Political News

కూట‌మిని ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు: ప‌వ‌న్

ఏపీ అభివృద్ధికి కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం అన్ని విధాలా సాయం చేస్తోంద‌ని ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం నుంచి సాయం పుష్క‌లంగా ఉంద‌న్నారు. దీనికి తాము కేంద్రానికి రుణప‌డి ఉంటామ‌ని వ్యాఖ్యానించారు. బీవీజీ రామ్‌జీ ప‌థ‌కం కింద‌.. 7 వేల కోట్ల రూపాయ‌లు తాజాగా ఇచ్చార‌ని తెలిపారు. దీనికి ముందు కూడా ఎక్క‌డా అన్యాయం జ‌ర‌గలేద‌ని …

Read More »

ఏపీలో అధికారులు పని చేయట్లేదు!

నిజమే… ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా కూడా ఏపీలో అధికారులు పని చేయడం లేదని చెప్పక తప్పదు. స్వయంగా మంత్రులు ఆదేశాలు జారీ చేసినా పనులు కావడం లేదంటే… అధికారులు పని చేయనట్టే కదా. ఈ తరహా అధికారుల తీరుపై స్వయంగా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణే ఆగ్రహం వ్యక్తం చేశారు కదా. తాజాగా జనసేనకే చెందిన కీలక నేత, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ …

Read More »

పవన్ తెలంగాణ రాకూడదంటే… రాహుల్ కూడా అంతేగా?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలంగాణ‌పై కాంగ్రెస్ నేత‌ల వైఖ‌రిని సూటిగా ప్ర‌శ్నించారు. తెలంగాణ‌లో త‌న‌ను అడుగు పెట్టొద్ద‌ని అన్నార‌ని చెప్పిన ఆయ‌న‌.. అలాంట‌ప్పుడు.. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ కూడా ఉత్త‌రాదికి చెందిన నాయ‌కుడు కాబ‌ట్టి.. ఆయ‌న కూడా తెలంగాణ స‌హా.. ద‌క్షిణాది రాష్ట్రాల్లోకి రాకూడ‌ద‌ని వ్యాఖ్యానించారు. అయితే.. తాను అలా చెప్పే వ్య‌క్తిని కాద‌న్నారు. సువిశాల భారత దేశంలో ఎవ‌రు ఎక్క‌డినుంచి ఎక్కడికైనా వెళ్లొచ్చ‌ని.. నివసించొచ్చ‌ని …

Read More »

అమరావతిలో రూ.2.5 వేల కోట్ల కేంద్ర ప్రాజెక్టు

అమరావతిని ఏపీకి శాశ్వత రాజధానిగా కాకుండా చేయడం ఇక ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఒక వేళ కూటమి సర్కారు కాకుండా ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా కూడా రాజధానిని అమరావతి నుంచి తరలించడం అసలు కుదరనే కుదరని కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే… అమరావతికి శాశ్వత రాజధాని హోదా కల్పిస్తున్నట్లుగా బుదవారం కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల …

Read More »

మాజీ మంత్రుల సెల్ఫ్ గోల్‌.. వైసీపీకి ఇర‌కాటం.. !

నెల్లూరు జిల్లా వైసీపీలో మాజీ మంత్రుల సెల్ఫ్ గోల్ రాజకీయాలు పార్టీని, వారి కార్యకర్తలను తీవ్ర స్థాయిలో ఇబ్బందికి గురిచేస్తున్నాయి. గతంలో జ‌గ‌న్ హ‌యాంలో ఈ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు పనిచేశారు. అయితే గత ఎన్నికల్లో ఇద్దరు ఓడిపోయారు. తాజాగా జిల్లా రాజకీయాలను గమనిస్తే ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలన్న విధంగా వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఒకరు జిల్లా మొత్తం తన క‌నుస‌న్న‌ల్లోనే ఉందని చెప్పుకోగా మరొకరు రెడ్డి …

Read More »

న‌ట‌రాజ‌న్‌… కింక‌ర్త‌వ్యం…?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజ‌న్‌ పరిస్థితి ఏమవుతుంది? అనేది ఆస‌క్తిగా మారింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్లాలని భావించిన ఆమెకు భారీ షాక్ తగిలింది. ఆమె సమర్పించిన ఎన్నికల అఫిడ‌విట్‌లో త‌న‌పై ఉన్న కేసులను ప్రస్తావించలేదన్నది ఎన్నికల సంఘం తెరమీదకు తీసుకువచ్చిన ప్రధాన విషయం. సహజంగా ఎన్నికల నామినేషన్ దాఖలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చూసుకుంటారు. లోపాలు లేకుండా సరిచేసుకుంటారు. ఏ చిన్న తేడా …

Read More »

డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే – అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. సీఎం రేవంత్ రెడ్డి రోజుకు 18 గంట‌ల‌పాటు ప‌నిచేస్తున్నారని.. గ‌త ముఖ్య‌మంత్రి మాదిరిగా రెండు గంట‌లు ప‌నిచేసి 22 గంట‌లు.. రెస్టు తీసుకోలేద‌ని వ్యాఖ్యానించారు. మంగ‌ళ‌వారం జ‌న‌గామ జిల్లాలో ప‌ర్య‌టించిన భ‌ట్టి.. ప‌లు అభివృద్ధికార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. అనంత‌రం.. ఆయ‌న స‌భ‌లో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా …

Read More »

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్ర‌మాదం జ‌రిగి 8 మంది మృతి చెందిన విష‌యం రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రినీ క‌లిచి వేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆయా కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన మంత్రి నారా లోకేష్‌.. వారిలో భ‌రోసా నింపే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని తెలిపారు. కానీ.. …

Read More »

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్ తగిలింది. రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచిన మీనాక్షి నామినేషన్ ను తిరస్కరించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి మీనాక్షితో పాటు మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. నామినేషన్ల గడువు ముగిసిన నేపథ్యంలో ఇక మీనాక్షి రాజ్యసభకు వెళ్లడం దుస్సాధ్యమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ కోటాలో మూడు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు …

Read More »

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే. జ‌న‌సేన పార్టీ అధినేత‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్‌, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా తొలిసారి ఒకే స‌మ‌యంలో ఇద్ద‌రు నేత‌లుకూడా విశాఖ‌లో ప‌ర్య‌టించారు. సోమ‌వారం సాయంత్రం విశాఖ‌లోని స్టీల్‌ప్లాంట్ జ‌రిగిన ఘోర ప్ర‌మాదంలో 8 మంది మృతి చెంద‌డం తో పాటుప‌లువురు గాయ‌ప‌డ్డారు. వీరిని …

Read More »

రేపు విశాఖకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించనున్న ఆయన… ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పలకరించనున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కూడా ఆయన సందర్శించే అవకాశాలు ఉన్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ …

Read More »

రూ.25 లక్షల పరిహారం… ఓ శాశ్వత ఉద్యోగం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్తితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్లాంట్ లో ద్రవ ఉక్కును తరలిస్తున్న సమయంంలో దానిని తీసుకెళుతున్న బకెట్ లకు రంద్రం పడి ద్రవ ఉక్కు కిందిపడిపోయి ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ప్లాంట్ ఉధ్యోగులు, కార్మకులపై ఆ ద్రవ ఉక్కు …

Read More »