విశాఖపట్నం సాగర తీరంలో ఉండే ప్రముఖ పర్యాటక ప్రాంతం రుషి కొండను తొలిచి.. గత వైసీపీ ప్రభుత్వం భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టిన విషయం తెలిసిందే. పర్యావరణాన్ని ఛిద్రం చేస్తున్నారని ప్రజలు గగ్గోలు పెట్టినా.. పర్యావరణ ప్రేమికులు నెత్తీ నోరూ బాదుకున్నా.. వినకుండా.. జగన్ సర్కారు ముందుకు సాగింది. ఒకానొక దశలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “చెట్టు పోతే పెంచగలం.. కొండ కొట్టేస్తే.. పెంచడం సాధ్యమేనా?“ అని నిలదీసింది. …
Read More »అమరావతికి ఇక ‘టైం’ పెట్టేశారు!
ఏపీ రాజధాని అమరావతి ఇప్పటి వరకు మూలన ఉన్న ప్రాంతంగా.. ముసురుపట్టిన ప్రాంతంగా మారిపోయింది. ఎటు చూసినా తుమ్మలు, తుప్పలు తప్ప.. గత ఐదేళ్లలో ఇక్కడ జరిగింది.. ఒరిగింది ఏమీలేదు. కానీ, ఇప్పుడు ప్రభుత్వం మారడం.. సీఎం చంద్రబాబు గద్దెనెక్కడంతో అమరావతి తలరాత మారిపోనుంది. ఒక ఖచ్చితమైన సమయం పెట్టుకుని.. దాని ప్రకారం పనులు చేసేందుకు.. కేవలం మూడేళ్లలోనే అమరావతిని 90 శాతం వరకు తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. …
Read More »కేటీఆర్ ఎక్కడ? ఎందుకీ సైలెన్స్?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్కడ? ఇప్పుడు ఈ ప్రశ్న హాట్ టాపిక్గా మారింది. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కేటీఆర్ పత్తా లేకుండా పోయారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా దక్కని విషయం తెలిసిందే. సున్నా సీట్లతో ఆ పార్టీ ఉనికి మరింత ప్రమాదంలో పడింది. ఈ సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోక్సభ ఎన్నికల్లో ఓటమిపై సమీక్షలు నిర్వహించాల్సిన బాధ్యత కేటీఆర్దే. …
Read More »ఇటు సోమవారం రిపీట్.. అటు శుక్రవారం రిపీట్ అవుతుందా?
ఇవేంటి? అనుకుంటున్నారా? అవును.. సోమవారం, శుక్రవారాలకు ఏపీలో రాజకీయ సంబంధం ఉంది. గతంలో 2014-19 మధ్య ఏపీలో చంద్రబాబు పాలన చేసినప్పుడు.. సోమవారం.. సోమవారం.. ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించేవారు. ప్రాజెక్టు తీరు తెన్నులను ఆయన పరిశీలించి.. ప్రగతిని కూడా వివరించేవారు. ఇక, అక్కడికక్కడ సమీక్షలు కూడా చేసి.. నిర్దేశం చేసేవారు. దాదాపు మూడేళ్లపాటు ఇలా సోమవారం.. సోమవారం.. ఆయన పోలవరం సందర్శనకు వెళ్లడంతో సోమవారం కాస్తా.. పోలవారంగా మారింది. …
Read More »ప్రభుత్వంలో పవన్.. ఫ్యూచర్ కోసమేనా..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించనున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అయితే.. వాస్తవానికి ఎన్నికలకు ముందు వరకు కూడా.. ఆయన ప్రభు త్వంలో చేరేది లేదన్నారు. పదవులు ఆశించడం లేదని కూడా చెప్పారు. ముందు పార్టీని బలోపేతం చేసుకుని ఓ పది మంది వరకు ఎమ్మెల్యేలను అసెంబ్లీ గడప దాటిస్తే.. చాలని ఆ తర్వాత.. నెమ్మడిగా పాతికేళ్లలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు …
Read More »ఫర్నీచర్ : ఏపీ రాజకీయాల్లో కొత్త వివాదం !
“లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టినా జగన్కి ప్రజల సొమ్ము మీద మోజు తీరలేదు. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి క్యాంపు ఆఫీస్ను సచివాలయ ఫర్నిచర్తో నింపేశారు. పదవి పోయిన తర్వాత ఫర్నిచర్ను ప్రభుత్వానికి రిటర్న్ ఇవ్వకుండా వాడుకుంటున్నారు” అంటూ టీడీపీ పార్టీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ ఏపీ రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఏపీ రాజకీయాలు హాట్ …
Read More »ఒత్తిడి పెంచొద్దు సర్!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన అనగానే.. కొన్నిమార్కులు కనిపిస్తాయి. క్రమశిక్షణకు ఆయన మా రు పేరు. అంతేకాదు.. ఒక పనిని గంట సమయంలో చేయాల్సి ఉంటే.. దానిని పదినిమిషాల ముందుగా ఎందుకు చేయకూడదు? అనే తత్వం చంద్రబాబుది. అంతేకాదు.. పనిసమయానికి పూర్తి చేయడంతొ పాటు.. ఫ్యూచర్పైనా దృష్టి పెట్టాలనే విధంగా ఆయన మార్కు కనిపిస్తుంది. ఉద్యోగులను, ఉన్నతాధికా రులను కూడా ఆయన పరుగులు పెట్టించారు. అదేవిధంగా ధర్నాలు, నిరసనలు అంటే …
Read More »సైకో పాలనకు నిదర్శనం.. వాటిని తొలగించం: చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో అమరావతి ప్రాంతంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం బృహత్తర లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘ప్రజావేదిక’ను కేవలం ఒక్క నిర్ణయంతో కుప్ప కూల్చింది. కనీసం కోర్టుకు వెళ్లే సమయం కూడా లేకపోయింది. అప్పటి సీఎం జగన్ ప్రజావేదికలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో తొలి భేటీ నిర్వహించారు. ఈ సమావేశాన్ని అందరూ సాధారణ భేటీనే అనుకున్నారు. కానీ, అనూహ్యంగా జగన్.. …
Read More »కన్నాకు అందుకే నో!
ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు సారథ్యంలో కొత్త మంత్రివర్గం కొలువుతీరింది. అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయంతో అధికారంలోకి వచ్చిన కూటమి అందరికీ ఆమోదయోగ్యంగా కేటినేట్ను ఏర్పాటు చేసుకుంది. మంత్రివర్గ ఏర్పాటులో చంద్రబాబు తనదైన ముద్ర వేసి ఎలాంటి అసంతృప్తి లేకుండా చూసుకున్నారు. కానీ మంత్రి పదవి వస్తుందని భావించిన సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ మాత్రం కాస్త నిరాశకు లోనయినట్లు తెలిసింది. కానీ ఎలాంటి సమీకరణాల ప్రకారం చూసినా కన్నాకు బాబు …
Read More »జగన్ చుట్టూ భారీ వివాదం.. క్యాంపు ఆఫీసుపై విచారణ?
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చుట్టూ భారీ వివాదం ముసురుకుంది. ముఖ్యంగా గుంటూరు జిల్లా శివారులోని తాడేపల్లిలో ఏర్పాటు చేసుకున్న క్యాంపు కార్యాలయం నుంచే ఆయన ఐదేళ్లు పాలన సాగించారు. ఈ సమయంలో ఆయన క్యాంపు కార్యాలయాన్ని ఇంద్ర భవనంగా తీర్చిదిద్దుకున్నారు. కళ్లు మిరిమిట్లు గొలిపే లైటింగులు, శుభ్రంగా కడిగిన చేతులతో ముట్టుకున్న మరకలు పడతాయా? అని అనిపించేంత రాయితో తన క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక, …
Read More »10 నిమిషాలు.. జగన్ బాబుని చూసి నేర్చుకోవాలి
రాజకీయాలకు.. మీడియాకు అవినాభావ సంబంధం. నేతలు ప్రజలకు ఏం చెప్పాలన్నా.. మీడియానే వారధి. ముఖ్యంగా అధికారంలో ఉన్నవారికి మీడియా మరింత స్నేహంగా ఉండాలని కోరుకుంటారు. కానీ, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. సీఎంగా జగన్ పదినిమాషాల సమయం మీడియాకు వెచ్చించలేక పోయారు. ఫలితంగా.. ఆయన తనపై వచ్చిన వ్యతిరేక వార్తలను కూడా ఖండించుకునే పరిస్థితి.. తమ మనసులో ఏముందో ప్రజలకు చెప్పే అవకాశం కోల్పోయారు. నిజానికి మీడియాకు.. సర్కారుపై సదభిప్రాయం ఏర్పడాలంటే.. …
Read More »జగన్ అందుకే ఓడిపోయాడు: రాజా సింగ్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. కవేలం 11 స్థానాలకే ఆ పార్టీ పరిమితమై.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక పోయింది. అసలు అసెంబ్లీకి వెళ్తారో లేదో .. అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఘోర పరాభవం దరిమిలా.. వైసీపీ నాయకులు ఎవరూ కూడా ప్రజలకు మొహం చూపించలేక పోతున్నారు. ఇక, మాజీ సీఎం జగన్ మాత్రం విడతల వారీగా .. తన వారితో భేటీ అయి.. కొంత …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates