Political News

జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను టీడీపీకి దూరం చేసేది ఆ ఇద్ద‌రేనా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ మ‌రోసారి రాజ‌కీయంగా తెర‌మీదికి వ‌చ్చిన పేరు. టీడీపీ విషయంలో సానుకూలంగా స్పందించి.. 2009 ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. ఆ స‌మ‌యంలో యాక్సిడెంట్ జ‌రిగినా.. కూడా ఆసుప‌త్రి నుంచి ప్ర‌చారం నిర్వ‌హించారు. అయితే, ఆ త‌ర్వాత కాలంలో ఆయ‌న టీడీపీకి దూరంగా ఉంటున్నారు. దీనిపై అనేక కార‌ణాలు ఉన్నాయి. అయితే.. తాజాగా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ మ‌రికొన్ని …

Read More »

జ‌న‌సేన‌కు గ్లాసు గుర్తే.. బెంగ‌లేదు.. కానీ, స‌స్పెన్స్‌!

ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఎన్నిక‌ల గుర్తుల అంశం జ‌న‌సేన పార్టీని కుదిపేస్తోంది. ఈ పార్టీకి.. గాజు గ్లాసు గుర్తు ఉన్న విష‌యం తెలిసిందే. అయితే.. గుర్తింపు పొందిన పార్టీ కాక‌పోవ‌డంతో ప్ర‌తిసారీ గుర్తు విష‌యంలో ఇబ్బందులు ఎదుర‌వుతున్నారు. గ‌త ఏడాది జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ గుర్తు విష‌యంలో జ‌న‌సేన ఇబ్బందులు ఎదుర్కొంది. ఇప్పడు ఏపీలోనూ ఇదే ఇబ్బంది ఎదురైంది. అయితే.. తాజాగా ఈ …

Read More »

కోడూరులో జ‌న‌సేన అభ్య‌ర్థి మార్పు.. రీజ‌నేంటి?

ప్ర‌స్తుత సార్వత్రిక ఎన్నికల్లో అభ్య‌ర్థుల ఎంపిక‌, కేటాయింపు వంటి విష‌యాల్లో జ‌న‌సేన అధినేత  ప‌వ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో టీడీపీ నుంచి జ‌న‌సేన‌లో చేరిన వారికి టికెట్లు కేటాయిస్తున్నారు. తాజాగా.. ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం రైల్వే కోడూరులో జ‌న‌సేన అధినేత మార్పుకు శ్రీకారం చుట్టారు. ఇక్క‌డ నుంచి పోటీ చేసే జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును  పవన్  ఖరారు చేశారు. వాస్త‌వానికి రెండో …

Read More »

ఔను.. ద‌స్త‌గిరి చెప్పింది నిజ‌మే..

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న వివేకానంద‌రెడ్డి దారుణ‌ హత్య కేసులో నిందితుడుగా ఉన్న వైసీపీ నాయ‌కుడు, క‌డప ఎంపీ అవినాష్‌ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఇదే కేసులో అప్రూవ‌ర్‌గా బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ స‌మ‌యంలో హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అవినాష్‌ రెడ్డి కోర్టు షరతులు ఉల్లంఘించాడంటూ దస్తగిరి తన పిటిషన్ లో పేర్కొన్నాడు. దీనిని …

Read More »

  వైసీపీకి భారీ షాక్‌: ఆమంచి రాజీనామా

ఏపీ అధికార పార్టీ వైసీపీకి భారీ షాక్ త‌గిలింది. పార్టీ కీల‌క నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మో హ‌న్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అయితే.. ఈ ప‌రిణామం వైసీపీ ముందుగానే ఊహించిన అంశ‌మే. ఎందుకంటే.. ఆమంచి అభీష్టం వైసీపీలో నెర‌వేర‌లేదు. ప్ర‌స్తుత అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న చీరాల స్తానాన్ని ఆశించారు. కానీ, వైసీపీ ఆయ‌న‌కు ఇవ్వ‌లేదు. పైగా.. ఆమంచి బ‌ద్ధ శ‌త్రువుకు అప్ప‌గించింది. దీంతో ఇన్నాళ్లు వెయిట్ …

Read More »

కేటీఆర్ మాట్లాడితే… క్యాడర్ భయపడుతోంది

కారణం ఏమైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో.. అందునా కేసీఆర్ సర్కారు హయాంలో వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా ఎడాపెడా సాగిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై గడిచిన కొన్ని వారాలుగా వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు.. మాజీలు అరెస్టు అయ్యారు. అరెస్టుల పరంపర అధికారులకే పరిమితం కాగా.. రాజకీయ అరెస్టులు ఎప్పుడు.. ఏ కోణంలో జరగనున్నాయి? అన్నదిప్పుడు చర్చగా మారింది. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ …

Read More »

కేంద్రంలో వైసీపీకి మ‌రింత పెరిగిన ప‌ర‌ప‌తి..

కేంద్రంలో ఏర్ప‌డే ఏ ప్ర‌భుత్వాన్న‌యినా.. అంతో ఇంతో ప్ర‌భావితం చేయ‌గ‌లిగితే.. అది త‌మ‌కు మాత్ర‌మే కాద‌ని.. ఆ ప్ర‌యోజ‌నం ఏపీకి, ఏపీ ప్ర‌జ‌ల‌కు ద‌క్కుతుంద‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌దే ప‌దే చెబుతున్నారు. అయితే.. గ‌త ఐదేళ్ల కాలంలో ఇలాంటి ప్ర‌య‌త్నం చేసింది లేదు. కానీ.. ఇప్పుడు మ‌రోసారి వైసీపీకి భారీ అవ‌కాశ‌మే ద‌క్కింది. కేంద్రంలో వైసీపీ ప‌ర‌ప‌తి మ‌రింత పెరిగింది. ప్ర‌స్తుతం 9 మంది మాత్ర‌మే ఉన్న రాజ్య‌స‌భ …

Read More »

టాలీవుడ్ కోరుకున్నది పవన్ వల్ల జరుగుతుందా

జనసేన కార్యకలాపాల కోసం షూటింగులకు బ్రేక్ ఇచ్చి తన దర్శకులను ఇతర సినిమాలు చేసుకోమని చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రయాణం వైపు ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో టిడిపి జనసేన బిజెపి ప్రభుత్వం కనక ఏర్పడితే వేల కోట్ల పెట్టుబడులతో ముడిపడిన ప్యాన్ ఇండియా సినిమాలకు మేలు జరుగుతుందనే ఆశ బలంగా కనిపిస్తోంది. అదెలాగో చూద్దాం. ప్రస్తుతం ఏపీలో టికెట్ రేట్ల పెంపుకి సంబంధించిన …

Read More »

పవన్ సినిమాలపై వున్న శ్రద్ధ పింఛన్ల పై లేదా

ఏపీలో పింఛ‌న్ల పంపిణీ రాజ‌కీయం కొన‌సాగుతోంది. 3వ తేదీ నుంచి పింఛ‌న్లు పంపిణీ చేస్తామ‌ని వైసీపీప్ర‌భుత్వం చెప్పినా.. స‌రైన ఏర్పాట్లు చేయ‌క‌పోవ‌డంతో వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాద‌ప‌డుతున్న వారు.. పింఛ‌ను పంపిణీ కేంద్రాల‌కు చేరుకు ని ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో వ‌లంటీర్ల‌ను నిలిపివేశారంటూ.. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ పార్టీల‌పై వారు తీవ్ర ఆగ్ర హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ వివాదంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ …

Read More »

‘వైనాట్ 175’ పోయింది.. ఇప్పుడు ‘వైనాట్ 200’

వైసీపీ అధినేత జ‌గ‌న్.. ఎన్నిక‌ల‌కు ముందు… ఇప్పుడు షెడ్యూల్ ప్ర‌క‌టించిన త‌ర్వాత కూడా.. వైనాట్ 175 అనే మాట‌నే మాట్లాడుతున్నారు. అయితే.. ప్ర‌స్తుతం ఆయ‌న బ‌స్సు యాత్ర చేస్తున్నారు. ఈ క్ర‌మం లో క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్తితిని గ‌మ‌నిస్తున్నారో.. లేక ఆయ‌న‌లో మ‌రింత భ‌రోసా ఏర్ప‌డిందో తెలియ‌దు కానీ.. ఇప్పుడు కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు.. అదే డ‌బుల్ సెంచ‌రీ. ఔను.. గ‌త రెండు రోజులుగా ఆయ‌న ప్ర‌సంగాలు వింటే.. ఇదే స్ప‌ష్టంగా …

Read More »

ఏపీలో ఇదో ప్ర‌చార అరాచ‌కం!

వలంటీర్ల‌ను పింఛ‌న్ల పంపిణీ స‌హా.. ఇత‌ర ప‌నుల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం దూరం పెట్ట‌డంతో అస‌లు సిస‌లు రాజ‌కీయాలు తెర‌మీదికి వ‌చ్చాయి. వలంటీర్ల కేంద్రంగా సాగుతున్న రాజ‌కీయాల్లో ఇప్పుడు వైసీపీ అనుకూల వ్య‌క్తులు మ‌రింత ప‌రాకాష్ఠ‌కు చేరుకున్నారు. పింఛ‌న్ల పంపిణీకి చంద్ర‌బాబు అడ్డుప‌డుతున్నా డ‌ని, టీడీపీ అరాచ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని చెబుతున్న వైసీపీకి అనుకూలంగా.. మ‌రింత ప్ర‌చారాన్ని అరాచ‌క స్థాయికి చేర్చారు. న‌డ‌వ‌లేని వారు… మంచంపై అనారోగ్యంతో తీసుకుంటున్న‌వారిని మంచాల‌పైనే మోసుకు …

Read More »

అన్నీ రద్దు.. పవన్ కళ్యాన్ కు ఏమయింది

కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. గ‌త నాలుగు రోజు లుగా ఆయ‌న ఆరోగ్యం న‌ల‌త‌గా ఉన్న విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న పిఠాపురంలో ప‌ర్య‌టిం చి.. స‌భ‌లు, స‌మావేశాలు, పాద‌యాత్ర‌తో తీరిక లేకుండా గడిపారు. దీంతో ఆ అస్వ‌స్థ‌త తీవ్ర జ్వ‌రానికి దారి తీసింది. దీంతో ప్ర‌చారాన్ని ర‌ద్దు చేసుకుని ఆయ‌న హైద‌రాబాద్ వెళ్లిపోయారు. దీంతో పిఠాపురంలో ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను టీడీపీ …

Read More »