దేశంలోని మిగతా రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఒక ఎత్తు..దేశ రాజధాని ఢిల్లీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు మరో ఎత్తు. 2014 నుంచి వరుసగా మూడు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమికి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో విజయం మాత్రం అందని ద్రాక్షలా ఊరిస్తూనే ఉంది. హ్యాట్రిక్ కొట్టిన ప్రధాని మోడీ హవా కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ క్రేజ్ ముందు పనిచేయలేదు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా మరోసారి …
Read More »భారత్ పోల్ తో అంతర్జాతీయ నేరస్తుల ఆటకట్టు
మన దేశంలో నేరం చేసిన కొందరు వ్యక్తులు ఎంచక్కా విదేశాలకు పారిపోయి తలదాచుకుంటున్నారు. అలా విదేశాలకు పారిపోయిన నేరగాళ్లలను ట్రాక్ చేసేందుకు, వారిని పట్టుకునేందుకు..ఆ క్రమంలో ఇంటర్ పోల్ తో కనెక్ట్ అయ్యేందుకు ప్రత్యేకంగా ఒక వ్యవస్థ లేదు. ఈ క్రమంలోనే ఇకపై ఆ సమస్యకు చెక్ పెట్టేలాగా ఇంటర్ పోల్ తో వేగంగా కనెక్ట్ అయ్యేందుకు ‘భారత్ పోల్’ పోర్టల్ ను కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా …
Read More »ఎలాన్ మస్క్ పై బ్రిటన్ ప్రధాని ఫైర్!
ఒకప్పుడు రవి ఆస్తమించని బ్రిటన్ సామ్రాజ్యంగా పేరున్న ఇప్పటి గ్రేట్ బ్రిటన్.. తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రపంచ రాజకీయాల్లో ఇప్పటివరకు చూడని సిత్రమైన చిన్నెల్ని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చూపిస్తున్నారు. తజాగా బ్రిటన్ ప్రభుత్వంపై తన సోషల్ మీడియాలో మస్క్ సంధించిన ఒక ప్రశ్న.. బ్రిటన్ ప్రధానమంత్రికి ఒళ్లు మండేలా చేస్తోంది. అంతేకాదు.. బ్రిటన్ ప్రజాస్వామ్యాన్నిబలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మస్క్ మీద నిప్పులు చెరిగారు. బ్రిటన్ …
Read More »కేటీఆర్ కు షాక్… క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ కేసు కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కు హైకోర్టు షాకిచ్చింది. ఆ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దాంతోపాటు కేటీఆర్ అరెస్ట్పై ఇప్పటివరకు ఉన్న స్టే కూడా హైకోర్టు …
Read More »కెనడా పీఎం పదవికి భారతీయుల పేర్లు?
కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయడంతో అక్కడ రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. లిబరల్ పార్టీకి చెందిన 153 మంది ఎంపీల్లో 131 మంది ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయడం, పార్టీలో అంతర్గత విభేదాలు రగలడంతో ట్రూడో రాజీనామా చేయడం అనివార్యమైంది. ఆయన సోమవారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా, ఈ పరిణామం కెనడాలో కొత్త నాయకత్వంపై చర్చకు దారితీసింది. ట్రూడో రాజీనామా తర్వాత, …
Read More »7,500 కోట్ల ఖర్చు.. కంటికి కనిపించని శత్రువుతో ముప్పు!
ఏకంగా 7500 కోట్ల రూపాయలను మంచి నీళ్ల ప్రాయంలా ఖర్చు చేశారు. మరో వారం రోజుల్లో మహా క్రతువ ను ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేశారు. రేయింబవళ్లు వేలాదిగా కార్మికులు, వందల సంఖ్యలో అధికారులు కంటిపై కునుకు లేకుండా కష్టపడుతున్నారు. ఇదంతా సదరు క్రతువును నిర్విఘ్నంగా పూర్తి చేయడం కోసమే. కానీ, ఇప్పుడు ఈ 7500 కోట్ల ఖర్చును మింగేసేలా కంటికి కనిపించని శత్రువు ముప్పుగా మారింది. దీంతో అటు …
Read More »‘కుప్పం’ రుణం తీర్చుకుంటున్న చంద్రబాబు!
రాష్ట్రానికి సంబంధించి విజన్-2047 ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.. తాజాగా తన సొంత నియోజక వర్గం.. 35 ఏళ్ల నుంచి వరుస విజయాలు అందిస్తున్న కుప్పం నియోజకవర్గం రుణం తీర్చుకునేందుకు కూడా రెడీ అయ్యారు. దీనిలో భాగంగా ఆయన సుదీర్ఘకాలం తన పేరు చిరస్థాయిగా ఉండేలా.. స్వర్ణ కుప్పం విజన్ -2029.. ఫ్యూచర్ ప్లాన్ను విడుదల చేశారు. సోమవారం తన నియోజకవర్గంలో పర్యటించిన సీఎం చంద్రబాబు.. ఈ డాక్యుమెంటరనీ విడుదల చేయడం …
Read More »చంద్రబాబు సూపర్ విజన్.. జగన్ ది డెట్ విజన్!: నారా లోకేష్
ఏపీలో కూటమి ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అయితే..ఈ పాపం అంతా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్దేనని చెప్పారు. “చంద్రబాబుగారు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో వేసిన అడుగులు పెట్టుబడులు తెచ్చాయి. ఉపాధి కల్పించాయి. ఉద్యోగాలు సృష్టించాయి. ఇది జగమెరిగిన సత్యం. హైదరాబాద్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. కానీ, జగన్ పాలన తర్వాత.. అప్పులకు వడ్డీలు.. వాటికి అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది …
Read More »ఈ మాటలు జగన్కు చెప్పి ఉంటే బాగుండేది రామిరెడ్డీ!
“తెల్లారే సరికి పింఛన్లు పంచకపోతే ప్రపంచం తలకిందులు అవుతుందా? ఇది ఉద్యోగులను క్షోభ పెట్టినట్టు కాదా? మహిళా ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. వారిని కనీసం పట్టించుకోకుండా.. ఉదయం 5 గంటలకే ఇళ్లకు తోలుతున్నారు. ఇదేం పద్ధతి“- ఇదీ.. వైసీపీ సానుభూతి పరుడుగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి… (రామిరెడ్డి) చేసిన వ్యాఖ్యలు. అయితే.. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఉద్యోగులు ఉన్నది ప్రజలకు …
Read More »రేవంత్ కోరికల చిట్టా.. ప్రధాని చిరునవ్వులు.. ఏం జరిగింది?
ఏ రాష్ట్రమైనా కేంద్రం ముందు ఒకప్పుడు తల ఎగరేసిన పరిస్థితి ఉండేది. పట్టుబట్టి సాధించుకునే ప్రాజెక్టులు కూడా కనిపించేవి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎవరూ కేంద్రం ముందు గట్టిగా మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. రాష్ట్ర శ్రేయస్సు కోసం ఒక మెట్టు తగ్గాల్సిందే. రాజకీయంగా ఫైర్ అయినా.. కేంద్రం వద్దకు వచ్చేసరికి ఫ్లవర్లుగా మారుతున్న పరిస్థితి దాదాపు అన్ని రాష్ట్రాల దగ్గర కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా …
Read More »పేపర్ మిల్లు మూత… ఏం జరిగింది?
ఏపీలో కూటమి సర్కారుకు పెద్ద చిక్కే వచ్చింది. ఒకవైపు ఉపాధి, ఉద్యోగాల కల్పనతో ముందుకు సాగు తున్న సర్కారుకు.. ఇప్పుడు `లాకౌట్` రూపంలో పెను సవాల్ ఎదురైంది. రాజమండ్రిలోని `అంతర్జాతీయ ఏపీ పేపర్ మిల్స్`కు యాజమాన్యం తాళం వేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటనలు చేయకుండానే లాకౌట్ చేయడంతో ప్రత్యక్షంగా 52 వేల మంది , పరోక్షంగా 4 లక్షల మందిపై ప్రభావం చూపుతోంది. దీనిపై యాజమాన్యం మౌనంగా ఉంది. మరోవైపు …
Read More »లాయర్ లేకుంటే విచారణకు నో అన్న కేటీఆర్
ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. అయితే, తన లాయర్ ను పోలీసులు, ఏసీబీ అధికారులు అనుమతించకపోవడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దాదాపు 40 నిమిషాల పాటు పోలీసులు, అధికారులకు..కేటీఆర్, ఆయన లాయర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. లాయర్ ను …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates