Political News

అనిల్ విషయంలో వైసీపీ అడ్డంగా దొరికిపోయిందా?

రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అడ్డంగా దొరికిపోయింది. అతను పార్టీకి ఏమాత్రం సంబంధం లేదంటూ ప్రకటన చేసిన వెంటనే..“జగనన్న నా దేవుడు… ఆయన లేకపోతే నేను ఇప్పటికీ జైలులో ఉండేవాడిని” అని అనిల్ చేసిన వ్యాఖ్యలు, గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ కోసం వైసీపీ లాయర్లు పనిచేశారని, తన వెనక వైయస్ జగన్ …

Read More »

ఆ విషయంలో బాబు – పవన్ లను దాటేసిన మంత్రులు

చంద్రబాబు గవర్నమెంట్ లో అన్నింటికీ ఒక లెక్క ఉంటుంది… అది పక్కాగా ఉంటుంది. కేవలం నోటిమాటలు కాకుండా ప్రతిదానికి డేటా బేస్డ్ సమాచారంతో సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలన సాగుతుంది అనేది ప్రజలు అధికారులలో ఉన్న నానుడి. అంకెలతో సహా ఆయన వివరిస్తుంటే అందరూ ఆశ్చర్య పోవాల్సిందే. నిన్నటి సమావేశంలో కూడా చంద్రబాబు మంత్రులు శాఖల వద్ద ఫైళ్ల క్లియరెన్స్ కు సంబంధించి డేటాను రిలీజ్ చేశారు. అందులో సీఎం …

Read More »

దేశ చరిత్రలోనే మొదటిసారి – యూనివర్సిటీకి 1000 కోట్లు!

హైద‌రాబాద్‌లోని చ‌రిత్రాత్మ‌క విశ్వ‌విద్యాల‌యం.. ఉస్మానియా యూనివ‌ర్సిటీ(ఓయూ). అనేక మంది మేధావుల‌ను మాత్ర‌మే ఈ దేశానికి అందించ‌డం కాదు.. అనేక ఉద్య‌మాల‌కు కూడా ఈ విశ్వ‌విద్యాల‌యం నిలువెత్తు సాక్ష్యం. ముఖ్యంగా తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మ సమ‌యంలో ఇక్క‌డి విద్యార్థులు కీల‌క రోల్ పోషించారు. అలాంటి విశ్వ‌విద్యాల‌యానికి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి రూ.1000 కోట్ల నిధుల‌ను ప్ర‌క‌టించారు. అంతేకాదు.. ఆ వెంట‌నే జీవోను కూడా జారీ చేశారు. సీఎంగా బాధ్య‌త‌లు …

Read More »

క‌డ‌ప గ‌డ్డ‌పై తొలిసారి… `టీడీపీ మేయ‌ర్‌`?

వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో ఆ పార్టీకి భారీ ఎదురు దెబ్బ‌త‌గిలింది. గ‌త 2020-21 మ‌ధ్య జ‌రిగిన కడ‌ప కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యంద‌క్కించుకుంది. దీంతో ఆ పార్టీకి చెందిన సురేష్ బాబును మేయ‌ర్‌గా ఎన్నుకున్నారు. అయితే.. రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోవ‌డంతో గ‌త మూడేళ్ల‌లో మేయ‌ర్ పీఠాన్ని అడ్డు పెట్టుకుని సురేష్ బాబు చేసిన అక్ర‌మాలు ఇవీ.. అంటూ టీడీపీ కార్పొరేట‌ర్లు.. ప్ర‌భుత్వానికి ఫిర్యాదులు చేశారు. …

Read More »

టీం జగన్… ప‌దే ప‌దే అవే త‌ప్పులా?

అయిన కాడికీ.. కాని కాడికీ.. రాజ‌కీయాలు చేయ‌డం వైసీపీకి వెన్న‌తో పెట్టిన విద్య‌లా మారింది. ఇప్ప‌టికే గ‌త ఎన్నిక‌ల్లో చావు దెబ్బ తిని.. 11 స్థానాల‌కు ప‌రిమిత‌మై.. ప్ర‌తిప‌క్ష హోదా కూడా కోల్పోయి.. అలో ల‌క్ష్మ‌ణా అంటూ.. ప్ర‌తిప‌క్ష హోదా కోసం..కోర్టుల చుట్టూ తిరిగే ప‌రిస్థితిని తెచ్చుకున్నా.. ఇంకా మార్పు అయితే.. క‌నిపించ‌డం లేదు. 2024 ఎన్నిక‌ల‌కు ముందు ఎలా అయితే.. ఆ పార్టీ నాయ‌కులు బిహేవ్ చేశారో.. అలానే …

Read More »

బోరుగడ్డతో వైసీపీకి సంబంధం లేదా?

బోరుగడ్డ అనిల్.. గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన యువకుడు. వైసీపీ అధికారం కోల్పోగానే అతని పాపం పండింది. అతనిపై దాదాపు 50కి పైగా కేసులు నమోదు అయ్యాయి. చాలా కాలం జైలులో ఉన్నాడు. ఒక కేసులో బయటకు రాగానే మరో కేసులో అరెస్టు అయ్యాడు. ఇప్పుడు అతను ఎవరికీ కాకుండా పోయాడు. ఇంతకాలం వైసీపీకి …

Read More »

‘మీ మతంలో జరిగినా అలాగే మాట్లాడతారా జగన్’

తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్‌ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. దేవాలయంలో జరిగిన చోరీని తేలికగా తీసుకోవడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్న ఆయన, ఇదే సంఘటన ఇస్లాం లేదా మీ మతమైన క్రైస్తవ మతాల ప్రార్థనా స్థలాల్లో జరిగినా ఇలాగే స్పందించేవారా అని ప్రశ్నించారు. రాజ్యాంగం అన్ని మతాలకు సమానమేనని, ఏ మతానికీ వేరే …

Read More »

బ్రేకింగ్: రేపు కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి బ్రదర్స్

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరియు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి రేపు మాచర్ల కోర్టులో లొంగిపోవడానికి సిద్ధమయ్యారు. రెండు వారాల వ్యవధిలో కోర్టులో లొంగిపోవాలని సుప్రీంకోర్టు విధించిన గడువు రేపుతో ముగియనుండటంతో, ఇద్దరూ కోర్టు ఆదేశాలను పాటించేందుకు రెడీ అయ్యారు. ఈ ఏడాది మే 24న గుండ్లపాడు వద్ద టీడీపీకి చెందిన ఇద్దరు …

Read More »

ఇక్కడ వైసీపీ విమర్శలు.. అక్కడ కేంద్రం ప్రశంసలు

ఏపీ ఎడ్యుకేషన్‌ మోడల్‌ ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాలు అందరి మన్ననలు పొందుతున్నాయి. ఈ రోజు కేంద్ర మంత్రి ఇక్కడి ఎడ్యుకేషన్‌ మోడల్‌ భేష్‌ అంటూ కితాబిచ్చారు. ఇక్కడ ఉన్న విపక్షం మాత్రం లోకేష్‌ బాధ్యతలు చేపట్టిన తొలినాళ్ల నుంచి ఆరోపణలు చేస్తూనే ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని విద్యా విధానం ఇక్కడ వైసీపీ విమర్శలను, కేంద్రం నుంచి ప్రశంసలను అందుకుంటోందని …

Read More »

మీ సొమ్ము మీరే తీసుకోండి: మోదీ

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఆసక్తికర విష‌యాన్ని దేశ ప్ర‌జ‌ల‌తో పంచుకున్నారు. “ఇది మీ సొమ్మా.. అయితే.. సొంతం చేసుకోండి. మీ క‌ష్టార్జితాన్ని వ‌దులుకోకండి“ అని ఆయ‌న `లింక్డ్ ఇన్‌`లో పోస్టు చేశారు. సామాజిక మాధ్య‌మాల్లో స్పీడుగా ఉండే ప్ర‌ధాన‌మంత్రి.. తాజాగా దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి.. ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. దేశంలోని బ్యాంకులు, స్టాక్‌మార్కెట్లు, ఇన్సూరెన్సు కంపెనీలు, డివిడెండ్లు, మ్యూచ్‌వ‌ల్ ఫండ్స్ వంటి వాటిలో సుమారు.. ల‌క్ష కోట్ల …

Read More »

ఇంగ్లిష్ రాకపోతే ఏం… రాష్ట్రాన్ని నడిపించట్లేదా

ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పాలన చేతకాదని, ఇంగ్లిషు మాట్లాడడం రాదని కొంతమంది అంటున్నారని చెప్పారు. అయితే, తాను గుంటూరులో చదువు కోలేదని, గూడు పుటాని తెలియదని అన్నారు. తనకు భాష గొప్పగా రాకపోవచ్చని, కానీ, ప్రజల మనసు తెలుసుకునే విద్య తనకు తెలుసని అన్నారు. ఆ మాటకొస్తే అగ్ర దేశాలైన …

Read More »

రాష్ట్రంలో జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లు

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రాన్ని త్వ‌ర‌లోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లుగా విభజించుకుని అభివృద్ధి చేయాలని నిర్ణయించామ‌న్నారు. తాజాగా అమ‌రావతి స‌చివాలయంలో వివిధ శాఖ‌ల‌ మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీల సదస్సును నిర్వ‌హించారు. దీనిలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ చేసేందుకు విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల్లో మార్పులు తీసుకువ‌స్తున్న‌ట్టు చెప్పారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల‌ను జోన్లు, క్ల‌స్ట‌ర్లు, కారిడార్లుగా …

Read More »