ఏపీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం చేసుకోవడంలో రాష్ట్ర ప్రజలు కూడా భాగస్వాములు కావాలని సీఎం భావిస్తున్నారు. ఇందులో భాగంగానే స్వర్ణాంధ్ర సాధనకు సూచనలు ఇవ్వమంటూ ప్రజలకు బాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్)లో ఆయన ట్వీట్ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మీ వద్ద సూచనలు ఉన్నాయా..? అయితే మీరు ఇప్పుడు వాటిని నేరుగా …
Read More »జగన్కు ‘సంతకం’ సమస్య.. ఓటు బ్యాంకు ఎఫెక్ట్!
తిరుమల పర్యటన విషయంలో మాజీ సీఎం జగన్కు పెద్ద సమస్యే వచ్చింది. డిక్లరేషన్పై సంతకం చేసిన తర్వాత శ్రీవారిని దర్శించుకోవాలన్న నిబంధనను అమలు చేయడం ఆయనకు ప్రాణసంకటంగా మారిపోయింది. “నేను అన్యమతస్థుడిని అయినా.. తిరుమల శ్రీవారిపై విశ్వాసం ఉంది” అని డిక్లరేషన్ పై జగన్ సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ సంతకమే ఇప్పుడు జగన్కు ఇబ్బందిగా మారింది. దాని నుంచి తప్పించుకునేందుకు ఏకంగా తిరుమల పర్యటననే జగన్ రద్దు చేసుకున్నారు. …
Read More »విశాఖ ఉక్కుకు అభయం.. బాబు ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్!
విశాఖపట్నంలో కొన్ని దశాబ్దాల కిందట ఏర్పడిన ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రక్రియ దాదాపు నిలిచిపోయినట్టు తెలుస్తోంది. వైసీపీ హయాంలో మొగ్గ తొడిగిన ఈ ప్రతిపాదనను అడ్డుకునేందుకు అప్పటి సీఎం జగన్ ఏదో మొక్కుబడిగా వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. దీంతో విశాఖ ఉక్కు వ్యవహారం రాజకీయ దుమారం దిశగా అడుగులు వేసింది. మరోవైపు 1350 రోజులుగా ఇక్కడి కార్మికులు ధర్నాలు, నిరసనలు చేస్తూ.. ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయొద్దని డిమాండ్ …
Read More »జగన్ సేఫ్.. కార్యకర్తలే బలి!
రాజకీయాల్లో నాయకులు ముందుంటారు. కార్యకర్తలను వారే నడిపిస్తారు. ఇది ఎక్కడైనా జరిగేదే. అయితే .. వైసీపీలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. నాయకుడిగా జగన్ సేఫ్ జోన్ చూసుకుంటున్నా రు. కార్యకర్తలు మాత్రం బలయ్యే పరిస్థితి ఏర్పడింది. గతంలోనూ.. ఇప్పుడు కూడా.. కార్యకర్తలు, చోటా నాయకులు కేసుల్లో చిక్కుకుంటున్నారు. పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. జైళ్లకు వెళ్తున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులోనూ ఇప్పటికీ 30 మంది వైసీపీ …
Read More »‘జగన్’ కోసం బీజేపీ వెయిటింగ్.. వెరీ ఇంట్రస్టింగ్!!
వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ కోసం.. బీజేపీ నేతలు ఎదురు చూస్తున్నారు. అయితే.. ఇదేదో పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదు.. వ్యక్తిగత విషయాలు అంతకన్నా కావు. కేవలం తిరుమల తిరుపతి వ్యవహారం కోసమే కావడం గమనార్హం. వైసీపీ అధినేత జగన్ శుక్రవారం రాత్రికి తిరుపతి చేరుకుని ఆ వెంటనే ఆయన ప్రత్యేక కాన్వాయ్లో తిరుమలకు వెళ్తారు. అక్కడే శుక్రవారం రాత్రి బసచేసి శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. …
Read More »జగన్ తిరుమల పర్యటన స్టార్ట్.. అంతా ఉత్కంఠే..!
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు వెళ్తున్నారు. రేపు(శనివారం) ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఇదంతా తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం అయిందన్న ప్రభుత్వ ప్రచారం, కొన్ని రిపోర్టులు, అధికారుల వ్యాఖ్యల నేపథ్యంలో జరుగుతున్న పర్యటన కావడం గమనార్హం. పైగా ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి తొలిసారి తిరుమలకు వెళ్లడం ఉత్కంఠగా మారింది. తిరుమల అపవిత్రం అయిందన్న వార్తల నేపథ్యంలో హిందూ సంఘాలు, బిజెపి నేతల నుంచి తీవ్రస్థాయిలో …
Read More »ప్రభుత్వ మద్యం షాపులు రద్దుకు ఆర్డినెన్స్
వైసీపీ హయాంలో మద్యపాన నిషేధం అంటూ నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు విక్రయించారని టీడీపీ, జనసేన, బీజేపీ నేతల నుంచి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అదీగాక, వైసీపీ నేతలకు చెందిన మద్యం కంపెనీల నుంచి నాసిరకం మద్యాన్ని…ప్రభుత్వ మద్యం దుకాణాలకు సరఫరా చేశారని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపించారు. అంతేకాదు, మద్యం అమ్మకాలకు చెందిన లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని, మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులను అనుమతించలేదని ఆరోపణలు వచ్చాయి. …
Read More »చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న జగన్?
వైసీపీ హయాంలో తిరుమల లడ్డు నాణ్యత దెబ్బ తినడం, నెయ్యి కల్తీ వ్యవహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేసినపుడు ఈ విషయం ఇంత చర్చనీయాంశం అవుతుందని ఆయన కూడా ఊహించి ఉండకపోవచ్చు. కానీ అది జాతీయ స్థాయిలో పెద్ద చర్చకే దారి తీసింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఎంతో భక్తితో కొలిచే వేంకటేశ్వరస్వామికి సంబంధించిన ప్రసాదం విషయంలో తప్పు జరిగిందనేసరికి భాష, ప్రాంత భేదం లేకుండా హిందూ …
Read More »సాయిరెడ్డికి అచ్చెన్న కౌంటర్
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రి అచ్చెన్నాయుడుల మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. సాయిరెడ్డి టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నించారని అచ్చెన్న సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే అచ్చెన్నపై సాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ అనే కుల పార్టీలో చేరేందుకు ప్రయత్నించానా? అచ్చెన్నా అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడుకు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1% దేవుడు ఇచ్చాడంటూ వివాదాస్పద కామెంట్లు చేశారు. మోకాలికి, బోడి గుండుకు …
Read More »బాలినేనిని పవన్ కాపాడలేరు: దామచర్ల
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరబోతున్న నేపథ్యంలో ఒంగోలులో ఫ్లెక్సీ వార్ జరిగిన సంగతి తెలిసిందే. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తో పాటు బాలినేని ఫ్లెక్సీలు కలిపి వేయడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఫ్లెక్సీలు చింపి వేశాయి. ఈ క్రమంలోనే ఆ వ్యవహారం సద్దుమణగక ముందే తాజాగా బాలినేనికి మరో షాక్ తగిలింది. జనసేనలో చేరినా బాలినేనిని వదిలిపెట్టమబోమంటూ దామచర్ల …
Read More »ఆర్పీ నోటికి తాళాలు వేయాలి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముంగిట, తర్వాత కూటమి తరఫున బలంగా వాయిస్ వినిపించడం ద్వారా పాపులర్ అయిన వ్యక్తులు కిర్రాక్ ఆర్పీ ఒకడు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చి.. ఆ తర్వాత నెల్లూరు చేపల పులుసు పేరుతో కర్రీ పాయింట్లు తెరిచి పాపులర్ అయ్యాడు ఆర్పీ. ఎన్నికల ముంగిట అతను తెలుగుదేశం పార్టీలో చేరి.. ఆ పార్టీతో పాటు జనసేనకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నాడు. మాజీ మంత్రి రోజాతో …
Read More »‘దీక్షా’ దక్షుడు.. పవన్కు పెరిగిన గ్రాఫెంత..?
ప్రాయశ్చిత్త దీక్షతో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారాన్ని దశ దిశలకూ తీసుకువెళ్లే ప్రయ త్నం చేశారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్. తిరుమల శ్రీవారి ప్రసాదంలో అత్యంత దారుణమైన కల్తీ జరిగిందన్న ప్రభుత్వ ఆరోపణల నేపథ్యంలో దీనిపై కార్యాచరణను యుద్ధప్రాతిపదికన రూపొందించుకు న్న పవన్ ఆవెంటనే దీక్షకు దిగారు. అయితే.. ఈ దీక్షపై రెండు రూపాల్లో స్పందన వచ్చింది. కొందరు దీనికి అనుకూలంగా మాట్లాడారు. ఇదేసమయంలో మరికొందరు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates