ఏపీ ప్రతిపక్షం వైసీపీకి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఇదొక షాక్ అయితే.. సోమవారం మరో భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లాకు చెందిన ముఖ్య నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఆయన పార్టీ అదినేత, మాజీ సీఎం జగన్కు పంపించారు. 2019లో తొలిసారి రాజకీయాల్లోకి వచ్చిన మద్దాలిగిరి.. అప్పట్లో టీడీపీ తరఫున గుంటూరు వెస్ట్ …
Read More »మదన పల్లె ఘటన ప్రమాదం కాదు: డీజీపీ
అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం.. ప్రమాదవ శాత్తు జరిగిన ఘటన కాదని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు పేర్కొన్నారు. దీని వెనుక కుట్ర పూరిత చర్యలు ఉన్నాయని భావిస్తున్నట్టు చెప్పారు. తాను స్వయంగా మూడు గంటల పాటు కార్యాలయంలో కలియదిరిగి పరిస్థితిని పరిశీలించినట్టు తెలిపారు. అయితే.. షార్ట్ సర్క్యూట్ జరగడానికి.. అవకాశం లేదని గుర్తించినట్టు తెలిపారు. ఈ ఘటన వెనుక ఎవరున్నారనే విషయంపై …
Read More »మదనపల్లి ఘటనపై ప్రభుత్వం సీరియస్
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పాలన అంటే రాష్ట్ర ప్రజలందరికీ ఎంతో మక్కువ. చంద్రబాబు వంటి విజనరీ నేత తీసుకునే నిర్ణయాలు, ఆయన రాష్ట్ర శ్రేయస్సు కోసం చూపించే చొరవ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. చంద్రబాబు పరిపాలన దక్షత గురించి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాని మోదీ సైతం ఎన్నోసార్లు కితాబిచ్చారు. చంద్రబాబు తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం ఆ ప్రశంసల జాబితాను మరింత పెంచింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో …
Read More »ఢిల్లీలో ధర్నా చేసేందుకు సిగ్గుండాలి: షర్మిల
తన సోదరుడు, ఏపీ మాజీ సీఎం జగన్ పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గత కొద్ది నెలలుగా సంచలన విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తన చిన్నాన్న వివేకా హత్య కేసు వ్యవహారంలో జగన్, తన మరో సోదరుడు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిలను ఎన్నికల ప్రచారం సందర్భంగా షర్మిల తూర్పారబట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఇంత హై ప్రొఫైల్ కేసును ఐదేళ్ల పాటు నాన్చిన …
Read More »చంద్రబాబుపై బూతులు.. వైసీపీ నేత అరెస్టు
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై బూతులు మాట్లాడుతూ.. అసభ్యంగా వ్యవహరించిన వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్టు అయ్యారు. ఒక్క చంద్రబాబునే కాదు.. ఆయన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పైనా విమర్శలు గుప్పించారు. మూడు పెళ్లిళ్లు అంటూ.. విమర్శించారు. అదేవిధంగా రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనితపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయా అంశాలపై పోలీసులకు టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. వీటిపై ఎప్పుడో కేసులు …
Read More »వి‘చిత్రం’.. జగన్ పక్కనే రఘురామ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ప్రతిపక్ష టీడీపీ, జనసేన నాయకులకు ఏమాత్రం తగ్గని రీతిలో, ఇంకా చెప్పాలంటే వాళ్లను మించి ఆ పార్టీతో పోరాడిన, విమర్శలు గుప్పించిన నాయకుడిగా రఘురామకృష్ణంరాజుకు పేరుంది. వైసీపీ తరఫున ఏంపీగా గెలిచి, ఏడాది తిరక్కముందే రెబల్గా మారి నాలుగేళ్ల పాటు ఆ పార్టీతో తీవ్రంగా ఘర్షణ పడ్డారు రఘురామ. దీంతో జగన్ కక్ష పూరితంగా ఆయన్ని అరెస్ట్ చేయించి చిత్రహింసలు పెట్టించారనే ఆరోపణ …
Read More »దివ్యాంగుల-అందగత్తెలు… ఐఏఎస్ స్మితా వివాదం
ఐఏఎస్ – ఆఫీసర్ అయ్యేందుకు ఉండాల్సిన అర్హతలేంటి? దివ్యాంగులు ఈ పరీక్షలకు అనర్హులా..? వారిని ఎంపిక చేయడం పాపమా? ఇదీ.. ఇప్పుడు చర్చకు వస్తున్న విషయం. ఐఏఎస్గా ఎంపికయ్యే వారు.. కాళ్లు చేతులు సక్రమంగా ఉండి.. ఎలాంటి వైకల్యం లేనివారుగా ఉండాలంటూ.. తెలంగాణకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒక్క తెలంగాణలోనే కాదు.. దేశంలోని పలురాష్ట్రాల్లోనూ దివ్యాంగులు మండిపడుతున్నారు. భారత …
Read More »అసెంబ్లీకి నల్ల కండువాలతో జగన్..అడ్డుకున్న పోలీసులు
ఈ రోజు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం మొదలుబెట్టారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు సభలో నినాదాలు చేస్తున్నారు. హత్యారాజకీయాలు నశించాలి..సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీకి వచ్చే ముందు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు పూలమాలలు వేశారు. అదే సమయంలో అసెంబ్లీకి నల్ల కండువాలతో వెళ్లేందుకు ఏపీ మాజీ …
Read More »సభా సమరం: చంద్రబాబు వర్సెస్ జగన్…. పథకాల ఫైట్..!
ఏపీ అసెంబ్లీ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సభలో కీలకమైన అంశం.. బడ్జెట్. అది వచ్చే మూడు మాసాలకు ప్రకటిస్తారా? లేక.. వచ్చే ఏడాది మార్చి వరకు నిర్ణయిస్తారా? అనేది చూడాలి. సరే.. ఏది ఎలా ఉన్నా.. ఇప్పుడు చంద్రబాబు సర్కారు ప్రధాన వ్యూహం.. వైసీపీకి కౌంటర్ ఇవ్వడమే. భారీ ఎత్తున అలివిమాలిన పథకాలను ప్రకటించి.. చంద్రబాబు అధికారంలోకి వచ్చారంటూ.. జగన్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఇప్పటికీ పథకాల …
Read More »వైసీపీకి మైండ్ బ్లాంక్ అయ్యేలా కూటమి వ్యూహం..!
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఇంటీరియం బడ్జెట్ను ప్రవేశ పెడతారని ప్రచారం జరుగుతున్నా.. కేవలం వచ్చే మూడు మాసాలకు(ఆగస్టు-అక్టోబరు) మాత్రమే బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉందని మరో ప్రచారం కూడా తెరమీదికి వచ్చింది. అయితే.. దీనిపై ఇంకా క్లారిటీ లేదు. సరే.. మొత్తానికి సోమవారం నుంచి సభ అయితే.. ప్రారంభం కానుంది. మొత్తం ఐదు రోజుల పాటు ఈ సభ జరగనుంది. బడ్జెట్తో పాటు.. …
Read More »జగన్కు మైండ్ పనిచేయట్లా: మంత్రి హాట్ కామెంట్స్
వైసీపీ అధినేత, విపక్ష నాయకుడు జగన్కు మైండ్ పనిచేయట్లేదని.. అందుకే నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యల్లో టీడీపీ వారే ఎక్కువగా చనిపోయిన విషయాన్ని జగన్ గుర్తించాలన్నారు. ఇప్పటి వరకు నాలుగు హత్యలు జరిగిన మాట వాస్తవమేనని .. అయితే.. మూడు ఘటనల్లో ముగ్గరు టీడీపీ నాయకులు మృతి చెందారని తెలిపారు. వినుకొండలో జరిగిన …
Read More »టీడీపీ డ్రస్ కోడ్.. అసెంబ్లీకి అలానే రావాలని పిలుపు!
సోమవారం నుంచి ప్రారంభం అవుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూటమి సర్కారు ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలకు.. ఆ పార్టీ నేతలు కొన్ని కీలక సూచనలు చేశారు. సభకు వచ్చే వారు.. పసుపు రంగు దుస్తుల్లోనే రావాలని పేర్కొన్నారు. అదేవిధంగా సైకిల్ గుర్తు మాత్రమే ఉన్న పసుపు కండువాలు ధరించాలని సూచించారు. సూచనలను తప్పకుండా పాటించాలని అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయని మాత్రం పార్టీ నాయకులు …
Read More »