ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో రెండేళ్ల సమయం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత.. ఏడాది అంటే.. ఎన్నికలకు ముందు సంవత్సరం పూర్తిగా ఎన్నికల రాజకీయాలు ప్రారంభం అవుతాయి. ఈ నేపథ్యంలో సర్కారు వేసే అడుగులు.. తీసుకునే నిర్ణయాలకు.. వచ్చే రెండేళ్ల కాలం అత్యంత కీలకమని అంటున్నా రు పరిశీలకులు. రెండేళ్ల పాలనలో.. గడిచిన రెండేళ్ల …
Read More »“మరో వందేళ్లయినా… కాంగ్రెస్ ఇంతే”
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను విడుదలచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్పార్టీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోయి ఉంటే..నేడు ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బంగ్లాదేశ్లో కలిసిపోయి ఉండేదని ఆరోపించారు. దీనికి కారణం కాంగ్రెస్వేర్పాటు వాద సిద్ధాంతమేనని పేర్కొన్నారు. బుజ్జగింపు రాజకీయాలకు ఆలవాలమైన కాంగ్రెస్ పార్టీ ఈ …
Read More »‘గొడ్డలి పార్టీ అంతకు మించి ఏం చేసింది?’
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం.. వ్యవస్థలను నాశనం చేయడం తప్ప.. ఇంకేం చేసిందని ఆయన నిలదీశారు. రైతులను కూడా వదిలి పెట్టుకుండా వేధించారని విమర్శించారు. రైతుల భూములు కొట్టేసేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చారని తెలిపారు. దీనివల్ల రైతులు ఎంత క్షోభను అనుభవించారో ..తనకు అనేక మంది చెప్పారని అన్నారు. అందుకే ఎన్నికల సమయంలో …
Read More »నేను హోమ్ మినిస్టర్ కాకపోవడమే నేరస్తుల అదృష్టం: పవన్
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కులాన్ని ఓ దరిద్రంతో పోల్చిన పవన్… కుల భావన అనేది ఓ దరిద్రమని, దానిని వీడితే తప్పించి రాష్ట్రం అభివృద్ది బాటలో నడవదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలను పకడ్బందీగా అమలు చేయాలని తాను భావిస్తానని, అదికార యంత్రాంగానికీ …
Read More »హోర్ముజ్ మళ్లీ మూత… ప్రపంచం దిగ్భ్రాంతి!
ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ పరిధిలో ప్రపంచ వాణిజ్య నౌకారవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసి వేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. అదే క్షణంలో అమలు కూడా చేసింది. దీంతో ఉరుములు లేని పిడుగులాంటి ఈ వార్తతో ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. సుదీర్ఘ విరామం తర్వాత.. నాలుగు రోజుల కిందటే ఈ జలరవాణా మార్గాన్ని .. ఇరాన్ ఎలాంటి షరతులు లేకుండా తెరిచింది. అనంతరం.. అమెరికా-ఇరాన్ …
Read More »బెయిలుపై బయటకు రాగానే మొదలు
వైసీపీ నేతల వ్యవహార తీరు అంతకంతకూ వివాదాస్పదంగా మారుతోందని చెప్పాలి. పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీరు ఇప్పుడు నిజంగానే పైన చెప్పినట్టే ఉందని చెప్పక తప్పదు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో భూకబ్జాకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అరెస్టు అయిన బొల్లా… బెయిల్ తీసుకుని బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఏమాత్రం స్పందించని బొల్లా… ఇప్పుడు బెయిల్ పై బయటకు …
Read More »పీకే… సినిమాల వరకు ఓకే: కవిత
జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే హైదరాబాద్ లో జనసేన కార్యాలయాన్ని ప్రారంభించారు పవన్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆల్రెడీ తెలంగాణ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, జనసేన కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత కూడా మరోసారి పవన్ పై వారు తమ వ్యాఖ్యలకు …
Read More »బండి భగీరథ్ కు బెయిల్
పోక్సో కేసులో అరెస్టైన బండి భగరీథ్కు మల్కాజిగిరి కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. భగీరథ్ను పేట్ బషీరాబాద్ పోలీసులు మే 16న అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. నెల రోజులకు పైగా రిమాండ్ లో ఉన్న భగీరథ్ కు కోర్టు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేేయడంతో అతడికి ఊరట లభించినట్లయింది. వారం రోజుల పాటు భగీరథ్ కు బెయిల్ మంజూరైంది. …
Read More »వైసీపీ స్ట్రాటజీ: కాపులతో కలివిడా.. విడివిడా?
కాపుల విషయంలో ఏం చేయాలన్న అంశంపై వైసీపీ తర్జన భర్జన పడుతోందా? వారితో కలిసి ముందుకు సాగాలా? లేక.. వారిని వాడుకుని రాజకీయాలు చేయాలా? అనే విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేక పోతోందా? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ నాయకులు. అన్ని పార్టీల్లోనూ ఉన్నట్టుగానే.. వైసీపీలోనూ కొందరు తటస్థ నాయకులు ఉన్నారు. వారు.. జగన్ చెప్పారని గుడ్డిగా ఫాలో అయ్యే టైపు కాదు. ఇలాంటి వారు.. ఇప్పుడు ఈ …
Read More »అమెరికా-ఇరాన్… మిగిల్చిందేంటి?
ఈ ఏడాది ఫిబ్రవరి 28. ప్రపంచం కళ్లు తెరుస్తున్న సమయం. ఊహాతీతంగా.. అన్ని మీడియాల్లోనూ.. అ ప్పటికే.. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేశాయని, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ.. ఆయన కుటుంబం లక్ష్యంగా కీలక ప్రాంతాల్లో యుద్ధం చేశారని.. వారు మృతి చెందారని బ్రేకింగ్ న్యూస్ లు వచ్చాయి. ఇలా.. ప్రారంభమైన.. అమెరికా-ఇరాన్ యుద్ధం.. దాదాపు 42 రోజుల పాటు నిరాటంకంగా కొనసాగింది. ఎలా మొదలై.. ఎక్కడికి? వాస్తవానికి …
Read More »ఇక కొడాలి నాని వంతు
వైసీపీ సీనియర్ నాయకుడు, ఫైర్బ్రాండ్ కొడాలి నానిపై 2021లో నమోదైన కేసు విచారణకు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పోలీసులు నానీకి నోటీసులు జారీ చేసి విచారించనున్నారు. అయితే.. ఈ కేసు వైసీపీ హయాంలోనే నమోదు కావడం గమనార్హం. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండడంతో ఈ కేసు విచారణ ముందుకు సాగలేదు. తాజాగా నానీ విచారణకు అనుమతించాలని కృష్నాజిల్లా కలెక్టర్ కోరడంతో ప్రభుత్వం ఓకే చెప్పింది. ఏంటీ …
Read More »నిషేధం చిన్న చర్యే: టెలిగ్రామ్ యాప్కు కోర్టు షాక్!
తమపై తాత్కాలిక నిషేధం ఎత్తివేయాలని.. ఉద్దేశ పూర్వకంగానే కేంద్ర ప్రభుత్వం తమపై నిషేధం విధించిందని ఆరోపిస్తూ.. టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. శుక్రవారం కోర్టు కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే ఈ కేసు విచారణకు వచ్చింది. దీనిపై వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు.. ప్రస్తుత పరిస్థితిలో నిషేధం అనేది చిన్న చర్యేనని వ్యాఖ్యానించింది. నీట్ ప్రశ్న పత్రాలు లీకైతే.. ఎవరు బాద్యత వహిస్తారని ప్రశ్నించింది. తాత్కాలిక నిషేధం వెనుక.. ఎలాంటి ఉద్దేశ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates