Political News

ఉత్తర భారతం ఉక్కిరిబిక్కిరి.. రాహుల్ ఫైర్

ఉత్తర భారతం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. గాలి పీల్చడమే ఒక పెద్ద సాహసంగా మారింది. ఈ పరిస్థితులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరినా, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు. ఇది కేవలం పర్యావరణ సమస్య కాదు, దేశం ఎదుర్కొంటున్న ఒక ‘హెల్త్ ఎమర్జెన్సీ’ అని ఆయన హెచ్చరించారు. రాహుల్ సోషల్ మీడియాలో పోస్ట్ …

Read More »

తెలంగాణ పంచాయ‌తీ పోరు: నామినేష‌న్లు కాదు.. ఏక‌గ్రీవాలే!

తెలంగాణ‌లో జ‌రుగుతున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు సంబంధించి.. గురువారం నామినేష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. మొత్తంగా మూడు ద‌శ‌ల్లో జ‌ర‌గ‌నున్న ఈ ఎన్నిక‌ల‌లో తొలి విడ‌త పోలింగ్ జ‌ర‌గ‌నున్న పంచాయ‌తీల‌కు సంబంధించి నామినేష‌న్ల ప్ర‌క్రియ జ‌రుగుతోంది. అయితే.. అనుకున్న విధంగా నామినేష‌న్లు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి పంచాయ‌తీ ఎన్నిక‌ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపించింది. తీరా నామినేష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌య్యాక పెద్ద‌గా ఆ ఊసు క‌నిపించ‌డం …

Read More »

కేసీఆర్ పేరు లేకుండానే కవిత తెలంగాణ పోస్టు

తన తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ లతో మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కొద్ది రోజులుగా దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. సొంత పార్టీపై, కేసీఆర్ నాయకత్వంపై, కేటీఆర్ పై, హరీష్ రావుపై కవిత తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే, తాజాగా కేసీఆర్ పేరెత్తేందుకు కూడా కవిత ఇష్టపడని వైనం హాట్ టాపిక్ గా మారింది. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి …

Read More »

పిపిపి మోడల్ లో నిర్మించే మెడికల్ కాలేజీలకు పేర్లు పెట్టేది ఇలానే…

పిపిపి విధానంలో అభివృద్ధి చేయ‌బ‌డుతున్న క‌ళాశాల‌ల‌కు ‘ ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల మ‌రియు ఆసుప‌త్రి ‘ అని నామ‌క‌ర‌ణం చేయాల‌ని రాష్ట్ర కేబినెట్ నిర్ణ‌యించింది. ఈ పేరుతో పాటు క‌ళాశాల ఉండే ప్ర‌దేశం పేరును జోడించాలి. ఉదాహ‌ర‌ణ‌కు…ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల మ‌రియు ఆసుప‌త్రి, మార్కాపురం. దీని కింద పిపిపి భాగ‌స్వామి పేరును కూడా ప్ర‌స్తావించ‌వ‌చ్చు. ఈ రెండు పేర్ల‌ను 70:30 నిష్ప‌త్తిలో ప్ర‌ద‌ర్శించాలని నిర్ణయించింది. నిన్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు …

Read More »

కేసీఆర్ ఉన్నంతవరకే బీఆర్ఎస్, ఆ తరువాత…

మాజీ ఉప ముఖ్య‌మంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి సంచ‌నల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ ఉన్నంత వ‌ర‌కే బీఆర్ ఎస్ ఉంటుంద‌ని.. ఆ త‌ర్వాత ముక్క‌లు చెక్క‌లు అవుతుందని వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికే పార్టీలో అస్థిర‌త కనిపిస్తోంద‌ని చెప్పారు. బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ వ్య‌వ‌హార శైలి ఆ పార్టీలో నేత‌ల‌కు ఎవ‌రికీ న‌చ్చ‌డం లేద‌ని క‌డియం చెప్పారు. అందుకే సొంత చెల్లి కూడా బ‌య‌ట కు వ‌చ్చేసింద‌న్నారు. ప‌రిస్థితులు …

Read More »

‘చంద్రబాబుపై ఉన్న విశ్వాసంతో రైతులు భూములు ఇచ్చారు’

కూట‌మి ప్ర‌భుత్వం బాధ్య‌త‌గా ప‌నిచేస్తోంద‌ని ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారం మెండుగా ఉంద‌న్నారు. అమ‌రావ‌తి రాజ‌ధానిలో ఒకే విడ‌త 15 బ్యాంకులు, ఇత‌ర బీమా కంపెనీల‌కు చెందిన కేంద్ర కార్యాల‌యాల నిర్మాణానికి భూమి పూజ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌, సీఎం చంద్ర‌బాబు త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడారు. రాజ‌ధాని …

Read More »

పంచాయతీల కోసం బరిలోకి దిగనున్న సీఎం

తెలంగాణ‌లో పంచాయ‌తీ ఎన్నిక‌లకు సంబంధించిన నామినేష‌న్ల ప్ర‌క్రియ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. వ‌చ్చే నెల 11, 14, 19 తేదీల్లో మూడు ద‌శ‌ల్లో ఎన్నిక‌ల పోలింగ్ కూడా జ‌ర‌గ‌నుంది. వాస్త‌వానికి ఇది పార్టీలు, అజెండా, జెండాల ప్రాతిప‌దిక‌న జ‌రిగే ఎన్నిక కాదు. అయినా.. ప్ర‌భావితం అయ్యే అవ‌కాశం ఉంటుంది. అందుకే పార్టీలు ముందుగానే అలెర్ట్ అయ్యాయి. బీఆర్ ఎస్ నాయ‌కులు ఇప్ప‌టికే గ్రామ ప‌ర్య‌ట‌న‌లు చేప‌ట్టి రైతుల స‌మ‌స్య‌ల‌ను, పంట‌ల …

Read More »

నేపాల్ రూ 100 నోటులో భారత ప్రదేశాలు?

భారత్, నేపాల్ మధ్య స్నేహ సంబంధాలు ఉన్నప్పటికీ, సరిహద్దు గొడవలు అప్పుడప్పుడు రాజుకుంటూనే ఉంటాయి. ఇన్నాళ్లు కేవలం మాటల యుద్ధంగా, రాజకీయ మ్యాపులకే పరిమితమైన ఈ వివాదం ఇప్పుడు ప్రజల జేబుల్లోకి కూడా వచ్చేసింది. నేపాల్ తీసుకున్న తాజా నిర్ణయం రెండు దేశాల మధ్య దౌత్యపరమైన వేడిని పెంచేలా ఉంది. ఒక చిన్న కాగితం ముక్క ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. సాధారణంగా ఏ దేశమైనా తమ కరెన్సీ నోట్ల …

Read More »

స‌ర్పంచ్ ప‌ద‌వికి వేలం: 20 ల‌క్ష‌లు ప‌లికిన ప‌ద‌వి!

ప్ర‌జాస్వామ్యంలో ఎన్నిక‌ల ద్వారానే ప‌దువులు సొంతం అవుతాయి. ప్ర‌జాప్ర‌తినిధిగా ఉండేందుకు ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో నిర్వ‌హించే ఎన్నిక‌ల్లో పోటీ చేసి వారి ఆద‌ర‌ణ‌ను నాయ‌కులు చూర‌గొనాలి. ఎంపీ నుంచి ఎమ్మెల్యే వ‌ర‌కు, కార్పొరేట‌ర్ నుంచి వార్డు స‌భ్యుడి దాకా అంతా ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌పైనే ఆధార‌ప‌డి ఉంటుంది. అయితే.. తాజాగా తెలంగాణలో కొత్త సంస్కృతి పురుడు పోసుకుంది. ప్ర‌స్తుతం పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు ఇక్క‌డ రంగం కొన‌సాగుతోంది. నామినేష‌న్ల ప్ర‌క్రియ కూడా ప్రారంభ‌మైంది. వ‌చ్చే …

Read More »

జగన్ కడప టూర్ – హిట్ ఆర్ ఫ్లాప్??

మూడు రోజ‌లు పాటు వైసీపీ అధినేత జ‌గ‌న్ త‌న సొంత జిల్లా క‌డ‌ప‌లో ప‌ర్య‌టించారు. ముఖ్యంగా పార్టీ కార్యక‌ర్త‌లు, నాయ‌కుల‌ను స‌రైన మార్గంలో న‌డిపించాల‌న్న ఉద్దేశంతో ఆయ‌న ఈ ప‌ర్య‌ట పెట్టుకున్నారు. అయితే.. వ‌ర్షాలు.. వ‌ర‌ద‌ల కార‌ణంగా దెబ్బ‌తిన్న అర‌టి రైతుల‌కు త‌మ పార్టీ త‌ర‌ఫున ప‌రిహారం అందిస్తామ‌ని వాగ్దానం చేశారు. ఈ నేప‌థ్యం కూడా.. తాజాగా ప‌ర్య‌ట‌న‌లో కీల‌కంగా మారింది. దీంతో అర‌టి రైతుల‌ను కూడా జ‌గ‌న్ ప‌రామ‌ర్శించారు. …

Read More »

నేనే త‌ప్పుచేసి… నేనే కోర్టుకెళ్లానా?: సుబ్బారెడ్డి

“నేనే త‌ప్పు చేసి.. నేనే కోర్టుకువెళ్తానా?“ అని టీటీడీ మాజీ చైర్మ‌న్‌, వైసీపీ నాయ‌కుడు వైవీ సుబ్బారెడ్డి ప్ర‌శ్నించారు. ప్ర‌తి విష‌యాన్నీ రాజ‌కీయంగా చూస్తున్నార‌ని విమ‌ర్శించారు. తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించిన ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ప‌ర‌కామ‌ణి దొంగ‌త‌నం కేసు విష‌యంలో విచార‌ణ నిమిత్తం విజ‌య‌వాడ‌కు వ‌చ్చిన సుబ్బారెడ్డి .. అధికారుల ముందు హాజ‌ర‌య్యారు. అనంత‌రం.. బ‌య‌ట‌కు వ‌చ్చి మీడియాతో మాట్లాడారు. …

Read More »

కష్టకాలంలో లంకకు అండగా భారత్

శ్రీలంకను ‘దిత్వ’ తుఫాను అతలాకుతలం చేసింది. ఎడతెరిపి లేని వర్షాలు, వరదలతో ఆ దేశం చిగురుటాకులా వణికిపోతోంది. ముఖ్యంగా కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 56 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. వేలాది ఇళ్లు నీట మునిగాయి. దాదాపు 44 వేల మందిని స్కూళ్లు, షెల్టర్లకు తరలించారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, రాజధాని కొలంబోలో స్టాక్ ఎక్స్ఛేంజ్ కూడా పనిచేయలేదు. రైళ్లు నిలిచిపోయాయి. కష్టకాలంలో …

Read More »