Political News

మాట నిల‌బెట్టుకున్న సీఎం.. ఉద్యోగుల‌కు 2026 కానుక‌!

తెలంగాణ ఉద్యోగుల‌కు.. రాష్ట్ర ప్ర‌భుత్వం కొత్త సంవ‌త్స‌రానికి ఒక‌రోజు ముందే భారీ కానుక‌ను ప్ర‌క‌టించింది. గ‌త కొన్నాళ్లుగా ఉద్యోగులు ఎదురు చూస్తున్న బ‌కాయిల‌ను తాజాగా బుధ‌వారం విడుద‌ల చేస్తూ.. ఉత్త‌ర్వులు ఇచ్చింది. దాపు 713 కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌భుత్వం వెంట‌నే విడుద‌ల చేసింది. జ‌న‌వ‌రి నెల వేత‌నంతోనే ఆ బ‌కాయిలు.. ఉద్యోగుల ఖాతాల కు జ‌మ చేయ‌నున్నారు. దీంతో కొత్త సంవ‌త్స‌రం 2026 సందర్భంగా ఉద్యోగుల‌కు మేలు జ‌ర‌గ‌నుంది. ఏంటా …

Read More »

ఉత్తరాంధ్రకు న్యూ ఇయర్ గిఫ్ట్

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఉత్తరాంధ్రకు నూతన గేమ్‌చేంజర్ కానుంది. విజయనగరం భోగాపురంలో నిర్మాణమైన అంతర్జాతీయ విమానాశ్రయం చారిత్రక ఘట్టానికి సిద్ధమవుతోంది. 2026 జనవరి 4న ఢిల్లీ నుంచి వచ్చే ఎయిర్ ఇండియా విమానం తొలి ల్యాండింగ్ కోసం వస్తోంది. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈ సందర్భంగా భోగాపురానికి విచ్చేస్తున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం వేగంగా సాగుతోంది. ఇప్పటికే 95 శాతం పనులు …

Read More »

2025: ఏపీకి పెట్టుబ‌డుల సంవత్సరమే.. !

సాధార‌ణంగా.. ఏ రాష్ట్రానికైనా పెట్టుబ‌డులు వ‌స్తాయి. కానీ.. ఏపీ విష‌యాన్ని గ‌మ‌నిస్తే.. 2025లో మెజారిటీ పార్ట్ అంతా కూడా.. పెట్టుబ‌డుల చుట్టూనే తిరిగింది. ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి.. న‌వంబ‌రు వ‌ర‌కు ప్ర‌ధానంగా పెట్టుబ‌డుల కోసం సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు విస్తృతంగా ప‌ర్య‌టించారు. రాష్ట్రం లో 20 ల‌క్ష‌ల మంది యువ‌త‌కు ఉపాధి, ఉద్యోగాల క‌ల్ప‌న‌ను ల‌క్ష్యంగా నిర్దేశించుకున్న ద‌రిమిలా..దానిని సాధించేందుకు తీవ్రంగా శ్ర‌మించారు. పెట్టుబ‌డుల‌పై ప‌ట్టు …

Read More »

‘ప‌వ‌న్‌ను రెచ్చ‌గొట్టాల‌ని చూస్తున్నారు’

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వన్ క‌ల్యాణ్‌ను రెచ్చ‌గొట్టాల‌ని కొన్ని శ‌క్తులు చూస్తున్నాయ‌ని టీడీపీ సీనియ‌ర్ నేత‌, రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీని వెనుక వైసీపీ హ‌స్తం ఉంద‌న్నారు. సినీరంగానికి చెందిన వారితో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ల‌క్ష్యంగా చేసుకుని రెచ్చ‌గొట్టేలా వ్య‌వ‌హారిస్తున్నార‌ని.. అయితే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక విజనరీ నాయకుడితో పని చేస్తున్నాం అని అర్ధం చేసుకొని ముందుకు …

Read More »

బాబులేరు… బాధ్య‌త తెలుసుకున్నారు!

ఏపీలో జ‌న‌వ‌రి నెల‌కు సంబంధించిన ఎన్టీఆర్ భ‌రోసా పింఛ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌భుత్వం ఒక రోజు ముందుగానే అమ‌లు చేసింది. డిసెంబ‌రు 31నే పింఛ‌న్ల‌ను పంపిణీ చేసింది. అయితే.. వాస్త‌వానికి ప్ర‌తి నెలా 1న లేదా.. అంత‌కుముందే నిర్వ‌హిస్తున్న ఈ కార్య‌క్ర‌మానికి సీఎం చంద్ర‌బాబు హాజ‌రై.. ల‌బ్దిదారుల ఇళ్ల‌కు వెళ్లి.. పాల్గొని.. వారికి పింఛ‌న్లు అందిస్తున్నారు. కానీ, ఈ నెల‌లో ఆయ‌న విదేశాల‌కు వెళ్లారు. దీంతో పార్టీ నాయ‌కులు, మంత్రుల‌కు …

Read More »

వీళ్ల‌ను ఏం చేయాలి?… చంద్ర‌బాబు విస్మ‌యం!

ఏపీలో అరాచ‌కాలు ఆగ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు సోష‌ల్ మీడియాలో రెచ్చిపోయిన వారిని ప్ర‌భుత్వం దారిలోకి తీసుకువ‌చ్చింది. ప్ర‌భుత్వంపైనా.. నాయ‌కులు, మంత్రుల‌పైనా నోరు చేసుకున్న వారికి చ‌ట్టం రుచి చూపించి.. స‌రిచేసే ప్ర‌య‌త్నం చేసింది. అయితే.. స‌ర్కారుకు స‌మ‌స్య‌లు రోజు కోరకంగా వ‌స్తున్నాయి. గతంలో అడ్డు అదుపు లేకుండా.. ఆల‌యాల‌పై దాడులు జ‌రిగిన విష‌యం తెలిసిందే. అంత‌ర్వేది ఆల‌య ర‌థానికినిప్పు పెట్ట‌డంతోపాటు.. విజ‌య‌వాడ దుర్గ‌మ్మ ఆల‌యానికి చెందిన ర‌ధాల‌కు ఉన్న …

Read More »

చంద్రబాబుకు అత్యంత సంతృప్తినిచ్చిన కార్యక్రమం

2025లో తన బెంచ్ మార్క్ పాలనతో ఏడాదంతా క్షణం తీరిక లేకుండా ప్రజల్లో గడిపిన సీఎం చంద్రబాబు.. తనకు అత్యంత సంతృప్తిని ఇచ్చేది ఏమిటో చెప్పేశారు. ఉంటే సచివాలయంలో లేదంటే ప్రజల్లో అన్నట్లు బాబు తన పూర్తి సమయాన్ని వెచ్చించారు. ఇందులో ముఖ్యంగా ప్రతి నెల మొదటి తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పేదల ఇంటికి వెళ్లి జరుపుతున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 31వ తేదీనే పేదలకు పెన్షన్లు ఇస్తున్నారు. …

Read More »

చిన్న జిల్లా వెనుక బాబు పెద్ద వ్యూహం

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం రాష్ట్రంలో ప్ర‌స్తుతం ఉన్న 26 జిల్లాల‌ను మ‌రో రెండు జిల్లాలు క‌లుపుతూ.. 28 జిల్లాలుగా ఏర్పాటు చేయ‌నుంది. ఈ నిర్ణ‌యం నూత‌న సంవ‌త్స‌రం 2026, జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచే అమ‌లులోకి రానుంది. వీటిలో మ‌ద‌న‌ప‌ల్లె, పోల‌వ‌రం రెండు కొత్త జిల్లాల‌ను జోడిస్తున్నారు. మ‌ద‌న‌పల్లె జిల్లాను ఏర్పాటు చేయ‌డం వ‌ర‌కు బాగానే ఉంది. ఎందుకంటే.. దీనిలో మొత్తం 22 మండ‌లాలు రానున్నాయి. పీలేరు, పుంగ‌నూరు, తంబ‌ళ్ల‌ప‌ల్లె, …

Read More »

2025 డైరీ: మార‌ని జ‌గ‌న్‌..!

ఒక ఎదురు దెబ్బ మ‌నిషిని మారుస్తుంది. ఒక ఓట‌మి పార్టీల‌కు క‌నివిప్పు క‌లిగిస్తుంది. మ‌రి అలాంటి ఇలాంటి ఓట‌మి కాకుండా.. ఊహించ‌ని ఘోర ప‌రాజ‌యం ఎదురైతే.. ఆ పార్టీ ఇంకెంత మారాలి? ఎన్ని దిద్దుబాటు చ‌ర్య‌లు తీసుకోవాలి? స‌హ‌జంగానే స‌మూలంగా అధినేత నుంచి నాయ‌కుల వ‌ర‌కు అంద‌రూ మార‌తారు. మారాల‌ని చూస్తారు కూడా. కానీ.. ఏపీ ప్ర‌తిప‌క్ష‌(ప్ర‌ధాన కాదు) పార్టీ వైసీపీలోను.. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌లోనూ ఎలాంటి మార్పూ …

Read More »

బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్… కేటీఆర్ ఎందుకు లేరు?

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల స‌మావేశాలు ప్రారంభ‌మైన నేప‌థ్యంలో ఆ పార్టీ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం అసెంబ్లీ బీఆర్ ఎస్ ఫ్లోర్ లీడ‌ర్‌గా కేసీఆర్ ఉన్నారు. అంటే.. స‌భ‌లో ప్ర‌తిప‌క్షం త‌ర‌ఫున చ‌ర్చించే అంశాల‌కు ఆయ‌న అనుమ‌తి ఉంటుంది. ఆయ‌న చెప్పిన‌ట్టుగానే స‌భ్యులు వ్య‌వ‌హ‌రించాలి. అయితే.. డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ల‌ను నియ‌మించాల‌ని కొన్నాళ్లుగా స‌భ్యుల నుంచి డిమాండ్లు వ‌స్తున్నాయి. కానీ.. కేసీఆర్ మౌనంగా ఉంటున్నారు. …

Read More »

అమ‌రావ‌తి.. @ 2025 ..!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి 2025 ఓ మ‌హ‌త్త‌ర సంవ‌త్స‌ర‌మేన‌ని చెప్పాలి. 2014-19 మ‌ధ్య ఏపీ రాజ‌ధానిగా ఏర్పడిన అమ‌రావ‌తి.. త‌ర్వాత వైసీపీ హ‌యాంలో వెనుక‌బ‌డింది. అస‌లు దీనిని లేకుండా చేయాల‌ని.. మూడు రాజ‌ధానుల‌ను తీసుకురావాల‌ని వైసీపీ ప్ర‌య‌త్నించింది. కానీ, రాజ‌ధాని రైతులు మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిరేకంగా గ‌ళం వినిపించారు. ఇక‌, ఈ ఏడాది రాజ‌ధాని ప‌నుల‌ను ప్రారంభించారు. సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా చొర‌వ తీసుకోవ‌డంతో ఈ ప‌నులు తిరిగి గాడిలో …

Read More »

హైదరాబాద్ టు విజయవాడ.. సంక్రాంతికి ట్రాఫిక్ ఉండదా?

సంక్రాంతి పండుగ…తెలుగు ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగ. అందుకే, ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు ప్రజలు తమ కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో పండుగ చేసుకునేందుకు సొంతూళ్లకు పయనమవుతుంటారు. ముఖ్యంగా, హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు లక్షలాది మంది వెళుతుంటారు. ఈ క్రమంలోనే సంక్రాంతి సమయంలో హైదరాబాద్ ఖాళీ అయిందా అన్న రీతిలో ట్రాఫిక్ అంతా విజయవాడవైపు మళ్లుతుంది. దీంతో, ఎల్బీ నగర్, హయత్ నగర్, రామోజీ …

Read More »