Political News

కేసీఆర్, రేవంత్ ను ఒకేసారి ఎలా ప్రేమిస్తావ్ కడియం?

బీఆర్ ఎస్ పార్టీ తరఫున 2023లో విజయం సాధించి, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కు మద్దతుగా మారిన 10 మంది ఎమ్మెల్యేల విచారణ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు కేవలం 8 మంది ఎమ్మెల్యేల విచారణనే స్పీకర్ ప్రసాదరావు పూర్తి చేశారు. మిగతా ఇద్దరు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌ల విచారణ వాయిదా పడుతూ వస్తోంది. చివరికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గురువారం ఇద్దరిపై విచారణ చేపట్టాలని స్పీకర్ నిర్ణయించారు. ఈ …

Read More »

పిల్ల‌ల‌నుకంటే పాతిక వేలు: బాబు గారి కొత్త పథకం

రాష్ట్రంలో జనాభాను పెంచాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. అసెంబ్లీలో జనాభా అంశంపై గురువారం జరిగిన చర్చలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి జరగాలన్నా, కేంద్రం నుంచి నిధులు రావాలన్నా, సామాజిక సమతుల్యం పెరగాలన్నా జనాభాను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కానీ ఇప్పుడు జనాభా విషయంలో ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేశారని తెలిపారు. అందుకే ఒక పిల్లో పిల్లాడో ఉంటే చాలనుకునే దంపతులు 57 శాతం మంది …

Read More »

వైసీపీ ఎమ్మెల్యేలపై యాక్షన్ ఎలా ఉంటుందంటే..

వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మరోసారి స్పందించారు. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలకు వారు హాజరు కాకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన వారు ఇంట్లోనే కూర్చుంటామంటే ప్రజలు కూడా వారిని శాశ్వతంగా ఇంట్లోనే కూర్చోబెట్టే రోజులు వస్తాయని విమర్శించారు. సభకు రావాలని తామంతా కోరుతున్నామని చెప్పారు. “ప్రధాన ప్రతిపక్షం అనేది ప్రజలు ఇవ్వాలి. జగన్‌కు అవసరమైతే ప్రజలను వెళ్లి …

Read More »

పాడిన పాటే పాడుతోన్న అంబటి

సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించిన కేసులో మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలు కేసుల్లో పీటీ వారెంట్ పై రాజమండ్రి జైల్లో 18 రోజులు ఉన్న అంబటి…కోర్టుకు హాజరయ్యే సమయంలో తగ్గేదేలే అంటూ పుష్ప మాదిరి మేనరిజంతో చెప్పడం చర్చనీయాంశమైంది. జైలుకు వెళ్లినా భయపడేదే లేదని అంబటి ఆ తర్వాత ప్రెస్ మీట్లో కూడా …

Read More »

ఇరాన్ యుద్ధంపై మోదీ స్పందన.. ఇంత ఆలస్యమెందుకు?

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా యుద్దం ప్ర‌క‌టించ‌డం.. ఇరాన్ కూడా బ‌లంగానే పోరాటం చేస్తున్న‌ నేప‌థ్యంలో ప‌శ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెల‌కొంది. ఈ యుద్ధం ఎప్ప‌టికి ముగుస్తుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ క్ర‌మంలో ప‌లు దేశాలు రెండుగా చీలిపోయాయి. ర‌ష్యా, చైనాలు ఇరాన్‌కు మద్ద‌తుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఇక‌, పాకిస్థాన్ ఎటూ తేల్చుకోలేని సందిగ్ధావ‌స్థ‌ను ఎదుర్కొంటోంది. యుద్ధం వ‌ద్దంటే.. అమెరికాకు కోపం.. కావాలంటే ఇరాన్‌కు కోపం.. …

Read More »

వైసీపీ హయాంలో మొక్కలు కూడా స్వేచ్ఛ కోల్పోయాయి: పవన్

వైసీపీ హయాంలో ప్రజలతో పాటు మొక్కలు, చెట్లు కూడా స్వేచ్ఛ కోల్పోయాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో అటవీ శాఖపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు, చెట్ల దుస్థితిపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రహదారుల విస్తరణ పేరుతో మొక్కలను, చెట్లను తొలగిస్తున్నారని, అలా తొలగించిన వాటిని వేరే ప్రాంతంలో నాటాలని సూచించారు. ఈ క్రమంలో కీలక చర్చను …

Read More »

విజ‌య్ ఒంట‌రి పోరే… ఛాన్స్ లాగేసిన సీఎం!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల వ్య‌వ‌హారం కీల‌క మ‌లుపు తిరిగింది. వ‌చ్చే ఏప్రిల్‌లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో.. ఒంట‌రి పోరు చేస్తామంటూ.. కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కు చెప్పుకొచ్చిన న‌టుడు విజ‌య్ ప్ర‌క‌టించారు. ఈయ‌న స్థాపించిన త‌మిళ వెట్రి క‌గ‌ళం(టీవీకే) పార్టీ ఒంట‌రి పోరునే ఎంచుకుంద‌ని ప‌దే ప‌దే ప్ర‌క‌టించారు. త‌మిళ ప్ర‌జ‌ల కోసం.. నిల‌బ‌డ‌తామ‌ని కూడా తెలిపారు. అయితే.. ప‌రిణామాలు అన్నీ ఒకేలా ఉండ‌వు క‌దా.. బీజేపీ స‌హా.. అధికార పార్టీ …

Read More »

ప‌ట్టు నిలుపుకొన్న రేవంత్ రెడ్డి!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై మ‌రోసారి త‌న ప‌ట్టును గ‌ట్టిగా నిల‌బెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గ‌తంలోనూ ఆయ‌న అనేక సంద‌ర్భాల్లో పార్టీలో త‌న మాట‌నే నెగ్గించుకున్నారు. తాజాగా రాజ్య‌స‌భ ఎన్నిక‌ల వేళ అనేక మంది పోటీలో ఉన్నా, ఏకంగా రాష్ట్ర పార్టీ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ సైతం ఓ అభ్య‌ర్థిని సిఫార‌సు చేసినా, ఇక సీనియ‌ర్లు వీ. హ‌నుమంత‌రావు వంటివారు నేను సైతం అంటూ ఢిల్లీలోనే పంచాయ‌తీ పెట్టినా …

Read More »

‘విద్యా సంస్థలను రెడ్లకు రాసిచ్చిన జగన్’

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై మంత్రి నారా లోకేష్ తీవ్ర‌స్థాయిలో మండి ప‌డ్డారు. రాష్ట్రంలోని ప్ర‌తిష్టాత్మ‌క విద్యాసంస్థ‌లను జ‌గ‌న్ త‌న బంధువులైన రెడ్ల‌కు రాసిచ్చేశార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ హ‌యాంలో ప్ర‌తిష్టాత్మ‌క విద్యాసంస్థ‌లు రాజ‌కీయ కేంద్రాలకు ఆల‌వాలంగా మారిపోయాయ‌న్నారు. రాజ‌కీయ పున‌రావాస కేంద్రాలుగా ప‌రిఢ‌విల్లాయ‌ని చెప్పారు. జ‌గ‌న్ జపం చేయ‌డం త‌ప్ప‌.. గ‌త వైసీపీ పాల‌న‌లో రాష్ట్రంలోని విశ్వ‌విద్యాల‌యాలు సాధించింది ఏమీ లేద‌న్నారు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత మార్పుల దిశ‌గా …

Read More »

అప్పుడు వైసీపీ.. ఇప్పుడు టీడీపీ… ఎవరీ న‌త్వానీ?

ప‌రిమ‌ళ్ న‌త్వానీ. ఈ పేరు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు. కానీ, ఈయ‌న పెద్ద పారిశ్రామిక వేత్త‌. ఉత్త‌రాది రాష్ట్రాల్లో ఈయ‌న పేరు అంద‌రికీ తెలుసు. ప్ర‌ముఖ వ్యాపార వేత్త‌, జియో అధినేత ముఖేష్ అంబానీకి అత్యంత ప్రియ మిత్రుడు. ఆటోమేటిక్‌గా ప్ర‌ధాని మోడీకి కూడా ఆయ‌న విశ్వాస‌పాత్రుడు. ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు. గ‌తంలో ప్ర‌ధాని సూచ‌న‌ల మేర‌కు.. బీజేపీ కోరిక మేర‌కు.. వైసీపీ న‌త్వానీకి.. రాజ్య‌స‌భ సీటు ఇచ్చేసింది. …

Read More »

`చిరంజీవి` ఎఫెక్ట్‌… అక్క‌డి పాలిటిక్స్ మార‌తాయా ..!

చిరంజీవి అంటే.. మెగాస్టార్ చిరంజీవి కాదు. ఉత్త‌రాంధ్ర‌లోని ఆముదాల‌వ‌ల‌స మాజీ ఎమ్మెల్యే, మాజీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్‌. ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో ఈయ‌న గురించిన టాపిక్ పెద్ద‌గానే సాగుతోంది. యువ‌త‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డంలో బాగానే ప‌నిచేస్తున్నార‌ని అంటున్నారు. అంతేకాదు.. వైసీపీ నాయ‌కుల‌తోనూ క‌లివిడిగానే ఉంటున్న‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆముదాల‌వ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గం నుంచి చిరంజీవి పోటీ చేయ‌డం ఖాయ‌మైంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. వైసీపీ ప‌రంగా …

Read More »

అక్కడ ‘పవన్’ పేరు బాగా వినిపిస్తుంది

గ్రామీణ భార‌తంపై జ‌న‌సేన సైలెంట్ వేవ్‌తో దూసుకుపోతోందా? ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల‌కే ప‌రిమితం అయిన జ‌న‌సేన ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల‌పై త‌న‌దైన శైలిలో ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకుందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌ల్లె పండుగ‌-2.0ను మ‌రింత ముందుకు తీసుకువెళ్ల‌డం ద్వారా.. ప‌ట్టు పెంచుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి ప‌ల్లెల‌పై జ‌న‌సేన‌కు ప‌ట్టు పెద్ద‌గా లేదు. అయితే.. త‌ర‌చుగా ప‌ల్లెల ప‌ర్య‌ట‌న‌తోపాటు.. కేంద్రం నుంచి …

Read More »