Political News

పవన్ ఒకరే జనసేనను నడపలేరు

జ‌న‌సేన పార్టీని పుంజుకునేలా చేయాల‌న్న‌ది పార్టీ అధిప‌తి, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆలోచ‌న‌. అందుకే ఆయ‌న త‌ర‌చుగా క‌మిటీలు ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ నాయ‌కుల‌ను ముందుండాల‌ని కూడా సూచిస్తున్నారు. కానీ, ఆయ‌న చెబుతున్న‌ట్టుగా.. లేదా ఆయ‌న ఊహిస్తున్న‌ట్టుగా పార్టీలో ఆ త‌ర‌హా.. దూకుడు క‌నిపించ‌డం లేదు. కేవ‌లం ప‌వ‌న్ వ‌స్తే కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రు కావ‌డం.. లేకపోతే లేదు.. అన్న‌ట్టుగానే నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న‌ది పార్టీలోనే జ‌రుగుతున్న చ‌ర్చ‌. గ‌త ఏడాది …

Read More »

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే అవ‌కాశాన్ని తీసుకువస్తున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. సేవ‌ల్లో మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త కోస‌మే ఈ విధానాన్ని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు, రెవెన్యూ సేవ‌ల‌పై ఆయ‌న స‌మీక్షించారు. చాలా మంది స్టేష‌న్ల‌కు రావాలంటే ఇప్ప‌టికీ జంకుతున్న ప‌రిస్థితి ఉంద‌ని సీఎం తెలిపారు. ఈ ప‌రిస్థితి పోవాల‌న్నారు. ఫ్రెండ్లీ …

Read More »

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ ఆ పార్టీ జిల్లా కార్యాలయాల్లో ఎక్కడికక్కడ వెలిశాయి. వైసీపీ కార్యాలయాలు వెలసిన ప్రదేశాలు ప్రభుత్వ స్థలాలా?… లేదంటే ప్రైవేట్ స్థలాలా? అన్న విషయాన్ని నాటి పాలకులు అస్సలు పట్టించుకోలేదనే చెప్పాలి. తాజాగా ఈ తరహా అక్రమాలపై విజయనగరం రాజ వంశస్తులు, కేంద్ర మాజీ మంత్రి, గోవా గవర్నర్ పూసపాటి …

Read More »

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో నిర్వహించిన పరీక్షల్లో రొటేటర్ కఫ్ తో పాటు రెండు భుజాల కండరాల్లో తీవ్ర చీలికలు ఉన్నట్లు తేలింది. వెంటనే శస్త్ర చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. అయితే పవన్ మాత్రం వెంటనే ఆపరేషన్ చేయించుకునే ఆలోచనలో లేరు. ఇప్పటికే నిర్ణయించిన పాలనాపరమైన కార్యక్రమాలు, అధికారిక బాధ్యతలు …

Read More »

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్ రిటైర్మెంట్‌కు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 1993వ సంవ‌త్స‌రం అఖిల భార‌త స‌ర్వీసుల‌కు చెందిన సునీల్ కుమార్‌.. ఏపీలో వివిధ హోదాల్లో ప‌నిచేశారు. వైసీపీ హ‌యాంలో సీఐడీ చీఫ్‌గా ప‌నిచేసిన‌ప్పుడు వివాదాల‌కు కేంద్రంగా నిలిచారు. తాజాగా ఆయ‌న ప‌ద‌వీ విర‌మ‌ణ గ‌డువు(జూన్ 30) రావ‌డంతో రాష్ట్ర …

Read More »

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు వ‌చ్చింద‌ని నేను అనుకుంటున్నా. ఆ పార్టీని ప్ర‌జ‌లు ఎప్పుడో ప‌క్క‌న పెట్టేశారు. ఇప్పుడు ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసే పార్టీలు, రాష్ట్రం కోసం ప‌నిచేసే నాయ‌కులు ఉన్నారు. వ్య‌క్తిగ‌త స్వార్థం కోసం.. ప‌నిచేసేవారు ఎవ‌రూ లేరు. రాజ‌కీయాలు మ‌రీ అంత చెడిపోలేదు. చెడ్డ‌వి కూడా కావు. రండి. రాజ‌కీయ పార్టీల్లో …

Read More »

అంబానీ ఆసుప‌త్రికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌… ఏం జ‌రిగింది?

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌రోసారి ఆసుప‌త్రిలో చేరారు. 40 రోజుల కింద‌ట‌ ఆయ‌న హైద‌రాబా ద్‌లోని ఓ ఆసుప‌త్రిలో చికిత్స పొందిన విష‌యం తెలిసిందే. ముక్కుకు స‌ర్జ‌రీ కూడా చేయించున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా మ‌రోసారి ఆయ‌న ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుప‌త్రిలో చేరారు. ఆయ‌న వెంట స‌తీమ‌ణి అన్నా కూడా వెళ్లారు. రెండు రోజుల పాటు ఆసుప‌త్రిలోనే ఉండ‌నున్న‌ట్టు పార్టీ …

Read More »

‘న‌కిలీ ఓట్ల‌తోనే రేవంత్ గెలిచారు’

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ ర‌క్ష‌ణ‌సేన(టీఆర్ఎస్‌) పార్టీ అధ్యక్షురాలు క‌విత తీవ్ర వ్యాఖ్య లు చేశారు. న‌కిలీ ఓట్ల‌తోనే రేవంత్ విజ‌యం ద‌క్కించుకున్నార‌ని అన్నారు. కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో 33 వేల‌ న‌కిలీ ఓట్లు ఉన్నాయ‌ని.. రేవంత్ రెడ్డికి 32 వేల ఓట్ల మెజారిటీ ల‌భించింద‌ని.. అంటే.. ఆయ‌న న‌కిలీ ఓట్ల‌తోనే విజ‌యం ద‌క్కించుకున్న‌ట్టు క‌దా! అని క‌విత అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా న‌కిలీ ఓట్లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ఆరోపించారు. …

Read More »

తూచ్… అమరావతికి వ్యతిరేకమని జగన్ చెప్పలేదా?

అమరావతి రాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధానికి కేంద్రం నుంచి భారీగా నిధులు మంజూరవుతూ, నిర్మాణ పనులు వేగంగా సాగుతున్న నేపథ్యంలో “మేము కానీ, జగన్ గారు కానీ ఎప్పుడూ అమరావతికి వ్యతిరేకం కాదని చెప్పాం” అంటూ కొత్త వాదనను ముందుకు తీసుకొస్తోంది. అయితే అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానుల ప్రతిపాదన, అధికారం కోల్పోయిన తర్వాత కొంతకాలం మౌనం, ఆ తర్వాత …

Read More »

ఇడుపు కాయితం ఇష్యూలోకి పవన్ ను టార్గెట్ చేసుడేంది కవిత?

ఒకరు వెళుతుంటే నలుగురు నానా మాటలు అనటం కొత్తేం కాదు. ఎప్పుడైతే సమాజం సోషల్ మీడియాలోకి షిప్ట్ అయ్యిందో.. ఆ పైత్యాలు సోషల్ మీడియా వేదికగా చేసుకోవటం ఎక్కువైంది. విచక్షణ మరిచి.. మర్యాదల్ని వదిలేసి నలుగురు ముందు నోటికి వచ్చినట్లు మాట్లాడే ఎంతోమందికి.. సోషల్ మీడియా ఇప్పుడో వరమైంది. ఎందుకంటే.. తమ పైత్యాన్ని సోషల్ మీడియాలో ప్రదర్శిస్తే నలుగురేంటి ఖర్మ.. నాలుగు వేలు.. ఒకవేళ సదరు పోస్టు వైరల్ అయితే …

Read More »

బీజేపీ బెంగాల్ రాజకీయం తెలంగాణలో పని చెయ్యదా?

తెలంగాణ‌లో విజ‌య‌మే ల‌క్ష్యంగా ప‌నిచేయాల‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేందుకు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బీన్ దిశానిర్దేశం చేశారు. దీనికిగాను ఈ ఏడాది జ‌రిగిన ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల‌ను స్ఫూర్తిగా తీసుకోవాల‌న్నారు. అక్క‌డ ప్ర‌జా పోరాటాల ద్వారానే అధికారం ద‌క్కించుకున్నామ‌ని నాయ‌కుల‌కు చెప్పారు. ఇదే త‌ర‌హాలో తెలంగాణ‌లో కూడా విజ‌యం ద‌క్కించుకోవాల‌న్నారు. అయితే.. తెలంగాణ‌లో బెంగాల్ ఫార్ములా ప‌నిచేస్తుందా? అనేది కీల‌క ప్ర‌శ్న‌. …

Read More »

మూసీ ప్రక్షాళన నా జీవిత లక్ష్యం: రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రక్షాళన తన జీవిత లక్ష్యమని ఆయన ప్రకటించారు. ఎవరు అడ్డుపడినా, ఎవరు సహకరించకున్నా కూడా మూసీని ప్రక్షాళన చేసి తీరతానని ఆయన ప్రతినబూనారు. ఈ మేరకు ఆదివారం నల్లగొండ జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మూసీ నది కాలుష్యం కారణంగా నల్లగొండ జిల్లా ప్రజలు …

Read More »