జనసేన నేత, రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ప్రభుత్వ మహిళా ఉద్యోగి లైంగిక ఆరోపణలు చేసిన వైనం హాట్ టాపిక్ గా మారింది. ఆ ఎమ్మెల్యేపై తాత్కాలిక చర్యలు తీసుకున్న జనసేన రాష్ట్ర కమిటీ…ఆ వ్యవహారంపై విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీ వేసింది. మరోవైపు, సదరు మహిళ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మరిన్ని షాకింగ్ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై ఏపీ మాజీ …
Read More »‘దాదా’ మృతిపై ‘దీదీ’ కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందిన వార్తతో మహారాష్ట్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అజిత్ దాదా మరణ వార్త విని ఆయన అనుచరులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అజిత్ పవార్ మృతి పట్ల ప్రధాని మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో అజిత్ పవార్ మృతిపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన …
Read More »జనసేన ఎమ్మెల్యేపై యాక్షన్
జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ం పై వచ్చిన లైంగిక ఆరోపణల వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. జనసేనపై వైసీపీ నేతలు మాటల దాడికి దిగారు. బాధిత మహిళ స్వయంగా వచ్చి తనను బెదిరించి లోబరుచుకున్నాడు అని ఆరోపణలు చేస్తున్నప్పటికీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదు అని వైసీపీ మహిళా నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అరవ శ్రీధర్ పై జనసేన చర్యలు …
Read More »‘కూటమిలో ఇబ్బందులు సరే.. అయినా కలిసి ఉండాల్సిందే’
పార్టీ అధినేత ఒక లక్ష్యం నిర్దేశించుకున్నారు. దానిని ముందుకు తీసుకువెళ్లడం మనందరి బాధ్యత. ఈ క్రమంలో అనేక ఇబ్బందులు వస్తాయి. ఇప్పటికే చాలా ఉన్నాయి. అవన్నీ నేను కూడా ఒప్పుకుంటున్నా. అయినా కూటమిగా ముందుకు వెళ్లాల్సిందే అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ తేల్చి చెప్పారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలు, కార్యకర్తలకు నిర్వహించిన శిక్షణ శిబిరంలో నారా లోకేష్ కీలక ప్రసంగం చేశారు. …
Read More »లైంగిక ఆరోపణలపై స్పందించిన జనసేన ఎమ్మెల్యే
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ వివాహిత సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనను ఏడాదిన్నరగా అరవ శ్రీధర్ లైంగికంగా వేధిస్తున్నారని ఆమె ఓ మీడియా ఛానెల్ లో ఆరోపించారు. తనతో అరవ శ్రీధర్ నగ్నంగా వీడియో కాల్ మాట్లాడరని ఆరోపించారు. దీంతో, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలోనే ఆ ఆరోపణలపై అరవ శ్రీధర్ స్పందించారు. డీప్ …
Read More »విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం మృతి
మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందారు. పుణెలోని బారామతిలోని మినీ ఎయిర్ పోర్ట్ లో అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టెడ్ ఫ్లైట్ ల్యాండ్ అవుతున్న సమయంలో పైలట్ విమానంపై అదుపు కోల్పోయాడని తెలుస్తోంది. విమానం క్రాష్ ల్యాండ్ అయి రన్ వే పై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు మరో ఇద్దరు మృతి …
Read More »పొలిటికల్ టాక్: ఈసారీ ఎన్నికల బడ్జెట్టేనా?
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. బుధవారం నుంచి(ఈ నెల 28) ప్రారంభం కానున్నాయి. రెండు విడతల్లో జరిగే ఈ సమావేశాలు.. కేంద్ర ప్రభుత్వానికి అత్యంత కీలకంగా మారనున్నాయి. వచ్చే ఏప్రిల్-మే మధ్య 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు నిధుల కేటాయింపులు, ప్రాజెక్టులు వంటివి తాజా బడ్జెట్లో ఉంటాయన్న చచ్చ సాగుతోంది. ఎందుకంటే.. గత 2025-26 బడ్జెట్ను చూస్తే.. ఈ వ్యవహారం స్పష్టంగా కనిపించింది. గత ఏడాది కీలకమైన …
Read More »వైసీపీ ఏం చేయబోతోంది? ఎంపీలకు జగన్ క్లియర్ కట్ ఆదేశాలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడంతో సమావేశాలు మొదలుకానున్నాయి. అనంతరం రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రెండు రోజుల పాటు చర్చ జరగనుంది. ఈ నెల 31న శనివారం సెలవు ఉండగా, ఫిబ్రవరి 1న ఆదివారం కేంద్ర వార్షిక బడ్జెట్ (2026–27)ను ప్రవేశపెట్టనున్నారు. మొత్తంగా ఈసారి సుమారు 40 రోజులకుపైగా పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో …
Read More »పేర్ని నోటి దూల… కేసు నమోదు!
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య.. ఉరఫ్ నానిపై మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. గత 18 నెలల కాలంలో పేర్నిపై నమోదైన కేసుల్లో ఇది 6వది కావడం గమనార్హం. గతంలో బియ్యం అక్రమ నిల్వ, విక్రయాలకు సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయి. తర్వాత.. పోలీసులపై దురుసుగా వ్యవహరించిన కేసులు రెండు ఉన్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లపై చేసిన వ్యాఖ్యల …
Read More »అమెరికా నుంచి వచ్చేస్తున్నారు.. మంచిదేనా?
వృత్తి నిపుణులు, దేశంలో నైపుణ్య కేంద్రాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. కేంద్రంలో మోడీ సర్కారు ఏర్పడిన తర్వాత నైపుణ్య కేంద్రాలకు ప్రాధాన్యం పెరిగింది. తద్వారా వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుకుని సమర్థవంతమైన ఉత్పత్తులకు అవకాశాలు కల్పించారు. అయితే చిత్రంగా గత రెండు ఏళ్ల నుంచి వృత్తి నైపుణ్యం పొందుతున్న వారు విదేశాలకు వెళ్లిపోతున్నారు. దీంతో ఎప్పటికప్పుడు భారత్కు వృత్తి నిపుణుల కొరత వెంటాడుతోంది. ఇలాంటి కీలక సమయంలో అనూహ్యంగా అమెరికా నుంచి …
Read More »ఇందుకే టీడీపీని రాజకీయ పాఠశాల అంటారు
గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్టీ కార్యకర్తలు, నాయకుల కోసం శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని మొత్తం 12 విభాగాలుగా విభజించి, వెయ్యి మందికి పైగా కార్యకర్తలు, నేతలకు పార్టీ విధి విధానాలు, భవిష్యత్ ప్రణాళికలపై సీనియర్ నాయకులు అవగాహన కల్పించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమాలు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగాయి. కేంద్ర కమిటీ కార్యాలయంలోని అన్ని గదుల్లోనూ …
Read More »షర్మిల ఢిల్లీ ప్రయాణం వెనుక ఇంత కథ ఉందా?
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ షర్మిల.. రాజ్యసభకు వెళ్తారంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. 2024 ఫిబ్రవరిలో ఆమె ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేపట్టారు. అనంతరం.. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో కడప నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. తన సోదరుడు, వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వం దిగిపోవడంలో షర్మిల కీలక పాత్ర పోషించారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తారు. అప్పట్లో ఊరూ వాడా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates