ఉమ్మడి కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో బంగారు గనుల నుంచి తవ్వి తీసిన పసిడి మార్కెట్లోకి అందు బాటులోకి వచ్చింది. సీఎం చంద్రబాబు ఇటీవలే ఈ గనులను దక్కించుకున్న ఓ ప్రైవేటు కంపెనీని ప్రారంభించారు. అప్పటికే పనులు ప్రారంభించిన కంపెనీ.. బంగారాన్ని వెలికి తీయడంతోపాటు దానిని శుద్ధి చేసి బిస్కెట్ల రూపంలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ బిస్కెట్లను సీఎం చంద్రబాబుకు కానుకగా కూడా అందించారు. తాజాగా ఈ బంగారం బిస్కెట్లు సాధారణ …
Read More »మాకు ఆంధ్రా తెలంగాణ ఉండదు: లోకేష్
ఏపీ-తెలంగాణల మధ్య ప్రాంతీయత, రాష్ట్ర విభజనకు సంబంధించిన వివాదాలు తీవ్రంగా సాగుతున్న సమయంలో కీలక విషయం చర్చకు వచ్చింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఇద్దరు తెలంగాణకు చెందిన యువతులు లీడ్ రోల్ పోషిస్తున్న విషయం వెలుగు చూసింది. ప్రస్తుతం ఏపీ-తెలంగాణ పరిధులు.. హక్కులపై చర్చ జరుగుతున్న సమయంలో ఇద్దరు తెలంగాణ బిడ్డలు ఏపీలో ఉద్యోగాలు చేస్తున్న విషయం ఆసక్తిగా మారింది. దీనిపై …
Read More »ఎన్నికల ముంగిట బీజేపీకి అయోధ్య ఎఫెక్ట్ ఎంత?
బీజేపీకి అత్యంత కీలకమైన ఉత్తర ప్రదేశ్లో ఎన్నికలకు ముందు చెలరేగిన అయోధ్య రామమందిర వివాదం కీలక మలుపులు తిరుగుతోంది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం కావడం.. 80 పార్లమెంటు నియోజనకవర్గాలు ఉన్న ఏకైక రాష్ట్రం కావడంతో ఈ స్టేట్పై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ను తీసుకువచ్చి ఉత్తర ప్రదేశ్ సీఎంగా కూడా చేశారు. తద్వారా.. రాష్ట్రంలో పక్కాగా బీజేపీని బలోపేతం …
Read More »కేటీఆర్ తప్పు ఒప్పేసుకున్నట్టేగా!
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాదించిన పార్టీగా బీఆర్ఎస్ (గతంలో టీఆర్ఎస్)కు ఓ ప్రత్యేక గుర్తుంపు అయితే ఉంది. అయినంత మాత్రాన కొత్త తెలంగాణను పదేళ్ల పాటు పాలించిన ఆ పార్టీ ప్రభుత్వం తప్పులేమీ చేయలేదా? అంటే.. ఎందుకు చేయలేదు. చాలానే చేసింది. తప్పులు జరిగాయి. పొరపాట్లూ జరిగాయి. ఇదేదో బీఆర్ఎస్ వ్యతిరేకులో, బీఆర్ఎస్ అంటే గిట్టని వారో చెబుతున్న మాట ఎంతమాత్రం కాదు. సాక్షాత్తు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, …
Read More »ఆపరేషన్ సిందూర్లో ఆరుగురు వీరమరణం
గత ఏడాది మేలో జరిగిన ఆపరేషన్ సిందూర్లో ఆరుగురు సైనికులు వీరమరణం చెందినట్టు కేంద్రం తాజాగా వెల్లడించింది. దాదాపు 13 మాసాల తర్వాత ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. వీరిలో ఐదుగురు సైనిక శాశ్వత అధికారులు ఉన్నారు. మరొకరు అగ్నివీర్ ఉన్నారు. వీరి పేర్లను జాతీయ యుద్ధ స్మారకం వద్ద పొందుపరచనున్నారు. అమరులైంది వీరే.. 1) సుబేదార్ మేజర్ పవన్ కుమార్ (10 ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ హెడ్క్వార్టర్స్)2) రైఫిల్మ్యాన్ సునీల్ …
Read More »తెలంగాణ కొత్త సీఎస్ ఎవరంటే?
తెలంగాణలో ఓ కీలక నియామకానికి సంబంధించిన నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం రేవంత్ రెడ్డి సర్కారు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30న ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజున కొత్త సీఎస్ గా జాజు పదవీ బాధ్యతలు చేపడతారు. …
Read More »నవ్వకుండా ఉండలేరు.. చంద్రబాబు పోస్టు వైరల్
ఏపీ సీఎం చంద్రబాబు సాధారణ ప్రజలతో ఇటీవల కాలంలో మమేకమవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేసిన ఓ వీడియో అందరినీ కడుపుబ్బ నవ్విస్తోంది. ఈ వీడియోకు స్వయంగా చంద్రబాబే.. ‘నవ్వకుండా ఉండలేరు’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్గా మారింది. ఏంటా వీడియో.. కలెక్టర్ కుర్చీలో ఓ చిన్నారి కూర్చున్నాడు. తనముందున్న నేమ్ ప్లేట్పై ‘ఆర్నా ఐఏఎస్’ అని …
Read More »బొత్స ఇలాకాలో మంత్రి పాగా… వైసీపీ ఖాళీ!
ఏపీలో చేరికల పర్వం ప్రారంభమైంది. ఎన్నికలకు ముందుగానే వైసీపీని ఖాళీ చేసే దిశగా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఆపరేషన్ ఆకర్ష్ను చేపట్టారు. దీంతో నియోజకవర్గాల వారీగా వైసీపీ కేడర్ను పార్టీలో చేర్చుకునే కార్యక్రమాన్ని ముమ్మరంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలోని గజపతి నగరం నియోజకవర్గం ఎమ్మెల్యే కమ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలను భారీ సంఖ్యలో సైకిల్ ఎక్కించారు. గజపతి నగరం అంటేనే …
Read More »మీరు భారతీయులేనా? సర్కు చెప్పాలి!
మీరు భారతీయులేనా?- ఈ సందేహం ఎందుకు? అనే డౌటు రావొచ్చు. ప్రస్తుతం జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియలో ఇది కూడా భాగమనే విషయం చాలా మంది తెలియదు. కానీ, ఫారం పూర్తి చేస్తుంటే వచ్చే ప్రశ్నల్లో ఇది కూడా ఉంది. మీరు భారతీయులేనా? అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. అయితే.. భారతీయత్వం ఎలా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రజల వద్ద ఉన్న ఏ గుర్తింపు …
Read More »ఎవరీ ఐఏఎస్ శ్రీలక్ష్మి?
ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో కీలక నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై శ్రీలక్ష్మికి ఎట్టకేలకు పోస్టింగ్ దక్కింది. ప్రస్తుతం ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారిణిగా కొనసాగుతున్న శ్రీలక్ష్మిని సాధారణ పరిపాలనా శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రెండేళ్లుగా పోస్టింగ్ లేకుండా వెయిటింగ్ లో ఉన్న ఆమెకు చివరాఖరుకు పోస్టింగ్ దక్కిందన్న వాదన వినిపిస్తోంది. …
Read More »ఇదేం లాజిక్ ఎంపీ గారూ?
విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాయికృష్ణది లాకప్ డెత్ అని కోర్టుకు సిట్ నివేదిక ఇచ్చింది. సాయికృష్ణను లాకప్ డెత్ చేసిన సీఐ నాగరాజు ఆ తర్వాత శవాన్ని మాయం చేశారని పేర్కొంది. విజయవాడ నగర కమిషనర్ కు సాయికృష్ణ తల్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. టీడీపీ నేతలు చెప్పినట్లు …
Read More »ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు!… కొత్త చరిత్రే!
దక్షిణ భారత దేశంలో గురువారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి కనిపించారు. అంతేకాదండోయ్…తాము ముగ్గురం కలిస్తే కొత్త చరిత్రేనని కూడా ఆ సీఎంలలో ఓ ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సన్నివేశం కర్ణాకట, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న తుంగభద్ర డ్యాం వద్ద కనిపించింది. ఈ అరుదైన సన్నివేశంలో ఈ మూడు రాష్టాల ముఖ్యమంత్రులు డీకే శివకుమార్, ఎనుముల రేవంత్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates