Political News

తెలంగాణ నూతన డీజీపీగా సీవీ?

ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లోనే విధులు నిర్వర్తించిన సీనియర్ పోలీసు అధికారి సీవీ ఆనంద్ తెలంగాణకు తదుపరి డీజీపీగా పదవీ బాధ్యతలు చేపట్టనునట్టు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆనంద్ పనిచేస్తున్నారు. అంతకుముందు హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా రెండు పర్యాయాలు అవకాశం దక్కించుకున్న ఆనంద్… పోలీసింగ్ లో తనదైన మార్కును చూపారు.  ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న శివధర్ …

Read More »

శిల్పా రవికి ఈసారి టికెట్ లేనట్టేనా?

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపి పరిస్థితి ఎలా ఉంది.. ఈ పార్టీ తరఫున కార్యక్రమాలు ఏ విధంగా నడుస్తున్నాయి.. అనే విషయాలు ఆసక్తిగా మారాయి ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గంలో టిడిపి నాయకుడు మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ నేతృత్వంలో కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. స్థానికంగానే కాకుండా ఇరుగుపొరుగు జిల్లాలకు చెందిన మైనారిటీ వర్గాన్ని ఆయన హజ్ యాత్రకు తీసుకువెళ్లే విషయంలో కీలకంగా వ్యవహరించారు. పార్టీ …

Read More »

బీజేపీలో పార్టీ కార్యాలయంలో మల్లారెడ్డి కోడలు

టీడీపీతో రాజకీయం మొదలుపెట్టి…ఆపై బీఆర్ఎస్ లో చేరి సక్సెస్ ఫుల్ రాజకీయవేత్తగా ఎదిగిన మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలోనే మరోమారు పార్టీ మారబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. తన రాజకీయ వారసత్వం కోసం ఈ దఫా ఆయన బీజేపీలో చేరబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మల్లారెడ్డి పార్టీ మారడం లేదని స్వయంగా ఆయన కోడలు ప్రీతిరెడ్డి శుక్రవారం తేల్చిపారేశారు. శుక్రవారం నాంపల్లిలోని బీజేపీ తెలంగాణ కార్యలయానికి వెళ్లిన ప్రీతి …

Read More »

అనంతబాబు అరెస్టు… తర్వాతేంటి?

వైసీపీ కీలక నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరంలోని కోర్టు విచారణకు హాజరై తిరిగి వెళుతున్న సమయంలో అనంతబాబును సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అనంతబాబును అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించిన పోలీసులు ఆయనను సర్పవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతబాబు అరెస్టు సమయంలో ఆయన వెంట ఆయన సతీమణి లక్ష్మీదుర్గ కూడా ఉన్నారు. పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న అనంతబాబు అరెస్టు కావడంతో ఆపై పోలీసులు …

Read More »

సింగపూర్ క్లాసులు.. ఇక్కడ పాలన

రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన శుక్రవారం తో ముగియ‌నుంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా సింగపూర్లో అవలంబిస్తున్న ప్రభుత్వ విధానాలను మంత్రులు అధ్యయనం చేశారు. ముఖ్యంగా కార్పొరేషన్ లో మున్సిపాలిటీలలో జరుగుతున్న అభివృద్ధి, ప్రభుత్వ పరంగా ప్రజలకు చేరువ అవుతున్న తీరును మంత్రులు తెలుసుకున్నారు. వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి సింగపూర్ మోడల్ …

Read More »

విజయ్ నియోజకవర్గంలో రాత్రి 1 వరకు ఓటింగ్…

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా జ‌రిగింది. వాస్త‌వానికి గ‌తంలో కొన్ని కొన్ని చెదురుమొదురు ఘ‌ట‌న‌లు జ‌రిగేవి. తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ ఘ‌ట‌న‌ల‌కు కూడా అవ‌కాశం లేకుండా ఎన్నికల సంఘం ప‌క్కా ఏర్పాట్లు చేసింది. దీంతో క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో ఓటింగ్ న‌మోదైంది. 88.9 శాతం(శుక్ర‌వారం తెల్ల‌వారు జామున ప్ర‌క‌టించిన లెక్క ప్ర‌కారం) ఓటింగ్ న‌మోదైంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రేంజ్‌లో ఓట్లు పోలింగ్ కావ‌డం …

Read More »

ఆర్టీసీ స‌మ్మె… అసలు కారణం ఇదేనా?

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. త‌ద్వారా ఉద్యోగాల‌కు పొంచి ఉన్న ముప్పు వంటివి ప్ర‌ధానంగా క‌నిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం, తద్వారా ఆర్టీసీ గ్యారేజీల ఉనికి ప్రమాదంలో పడటంపై కార్మికులు, ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.ఎందుకు గాబ‌రా?ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు గాబ‌రా చెందడం ఈ రోజు …

Read More »

ఆర్టీసీ డ్రైవర్ బలిదానం.. సీఎంకు పెద్ద పరీక్ష

తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని రేకెత్తించింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏప్రిల్ 23న డిపో ఎదుటే తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న శంకర్ గౌడ్, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో కన్నుమూశారు. 32 డిమాండ్ల సాధన కోసం జరుగుతున్న సమ్మె నేపథ్యంలో ఈ ఘటన …

Read More »

దీదీ కోస‌మా.. మోదీ కోస‌మా..?

ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ తొలిద‌శ‌లో ఓట‌ర్లు .. క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో పోలింగ్ కేంద్రాల‌కు బారులు తీరారు. వేస‌వి తాపాన్ని కూడా లెక్క చేయ‌కుండా.. వేలాది మంది బూతుల వద్ద క‌నిపించారు. ఫ‌లితంగా బెంగాల్ ఎన్నిక‌ల్లో.. క‌డ‌ప‌టి స‌మాచారం మేర‌కు.. 95 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇది రాష్ట్ర చ‌రిత్ర‌లోనే తొలిసారి అని సాక్షాత్తూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్ ట్వీట్ చేశారు. …

Read More »

వైసీపీ మైన‌స్ `నాలుగు`?

ప్ర‌స్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజ‌క‌వ‌ర్గాల్లో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి 4 నియోజ‌క‌వ‌ర్గాలు చేజారి పోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లో వైనాట్ 175 అంటూ బ‌రిలో నిలిచిన వైసీపీకి ప్ర‌జ‌లు 11 సీట్లే ఇచ్చారు. కానీ.. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌రకు కూడా.. ఆయా ఎమ్మెల్యేలు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రావ‌డంలేదు. అసెంబ్లీకి పోవ‌డం లేదు. స‌మ‌స్య‌లు ఎక్క‌డివ‌క్క‌డే అన్న‌ట్టుగా కూడా ఉన్నాయి. ఇది పార్టీకి ప్ర‌ధాన …

Read More »

వైసీపీలో వ‌రుస అరెస్టులు.. అంతా రెడీనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ శుక్ర‌వారం నుంచి యూర‌ప్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్నారు. దాదాపు 20 రోజుల‌కు పైగానే ఆయ‌న రాష్ట్రానికి దూరంగా ఉండ‌నున్నారు. అయితే.. ఇదేస‌మ‌యంలో కీల‌క నాయ‌కుల అరెస్టుకు పోలీసులు రంగం రెడీ చేస్తున్నార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. వీరిలో ఒక మాజీ మంత్రి కూడా ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అదేస‌మ‌యంలో ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు కూడా అరెస్టు కాక త‌ప్ప‌ద‌ని కూడాపార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. ఎవ‌రెవ‌రు?గుడివాడ మాజీ …

Read More »

కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ చేస్తున్నారా?

తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్ తో ఆర్టీసీ ఐక్య కార్యాచరణ సమితి (ఆర్టీసీ ఐకాస) సమ్మెకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమ్మె గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదిలోనే స్పందించినా… ప్రధాన డిమాండ్లపై పెద్దగా స్పష్టత ఇవ్వకపోవడంతో ఆర్టీసీ సమ్మె మొదలైపోయింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటే పెను నష్టమే సంభవించి తీరుతుందన్న …

Read More »