Political News

జనసేనను వదిలే ప్రసక్తే లేదంటున్న బాలినేని

మాజీ మంత్రి, జ‌న‌సేన నాయ‌కుడు బాలినేని శ్రీనివాస‌రెడ్డి తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జ‌న‌సేన పార్టీలో తాను ఎలాంటి ప‌ద‌వులూ ఆశించ‌డం లేద‌న్నారు. తాను ఎన్నిక‌ల త‌ర్వాత‌.. పార్టీలో చేరాన‌ని.. ఇంత స్వ‌ల్ప స‌మ‌యానికే ప‌ద‌వులు ఆశించే ప‌రిస్థితి లేద‌న్నారు. తాను పార్టీలో కొన‌సాగాల‌ని అనుకుంటున్నట్టు చెప్పారు. స‌భ్య‌త్వం వ‌ర‌కు తాను సంతృప్తి చెందుతాన‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌పైనా బాలినేని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మావిగ‌న్ అనే ప్ర‌తిపాద‌న‌ను …

Read More »

జ‌గ‌న్‌ను వారెందుకు క‌లిశారు: లోకేష్ ఆరా

మ‌నం ఎంతో పార‌దర్శ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాం. ఎవ‌రికీ ఎలాంటిఇబ్బంది లేకుండా చేస్తున్నాం. అయినా.. జ‌గ‌న్‌ను కొంద‌రు క‌లుస్తున్నారు. ఇలా ఎందుకు జ‌రుగుతోంది..? ఎవ‌రు త‌ప్పు చేశారు? ఎక్క‌డ జ‌రిగింది? అంటూ.. మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది. అంతేకాదు.. అస‌లు త‌ప్పు ఎక్క‌డ జ‌రిగిందో తెలుసుకుని చెప్పాల‌ని కూడా ఆయన ఆదేశించారు. దీంతో అస‌లు విష‌యంపై పెద్ద ఎత్తున ప్ర‌భుత్వంలో చ‌ర్చ‌కు దారితీసింది. ఏం …

Read More »

జగన్ రైటు… జనమే రాంగా?

ఏపీ రాజ‌ధాని విష‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌క్కా క్లారిటీతోనే ఉన్నారా? అంటే.. ఔన‌నే ఆయ‌న చెబుతున్నారు. ప్ర‌జ‌లు మెచ్చుతారా.. గిచ్చుతారా.. అనే వాద‌న‌తో సంబంధం లేకుండా.. మ‌రోసారి ఆయ‌న నోటి వెంట మావిగ‌న్‌(మ‌చిలీప‌ట్నం-విజ‌య‌వాడ‌-గుంటూరుతో కూడిన రాజ‌ధాని) మాటే వినిపించింది. రాజ‌ధాని అమ‌రావ‌తికి .. ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ను వృధా చేస్తున్నార‌ని.. అస‌లు ఎప్ప‌టికీ రాజ‌ధాని అనేది లేకుండా చేస్తున్నార‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 14 ల‌క్ష‌ల …

Read More »

యుద్ధ‌మైనా.. విప‌త్త‌యినా.. మోడీది రాజ‌కీయ‌మే

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. యుద్ధ‌మైనా.. విప‌త్త‌యినా.. ప్ర‌జ‌లకు ఏం జ‌రిగినా.. ప్ర‌ధాని మోడీకి రాజ‌కీయాలే ముఖ్య‌మ‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం నెల‌కొన్న యుద్ధ స‌మ‌యాన్ని.. త‌ద్వారా వ‌చ్చిన ఇంధన విప‌త్తును ఎవ‌రూ కాద‌న‌లేర‌న్నారు. కానీ.. దీని వెనుక చేసిన రాజ‌కీయ‌మే ఇప్పుడుచ‌ర్చ‌కు కీల‌క‌మ‌ని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు ముందే.. ప‌శ్చిమాసియాలో యుద్ధం మొద‌లైంద‌న్నారు. ఆ స‌మ‌యంలోనే చ‌మురు ఉత్ప‌త్తులు.. …

Read More »

ప్రొఫెసర్ తప్పు ఒప్పుకున్నారుగా!

ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ తాను తప్పు చేసినట్టుగా ఒప్పేసుకున్నారు. జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆ పార్టీ పీఏసీ చైర్మన్, ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ లు కేంద్ర హోం శాఖ మంత్రిని కలిసినట్లుగా ఇటీవలే నాగేశ్వర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ ను అరెస్టు చేయాలని పవన్ కోరితే… అందుకు …

Read More »

జగన్ మంచోడు కాబట్టే వాళ్లు బ్రతికున్నారు

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై కొంతకాలంగా కూటమి పార్టీల నేతలు ట్రోలింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. వైసీపీని గొడ్డలి పార్టీ అంటూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తదితరులు కామెంట్ చేస్తున్నారు. ఇక, సోషల్ మీడియాలో అయితే వైసీపీ నేతలను యాక్స్ గ్యాంగ్ అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ ఆ కామెంట్లపై స్పందించారు. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ అంటూ జగన్ …

Read More »

తండ్రి మరణంపై మరోసారి జగన్ కు అనుమానాలు!

ఏపీ రాజకీయాల్లో మళ్లీ వేడి రాజుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై మరోసారి అనుమానాలు వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల అనంతరం రెండు, మూడు రోజులకే వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని జగన్ ఆరోపించారు. “అసెంబ్లీకి ఎలా వస్తావో …

Read More »

‘బాబు గుండె ఆగి చనిపోతాడు’, జగన్ హద్దు మీరుతున్నారా?

వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాగంగా పలు కీలక అంశాలను ప్రస్తావించిన జగన్… చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మావిగన్ పేరు వింటే చంద్రబాబు గుండె ఆగి చనిపోతాడు అంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు …

Read More »

‘గొడ్డలి పార్టీ’ వ్యాఖ్యలకు జగన్ ఇంతలా ట్రిగ్గర్ అయ్యారా?

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం తాడేపల్లిలోని తన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జగన్ తన పాత పాటను పాడినట్టే అన్నీ పాత విషయాలే చెప్పుకొచ్చారు. అయితే కొత్తగా కొన్ని అంశాలను ఆయన ప్రస్తావించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. గొడ్డలి పార్టీ ఎవరిది? అని ప్రశ్నించిన జగన్… గన్ కల్చర్ ఎవరిది? అని …

Read More »

అమ‌రావ‌తికి సొమ్ములిస్తే నేర‌మా… జ‌గ‌న్‌?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని వ్య‌తిరేకిస్తున్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న చేశారు. అది విఫ‌ల‌మైంది. ఇక‌, ఇటీవ‌ల రాజ‌ధానికి చ‌ట్ట బ‌ద్ధ‌త క‌ల్పించే బిల్లును పాస్ చేసిన‌ప్పుడు.. మావిగ‌న్‌ పేరుతో చేసిన ప్ర‌తిపాద‌న కూడా బెడిసి కొట్టి న‌వ్వుల పాలైంది. మొత్తంగా.. జ‌గ‌న్ ఏమ‌నుకున్నా.. ప్ర‌జ‌లు మాత్రం అమ‌రావ‌తిని కోరుకుంటున్నారు. కానీ, ఈ విష‌యాన్ని జ‌గ‌న్ గ్ర‌హించ‌లేక పోతున్నారో.. లేక ,ఆయ‌న ఎవ‌రో చెప్పిన మాట‌ల‌నే ఇంకా …

Read More »

`బ‌ట‌న్‌`కు-బాబుకు తేడా ఇదే… !

వైసీపీ హ‌యాంలో ప‌థ‌కాల‌ను అమ‌లు చేశారు. జ‌గ‌న్ చెప్పిన లెక్క ప్ర‌కారం.. 2.5 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లను ప్ర‌జ‌ల‌కు పంచారు. త‌ద్వారా.. డ‌బ్బులైతే.. ప్ర‌జ‌ల‌కు చేరాయి కానీ.. జ‌గ‌న్ వారి హృద‌యాల్లోకి చేర‌లేక పోయార‌న్న వాద‌న ఉంది. దీనికి కార‌ణం.. బ‌ట‌న్‌!. కార్య‌క్ర‌మం ఎలాంటిదైనా.. కేవ‌లం తాడేప‌ల్లికే ప‌రిమితం కావ‌డం.. ల‌బ్ధిదారుల‌నే త‌న వ‌ద్ద‌కు పిలిపించుకోవ‌డం.. జ‌గ‌న్ చేసిన కామ‌న్ కార్య‌క్ర‌మం. దీంతో జ‌గ‌న్ బ‌ట‌న్ ముఖ్య‌మంత్రిగా మిగిలిపోయారు. ఆయ‌న …

Read More »

విజ‌య‌న‌గ‌రం టీడీపీలో షాడోల క‌ల‌క‌లం.. !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయనగరం కోటకు ఒక ప్రత్యేకమైన చరిత్ర, హుందాతనం ఉన్నాయి. పూసపాటి రాజుల రాజకీయ వారసత్వం ఎప్పుడూ ఒక పద్ధతి ప్రకారం సాగుతుందనే పేరుంది. కానీ, ప్రస్తుతం విజయనగరం నియోజకవర్గంలో నడుస్తున్న రాజకీయాలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. అక్కడ వినిపిస్తున్న షాడో పాలిటిక్స్ వ్యవహారం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పైకి కనిపిస్తున్న అధికార ముద్ర ఒకరిదైతే… తెర వెనుక అసలు చక్రం …

Read More »