దేశంలో 18వ పార్లమెంటు ఎన్నికలు.. అదేసమయంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. నిజానికి భారత దేశ చరిత్రలో ఇంత భారీ ఎత్తున ఎన్నికలు జరిగిన సందర్భాలు లేవు. ఏకంగా ఏడు దశలు.. రెండు మాసాలకు పైగా సమయం.. వంటివి.. ఎప్పుడూ లేదు. మార్చి 15న కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ నాటి నుంచి ప్రారంభమైన ఎన్నికల సమరం.. తొలి దశ నుంచి చివరి దశ …
Read More »పిన్నెల్లిని వదలని TDP కార్యకర్త
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని.. ఈవీఎం ధ్వంసం ఘటనలు, హత్యా యత్నాల ఘటన లు వెంటాడుతున్నాయి. మే 13న జరిగిన పోలింగ్ సమయంలో ఈవీఎం, వీవీప్యాట్లను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఎమ్మెల్యేను నిలదీసిన.. టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై హత్యా యత్నం జరిగింది. సర్కిల్ ఇన్ స్పెక్టర్పైనా హత్యాయత్నం జరిగింది. ఈ మూడు ఘటనల్లోనూ ఏ1గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. దీంతో ఆయన పరారు …
Read More »బాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు!
ఆంధ్రప్రదేశ్ తర్వాతి సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ సారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమనే అంచనాల నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడానికి బాబు రెడీ అవుతున్నారని తెలిసింది. అందుకు సంబంధించిన ఏర్పాట్ల గురించి పార్టీలోని సీనియర్ నేతలకు బాబు బాధ్యతలు అప్పగించారని సమాచారం. అలాగే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదట ఏం చేయాలి? …
Read More »ఎగ్జిట్ పోల్స్పై కాంగ్రెస్ మెలిక.. ఏసేసుకున్న బీజేపీ!
మరికొన్ని గంటల్లో 7వ దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియనుంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెల్లడించేందుకు సుమారు దేశవ్యాప్తంగా 112 సంస్థలు రెడీ అయ్యాయి. దేశంలోని 543 పార్లమెంటు స్థానాలు.. ఏపీ, ఒడిశా సహా.. నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల సరళి, ప్రజా తీర్పునకు సంబందించి ఈ సంస్థలు సర్వేలు.. అంచనాలు వెల్లడించేందుకురెడీ అయ్యాయి. వాస్తవ ఫలితం …
Read More »వైసీపీని వణికిస్తున్న ఎగ్జిట్ పోల్స్!
ఈ సారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని ఇప్పటికే వైసీపీ నేతలకు అర్థమైపోయింది. కానీ బయటకు మాత్రం తమ పార్టీనే గెలుస్తుందని, జగన్ రెండోసారి సీఎం అవుతారని గొప్పలు చెబుతోందనే టాక్ ఉంది. ఎన్నికల ఫలితాలకు ఇంకా సమయం ఉంది కాబట్టి వైసీపీ ఏం చెప్పినా చెల్లుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ శనివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానుండటంతో వైసీపీ నేతలు వణుకుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే …
Read More »ఇంకెన్ని రోజులు ఆంధ్ర పేరుతో పబ్బం గడుపుకుంటారు?
ఎన్నికలు వచ్చినా.. పార్టీ ఉనికి ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చినా.. తెలంగాణ సెంటిమెంట్ను రాజేయడమే ప్రధాన అస్త్రంగా బీఆర్ఎస్ పార్టీ సాగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన బీఆర్ఎస్.. రాష్ట్రం ఏర్పడ్డాక వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. ఆ రెండు ఎన్నికల్లోనూ అభివృద్ధిని చెప్పుకోకుండా ఎంత సేపు ఆంధ్రవాళ్లు, తెలంగాణ సెంటిమెంట్ను నమ్ముకుని కేసీఆర్ గట్టెక్కారనే విమర్శలున్నాయి. గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా …
Read More »సోనియమ్మ.. రావట్లే!
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడులను అంగరంగవైభవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సీఎం రేవంత్రెడ్డి ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ జాతీయ గీతం వంటివాటిని ఆవిష్కరించనున్నారు. ఆదివారం జరగనున్న ఈ కార్యక్రమం … నభూతో అన్నట్టుగా నిర్వహించేలా సర్కారు ఏర్పాట్లు చేసింది. దీనికి ఎంతో మంది ఉద్యమకారులను కూడా ఆహ్వానించింది. మాజీ సీఎం కేసీఆర్ను కూడా పిలిచారు. ఇక, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు.. …
Read More »జగన్ న్యూ లుక్ !
ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటన ముగిసింది. ఏపీలో పోలింగ్ పూర్తైన వెంటనే వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి యూరోప్ పర్యటనకు వెళ్లారు. సుమారుగా 15 రోజులపాటు జగన్ విదేశాల్లో పర్యటించారు జగన్. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో జగన్ స్వదేశానికి వస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అయితే లండన్ పర్యటన సందర్భంగా …
Read More »ఎగ్జిట్ పోల్స్ను మించిన జ్యోతిష్యుల పోల్స్..
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జూన్ 1న ముగియనుంది. అయితే.. ఏపీలోమాత్రం పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 13నే ముగిశాయి. కానీ, ఫలితాలు మాత్రం జూన్ 4న రానున్నాయి. ఇక, దీనికి ముందు… జూన్ 1న జరిగే తుది దశ పోలింగ్ ముగిసిన మరుక్షణమే దేశంలోను.. నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎవరు గెలుస్తారు? ఎవరు ప్రతిపక్షంలో కూర్చుంటారనే విషయాలను ఎగ్జిట్ పోల్స్ వెల్లడించనున్నాయి. దీనికి సంబంధించి ఏపీలోనూ.. …
Read More »ఏబీవీ: ఎలా రిటైర్ అవ్వాలి.. ఎలా రిటైర్ అయ్యారు..?
పోలీసు శాఖలో ఒక సంప్రదాయం ఉంది. ఒక అధికారి రిటైరైతే.. ఆయనను సిబ్బంది ఎంతో గౌరవంగా ఇంటికి తోడ్కొని వెళ్తారు. ఆ అధికారి స్తాయిని కూడా పట్టించుకోరు. కానిస్టేబుల్ నుంచి ఎస్సై వరకు.. సాధారణ అధికారులనే భావన పోలీసు శాఖలో ఉంది. కానీ, వీరు రిటైరైతే మాత్రం.. వారిని ప్రత్యేక వాహనంలో ఎక్కించి.. దానికి తాళ్లు కట్టి ఇరు వైపులా అధికారులు, సిబ్బంది కూడా నిలబడి వాటిని లాగుతూ.. ఎంతో …
Read More »చంద్రబాబు సంచలన నిర్ణయం: తెలంగాణలో టీడీపీ బలోపేతం!
టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఏపీలో మరో నాలుగురోజుల్లో ఎన్నికల ఫలితం రానున్న నేపథ్యంలో చంద్రబాబు తన దృష్టంగా ఏపీపై పెడతారని అనుకున్నారు. కానీ, ఒకవైపు ఏపీ బాధ్యతలు చూస్తేనే.. అక్కడ జరిగే పోలింగ్ వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తూనే.. ఇప్పుడు తెలంగాణపై నా దృష్టి పెట్టారు. తాజాగా తెలంగాణ నాయకులతో చంద్రబాబు.. హైదరాబాద్ లోని తన నివాసంలో భేటీ అయ్యారు. వచ్చే …
Read More »`33` చుట్టూనే ఏపీ అధికారం!
ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు? ఎవరు.. ప్రతిపక్షంలో కూర్చుంటారు? అనేది తేలేందుకు.. మరో ఐదు రోజుల వరకు వేచి చూడక తప్పదు. జూన్ 4న కానీ.. సార్వత్రిక ఎన్నికల ఫలితం వచ్చే అవకాశం లేదు.. అప్పటి వరకు ఎవరికీ నిద్ర పట్టడం లేదు. అయితే…. ఈ మధ్య కాలంలో ఎవరి అంచనాలు వారి వి. ఎవరి లెక్కలు వారికిసొంతం. మేమే గెలుస్తున్నామని.. వైసీపీ చెబుతోంది. కానీ, దుష్ట పాలనకు చరమ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates