Political News

మ‌రో వివాదంలో టీడీపీ ఫైర్ బ్రాండ్.. దెందులూరు హాట్ హాట్‌!

టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ మ‌రో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నిక‌ల అనంతరం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలోనూ కొంత మేర‌కు అల్ల‌ర్లు జ‌రిగాయి. ముఖ్యంగా చింత‌మ‌నేనికి బ‌ల‌మైన ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని పెద‌వేగి మండ‌లంలో ఈ ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకున్నాయి. వీటిని స్థానిక పోలీసులు.. ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని విచార‌ణ చేశారు. ఈ క్ర‌మంలో చింత‌మ‌నేని అనుచ‌రుల‌పై కేసులు పెట్టివారిని స్టేష‌న్‌కు త‌ర‌లించారు. …

Read More »

నోరు జారిన కేటీఆర్‌.. క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఈసీ ఆదేశం!

తెలంగాణ ప్ర‌తిప‌క్షం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం కొన్ని వారాల కింద‌ట క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్న విష‌యం తెలిసిందే. కీల‌క‌మైన ఎన్నిక‌ల పోలింగ్‌కు వారం ముందు ఆయ‌న‌ను 48 గంట‌ల పాటు ప్ర‌చారంలో పాల్గొన‌కుండా.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం అడ్డుకుంది. దీనికి కార‌ణం.. అప్ప‌ట్లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో సీఎం రేవంత్ స‌హా కాంగ్రెస్ నేత‌ల‌పై కేసీఆర్ నోరు చేసుకోవ‌డ‌మే. దీనిపై వివ‌ర‌ణ కోరిన ఎన్నిక‌ల సంఘం.. ఆ …

Read More »

దేశం విడిచి పారిపోతున్న మంత్రి పెద్దిరెడ్డి… ఇదిగో క్లారిటీ!

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి దేశం విడిచి పారిపోతున్నార‌ని.. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకోవ‌డం లేద‌ని.. అందుకే ఆయ‌న ఈ రాష్ట్రమే కాదు.. దేశం నుంచి పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్నార‌ని.. ఓ వ‌ర్గం టీడీపీ నాయ‌కులు ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాదు.. పెద్దిరెడ్డి దేశం విడిచి పోయేది.. జూన్ 1-3 మ‌ధ్య‌లోనేన‌ని కూడా చెప్పుకొచ్చారు. ఇక‌, ఇదేవిష‌యంపై సోష‌ల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున పోస్టులు వ‌చ్చాయి. …

Read More »

‘మండి’లో ‘కంగు’మంటుందా ? ‘కంగు’తింటుందా ?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు కీలకదశకు చేరుకున్న నేపథ్యంలో దేశంలో వివిద నియోజకవర్గాలలో నిలబడ్డ ప్రముఖులలో ఎవరు గెలుస్తారు ? అని ఆయా లోక్ సభ నియోజకవర్గాలలో పోటీని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. అందులో ఒకటి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి లోక్ సభ నియోజకవర్గం. ఇక్కడ బీజేపీ తరపున ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుండి హిమాచల్ కు ఆరుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వీరభద్రసింగ్ …

Read More »

విదేశీ పర్యటన: జగన్, చంద్రబాబు.. ఇద్దరి మధ్యా తేడా ఇదీ.!

YS-Jagan-Chandrababu-Naidu

ఎన్నికల ప్రచారంలో ఎండనక.. వాననక.. నానా కష్టాలూ పడిన రాజకీయ ప్రముఖులు, పోలింగ్ తర్వాత, కౌంటింగ్‌కి ముందు.. కొంత ఉపశమనం కోసం ప్రయత్నిస్తే, అది తప్పెలా అవుతుంది.? పుణ్యక్షేత్రాల సందర్శన, విదేశాలకు పయనం.. ఇలాంటివాటిని మామూలుగా అయితే తప్పు పట్టే పరిస్థితి లేదు. కాకపోతే, గతంలో చేసిన అడ్డగోలు ఆరోపణలు, వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో, రాజకీయాల్లో ప్రతీదీ కౌంట్‌లోకి వస్తుంది.! పైగా, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, …

Read More »

జనసేనలోకి వంగా గీత.!? అసలేం జరుగుతోంది.?

పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద పోటీకి దిగిన వైసీపీ ఎంపీ (కాకినాడ) వంగా గీత, జనసేన పార్టీలోకి జంప్ చేయబోతున్నారా.? పోలింగుకి ముందే వంగా గీత, జనసేనలోకి జంప్ చేస్తారన్న పుకార్లు ఎలా పుట్టాయి.? ఓటమి ఖాయమవడంతో వంగా గీత, జనసేనలోకి చేరతారన్న ప్రచారంలో నిజమెంత.? వంగా గీత విషయంలోనే కాదు, చాలామంది వైసీపీ అభ్యర్థుల విషయంలో ఈ ప్రచారం చాలా గట్టిగా జరుగుతోంది. 151 కంటే …

Read More »

కార్య‌క‌ర్త‌ల‌ను రెచ్చ‌గొట్టి నేత‌లు ప‌రార్‌.!

ఏపీలో రాజ‌కీయాలు కీల‌క మ‌లుపు తిరిగాయి. ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగిన ఈ నెల 13న, ఆ రోజు త‌ర్వాత కూడా.. ప‌ల్నాడు, అనంత‌పురం, తిరుప‌తిజిల్లాల్లో హింస చెల‌రేగింది. వైసీపీ, టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కు లు కూడా రెచ్చిపోయి దాడులు చేసుకున్నారు. ఆయా ఘ‌ట‌న‌ల్లో ప‌లువురు గాయాల పాల‌య్యారు. మ‌రికొంద‌రు త‌న్నులు కూడా తిన్నారు. రాళ్ల వ‌ర్షాలు.. క‌ర్ర‌ల కుమ్ములాట‌లు కామ‌న్ అయిపోయాయి. అయితే.. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. ఇప్పుడు …

Read More »

రేపే ర‌ణ‌భేరి.. ‘గాంధీ’ల ప‌రువు ద‌క్కుతుందా?

దేశంలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఐదో ద‌శ పోలింగ్ సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. మొత్తం 6 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 పార్లమెంటు స్థానాలకు సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 5వ దశలో ఉత్తరప్రదేశ్ లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమబెంగాల్ లో 7, ఒడిషాల్లో 5, బీహార్ లో 5, జార్ఖండ్ లో 3, …

Read More »

తేనెతుట్టెను గెలుకుతున్న రేవంత్ !

లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదిస్తారని వస్తున్న వార్తలు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా విభజించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని చోట్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను నిర్మించి ప్రారంభించింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని కుదిస్తామని ప్రకటించడం కొత్త పంచాయతీలకు తెరలేపడమే అని భావిస్తున్నారు. 17 పార్లమెంటు …

Read More »

మాజీ ప్ర‌ధాని మ‌న‌వ‌డి కోసం… బ్లూ కార్నర్ నోటీసు!

భార‌త దేశ చ‌రిత్ర‌లో ఇదోక అనూహ్య‌మైన.. అస‌హ్యించుకునే ఘ‌ట‌న‌. ఈ దేశాన్ని పాలించి, రైతుల మ‌న్న‌న‌లు, మ‌హిళ‌ల మ‌న్న‌న‌లు పొందిన మాజీ ప్ర‌ధాని మ‌న‌వ‌డి కోసం బ్లూ కార్న‌ర్ నోటీసులు స‌హా అరెస్టు వారెంటు జారీ చేయ‌డం.. దేశ చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి. ఆయ‌నే మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌.. ఆయ‌న మ‌న‌వ‌డే.. సెక్స్ ర్యాకెట్ కుంభ‌కోణంలో చిక్కుకున్న పార్ల‌మెంటు(హాస‌న్‌) స‌భ్యుడు 36 ఏళ్ల ప్ర‌జ్వ‌ల్‌. తాజాగా ఈయ‌న‌పై అరెస్టు వారెంటు …

Read More »

జ‌గ‌న్.. నీరో : జేడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. నీరో చ‌క్ర‌వ‌ర్తిని త‌ల‌పిస్తున్నారంటూ.. సీబీఐ మాజీ డైరెక్ట‌ర్ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ సంచ ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌ప్పుడు దేశం త‌గ‌ల‌బ‌డుతుంటే.. నీరో చ‌క్ర‌వ‌ర్తి ఫిడేల్ వాయించుకున్నా డ‌ని.. ఇప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా ఇలానే చేస్తున్నార‌ని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. తాజాగా విశాఖ‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం.. రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో అల్ల‌ర్లు చెల‌రేగాయ‌ని.. దీంతో అస‌లు ఏం జ‌రుగుతోందో కూడా …

Read More »

సతీసమేతంగా అమెరికాకు చంద్రబాబు

ఏపీలో ఎన్నికల పోరు ముగియడంతో ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి సేద తీరేందుకు విదేశాలకు వెళుతున్నారు. సీబీఐ కోర్టు అనుమతితో ఏపీ సీఎం జగన్ మే 18న విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యే జూన్ 1న జగన్ తిరిగి ఏపీలో అడుగుపెట్టనున్నారు. మరోవైపు, …

Read More »