ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న జనసేన పార్టీ.. ఈ ఏడాది పార్టీ సభ్యత్వాన్ని గత నెలలోనే ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సభ్యత్వ కార్యక్రమానికి `ఉద్యమి` అనే పేరును పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ తరఫున నాయకులు.. కార్యకర్తలు ఉద్యమి సభ్యత్వ కార్యక్రమాన్ని జోరుగా ముందుకు తీసుకువెళ్లాలని సభ్యత్వ కార్యక్రమం ప్రారంభం రోజునే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. దీనిని అప్పట్లో నాయకులు కూడా …
Read More »మారకపోతే మార్చేస్తా.. తమ్ముళ్లకు బాబు హెచ్చరిక
పార్టీ విధానాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా నాయకులు పనిచేయాలని.. ఎమ్మెల్యేలు-ఎంపీలు కలివిడిగా ఉండాలని సీఎం చంద్రబాబు టీడీపీ నాయకులకు సూచించారు. నంద్యాల జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. సోమవారం సాయంత్రం పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ నాయకుల వ్యవహార తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అదేసమయంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం లేదని వస్తున్న నివేదికలను కూడా వారి ముందు ఉంచి.. ప్రశ్నించారు. “ఇలా అయితే..ఊరుకునేది …
Read More »బాబు కొత్త నిర్ణయం… వారి పరిస్థితి ఏమిటి?
రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని.. దీనికి మహిళలు కూడా సిద్ధంగా ఉండాలని తాజాగా ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. అనేక అంశాలను ప్రస్తావించారు. ఈ క్రమంలోనే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తామని తేల్చి చెప్పారు. అంతేకాదు.. ఎమ్మెల్యేలు అయ్యేందుకు మహిళలు ఇప్పటి నుంచే రెడీ కావాలని కూడా చంద్రబాబు …
Read More »జగన్ పరామర్శలు.. సైతాన్ సైన్యం కోసమైనా?
జగన్కు బలప్రదర్శనల మీద ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు. జగన్ వెనుక సైతాన్ సైన్యం ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ సైన్యానికి లేదా ఆయన పార్టీ క్యాడర్కు ఇబ్బంది వస్తే తప్ప జగన్ బయటకు రారని ఆమె ఆరోపించారు. రాజమహేంద్రవరం కిమ్స్ ఆసుపత్రిలో కల్తీ పాల ఘటనలో చికిత్స పొందుతున్న బాధితులను సోమవారం షర్మిలా పరామర్శించారు. అనంతరం …
Read More »ఈ `తెలివి` తేటలు సీఎం రేవంత్ వేనా?
తెలివి ఎవరి సొత్తూ కాదు. ఐడియా ఉండాలేకానీ.. ఎంత కష్టమైన పనైనా సులువుగా మారిపోవడంతోపాటు సులువుగా మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ఓ అద్భుతమైన ఐడియానే తెలంగాణ ప్రభుత్వం చేసింది. డబ్బులతో పనిలేకుండా.. పొరుగు రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయడమే ఈ ఐడియా సారాంశం. ఇది కొంత వింతగా ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ పాలిత తెలంగాణలో త్వరలోనే ఇది అమల్లోకి రానుంది. దీనికి సంబంధించిన ఒప్పందాలు కూడా …
Read More »బీఆర్ఎస్ తో పొత్తు.. మౌనం వీడిన బీజేపీ
బీఆర్ఎస్ తో బీజేపీకి చీకటి పొత్తు ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటారు. అయితే, బీజేపీతో కాంగ్రెస్ చీకటి ఒప్పందం చేసుకుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంటారు. అయినప్పటికీ ఎన్నడూ ఈ రెండు ఆరోపణలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించలేదు. కానీ, తాజాగా అసలు బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తేల్చి చెప్పడం ఆసక్తికరంగా మారింది. రెండుసార్లు బీఆర్ఎస్ కు, ఒకసారి …
Read More »రాజుగారిపై అవిశ్వాసం.. జనసేన అడ్డు చెప్పిందా?
శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని, ఆయనకు ఆ పదవిలో ఉండేందుకు అర్హత లేదని వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన పలువురు ఎమ్మెల్సీలు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బల్లి కళ్యాణ్ చక్రవర్తి మోషన్ రాజు పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసు కూడా ఇస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి శుక్రవారం పెద్ద ఎత్తున చర్చ కూడా …
Read More »చికాకులకు చెక్ పెట్టకపోతే… నేతలను కట్ చేసేస్తారు!
కూటమి ఎలా ఉండాలి కూటమి సభ్యులు ఏ విధంగా వ్యవహరించాలి పార్టీ నాయకులు ఎలా ఉండాలి అనే విషయాలపై తరచుగా సీఎం చంద్రబాబు పదేపదే చెబుతూ వస్తున్నారు. అందరూ కలివిడిగా ఉండాలని క్షేత్రస్థాయిలో కలిసిమెలిసి పనిచేయాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు దీనికోసం సమన్వయ కమిటీలను కూడా క్షేత్రస్థాయిలో నియమించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీ పని చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ కలివిడికి సంబంధించి కూటమి …
Read More »మోడీ ఎఫెక్ట్: ఉచితాల వైపు వడివడిగా అడుగులు!
వచ్చే రెండు మూడు మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కీలక రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు ప్రధాని మోడీ భయం పట్టుకుందా? ముఖ్యంగా ఆయన వ్యూహం, దూకుడుపై అంచనాలు వేయలేకపోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో ప్రజలను మచ్చిక చేసుకునేందుకు ఉచిత పథకాలను మరిన్ని ప్రకటించడంతో పాటు, ఇప్పటికిప్పుడు వాటిని అమలు చేస్తూ ఓటు బ్యాంకును పదిలం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వచ్చే ఏప్రిల్ మే …
Read More »‘అందుకే ఎక్కువ మంది పిల్లల్ని కనమని చెబుతున్నా’
ప్రపంచంలోని పలు దేశాల్లో వృద్ధ జనాభా ఇప్పుడు పెను సవాలుగా మారుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. మనదేశం మాత్రమే ప్రస్తుతం యువత ఎక్కువగా ఉందన్నారు. అయితే వచ్చే 20 ఏళ్ల తర్వాత ఈ పరిస్థితి కూడా తారుమారయ్యే అవకాశం ఉందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పిలుపునిస్తున్నట్టు చెప్పారు. వయోజన జనాభా సమతుల్యం కావాలంటే ఇప్పటి నుంచే సంతానోత్పత్తిపై దృష్టి పెట్టాలన్నారు. అందుకే …
Read More »అరటి దొంగకు తీహార్ జైలా?
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్టై విడుదలైన సంగతి తెలిసిందే. ఆ కేసులో ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ తో పాటు కవితకు కూడా క్లీన్ చిట్ ఇస్తూ కోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా కవిత జైలులో గడిపిన రోజులు, అక్కడి దుర్భర పరిస్థితులు, సరదా ఘటనల గురించి …
Read More »మా వల్లే గెలిచారు.. వివాదాలకు బాబు చెక్!
వివాదాస్పద నాయకులకు సీఎం చంద్రబాబు తనదైన శైలిలో చెక్ పెట్టారు. ఎవరికివారు తమంత వారు లేరని భావిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వివాదాలు కూడా అదేవిధంగా కొనసాగుతున్నాయి. గతం నుంచి వివాదాలకు దిగుతున్న నేతలు కొందరు అయితే, కొత్తగా మరికొందరు వివాదాలకు కేంద్రంగా మారుతున్నారు. దీంతో పైస్థాయిలో కూటమి నాయకుల మధ్య ఐక్యత ఉన్నప్పటికీ, గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఒకింత ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తిరువూరు, సత్తెనపల్లి, సత్యవేడు, గుడివాడ, …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates