తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఏపీ రాజధానికి రూ.15 వేల కోట్ల రూపాయలను ప్రకటించారు. అయితే.. ఈ ప్రకటన వెలువడిన వెంటనే రాజధాని అమరావతిలోనూ.. ఏపీ అసెంబ్లీలోనూ(అప్పుడే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశ పెట్టారు) సంబరాల వాతావరణం ఏర్పడింది. అయితే.. గంటలు గడిచిన తర్వాత.. ఇదే రూ.15 వేల కోట్లపై తీవ్ర దుమారం రేగింది. వివాదంగా మారింది. అసలు …
Read More »RRRను చూసి నేర్చుకోవాలి: పవన్
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడుతూ.. రఘురామకృష్ణరాజు(ఆర్.ఆర్.ఆర్) నుంచి చూసి నేర్చుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయని తెలిపారు. జగన్ ఆయనపై ఎన్నో అక్రమ కేసులు పెట్టి పోలీసులతో కొట్టించినా.. అవేవీ మనసులో పెట్టుకోకుండా.. సభలో జగన్ కనిపించగానే వెళ్లి ఆప్యాయంగా పలకరించారని తెలిపారు. సభ్యులందరూ.. ఈ మంచి లక్షణాన్ని నేర్చుకోవాలని సూచించారు. …
Read More »గజి బిజి రోజా .. గత వైభవమేనా ?!
ఒక్క ఓటమి వైసీపీ నేతల రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తుంది. ఇంట్లో ఉండలేరు, బయట తిరగలేరు. ఐదేళ్ల అధికారంలో వారు వ్యవహరించిన తీరే ప్రస్తుతం వారిని ఈ పరిస్థితికి తీసుకువచ్చిందని అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పద్దతిగా వ్యవహరించి ఉంటే ఈ రోజు ఓటమి పాలైనా ప్రజలలో ఒకింత సానుభూతి ఉండేదని అంటున్నారు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ఉన్న సినీనటి, మాజీ మంత్రి రోజా నగరి శాసనసభ స్థానం నుండి …
Read More »హత్యలపై నెంబర్ గేమ్.. వాస్తవం ఏంటి.. ?
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, 31 రాజకీయ హత్యలు జరిగాయని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించడం తెలిసిందే. ఏపీలో రాజకీయ కక్షలతో జరుగుతున్న దాడులను తాము పార్లమెంటులో ప్రస్తావిస్తామని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని దేశం మొత్తానికి వివరిస్తామని మిథున్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా నెంబర్లు వివరించారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు దాదాపు35-36 మంది …
Read More »ఏపీకి ఇచ్చినందుకు బాధ లేదు-కేటీఆర్
ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ మీద ఏపీ ప్రధాన ప్రతిపక్షం నుంచి పెద్దగా స్పందనే లేదు. కానీ తెలంగాణలో ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం గట్టిగానే మాట్లాడింది. తమ పార్టీ నేతలతో కలిసి ప్రెస్ మీట్ పెట్టిన మాజీ మంత్రి కేటీఆర్.. బడ్జెట్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు గుండు సున్నా ఇచ్చారంటూ ఎన్డీయే ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఈసారి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్తో పాటు బీహార్కు పెద్ద ఎత్తున …
Read More »నన్నైనా శిక్షించండి-పవన్ కళ్యాణ్
మిగతా రాజకీయ నాయకులతో పోలిస్తే తాను భిన్నం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు చాటుతూనే ఉంటాడు. ఆయన ప్రసంగాలు, వ్యవహార శైలి మొదట్నుంచి భిన్నమే. ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా కూడా పవన్ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నాడు. తప్పు చేస్తే తనను కూడా శిక్షించండి అంటూ ఆయన అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం విశేషం. అంతే కాక తమ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైనా తప్పు …
Read More »బాబు సాధించారు.. జగన్కు ఆయనకు తేడా ఇదే!
చంద్రబాబు అనుకున్నది సాధించారు. తాజాగా కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ను గమనిస్తే.. కీలకమైన రంగాలుగా ఉన్న అమరావతి నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టుకు.. నిధులు రాబట్టారు. ప్రత్యక్షంగా అమరావతి నిర్మాణంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. రూ.15 వేల కోట్లు ఇస్తామన్నారు. ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టుకు ఎలాంటి నిధులు ప్రకటించకపోయినా.. పూర్తి చేసేందుకు సాయం చేస్తామన్నారు. పార్లమెంటు సాక్షిగా చేసిన ప్రకటన కాబట్టి.. ఈ విషయంలో …
Read More »ప్రధాన ప్రతిపక్ష హోదా ఇప్పించండి: హైకోర్టుకు జగన్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్.. హైకోర్టు మెట్లు ఎక్కారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇప్పించాలని కోరుతూ ఆయన వైసీపీ తరఫున పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించి ఇప్పటికే స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశామని.. అయినా .. ఆయన నుంచి ఎలాంటి సమాచారం రాలేదని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు జోక్యం చేసుకుని.. తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదాను ఇప్పించాలని కోరారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర, రాజస్థాన్ …
Read More »హిందుత్వ అజెండాలో ఆహార నియమాలు.. !
హిందుత్వ అజెండాలో ఆహార నియమాలు. ఇది వినేందుకే ఇబ్బందిగా అనిపించే పరిణామం. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం దీనిని ప్రధాన అజెండాగా బిజెపి భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈనెలలో ప్రారంభమయ్యే శ్రావణమాసం సందర్భంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కావడి ఉత్సవాన్ని హిందువులు ఘనంగా నిర్వహిస్తారు. సుదూర ప్రాంతాల్లోని వారు గంగానది జలాలను తీసుకువెళ్లి శివాలయాల్లో అభిషేకం చేస్తారు. దీనిని కావడి ఉత్సవంగా పేర్కొంటారు. ఈ ఉత్సవం జరిగే సమయాల్లో ఆహార నియమాలను అనుసరించాలి …
Read More »ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు: అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం!
ఎన్నికలకు ముందు తీవ్ర చర్చనీయాంశం అయిన.. ల్యాండ్ టైటింగ్ యాక్ట్ బుట్ట దాఖలైంది. ఈ చట్టాన్ని రద్దు చేస్తూ.. ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. దీంతో 2021-22 మధ్య అప్పటి జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తిగా రద్దయిపోయినట్టు అయింది. ఎన్నికలకు మూడు వారాల ముందు.. అనూహ్యంగా ఈ అంశం తెరమీదకు వచ్చింది. అప్పటి వరకు జరిగిన ప్రచారం ఒక ఎత్తు అయితే. ఈ …
Read More »‘నాడు-నేడు’పై విచారణ: మంత్రి లోకేష్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో తొలిరోజు సభ ముగిసింది. ఈ రోజు సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దాంతోపాటు సభలో 2 ప్రభుత్వ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ రిపీట్ బిల్ 2024, డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సవరణ బిల్లు 2024 లను సభ ముందుకు తీసుకురాబోతున్నారు. …
Read More »కేంద్ర బడ్జెట్ సమగ్ర స్వరూపం ఇదే!
వచ్చే ఏడు మాసాల కాలానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు ప్రవేశ పెట్టిన బడ్జెట్ను పరిశీలిస్తే.. ఈ కేంద్ర బడ్జెట్ మొత్తం(ఏడు మాసాలకు) రూ.48.21 లక్షల కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. పన్ను ఆదాయం రూ.28.83 లక్షల కోట్లుగా ఉండగా.. ద్రవ్యలోటు 4.9 శాతంగా ఉండవచ్చని అంచనా వేశారు. అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు అంచనావేశారు. మొత్తంగా చూస్తే.. విదేశీ పెట్టుబడులకు.. …
Read More »