రాష్ట్ర శాసన సభ 7వ సమావేశాలు ఈ నెల 17 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఎమ్మెల్యేలకు, ప్రభుత్వ శాఖలకు నోటిఫికేషన్ ప్రతులను పంపించారు. అమరావతి లోని అసెంబ్లీ హాలులో జరిగే సమావేశాలకు సంబందించి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షుత జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పని దినాలు, ఎజెండా ఖరారు చేస్తారు. ఈ …
Read More »సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విద్యార్థుల సెగ.. కేంద్రం మౌనం!
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే.. రాష్ట్రపతి తర్వాత రాష్ట్రపతి అంతటి పోస్టు. ఈ పదవికి అనేక మంది వన్నె తెచ్చారు. అదేసమయంలో తమ ఇష్టానుసారంగా వ్యవహరించిన ఒకరిద్దరు ప్రధాన న్యాయమూర్తులు వివాదాల్లోనూ చిక్కుకున్నారు. ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న.. జస్టిస్ సూర్యకాంత్.. కూడా అంతకు మించి అన్నట్టుగా వివాదాల్లో కూరుకుపోతున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ముఖ్యంగా ఆయన విద్యార్థులను, వారి ఉద్యమాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు.. తీవ్ర విమర్శలకు …
Read More »‘వందేమాతరం’ పూర్తిగా పాడం: రాష్ట్రాల అల్టిమేటం
మరో నాలుగు రోజుల్లో దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా.. నిర్వహించే అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ వందేమాతరం గేయాన్ని సంపూర్ణంగాఆలపించాలని.. అలా చేయని వారిపై కేసులు నమోదు చేయాలని కూడా పేర్కొంది. ఈ మేరకు.. కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కూడా ఆదేశాలు ఇచ్చింది. వందేమాతరంలోని మొత్తం …
Read More »వరుణ యాగంపై బీఆర్ఎస్ సెటైర్లు.. రేవంత్ సందేహం!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిగ్ సందేహం వచ్చింది. ఇటీవల ఆయన.. స్వయంగా వర్షాల కోసం వరుణ యాగం నిర్వహిస్తున్నామని ప్రకటించారు. దీనికి సంబంధించి నాగార్జున సాగర్ చెంతనే ఉన్న విజయ్ విహార్లో ఏర్పాట్లు కూడా చేశారు. సోమవారం రిత్విక్కులు.. వరుణ యాగం క్రతువును కూడా ప్రారంభించారు. దీనికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. తొలి పూజలో వారే పాల్గొని ప్రారంభం చేశారు. ఈ క్రతువు సోమవారం …
Read More »అంబటి అంటే ఫైర్… ఫ్లవర్ కూడా!
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. తన వ్యాఖ్యలతో, దురుసు ప్రవర్తనతో అంబటి వార్తల్లో నిలుస్తుంటారు. గతంలో విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీసు అధికారితో అంబటి ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇక, తనను అడ్డుకున్న పోలీసులకు అంబటి వార్నింగ్ ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో సడెన్ గా పోలీసులపై అంబటి తీరు మారింది. గతంలో పోలీసులపై …
Read More »బాలినేని వైసీపీ కోసం పని చేస్తున్నారా?
బాలినేని శ్రీనివాసరెడ్డి… వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమీప బంధువు. జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డికి మరింత దగ్గరి బంధువు. ఈ బంధుత్వమే బాలినేనిని లీడర్ ను చేస్తే… దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఆయన ఏకంగా మంత్రి పదవిని దక్కించుకోగలిగారు. వైఎస్సార్ మరణం తర్వాత ఆయన కుమారుడిగా జగన్ ఎలా సాగితే.. బాలినేని కూడా అదే బాటన సాగారు. అలాంటి బాలినేని ఇప్పుడు జనసేనలో కొనసాగుతున్నా… జగన్ తో గానీ, సుబ్బారెడ్డితో …
Read More »డాక్టర్ కావాలనే ప్రియాంక కల… కలగానే మిగిలిపోయింది..!
ఏపీలోని రాజమహేంద్రవరం నగరంలో ఇటీవల చోటుచేసుకున్న హిట్ అండ్ రన్ కేసు ఆదివారం కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ప్రియాంక ఆదివారం మృతి చెందారు. దీంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అదే సమయంలో ప్రియాంక బైక్ ను కారుతో గుద్దిన ఇందరు నిందితులు సుందరపు దుష్యంత్, ఆండక్రూ విలియం జోసెఫ్ లను ఇప్పటికే అరెస్టు చేసిన రాజమహేంద్రవరం …
Read More »మొజ్తబా ఖొమేనీ సేఫ్… ఇరాన్ ప్రజల పండుగ
ఇరాన్ ప్రస్తుత అధ్యక్షుడు మొజ్తబా ఖొమేనీ సురక్షితంగా వున్నారని, సంపూర్ణ ఆరోగ్యంతో వున్నారని ఒక వీడియో విడుదల కావడంతో ఇరాన్ లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఫిబ్రవరి 28 వ తేదీన యుద్ధం ప్రారంభమైన తొలిరోజే ఇరాన్ అధ్యక్షుడు అయాతుల్లా ఖొమేనీ మృతి చెందారు. ఆయనతో పాటుగా పలువురు మంత్రులు కూడా మరణించారు. ఆ దాడిలో ఖొమేనీ పెద్ద కుమారుడు మొజ్తబా కూడా మరణించినట్లు ప్రచారం జరిగింది. ముఖ్యంగా ఇజ్రాయిల్ …
Read More »బాబు గారు లక్షిత రేఖలు గీసేశారు
టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు లక్షిత రేఖలు గీశారు. రెండు కీలక లక్ష్యాలను ప్రతి ఒక్కరూ సాధించాలన్నారు. పార్టీ పరంగా అంతా బాగుందని.. పైవాళ్లే చేసుకుని పోతారని కింది వారు అనుకుంటే పొరపాటేనని అన్నారు. పార్టీలో ప్రతి యూనిట్, ప్రతిక్లస్టర్లో ఏం జరుగుతున్నా.. తమకు తెలుసునని చెప్పారు. మైటీడీపీ యాప్ ద్వారా ప్రతి విషయాన్నీ పార్టీలో చర్చిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికలకు ఇంకా సమయం ఉందని ఎవరూ …
Read More »మీరైనా న్యాయం చేయండి: రాష్ట్రపతికి వివేకా కుమార్తె లేఖ
“మేడమ్.. మీరైనా నాకు న్యాయం చేయండి.“ అంటూ 2019లో దారుణ హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత తాజాగా రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబుకు కూడా ఆమె పంపారు. ఈ లేఖలో 2019 నుంచి ఇప్పటి వరకు వివేకా దారుణ …
Read More »ఆలీ రాజకీయాలు ఎందుకు వదిలేశాడు?
తెలుగు సినిమా నటులు రాజకీయాలు చేయడం ఎప్పట్నుంచో ఉన్నదే. కానీ ఈ మధ్య పరిస్థితులు మారిపోయాయి. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని చూడట్లేదు జనం. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వస్తే.. ఆ ప్రభావం వారి సినిమాల మీదా పడుతోంది. ఇలా కెరీర్ను దెబ్బ తీసుకున్న వాళ్లలో ఆలీ కూడా ఒకరు. ఆయన చాలా ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తర్వాత తన మిత్రుడు పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేనలోకి వస్తారని అనుకుంటే.. …
Read More »ఛార్జీల బాదుడు వాళ్లకు మాత్రమే…
500, 1000 రూపాయల నోట్ల రద్దు తర్వాత భారత దేశంలో యూపీఐ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు వీధిలో కూరగాయల వ్యాపారి దగ్గరి నుంచి ఫైవ్ స్టార్ హోటళ్ల వరకు అందరూ యూపీఐ స్కానర్లు వాడుతున్నారు. ఈ క్రమంలోనే ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ ప్లాట్ ఫార్మ్ లు తమ యూజర్లకు ఆల్రెడీ సర్వీస్ ఛార్జీల రూపంలో బాదుడు మొదలుబెట్టాయి. అయితే, తాజాగా యూపీఐ లావాదేవీలపై బ్యాంకుల …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates