గత రెండు మూడేళ్ల నుంచి ఎదురు చూస్తున్న వేలాది మందికి సీఎం చంద్రబాబు తాజాగా చల్లని కబురు అందించారు. తమ భూములను వైసీపీ హయాంలో `ఏ-22`లో చేర్చడంతో వాటిపై హక్కులు కోల్పోయిన వేలాది మందికి ఉపశమనం కల్పిస్తూ.. తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఆయా భూములను పరిశీలించి.. వాటిని `ఏ-22` జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వేల మందికి లబ్ధి చూకూరడంతోపాటు.. ఇన్నాళ్లుగా వారి ఆవేదన కూడా …
Read More »`వేమిరెడ్డి` వేడి.. వైసీపీని దహిస్తుందా.. !
రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ఆరోపణలు వచ్చినప్పుడు, వైసీపీ నేతలు యాగీ చేసినప్పుడు కూడా ఆయన సైలెంట్గానే ఉన్నారు. కానీ.. తాజాగా మాత్రం ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్పైనే నేరుగా విరుచుకుపడ్డారు. తనపై జగన్ చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. వైసీపీ సీనియర్ నేత.. వైవీ …
Read More »తెలంగాణ విజన్ డాక్యుమెంట్ లో ఏముంది?
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్వప్నిస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంటును తాజాగా మంగళవారం సాయంత్రం ఫ్యూచర్ సిటీలో ఆవిష్కరించారు. ఇటీవల కాలంలో చెబుతున్న తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిష్కరించడమే ధ్యేయంగా ఈ విజన్ డాక్యుమెంటును రూపొందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ విజన్ డాక్యుమెంటు తెలంగాణ బలోపేతం కోసం రూపొందించామన్నారు. ఈ డాక్యుమెంటు కోసం.. …
Read More »ఏఐ కోసం రూ. 1.5 లక్షల కోట్లు… మైక్రోసాఫ్ట్ భారీ ప్లాన్!
టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇండియా భవిష్యత్తు కోసం ఒక భారీ ఆఫర్ ప్రకటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారత్ను తిరుగులేని శక్తిగా మార్చడానికి ఏకంగా 17.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.48 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టబోతున్నట్లు నాదెళ్ల తెలిపారు. ఇది మామూలు విషయం కాదు. ఈ …
Read More »సినీ పరిశ్రమకు సీఎం బంపర్ ఆఫర్
ఫ్యూచర్ సిటీలో సినీ స్టూడియోల నిర్మాణానికి ప్రభుత్వం సహకరిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. నిర్మాతలు ఎవరైనా.. ఎక్కడి నుంచైనా ఎవరు వచ్చినా.. స్క్రిప్టుతో వస్తే చాలు.. ఇక్కడ సినిమాలు రూపొందించుకుని తీసుకుని వెళ్లే సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా సినీఇండస్ట్రీ ప్రముఖులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. తెలుగు ఇండస్ట్రీతోపోటు బాలీవుడ్ నుంచి కూడా ప్రముఖ నిర్మాతలు, దర్శకులు ఈ సదస్సుకు హాజరయ్యారు. …
Read More »వైసీపీ… జాతీయ మీడియా జపం..?
జాతీయ మీడియాపై వైసీపీకి అకస్మాత్తుగా ప్రేమ ఉప్పొంగిపోయింది. జాతీయ మీడియాలో వచ్చే పలు క్లిప్పింగులను వైసీపీ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేస్తోంది. ఆ పార్టీ సోషల్ మీడియా వాటిని వైరల్ చేస్తుంది. ఈ రోజు ఏపీలోని ఒక సంఘటన గురించి వైసీపీ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఏకంగా.. 37 జాతీయ మీడియా ఛానళ్లను టాగ్ చేసింది. ఇంత సడన్ గా అంతగా ఎందుకు గుర్తుకు వచ్చాయి …
Read More »బీఆర్ఎస్ పార్టీపై మరో సంచలన ట్వీట్ చేసిన కవిత
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీపై మాజీ ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సోదరుడు కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుపై కూడా కవిత సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ఆమె బీఆర్ఎస్ పై షాకింగ్ కామెంట్లు చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత దీక్షా దివస్ లు.. విజయ్ దివస్ లు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ …
Read More »అమెరికాలోనూ ఆగని లోకేష్ పెట్టుబడుల వేట
అమెరికాలో ప్రఖ్యాత శాన్ ఫ్రాన్సిస్కో రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. విదేశీ పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం ఆయన శాన్ఫ్రాన్సిస్కోకు చేరుకున్నారు. తొలుత ఆయన పలువురు ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. అమరావతి సహా ఏపీలో పెట్టుబడులు పెట్టాలని వారిని కోరారు. ఏపీ అభివృద్ధి బాటలో పురోగమిస్తోందని.. ఇప్పటికే పలువురు పెట్టుబడి దారులు వస్తున్నారని, ఒప్పందాలు కూడా జరిగాయని ఆయన వివరించారు. ముఖ్యంగా ఎన్నారైలతో నారా …
Read More »జగన్ అంటే వాళ్లలో ఇంకా భయం పోలేదా?
రాజకీయాల్లో నాయకుడి పట్ల ప్రజల్లో విశ్వాసం ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. ముఖ్యంగా నమ్మకం ఉండాలి. వీటికి తోడు సానుభూతి, గౌరవం, మర్యాద ఇవన్నీ ప్రజల నుంచి ఆటోమేటిక్గా రావాలి. బలవంతంగా ఎవ్వరూ ప్రజలను తమ వైపు తిప్పుకోలేరు. ఇది ప్రతి ఐదు సంవత్సరాలకోసారి స్పష్టంగా కనిపిస్తుంది. 2014లో విజయంతో వచ్చిన చంద్రబాబు 2019కి వచ్చేసరికి ప్రభుత్వాన్ని కోల్పోయారు. 2019లో భారీ మెజారిటీతో గెలిచిన జగన్ 2024లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. …
Read More »రాష్ట్రంలో పెట్టుబడుల వెల్లువ – ఒక రోజులో ఎన్ని లక్షల కోట్లు?
గత నెలలో ఏపీలోని విశాఖలో నిర్వహించిన సీఐఐ పెట్టుబడుల సదస్సుకు పోటీ పడుతున్నట్టుగా.. తెలంగాణ ప్రభుత్వం తాజాగా రెండు రోజలు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025ను ఘనంగా నిర్వహిస్తోంది. రెండు రోజులుగా సాగే ఈ సదస్సులో సోమవారం.. తొలిరోజు భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించారు. దేశ, విదేశాలకు చెందిన వివిధ కంపెనీలు 2.48 కోట్ల రూపాయల మేరకు తొలిరోజు ఒప్పందాలు చేసుకున్నాయి. వీటిలో కీలకమైన డీప్ టెక్నాలజీ, హరిత ఇంధనం, …
Read More »‘వైసీపీ తలా తోకా లేని పార్టీ’
తమ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచి పనుల గురించి వివరించడంలో చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారు. ఏపీ పునర్నిర్మాణానికి తమ ప్రభుత్వం నిరంతరంగా శ్రమిస్తుందని చెబుతుంటారు. చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు, ఏపీ అభివృద్ధికి దోహదపడేలా ఉంటాయని కూటమి లోని ప్రతి ఒక్క నేత చెబుతున్న మాట. ఇదే సమయంలో ఆయన విపక్ష కుట్రలపై కూడా కఠినంగా వ్యవహరిస్తుంటారని రాజకీయ వర్గాల్లో ఓ భావన ఉంది. రాజధాని అభివృద్ధికి అడ్డుపడే ఏ శక్తిని …
Read More »చైనాలోని ఆ రాష్ట్రమే తెలంగాణ అభివృద్ధికి స్పూర్తి
తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చే 2047 నాటికి 3(30 లక్షల కోట్ల రూపాయలు) ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి నిర్దేశిత లక్ష్యాలను పొందుపరుచుకున్నామన్నారు. ముఖ్యంగా అభివృద్ధి దూసుకుపోతున్న విదేశీ నగరాలను ప్రామాణికంగా తీసుకుని.. వాటిని అనుసరిస్తున్నామని చెప్పారు. వీటిలోనూ ప్రధానంగా చైనాలోని `గ్వాంగ్ డాంగ్`.. రాష్ట్రం అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆ రాష్ట్రం కేవలం 20 …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates