Political News

జగన్ కు కొండపి టెన్షన్

ప్రకాశం జిల్లా కొండపి వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. వర్గపోరు భగ్గుమంటోంది. వైసీపీ నేతల ఆధిపత్య పోరు పార్టీని బజారున పడేస్తోంది. ప్రస్తుత ఇన్‌చార్జ్‌, మాజీ ఇన్‌చార్జ్‌ల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో దుమారం రేపుతోంది. ఇళ్లపై దాడి చేసుకునే స్థాయికి విభేదాలు పెరిగాయి. ఇప్పటిదాకా ప్రత్యర్థి టీడీపీపై వైసీపీ నేతలు దుమ్మెత్తిపోశారు. ఇప్పుడు అంతర్గతంగా కొట్లాడుకుంటున్నారు. ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గమైన కొండపి వైసీపీ ఇన్‌చార్జ్‌గా ప్రస్తుతం వరికూటి అశోక్‌బాబు పని చేస్తున్నారు. …

Read More »

కరుణాకర్ రెడ్డి కొడుకుపై లోకేష్ ఫైర్

nara lokesh

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, యువగళం జైత్రయాత్ర అప్రతిహతంగా సాగుతోంది. పుణ్యక్షేత్రం తిరుపతి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న లోకేష్ ను చూసేందుకు జనం భారీగా తరలి వస్తున్నారు. అన్ని వర్గాల వారితో లోకేష్ సమావేశమవుతూ.. వారి బాగోగులు తెలుసుకుంటున్నారు.టీడీపీ అధికారానికి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ తప్పిదాలను అవినీతిని ఎండగడుతున్నారు. సైకో పాలన పోవాలి సైకిల్ పాలన రావాలని నినదిస్తూ ముందుకు …

Read More »

‘ఆంధ్రా మీడియా’ ఇప్పుడు పర్వాలేదా కేసీఆర్

పరిధితో సంబంధం లేకుండా పరిమితుల్ని పెట్టుకోవటం కొన్నిసార్లు చూస్తుంటాం. అదే సమయంలో పరిమితుల్ని తమ సౌలభ్యాలకు అనుగుణంగా మార్చుకునే తీరు కొందరిలో కనిపిస్తూ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ గుణం కాస్త ఎక్కువ. తన రాజకీయ అవసరాల కోసం ఏ మాటనైనా మాట్లాడేస్తుంటారు. అప్పటివరకు ఆంధ్రోళ్లు రాక్షసులు.. పిశాచులు అనేసి.. అంతలోనే వారి కాళ్లలో ముళ్లు గుచ్చుకుంటే నా పంటితో తీస్తాననే చతురత ఆయనకు మాత్రమే …

Read More »

తెలంగాణ‌పై టీడీపీ అధిరిపోయే ప్లాన్‌!

తెలంగాణ‌లో టీడీపీ పుంజుకునేలా ఆ పార్టీపెద్ద‌లు అధిరిపోయే ప్లాన్ వేశారు. పార్టీని ఇంటింటికీ తీసుకువెళ్లి.. ప‌రిచ‌యం చేసేందుకు.. పార్టీని పుంజుకునేలా చేసేందుకు.. ఈ ఏడాది జ‌రిగే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పూర్వవైభవం దిశగా అడుగులు పడుతుంద‌ని నాయ‌కులు చెబుతున్నారు. ముఖ్యంగా యువత, మహిళలు, విద్యావంతులను పార్టీవైపు తిప్పేలా ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో ఆదివారం నుంచి ‘ఇంటింటికి …

Read More »

మంత్రి వర్సెస్ ఎంపీ, మధ్యలో కాబోయే ఎమ్మెల్సీ

ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రస్తుతం పల్నాడు జిల్లాలో కీలక నియోజకవర్గం చిలకలూరిపేట ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. ఎన్నికలకు ముందు మంత్రిగా టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు ఒక వెలుగు వెలగి.. పేటను జనంలో వార్తగా కొనసాగించారు. ఎన్నికల్లో విడదల రజనీ వైసీపీ నుంచి గెలిచి సంచలనం సృష్టించారు. ముందు ఆమెకు ఎలాంటి పదవి రాకపోయినా పునర్ వ్యవస్థీకరణలో రజనీ మంత్రి పదవి పొందారు. పదవి వచ్చిన సంతోషంలో ఉబ్బితబ్బిబవుతున్న రజనీకి …

Read More »

ఆ ఒక్క దాని పై నే జ‌గ‌న్‌కు 3 కోట్ల ఇన్‌కం..

ఏపీ సీఎం జ‌గ‌న్ కు ఇసుక పైనే రోజుకు రూ. 3 కోట్ల ఆదాయం ల‌భిస్తోంద‌ని టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఇసుక విధానాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించి.. త‌న ఖ‌జానా నింపుకునేందుకు జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన రోజు నుంచి ఎత్తుగ‌డ‌లు వేశార‌ని చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో ఉన్న నారాలోకేష్‌.. తాజాగా తిరుప‌తిలో పాద‌యాత్ర చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తిరుపతిలో భవన నిర్మాణ …

Read More »

వైసీపీ స్పీడును తట్టుకోలేకపోతున్న టీడీపీ

ఏపీలో 2022వ సంవ‌త్స‌రం మొద‌ట్లో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అధికార పార్టీ వైసీపీ అనేక చోట్ల ఏక గ్రీవాలు సాధించింది. అయితే.. దీనిపై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఉద్దేశ పూర్వ‌కంగా ఇత‌ర పార్టీల‌ను తొక్కిపెట్టి.. అభ్య‌ర్థుల‌ను బెదిరించి..నామినేష‌న్లు కూడా వేయ‌నీయ‌కుండానే.. వైసీపీ ఇలా చేసింద‌నే వాద‌న వినిపించింది. దీనిపై టీడీపీ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు కూడా అప్ప‌ట్లో గుప్పించారు. ఇక‌, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ.. ఇవే ‘ఏక‌గ్రీవాల‌’ దిశ‌గా …

Read More »

‘ఈనాడు’ దొరికింది కదా అని..

రెండు రోజుల నుంచి సాక్షి మీడియా సంబరం మామూలుగా లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మాంచి జోష్‌లో ఉన్నారు. ‘ఈనాడు’ పత్రిక చేసిన ఒక తప్పిదం వారికి మంచి అవకాశంగా మారింది. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడిని పరిశీలించేందుకు వచ్చిన ఆ పార్టీ నేత పట్టాభిని పోలీసులు అరెస్టు చేయగా.. విచారణలో భాగంగా తన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లుగా ఆయన ఆరోపించిన …

Read More »

జగన్ కాపాడినా కష్టమే.. వదిలేసినా కష్టమే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు పెద్ద తలనొప్పినే ఎదుర్కొంటున్నారు. ఆయన సోదరుడైన వైఎస్ అవినాష్ రెడ్డి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడైన వివేకానంద రెడ్డి హత్య కేసులో పీకల్లోతు చిక్కుకుపోయినట్లే కనిపిస్తున్నారు. వివేకా హత్యకు ప్రణాళిక రచించింది అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలే అని సీబీఐ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొంది. అవినాష్, భాస్కర్‌లే వివేకా హత్య కేసులో ప్రధాన నిందితులు అనే కోణంలోనే …

Read More »

చంద్ర‌బాబులో టెన్ష‌న్ పెంచేయ‌డ‌మే జ‌గ‌న్ ల‌క్ష్య‌మా…?

వ‌రుస‌గా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. టీడీపీ అధినేత చంద్ర‌బాబును బిజీ బిజీ చేయ‌డ‌మే వైసీ పీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ల‌క్ష్యంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌టి వ‌దిలితే ఒక‌టి.. చంద్రబాబుకు పెద్ద ఇబ్బందిగా మారుతున్నాయి. నిజానికి చంద్ర‌బాబు షెడ్యూల్ ప్ర‌కారం.. ఈ నెల 23 నుంచి అంటే.. గురువారం నుంచి కూడా ఉత్త‌రాంధ్ర‌లో ప‌ర్య‌టించాల్సి ఉంది. ఇదేం ఖ‌ర్మ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొనాల్సి ఉంది. అయితే.. అనూహ్యంగా తార‌క‌రత్న …

Read More »

రాజ‌కీయాల‌కు సోనియా గుడ్ బై!

దేశ స్వాతంత్ర సంగ్రామంలో కీల‌క పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీని రెండు ద‌శాబ్దాల పాటు ముందుండి న‌డిపిన ఆ పార్టీ మాజీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. త్వ‌ర‌లోనే తాను రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్ర‌క‌టించారు. తన ఇన్నింగ్స్ భారత్ జోడో యాత్రతో ముగిసినందుకు సంతోషంగా ఉందన్న ఆమె. ఇది పార్టీకి టర్నింగ్ పాయింట్ అవుతుంద‌ని పేర్కొన్నారు. మూడు రోజుల పార్టీ ప్లీనరీలో 1500 మంది ప్రతినిధులను ఉద్దేశించి …

Read More »

మ‌రో రెండు నెల‌ల వ‌ర‌కు జ‌న‌సేన ఇంతే!

రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు.. మ‌రో రెండు నెల‌ల వ‌ర‌కు ఇలానే ఉంటాయా ? అప్ప‌టికి ఉన్న ప‌రిస్థి తుల‌ను గ‌మ‌నించి.. జ‌న‌సేన దూకుడు పెంచుతుందా? అంటే..ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం వారాహి బ‌స్సు ను రెడీ చేసిన‌ప్ప‌టికీ..జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ దానిని ఇంకా రోడ్డెక్కించ‌లేదు. ఆయ‌న ఎప్పుడు వ‌స్తారా ? ఎప్పుడు యాత్ర ప్రారంభిస్తారా ? అని పార్టీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే.. ఇప్ప‌టికిప్పుడు వ‌చ్చే ఉద్దేశం …

Read More »