్సభ స్థానం నుంచి ఒక బడా కాంట్రాక్టర్ను …
Read More »`అయోధ్య`కు రాజకీయ గ్రహణం వీడినట్టేనా?!
ఉత్తరప్రదేశ్లోని ప్రపంచ ప్రఖ్యాత రామజన్మభూమి అయోధ్యలో ఉన్న బాలరామయ్య ఆలయానికి రాజకీయ గ్రహణం వీడినట్టేనా? ఇక, ఆలయానికి రాజకీయ ప్రభావం, ఆర్ ఎస్ ఎస్ వంటి సైద్ధాంతిక సంస్థల పెత్తనం తొలిగిపోయినట్టేనా? అంటే.. తాజాగా జరిగిన కీలక నియామకం ఔననే సమాధానమే ఇస్తోంది. 2024, జనవరిలో ప్రాణప్రతిష్ఠ చేసుకున్న అయోధ్య బాలరామయ్య ఆలయం ఇటీవల వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. రామయ్యపై భక్తితో దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు …
Read More »సాక్షిలో రెండో పేజీకి చేరిన రాజన్న
ఇవ్వాళ సెప్టెంబర్ 2 వ తేదీ. వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. సరిగ్గా 17 ఏళ్ళ క్రితం 2009 సెప్టెంబర్ 2 వ తేదీన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది సెప్టెంబర్ 2వ ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. సాక్షి దినపత్రికలో వైఎస్సార్ కు సంబందించిన కథనాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వారు. ఏమైందో తెలియదు కానీ ఈసారి సాక్షి దినపత్రికలో దివంగత నేతకు …
Read More »తెలంగాణా బీజేపీలో కారు లొల్లి
తెలంగాణా బీజేపీలో ఓ సెకండ్ హ్యాండ్ కారు రచ్చ రచ్చ చేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీని రోడ్డు మీదకు లాగింది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తన తండ్రి డి. శ్రీనివాస్ ఉపయోగించిన కారును జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ బోగ శ్రావణికి గిఫ్ట్ గా ఇవ్వడంతో బీజేపీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గు మన్నాయ్. ఎంపీ ఏకపక్ష వ్యవహారిస్తున్నారంటూ ఆ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఏకంగా …
Read More »ఆ ఆలయాల్లో సెల్ ఫోన్ వినియోగంపై నిషేధం… విజయ్ సంచలనం
తమిళనాడులో నాలుగు నెలల క్రితం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జోసెఫ్ విజయ్ ప్రజానుకూల విధానాలతో ముందుకు సాగుతున్నారు. తమిళనాడులో అనేక పుణ్యక్షేత్రాలు వున్నాయి. ప్రసిద్ధి చెందిన దేవాలయాలున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని పవిత్ర ఆలయాల్లో సెల్ ఫోన్ వినియోగాన్ని నిషేదిస్తూ సీఎం విజయ్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక యువత స్పీడ్ కు బ్రేకులు వేయడం చాలా కష్టంగా మారింది. మొబైల్ ఫోన్లో కెమెరా …
Read More »నాపై కాదు రేవంత్ పై చర్యలు తీసుకోవాలి: కొండా సురేఖ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు సుస్మిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే, ఆ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని సురేఖ వివరణనిచ్చినా కాంగ్రెస్ హై కమాండ్ సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలోనే ఈ పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఈ సారి కొండా సురేఖ నేరుగా సంచలన విమర్శలు చేయడం షాకింగ్ గా మారింది. …
Read More »తమిళనాడులో అప్పుడే పెడాకులా…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం మూడ్ ఆఫ్ చేసినట్లు కనిపిస్తుంది. ఈ సర్వే ప్రకారం తదుపరి దేశ ప్రధానిగా 48.7 శాతం ప్రజలు మోదీని కోరుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి 27.1 శాతం మద్దతు ఇచ్చారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే…ఎవరూ ఊహించని విధంగా తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మూడో స్థానంలో నిలిచారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates