ఏపీ సీఎం చంద్రబాబు తరచుగా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలపై అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి కారణం.. వారు తన మాట వినిపించుకోవడం లేదని, తాను చెప్పినట్టు ప్రజల మధ్యకురావడం లేదని చంద్రబాబు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతి నెలా 1వ తేదీన అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ విషయంలో నాయకులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని కూడా చెబుతున్నారు. కేవలం గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది మాత్రమే …
Read More »రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించిన టీడీపీ ఎంపీ
వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ ఎంపీ సంచలన ప్రకటన చేశారు. వచ్చే 2029 ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదన్నారు. అయితే.. ఇదేదో తాను ప్రజలకు వ్యతిరేకంగానో.. పార్టీకి వ్యతిరేకంగానో తీసుకున్న నిర్ణయం కాదని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి తన వారసుడు రంగంలోకి దిగుతున్నారని ఆయన ప్రకటించారు. ప్రజలు తన వారసుడిని తనను ఆశీర్వదించినట్టుగానే ఆశీర్వదించాలని ఆయన కోరారు. ప్రజల కోసం తమ కుటుంబం అనేక పనులు …
Read More »విశాఖలో మిర్రర్ బ్రిడ్జి, ఎన్ని అడుగుల ఎత్తో తెలుసా?
విశాఖపట్నానికి పెట్టుబడులు, ఐటీ సంస్థల రాకతో ఇప్పటికే భారీ మైలేజీ వచ్చింది. గూగుల్ డేటా కేంద్రం ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఈ నగరం ఇప్పుడు ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకుంది. ఎక్కడ విన్నా.. విశాఖ పేరు వినిపిస్తోంది. ఏ నలుగురు కలుసుకున్నా.. విశాఖ అభివృద్ధి, పెట్టుబడులు, ఐటీ రాజధాని, ఆర్థిక రాజధానిగా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. ఈ నగరం …
Read More »రిజైన్ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ యూటర్న్… ఏంటి కథ?
వైసీపీ హయాంలో ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్న కొందరు.. కూటమి ప్రభుత్వం రాగానే.. తమ తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. దీంతో వీరి రాజీనామాలు గత ఏడెనిమిది నెలలుగా చైర్మన్ మోషేన్ రాజు దగ్గర పెండింగులో ఉన్నాయి. అయితే.. ఎప్పటికీ వీటిపై ఒక నిర్ణయం తీసుకోకపోవడంతో ఇటీవల ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన జయమంగళ వెంకటరమణ కోర్టును ఆశ్రయించారు. తమ రాజీనామాలను తక్షణమే ఆమోదించేలా చైర్మన్ను ఆదేశించాలని కోర్టును …
Read More »‘కాపు ముఖ్యమంత్రి’ అంటూ మాజీ సీఐడీ చీఫ్ వ్యాఖ, డిప్యూటీ ఏమన్నారు?
ఏపీ సీఐడీ చీఫ్గా పనిచేసి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్పై సస్పెన్షన్ వేటు వేయాలని కోరుతూ.. టీడీపీ నేత, ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే, అసెంబ్లీ ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు కోరారు. సునీల్ పనిగట్టుకుని కులాలనురెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్(డీవోపీటీ)కి లేఖ రాశారు. ఈ లేఖలో తాజాగా సునీల్ కుమార్ చేసిన …
Read More »‘నా మిత్రుడు పవన్’ – ఈ కూటమి చానా కాలం ఉంటది!
జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. “నా మిత్రుడు..“అంటూ ఆయనను సంబోధించారు. తరచుగా ఈ వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈసారి మరింత నొక్కి చెప్పారు. `నామిత్రుడు నేను.. నిరంతరం ఒకే విధంగాఆలోచన చేస్తున్నాం. ప్రజలకు మేలు చేసేందుకు ఉన్న ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటున్నాం. ఇద్దరం కూడా.. పేదల కోసం చర్చిస్తాం. ప్రజల మంచి చెడులపై …
Read More »లోకేష్ చెబుతున్న ఆ సైకో ఎవరు?
“మనం ఒక సైకోతో పోరాడుతున్నాం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అనుక్షణం గుర్తుంచుకోండి.“ అని మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. మంగళగిరిలోని పార్టీకార్యాలయంలో కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులకు శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఎవరికి వారు సొంత రాజకీయాలు చేయడం సరికాదన్న ఆయన పార్టీకిఒక సిద్ధాంతం.. ఒక లైన్ ఉన్నాయని.. …
Read More »`రాజ్`భవన్లకు పేరు మార్పు: కేంద్ర సంచలన నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న రాజ్ భవన్లకు పేరు మార్చింది. ఇక నుంచి రాజ్ భవన్లను `లోక్ భవన్`లుగా సంబోధించాలని.. అధికార, అనధికార జాబితాలు.. పత్రాలు.. సహా మీడియా కూడా ఇదే తరహాలో పేర్కొనాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా కేంద్ర హోం శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒకవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో …
Read More »అప్పుడు 10 వేలు, ఇప్పుడు 160 కోట్లు – చంద్రబాబు
హైదరాబాద్ సిటీ శివారు కోకాపేటలో భూముల ధరలు సరి కొత్త రికార్డులను సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ భూములను కొనుగోలు చేసేందుకు తెలుగు రాష్ట్రాల వారే కాకుండా ఇతర రాష్ట్రాల వారు సైతం పోటీ పడుతుండడం ఆసక్తికరంగా మారింది. గత వారం రెండు దఫాలుగా నాలుగు ప్లాట్లను హెచ్ఎండీఏ వేలం వేయగా, ఐదు ఎకరాల స్థలాన్ని ఎకరాకు రూ.151కోట్ల చొప్పున నలుగురు వ్యక్తులు దక్కించుకున్నారు. ఇది ఇరు తెలుగు రాష్ట్రాల్లో …
Read More »ప్రజాపాలనకు రెండేళ్లు: ఉత్సవాల నేపథ్యం.. మంచీ-చెడులు ఇవీ!
తెలంగాణలో పదేళ్ల పాటు వేచి చూసి.. 2023 ఎన్నికల్లో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ పాలన చేపట్టి.. ఈ నెల(డిసెంబ రు) 9వ తేదీకి రెండు సంవత్సరాలు పూర్తికానున్నాయి. అప్రతిహత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధిపత్యానికి, పాలనకు చెక్ పెట్టి.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టి.. రెండేళ్లు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే డిసెంబరు 1 నుంచి 9వ తేదీ వరకు ‘ప్రజాపాలన …
Read More »గడువుకు ముందే.. కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి
సాధారణంగా కేసుల నుంచి తప్పించుకుంటున్న కొందరు నిందితులు పోలీసులు, కోర్టుల ఆదేశాలను కూడా విస్మరిస్తున్నారు. వీరిలో వైసీపీకి చెందిన నాయకులు కూడా ఉన్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలపై జంట హత్యల కేసు నమోదైంది. ఈ కేసులో వారు ఏ8, ఏ9గా ఉన్నారు. అయితే.. కొన్నాళ్లపాటు తప్పించుకుని తిరిగి.. హైకోర్టు నుంచి …
Read More »మోదీ vs ప్రియాంక – ఏంటి ఈ ‘డ్రామా’ పాలిటిక్స్?
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ఫైర్ అయింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి ప్రధాన మంత్రి మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో `డ్రామాలు` చేయొద్దని.. ప్రజల సమస్యలపై చర్చించేందుకు ముందుకు రావాలని ఆయన సూచించారు. ముఖ్యంగా కొత్త తరం ఎంపీలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా కార్యక్రమాలు అమలు చేయాలని.. అరుపులు కేకలతో నినాదాలతో సభాకార్యక్రమాలకు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates