Political News

గులాబీ బాస్ బిగ్ స్కెచ్

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మించాలని భావిస్తున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఈసారి ఊహించని వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. కేవలం కమిటీల మార్పుతోనే సరిపెట్టకుండా, పార్టీ అగ్ర నాయకత్వంలోనే ఒక భారీ మార్పుకు గులాబీ బాస్ శ్రీకారం చుట్టబోతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. ప్రస్తుతం కేటీఆర్ మాత్రమే నిర్వహిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాను, ఇప్పుడు …

Read More »

క‌డప రెడ్లు ఆవేద‌న‌కు గుర‌య్యారు స‌ర్‌!

క‌డప రెడ్లు ఆవేద‌న‌కు గుర‌య్యారు స‌ర్‌! అంటూ టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, క‌డ‌ప ఎమ్మెల్యే రెడ్డ‌ప్ప‌గారి మాధ‌విరెడ్డి భ‌ర్త‌.. రెడ్డ‌ప్ప‌గారి శ్రీనివాస‌రెడ్డి టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబును ఉద్దేశించి సుదీర్ఘ లేఖ రాశారు. దీనిలో కొంత భాగాన్ని ఆయ‌న సోష‌ల్ మీడియాలోనూ పెట్టారు. క‌డ‌ప‌లో ఇప్పుడిప్పుడే.. రెడ్డి సామాజిక వ‌ర్గం టీడీపీ వైపు మ‌ళ్లింద‌ని.. అందుకే.. గ‌త ఎన్నిక‌ల్లో క‌డ‌ప‌లో చాలా సీట్లు టీడీపీకి అనుకూలంగా మారాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. …

Read More »

హిట్ల‌ర్ స్ఫూర్తితో హైడ్రా తెచ్చాం: రేవంత్ రెడ్డి

జ‌ర్మ‌నీ నియంత పాల‌కుడు హిట్ల‌ర్‌ను తాను స్ఫూర్తిగా తీసుకున్న‌ట్టు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్ప‌డం ఆశ్చ‌ర్యంగా మారింది. ఆయ‌న‌ను స్ఫూర్తిగా తీసుకునే తాము హైద‌రాబాద్‌లో హైడ్రా వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చామ‌న్నారు. మూసీ ప్ర‌క్షాళ‌న‌లో భాగంగా హైడ్రా ప‌నిచేస్తోంద‌న్నారు. దీనిలో 3 వేల మంది రిటైర్డ్ సైన్యాన్ని నియ‌మించామ‌ని చెప్పారు. దీనిని మ‌రింత విస్త‌రిస్తామ‌ని చెప్పారు. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. ఎన్ని వివాదాలు వ‌చ్చినా హైడ్రా కొన‌సాగుతుంద‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల …

Read More »

లవర్ కోసం కోటిన్నర కొట్టేసిన యువతి!

జెన్ జీ యుగంలో యువత ఎక్కడికి పోతోందో?… ఏమేం చేస్తుందోనన్న విషయాలపై అంతు చిక్కడం లేదని చెప్పాలి. ఏదో ఒక విషయం బుర్రలోకి చేరినంతనే… దాని పర్యవసానాల గురించి ఎంతమాత్రం ఆలోచించని ప్రస్తుత యువత…ఆ పనులను ఇట్టే ముగించేస్తున్నారు. ఆపై అడ్డంగా దొరికిపోతున్నారు కూడా. తాజాగా ఆదివారం హైదరాబాద్ లో చోటుచేసుకున్న ఓ ఘటనను చూస్తే… ఈ వాదనలు అక్షర సత్యమని చెప్పవచ్చు. బీఆర్ఎస్ కు చెందిన నేత సురేశ్… …

Read More »

రాము స‌వాల్‌.. కొడాలి మౌనం.. హీటెక్కిన‌ గుడివాడ.. !

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం గుడివాడ రాజ‌కీయాలు వేడెక్కాయి. గ‌త రెండేళ్ల పాల న‌లో తాను చేసిన అభివృద్ధిని చూపించేందుకు.. రెడీ అంటూ ఎమ్మెల్యే, టీడీపీ నాయ‌కుడు వెనిగండ్ల రాము ప్ర‌క‌టించారు. అంతేకాదు.. త‌న‌ను విమ‌ర్శిస్తున్న‌వారు.. ద‌మ్ముంటే ముందుకు రావాల‌ని కూడా ఆయ‌న స‌వాల్ రువ్వారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ముందుకు రాలేదు. వైసీపీ శిబిరం.. ఈ ప్ర‌క‌ట‌న త‌ర్వాత‌.. మౌనంగా ఉండిపోయింది. అస‌లు ఏం జ‌రిగింది.. ?వెనిగండ్ల …

Read More »

చంద్ర‌బాబు ఎంపిక‌పై తమ్ముళ్ళు ఏమంటున్నారు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాజాగా రాజ్య‌స‌భ స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. మొత్తం నాలుగు స్థానాలు ఖాళీ అయిన నేప‌థ్యంలో మూడు స్థానాల‌ను టీడీపీ తీసుకుని.. ఒక స్థానాన్ని మిత్ర‌ప‌క్షం జ‌న‌సేనకు కేటాయించారు. ఈ క్ర‌మంలో తీవ్ర ఉత్కంఠ న‌డుమ‌.. టీడీపీ త‌న అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. యువ నాయ‌కుడు, పార్టీకి అత్యంత వీర విధేయుడుగా ఉన్న చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడికుమారుడు విజ‌య్‌కు ఒక‌స్థానం, ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న సానా స‌తీష్‌కు …

Read More »

అమ‌రావ‌తిని వ్య‌తిరేకించే వారు… ఫ్యూచ‌ర్ సిటీని చూడాలి!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి అంత భూమి ఎందుకు? ఇంత భూమి ఎందుకు? ఏం చేసుకుంటారు.? 500 ఎక‌రాలు చాలవా? వెయ్యి ఎక‌రాలు చాల‌వా? అంటూ.. దీర్ఘాలు తీసేవారు.. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించే వారు.. పొరుగున ఉన్న తెలంగాణ‌లో సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌తిపాదించిన ఫ్యూచ‌ర్ సిటీని చూసి నేర్చుకోవాల‌ని టీడీపీ నేత‌లు కోరుతున్నారు. అమ‌రావ‌తికి ఇప్ప‌టికే రైతులు 33 వేల ఎక‌రాల‌ను ఇచ్చిన మాట వాస్త‌వం. అయితే.. దీనిని ప్రపంచ‌స్థాయి న‌గ‌రంగా …

Read More »

ఫాం హౌస్‌లో కేడీ-ఢిల్లీలో మోడీ!

ఫాం హౌస్‌లో కేడీ- ఢిల్లీలో మోడీ.. ఎవ‌రు ఎన్ని కుట్ర‌లు ప‌న్నినా.. తెలంగాణ‌లో అభివృద్ధిని ఆప‌లేరు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కేడీ….. మోడీల‌తో.. యుద్ధం చేస్తున్నామ‌ని అన్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడ‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోంద‌న్నారు. ఇప్పుడు రంగారెడ్డి, హైద‌రాబాద్ స‌హా ప‌లు జిల్లాల్లో భూముల ధ‌ర‌లు పెరుగుతున్నాయ‌న్నారు. ఎంత‌మంది అడ్డుకున్నా.. రాష్ట్ర అభివృద్ధి జ‌రుగుతుంద‌ని తెలిపారు. …

Read More »

ఇంటింటికీ కూట‌మి.. ఏం చెబుతారు… ?

ఈ నెల 25 నుంచి టీడీపీ వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది. ఇంటింటికీ.. పేరుతో ఓ కార్య‌క్ర‌మానికి సీఎం చంద్ర‌బాబు శ్రీకారం చుట్టారు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా.. ప్ర‌తి ఎమ్మెల్యే, ఎంపీ కూడా.. ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని ఆయ‌న నిర్దేశించారు. అంతేకాదు.. తాను కూడా వ‌స్తాన‌ని తేల్చి చెప్పారు. ఇక్క‌డితో కూడా ఆగ‌కుండా.. అంద‌రూ సైకిల్‌నే వినియోగించాల‌ని.. సాధార‌ణ సైకిల్ అయితే మంచిద‌ని.. అలా కాక‌పోతే ఎల‌క్ట్రిక్ సైకిల్ అయినా.. వాడాల‌ని …

Read More »

‘ద‌క్షిణాది సొమ్ము దోచిపెడుతున్నారు’

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫైర‌య్యారు. ద‌క్షిణాది రాష్ట్రాల సొమ్మును ఉత్త‌రాది రాష్ట్రాల‌కు ప్ర‌ధాని దోచి పెడుతున్నార‌ని విమ‌ర్శించారు. దీనికి అంద‌మైన జీఎస్టీ ముసుగు తొడిగార‌ని వ్యాఖ్యానించారు. ద‌క్షిణాది రాష్ట్రాల‌కు రూపాయిలో 45-50 పైస‌లు వాటా ల‌భిస్తుంటే.. ఉత్త‌రాది రాష్ట్రాల‌కు ఏడెనిమిది రెట్ల వ‌ర‌కు పంచుతున్నార‌ని తెలిపారు. బీహార్‌కు రూపాయికి ఆరు రూపాయ‌ల 50 పైస‌లు చొప్పున‌, ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు 3 రూపాయ‌ల 50 …

Read More »

అక్కడ తోటి పిల్లలే టీచర్లు…

ఆ పాఠశాలలో సంప్రదాయ విద్యా విధానం లేదు.. సహచర విద్యార్థుల ద్వారానే పాఠాలు నేర్చుకుంటారు… ఈ ప్రత్యేకతలు ఉన్న పాఠశాలను మంత్రి నారా లోకేష్సందర్శించారు. మాస్కో స్బేర్లో ఆధ్వర్యంలో నడుస్తున్న ఆ పాఠశాల పేరు స్కూల్ 21. మాస్కో పర్యటనలో ఉన్న లోకేష్ సాంప్రదాయ విద్యావిధానానికి భిన్నంగా అక్కడ అనుసరిస్తున్న విధానాలను నిర్వాహకులు, విద్యార్థుల ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ స్కూలు ప్రవేశం కోసం ఎంపిక ప్రక్రియ వినూత్నంగా, విభిన్నంగా …

Read More »

బొద్దింక‌ల నిర‌స‌న‌… మోడీ స‌మీక్ష‌?

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) ఉద్య‌మ సంఘం నాయ‌కుడు అభిజీత్ దీప్కే ఇచ్చిన పిలుపు ఫ‌లించింది. శ‌నివారం ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు ఢిల్లీలోని జంత‌ర్‌-మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న తెలుపుతామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో దేశంలోని ప‌లు రాష్ట్రాల నుంచి యువ‌త పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు. నిర‌స‌న‌లో పాల్గొన్నారు. ఇక‌, ఈ నిర‌స‌న‌కు తొలుత అనుమ‌తి లేద‌ని పేర్కొన్న ఢిల్లీ …

Read More »