బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ప్రముఖ సినీ నటులు నాగార్జున, సమంత, నాగ చైతన్యలపై మంత్రి కొండా సురేఖ కొద్ది నెలల క్రితం చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీంతో, కొండా సురేఖపై కేటీఆర్, నాగార్జున పరువు నష్టం దావా వేశారు. అయితే, కొద్ది రోజుల క్రితం నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై సురేఖ పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో …
Read More »`పిన్నెల్లి జైలు`తో పల్నాడు వైసీపీ విలవిల
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి రామకృష్ణరెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలకు.. జంట హత్యల కేసులో కోర్టు.. 14 రోజలు రిమాండ్ విధించింది. దీంతో వారిద్దరినీ నెల్లూరు జైలుకు తరలించారు. మరోవైపు.. ఈ పరిణామాలపై నిశితంగా దృష్టి పెట్టి.. వెంటనే బెయిల్ పిటిషన్ మూవ్ చేయాలని అనుకున్న జగన్కు కూడా షాక్ తగిలింది. ఇప్పటికిప్పుడు బెయిల్ …
Read More »ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఏ1గా చేర్చారు. అయితే, ఆయనకు కొంతకాలం క్రితం సుప్రీం కోర్టు మధ్యంతర రక్షణను కలిగించింది. కానీ, కేసు దర్యాప్తుకు ఆయన సహకరించడం లేదని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే ప్రభాకర్ రావుకు సుప్రీం కోర్టు …
Read More »పంచాయతీ ఎన్నికల్లో పైచేయి ఎవరిది?
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల పోలింగ్కు ఓటర్లు క్యూకట్టారు. పల్లేకదా.. అని ఓటర్లు లైట్ తీసుకోలేదు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి.. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వారు ఉన్నారు. మొత్తంగా పంచయతీల్లో తొలి దశ పోరు సక్రమంగా.. సజావుగా సాగిపోయింది. ఇదిలావుంటే.. పోలింగ్ ముగిసిన వెంటనే కేంద్ర …
Read More »తప్పు చేశాడు థర్డ్ డిగ్రీ రుచి చూశాడు
పార్టీ మెప్పు కోసమో.. తమ ప్రాపకం కోసమో.. కొందరు ద్వితీయ శ్రేణి నేతలు తెగ రెచ్చిపోతుంటారు. వేదిక దొరికితే చాలు అడ్డు అదుపు లేకుండా వాగేస్తుంటారు. సోషల్ మీడియా లో విచ్చలవిడిగా పోస్టులు పెడుతుంటారు. చివరికి ఆపదలో పడ్డప్పుడు ఆదుకునేవారు కరువుతారు. పార్టీ నేతలు ఆ వ్యక్తి వైపు కన్నెత్తి చూడరు. కొన్నేళ్లుగా జరుగుతున్న రాజకీయ ఉచ్చులో ఇటువంటి ఎందరో బలైపోతున్నారు. నోరు ఉంది కదా అని అనుచిత వ్యాఖ్యలు …
Read More »టీడీపీ నేత అరెస్ట్… సీఎం బాబు రియాక్షన్ ఇదే!
సాధారణంగా ప్రభుత్వంలో ఉన్న పార్టీకి చెందిన నాయకులకు సర్కారు నుంచి అభయం ఉంటుంది. ఇది సహజం. ఎక్కడైనా ఎవరైనా తప్పులు చేసినా.. పార్టీ ప్రభుత్వమే కాబట్టి వెనుకేసుకు వస్తుంది. అయితే.. ఏపీలో మాత్రం దీనికి భిన్నంగా టీడీపీ వ్యవహరిస్తోంది. తప్పు చేసిన వారు తన వారే అయినా.. అరెస్టుకు వెనుకాడడం లేదు. చర్యలకు వెనక్కి తగ్గడం లేదు. తాజాగా టీడీపీ నుంచి సస్పెన్షన్కు గురైన చిత్తూరు జిల్లాకు చెందిన జయచంద్రారెడ్డిని …
Read More »జగన్ కు కౌంటర్ ఇవ్వాలని మోదీ ఆదేశం?
2024 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేనల కలయికలో ఏర్పడిన కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో వైసీపీ, బీజేపీల మధ్య ఉన్న బంధం తెగిపోయింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా అయినా, ఆ తర్వాత అయినా మాజీ సీఎం జగన్ పై ప్రధాని మోదీ నేరుగా విమర్శలు చేయలేదు. అయితే, తాజాగా జగన్ పై కౌంటర్ అటాక్ చేయాలని బీజేపీ శ్రేణులకు మోదీ పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. జగన్ తో పాటు …
Read More »పార్లమెంటులో ఈ సిగరెట్ తాగారా?
కొద్ది సంవత్సరాల క్రితం వరకు చట్ట సభలను సభ్యులు పరమ పవిత్రంగా…దేవాలయాల మాదిరిగా చూసేవారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల చేత ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు సభలో ఎంతో హుందాగా, బాధ్యతగా నడుచుకునేవారు. కాలం మారింది…కలికాలం వచ్చింది…అందుకే కాబోలు గత దశాబ్ద కాలంలో చట్ట సభల్లో కొందరు సభ్యుల తీరు వివాదాస్పదవుతున్న ఘటనలు చూస్తున్నాం. ఎంతో కీలకమైన సభా సమయంలో మొబైల్ ఫోన్లలో నీలి చిత్రాలు చూస్తూ అడ్డంగా బుక్ …
Read More »పంచాతీయ స్వ`రూపం`పై జనసేన ఎఫెక్ట్ ..!
గ్రామ పంచాయతీలపై జనసేన పార్టీ పట్టు బిగించే దిశగా అడుగులు వేస్తోంది. చేస్తున్న అభివృద్ధి, ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ఈ పార్టీ.. ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా కేంద్రం నుంచి మరో 2 వేల కోట్ల రూపాయలు పంచాయతీలకు అందాయి. ఈ నిధులను మరింత సక్రమంగా వినియోగించి.. పంచాయతీల్లో మౌలిక సదుపాయాలను పెంచాలని డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఇదేసమయంలో …
Read More »సునీల్ వెనుక వైసీపీ రాజకీయ వర్గాల్లో చర్చ
వివాదాస్పద ఐపీఎస్ సునీల్ కుమార్ వ్యవహారం అందరికీ తెలిసిందే. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజును కస్టోడియల్ విచారణలో చేయి చేసుకున్నారన్న ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు. ఆయనను విచారించాలని ప్రభుత్వం ఇటీవల గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. దీంతో సిట్ అధికారులు ఆయనకు నోటీసులు కూడా పంపించారు. అయితే ఇటీవల ఆయన రాజకీయపరమైన వ్యాఖ్యలు చేశారు. కాపులు దళితులు కలిసి రాజ్యాధికారం దక్కించుకోవాలని అన్నారు. కాపులకు సీఎం పదవిని ఆఫర్ చేశారు. …
Read More »ఎన్నికల వరకు ఓర్చుకోండి అని జగన్ సూచన?
వైసీపీ నాయకులకు జగన్ తరచుగా హితవు పలుకుతున్నారు. ఎన్నికల వరకు ఓర్చుకోవాలని చెబుతున్నారు. దీనికి కారణం కొందరు ప్రస్తుతం కేసుల్లో ఇరుక్కున్నారు. మరికొందరు కేసుల్లో ఇరుక్కుని జైలు పాలయ్యారు. దీంతో నాయకులు కొందరు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై తరచుగా వైసీపీలో చర్చ జరుగుతుంది. జగన్ పట్టించుకోవడంలేదని, కనీసం తమకు న్యాయ సహాయం కూడా అందించడం లేదని ఒకరిద్దరు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి వైసీపీ తరఫున ప్రముఖ న్యాయవాది పొన్నవోల …
Read More »పవన్ చెప్పే సనాతన ధర్మ బోర్డు.. ప్రభుత్వం స్థాపించగలదా?
“సనాతన ధర్మ బోర్డును సాధ్యమైనంత వేగంగా ఏర్పాటు చేయాలి.“ తాజాగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి చెప్పిన మాట. తమిళనాడులో జరిగిన ఓ ఘటనను తాజాగా ప్రస్తావించిన ఆయన.. ఈ విషయాన్ని మరోసారి తెరమీదికి తెచ్చారు. సనాతన ధర్మ బోర్డును ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని.. సనాతన ధర్మాన్ని, దీనికి మద్దతు ఇచ్చేవారిని.. అదేవిధంగా సనాతన ధర్మాన్ని పాటించేవారిని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates