మెడిక‌ల్ స‌ర్వీసులో ఏఐ ప‌రిమ‌ళాలు.. బాబు దూర‌దృష్టి

ఏపీ సీఎం చంద్ర‌బాబు సాంకేతిక‌త‌కు పెద్ద‌పీట వేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే రైతుల‌కు సంబంధించిన అనేక విష‌యాల్లో డ్రోన్ల‌ను వినియోగిస్తున్నారు. అదేవిధంగా ఐటీ రంగంలో ఏఐని ప్రోత్స‌హించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఏఐ యూని వర్సిటీని కూడా విశాఖ‌ప‌ట్నంలో ఏర్పాటు చేయ‌నున్నారు. ఇలా.. ప్ర‌తి రంగంలోనూ సాంకేతిక ప‌రిమ‌ణాలు వెద‌జ‌ల్లేలా చేస్తు న్నారు. తాజాగా రాష్ట్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని వైద్య సేవ‌ల్లోనూ ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)ను ప్ర‌వేశ పెట్టాల‌ని నిర్ణ‌యించా రు. దీనికి ఎంత వ్య‌య‌మైనా ఫ‌ర్వాలేద‌న్నారు.

ఏం చేస్తారు?

సీఎం చంద్ర‌బాబు సూచ‌న‌ల ప్ర‌కారం.. వైద్య రంగంలో ఏఐ ద్వారా.. గ్రామీణ‌, గిరిజ‌న ప్రాంతాల్లో ప్ర‌జ‌ల ఆరోగ్యానికి సంబంధించిన ప‌రీక్ష‌ల‌ను ఏఐ ద్వారా నిశితంగా ప‌రిశీలిస్తారు. త‌ద్వారా.. బ‌య‌ట ప‌డ‌ని రోగాల‌ను వెంట‌నే గుర్తించ‌నున్నారు. ముఖ్యంగా కిడ్నీ, బోద‌కాలు, క్ష‌య‌, పెరాలిసిస్‌(ప‌క్ష‌వాతం) వంటివాటిని ముందుగానే గుర్తిస్తారు. ప్ర‌స్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోగాలు ఎక్కువ గా ఉన్నాయి. దీంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. అంతేకాదు.. దీనివ‌ల్ల ప్ర‌భుత్వంపైనా భారం ప‌డుతోంది. ఈ క్ర‌మంలో ఏఐ టెక్నాల‌జీని వినియోగించి.. ముందుగానే ఆయా రోగాల‌ను గుర్తించి.. వాటిని అరిక‌ట్టే ప్ర‌య‌త్నం చేయ‌నున్నారు.

108, 104 కు జ‌వ‌స‌త్వాలు!

బాధితుల‌కు ఫోన్ కాల్ దూరంలో ఉండే 108, 104 సేవ‌ల‌ను మ‌రింత విస్త‌రించే దిశ‌గా చంద్ర‌బాబు అడుగులు వేశారు. 108 వాహ‌నాల‌ను మ‌రో 190 కొనుగోలు చేయాల‌ని నిర్ణ‌యించారు. దీనికిగాను సుమారు 60 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంద ని తెలిపారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కీల‌క‌మైన 104 సేవ‌ల‌ను మ‌రింత బ‌లోపేతం చేయ‌డంతోపాటు.. వాహ‌న డ్రైవ‌ర్లు, ఏఎన్ ఎంల‌కు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించ‌నున్నారు. మొత్తంగా రాష్ట్రంలో వైద్య రంగాన్ని వ‌చ్చే రెండేళ్ల‌లోనే కొత్త పుంత‌లు తొక్కించే దిశ‌గా చంద్ర‌బాబు తాజాగా నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా ఎన్టీఆర్ బీమా పథకం సేవలను ఒకే కాల్ సెంటర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.