సీబీఐ మాజీ సంయుక్త సంచాలకుడు, మాజీ ఐపీఎస్ అధికారి వి.వి. లక్ష్మీనారాయణ రాజకీయాలకు శాశ్వతంగా గుడ్బై చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ఈవి ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో కార్యకలాపాల విభాగ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయన క్రియాశీలక రాజకీయాలకు పూర్తిగా దూరమైనట్టయింది. సీబీఐలో పలు సంచలన కేసుల విచారణతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన, ఐపీఎస్ సేవల …
Read More »అక్కడ బీజేపీ – కాంగ్రెస్ పొత్తు
తెలంగాణ రాజకీయాల్లో చిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ లు చేతులు కలిపాయి. ఫలితంగా మల్కాజిగిరి జిల్లాలోని అలియాబాద్ మునిసిపాలిటీని దక్కించుకున్నాయి. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. వాస్తవానికి నిన్నటి వరకు బీఆర్ఎస్-కాంగ్రెస్ ల మధ్య ఫెవికాల్ బంధం ఉందని బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈయన చేసిన వ్యాఖ్యలను కాదని.. మరో కేంద్ర మంత్రి బండి సంజయ్.. కాంగ్రెస్-బీఆర్ ఎస్ …
Read More »అమరావతిలో బాబుతో బిల్ గేట్స్ భేటీ, కారణమేంటి?
27 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్ అధినేత, గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ తో హైదరాబాద్ లో సీఎం చంద్రబాబు భేటీ అయిన సందర్భం తెలుగు వారందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ఒక్క మీటింగ్ ఏపీ, తెలంగాణలోని వేలాది మంది యువత భవితను మార్చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది నేడు ఐటీ ఉద్యోగులుగా దేశవిదేశాల్లో స్థిరపడ్డారంటే అందుకు ఆనాటి ఆ ఒక్క మీటింగే కారణమనేది అనేక విశ్లేషకుల …
Read More »విమర్శకుల ప్రశంసలు అందుకున్న డిప్యూటీ సీఎం!
సింగరేణి బొగ్గు టెండర్ల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతల మధ్య విభేదాలు వచ్చాయని మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల మధ్య విభేదాలు రచ్చకెక్కాయని ప్రచారం జరిగింది. అయితే, ఆ ప్రచారం సంగతి పక్కనబెడితే..రాజకీయాలకు అతీతంగా భట్టి విక్రమార్క చేసిన పని విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. మహా శివరాత్రి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితోపాటు కేబినెట్ మంత్రుల పేర్లతో …
Read More »జగిత్యాలలో ఒకటైన కాంగ్రెస్ వర్గాలు
జగిత్యాల మునిసిపల్ పీఠం ఎట్టకేలకు కాంగ్రెస్పార్టీకే దక్కింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న స్తబ్దతకు చెక్ పెడుతూ.. కాంగ్రెస్ అదిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయస్థాయి నాయకుడు సవాంగ్ ను రంగంలోకి దింపింది. దీంతో ఆయన ఎంట్రీ ఇచ్చి.. ఇరు వర్గాలుగా చీలిపోయిన కాంగ్రెస్ పార్టీ నేతలను ఏకతాటిపైకి తీసుకువచ్చారు. అందరూ కలసి కట్టుగా పనిచేస్తేనే పార్టీకి ఫ్యూచర్ ఉంటుందని తేల్చి చెప్పారు. ఇదేసమయంలో సీనియర్ నేత జీవన్ …
Read More »`కోవా బన్` వివాదం.. నాగబాబు ఎంట్రీ..!
గత వారం పది రోజులుగా తెరచాటునే ఉన్న `కోవా బన్` వివాదం.. రెండురోజుల నుంచి తీవ్రస్థాయిలో రాజకీయ రంగు పులుముకుంది. ఈ వివాదం సరికాదంటూ.. జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్సీ నాగబాబు, టీడీపీ తరఫున మంత్రి నారా లోకేష్లు స్పందించారు. నాగబాబు అయితే.. ఏకంగా బాధిత కుటుంబాన్ని తన నివాసానికి పిలిచి ఊరడించారు. రెక్కడితే కానీ.. డొక్కాడని కుటుంబాలను.. చిరు వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని వేధించడం సరికాదని ఆయన హితవు …
Read More »ప్రభుత్వం దగ్గర భూములు లేవ్: రేవంత్
రాష్ట్ర ప్రభుత్వం వద్ద భూములు లేవని.. ఎవరికీ ఇచ్చే పరిస్థితి కూడా లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పేదలకు ఉచితంగా భూములు ఇచ్చే ఆలోచన ఉన్నప్పటికీ.. ఇచ్చే పరిస్థితి లేదని.. ప్రభుత్వం దగ్గర భారీ భూ బ్యాంక్ ఉన్నట్టుగా జరుగుతున్న ప్రచారంలోనూ నిజం లేదని అన్నారు. ఏ సామాజికవర్గం కూడా.. ప్రభుత్వం నుంచి భూములు వస్తాయేమోననే ఆశలను విడనాడాలని ఆయన సూచించారు. అయితే.. అన్ని సామాజికవర్గాల …
Read More »పడుతున్నా.. పైచేయి మాదేనంటున్న బీఆర్ఎస్!
ఒక పరాజయం ఎదురైతేనే… పార్టీలు తమను తాము సరిచేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తాయి. ఇక, వరుస పెట్టి పరాజయాలు వెంటాడితే.. మరేం చేయాలి?!. మరింత అప్రమత్తం కావాలి. మరింతగా ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించాలి. తమ తప్పులు తెలుసుకుని వాటిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించాలి. ఇది రాజకీయాల్లో ఏ పార్టీకైనా ఉండాల్సిన ప్రధాన లక్ష్యం. కానీ.. తెలంగాణను పదేళ్లపాటు ఏలిన బీఆర్ఎస్ పార్టీలో ఈ తరహా సంస్కృతి కనిపించడం లేదని పరిశీలకులు చెబుతున్నారు. వరుస …
Read More »అసెంబ్లీలో శివరాత్రి వేడుక.. ఒకరోజు ముందే
దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఆదివారం జరగనున్నాయి. అన్ని శివాలయాల్లోనూ ఈ వేడుకలు నిర్వహించేందుకు భక్తులు సిద్ధమయ్యారు. అయితే.. ఏపీ అసెంబ్లీలో ఒక రోజు ముందుగానే మహా శివరాత్రి ముచ్చట కనిపించింది. టీడీపీ సహా కూటమిలోని అన్ని పార్టీలకు చెందిన మహిళా మంత్రులు, ఎమ్మె ల్యేలు(ఒకరిద్దరు మినహా) మహా శివరాత్రిని తలపించే వస్త్ర ధారణతో హాజరయ్యారు. శివరాత్రి రోజు శివత త్వంతో కూడిన వస్త్రాలను ధరిస్తారు. అచ్చంగా అలాంటి వస్త్రాలనే ధరించిన …
Read More »పవన్ సహాయాన్ని బయటపెట్టిన బన్నీ మేనేజర్
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఉదారతతో పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ చిన్నారులకు కొండంత అండగా నిలిచారు. రాజకీయ ప్రచారాలకు అతీతంగా, మానవీయ దృక్పథంతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. మొదట 42 మంది అనాథ చిన్నారులకు సహాయం అందించిన ఆయన, ఇటీవల సామాజిక మాధ్యమాల ద్వారా తమ సమస్యను వెల్లడించిన మాధవపురానికి చెందిన సత్య, చైతన్య అనే ఇద్దరు చిన్నారులకు …
Read More »బీఆర్ఎస్ కు సీపీఐ షాక్!
తెలంగాణ మున్సిపల్ పోరులో కాంగ్రెస్ అత్యధిక మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. ఐతే కీలకమైన కొత్తగూడెం కార్పరేషన్ లో హంగ్ ఏర్పడిన తరువాత రాజకీయ పరిణామాలు మారిపోయాయి. అధికార పార్టీ కాంగ్రెస్ కు ధీటుగా సీపీఐ కూడా 22 డివిజన్లలో విజయం సాధించడంతో మేయర్ పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారోనన్న సందిగ్ధత నెలకొంది. నిన్న ఫలితాలు వెల్లడించిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన కేటీఆర్.. సింగరేణి కేంద్రంగా ఉన్న కొత్తగూడెం కార్పొరేషన్ …
Read More »‘పిక్చర్ బాకీ హే..’ బీఆర్ఎస్ కు కవిత వార్నింగ్!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో బీఆర్ఎస్ కు వచ్చిన స్థానాల నేపథ్యంలో ఆ పార్టీకి జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కు కవిత డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. జాగృతిపై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో ఇంకో చోట ట్రోలింగ్, కామెంట్స్ చేస్తున్నారని…‘కారు’కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఏ సిర్ఫ్ ట్రైలర్.. పిక్చర్ బాకీ హై’’ అంటూ మాస్ డైలాగ్ తో బీఆర్ఎస్ కు వార్నింగ్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates