వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో భయం అంతకంతకూ పెరిగిపోతోందన్న వాదనలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. వైసీపీ శ్రేణులు, జగన్ అభిమానులు ఈ వాదనను ఎంతగా కొట్టివేస్తున్నా… జగన్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలే ఆయనలోని భయాన్ని బయటపెడుతున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గతంలో తాడేపల్లిని వదిలి వెళ్లేందుకు ససేమిరా అన్న రీతిలో సాగిన జగన్…ఇప్పుడు తాడేపల్లి ఇంటిలో క్షణం ఒక యుగం మాదిరిగా ఫీలవుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే… బెంగళూరు నుంచి …
Read More »రెండుసార్లు ఓటు వేసే వారికి చెక్.. EC కీలక నిర్ణయం!
భారత ఎన్నికల సంఘం (EC) ఓటర్ ఐడీ కార్డుల డూప్లికేట్ నంబర్ల సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 99 కోట్లకు పైగా ఓటర్లు ఉండటంతో, భారత ఎన్నికల జాబితా ప్రపంచంలోనే అతిపెద్ద డేటాబేస్గా ఉంది. అయితే, చాలా సంవత్సరాలుగా ఓటర్ కార్డుల డూప్లికేట్ నంబర్ల సమస్య కొనసాగుతోంది. ఉదాహరణకు గ్రామాల నుంచి వచ్చి సిటీలో ఉన్న వారు రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడమే కాకుండా …
Read More »ఏపీకి టాటాలు.. రూ.49 వేల కోట్ల పెట్టుబడి
కూటమి పాలనలో ఏపీకి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. ఇప్పటికే గడచిన 8 నెలల కాలంలోనే ఏపీకి దాదాపుగా రూ.7 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. తాజాగా ఈ పెట్టుబడులన్నింటినీ తలదన్నేలా లక్షల కోట్ల మేర పెట్టుబడులకు మార్గం చూపేలా ఏపీకి మరో భారీ పెట్టుబడి వచ్చేసింది. ఏపీలో ఏకంగా రూ.49 వేల కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు టాటా కంపెనీ ముందుకు వచ్చింది. ఈ మేరకు టీడీపీ జాతీయ …
Read More »బాబు, లోకేశ్ లు చెప్పిందదేగా… రచ్చ ఎందుకు?
ఏపీలో ఇప్పుడు ఓ అంశంపై విపరీతంగా చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో అయితే మరింతగా దీనిపై చర్చకు తెర లేసింది. అదేంటంటే… తాము అదికారంలోకి వస్తే రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని కూటమి పార్టీలు చెప్పిన సంగతి తెలిసిందే. కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల్లో ఇది కూడా ఒకటి. దీనిపై గురువారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి …
Read More »ఆగేది లేదు!.. జనసేనలోకి పెండెం దొరబాబు!
నిజమే.. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆగేదే లేదని తేల్చి చెప్పేశారు. అందుకు జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా సరేనన్నారు. అంతే… పిఠాపురంలో ఈ నెల 14న జరగనున్న జనసేన ఆవిర్భావ వేడుకల్లో జరగాల్సిన కార్యక్రమం శుక్రవారం సాయంత్రమే ముగిసిపోయింది. ఇదివరకే జనసేనలోకి పెండెం దొరబాబు చేరిక ఖరారు కాగా… శుక్రవారం ఆ లాంఛనం కూడా పూర్తి అయిపోయింది. పెండెం దొరబాబు జనసేనలో చేరిపోయారు. …
Read More »రంగన్న మృతిపై కేబినెట్ లో సుదీర్ఘ చర్చ
వైసీపీ అధినే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై శుక్రవారం నాటి ఏపీ కేబినెట్ లో సుదీర్ఘ చర్చ జరిగింది. అమరావతిలోని సచివాలంలో సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం తర్వాత ఏపీ కేబినెట్ భేటీ జరిగిన సంగతి తెలిసిందే. కేబినెట్ భేటీలో అజెండా అంశాలపై చర్చ ముగిసిన తర్వాత వివేకా హత్య కేసును స్వయంగా చంద్రబాబే ప్రస్తావించారు. …
Read More »ఎమ్మెల్సీ ఎన్నికలు.. రాములమ్మ రాజకీయం!
రాజకీయాల్లో ఎవరు ఉన్నా.. పదువులు ఆశించకుండా ఉండరనేది నిష్టుర సత్యం. ఎలాంటి పదవులు లేకుండానే ప్రజలకు సేవ చేస్తామని చెప్పేవారు కూడా ఇటీవల కాలంలో కరువయ్యారు. పైగా.. ఏ పార్టీలో ఉన్నా పదవుల కోసమే అన్నట్టుగా నాయకులు వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి ఏ పార్టీ వస్తే.. దానికి అనుకూలంగా మారుతున్న వారు పెరుగుతున్నారు. తాజగా గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రముఖ నటి, రాములమ్మగా పేరొందిన విజయశాంతి కూడా …
Read More »జగన్ మళ్లీ బెంగళూరు ఫ్లైటెక్కేశారు
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం మరోమారు బెంగళూరు బయలుదేరారు. 3 రోజుల క్రితం బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చిన జగన్… రెండు రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉన్నారు. మూడో రోజు మధ్యాహ్నమే ఆయన సతీసమేతంగా గన్నవరం ఎయిర్ పోర్టులో బెంగళూరు విమానం ఎక్కేశారు. ఈ టూర్ లో జగన్ తాడేపల్లిలో ఉన్నది కేవలం రెండు రోజులేనన్న మాట. తాడేపల్లిలో ఉన్న రెండు …
Read More »నారా లోకేశ్ వెంట రాగా… నాగబాబు నామినేషన్
జనసేన అధినే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఎమ్మెల్సి అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మొత్తం 5 సీట్లకు ఎన్నికలు జరుగుతుండగా… అన్నిసీట్లూ కూటమి పార్టీలకే దక్కనున్నాయి. అసెంబ్లీలో ఆయా పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి చూస్తే…వైసీపీకి 11మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దీంతో …
Read More »కేసీఆర్కు మరో ఉచ్చు.. సుప్రీంలో నాగం పిటిషన్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మరో ఉచ్చు చిక్కుకునేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన పలు ప్రాజెక్టులకు సంబంధించిన అవినీతి ఆరోపణల కేసుల్లో చిక్కుకున్నారు. వీటిపై విచారణ సాగుతోంది. తాజాగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతల పథకానికి సంబంధించిన మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి సుప్రీంకోర్టులో కేసు వేశారు. హైకోర్టులో ఈ వివాదంపై దాఖలు చేసిన కేసులను కొట్టి వేయడాన్ని సవాలు చేయడంతోపాటు ఈ ప్రాజెక్టును చేపట్టిన బీహెచ్ ఈఎల్ …
Read More »పోసానికి బెయిల్.. కానీ, జైలు తప్పలేదుగా!
వైసీపీ మాజీ నాయకుడు, మాటల రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళికి కడప జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియా లో అనుచిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టేలా చేసిన ప్రసంగాలపై అందిన ఫిర్యాదు మేరకు.. అన్నమయ్య జిల్లాలోని రాయచోటి నియోజకవర్గం ఓబులవారి పల్లె పోలీసులు.. కొన్ని రోజుల కిందట పోసానిని హైదరాబాద్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను కడపకు తరలించి.. జైలులో రిమాండ్ ఖైదీగా …
Read More »పేర్ని నానిపై హైకోర్టు ఆగ్రహం.. కానీ..!
వైసీపీ మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు పేర్ని వెంకట్రామయ్య ఉరఫ్ పేర్ని నాని వ్యవహారంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పేదలకు ఇచ్చే బియ్యాన్ని దారి మళ్లించారంటూ.. పేర్ని కుటుంబంపై ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. పేర్ని ఫ్యామిలి వైసీపీ హయాంలో సొంతగా గోడౌన్లు నిర్మించింది. దీనిలో పౌర సరఫరాల శాఖకు చెందిన బియ్యాన్ని నిల్వ చేస్తున్నారు. అయితే.. కూటమి సర్కారు వచ్చాక.. నిల్వలను …
Read More »