Political News

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల కోసం కొత్తగా 3సీ ఫార్ములాను తీసుకువచ్చారు. వినూత్న ఆలోచనలతో పరిపాలనలో నూతన సంస్కరణలను ప్రవేశపెట్టడంలో చంద్రబాబు ముందుంటారు. ఈ క్రమంలోనే ఆయన కలెక్టర్ల కోసం కొత్త ఫార్ములాను రూపొందించి వారి ముందు ఉంచారు. రెండు రోజులుగా ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నారు. రెండో …

Read More »

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అభయారణ్యం పేరుతో అభివృద్ధి పనులకు అటవీ శాఖ అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని, వారిని కిడ్నాప్ చేసి అక్కడకు పంపిస్తే కరెక్ట్ అవుతారని షాకింగ్ కామెంట్స్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక సౌకర్యాలకు అడ్డంకులు సృష్టించవద్దని సూచించారు. గిరిజనుల ఇళ్లకు క్లియరెన్స్ ఇవ్వకపోవడంపై …

Read More »

తారకరత్న కుటుంబాన్ని పట్టించుకోవట్లేదా?

కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి చనిపోవడం అందరినీ కలచివేసింది. నటుడిగా ఎంతో ప్రయత్నించి ఫెయిలైన అతను.. రాజకీయాల్లో అయినా వెలిగిపోవాలని అనుకున్నాడు. కానీ కుదరలేదు. అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న అలేఖ్య రెడ్డిని పెళ్లి చేసుకోవడం వల్ల కుటుంబం కూడా అతణ్ని దూరం పెట్టింది. ఇలా అనేక ఇబ్బందులు పడ్డ …

Read More »

ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్… లుక్ మార్చిన మోదీ

ఎన్నిక‌లు అన‌గానే నాయ‌కుల్లో మార్పులు స‌హ‌జం. మ‌రీ ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ అయితే.. మ‌రింత ఎక్కువ‌గా శ్ర‌ద్ధ తీసుకుంటారు. 5 సంవ‌త్స‌రాల కింద‌ట ప‌శ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు.. ఆయ‌న ఏకంగా నిలువెత్తు గ‌డ్డం పెంచుకున్నారు. బెంగాల్ వాసుల‌కు-విశ్వ‌క‌వి ర‌వీంద్రుడికి మ‌ధ్య చాలా సెంటిమెంటు ఉంది. ర‌వీంద్రుడి మాదిరిగా మోడీ కూడా గ‌డ్డం పెంచేసుకుని.. నాటి ఎన్నిక‌ల్లో ప్ర‌చారం కూడా చేశారు. దాదాపు ఏడాదిపైగానే ఆయ‌న అలాగే …

Read More »

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే చాలామంది ఆయ‌న్ని ఒక పోరాట‌ యోధుడిలా చూసేవారు. సీఎం కావ‌డానికి ముందు వ‌ర‌కు ట‌ఫ్ లీడ‌ర్‌గా క‌నిపించేవాడు జ‌గ‌న్. కానీ సీఎం అయ్యాక ఆయ‌న ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. ఏ ముఖ్య‌మంత్రి ఎదుర్కోనంత వ్య‌తిరేక‌త‌ను ఆయ‌న ఎదుర్కొన్నారు. ఆయ‌న ప్ర‌సంగాలు, మీడియా స‌మావేశాల్లో వ్యాఖ్య‌ల్లో ఒక‌ప్ప‌టి ప‌దును …

Read More »

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క నేత హ‌రీష్‌రావులు…తీవ్ర అంత‌ర్మ‌థ‌నంలో కూరుకుపోయారా?  ప్ర‌స్తుతం అసెంబ్లీ స్పీక‌ర్ ప్ర‌సాద‌రావు ఇచ్చిన `క్లీన్ చిట్`పై ఏం చేయాల‌న్న విష‌యంపై న్యాయ నిపుణుల నుంచి స‌మాచారం సేక‌రిస్తున్నారా?  అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. బీఆర్ ఎస్ నుంచి విజ‌యం ద‌క్కించుకున్న ప‌ది మంది ఎమ్మెల్యేలు.. త‌ర్వాత‌.. అధికార పార్టీ కాంగ్రెస్‌కు …

Read More »

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాసం.. ఎందుకంటే!

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్‌సభ స్పీకర్‌పై తమకు విశ్వాసం లేదని, ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విపక్ష ఎంపీలు ఆరోపించడం కొత్త కాదు. గతంలోనూ పలువురు స్పీకర్లపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. అయితే ఈ తీర్మానం నెగ్గుతుందా అంటే నెగ్గదు. కానీ ప్రతిపక్షాలకు ఈ తీర్మానం ద్వారా తమ వాదనను వినిపించే అవకాశం లభిస్తుంది. స్పీకర్ వైఖరిపై తమ అభిప్రాయాలను …

Read More »

అసెంబ్లీకి వస్తే ఆ జాకీలను పడేయొచ్చుగా జగన్

అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిన జగన్…అసెంబ్లీ సమావేశాలపై విమర్శలు చేశారు. ఈ సమావేశాల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని, అంతా పరనింద…ఆత్మస్తుతి అని సెటైర్లు వేశారు. తన కొడుకు లోకేశ్ కు చంద్రబాబు…చంద్రబాబుకు లోకేశ్…ఆ ఇద్దరికీ పవన్ కల్యాణ్ జాకీలు పెట్టి …

Read More »

వివేకా హత్య కేసు.. 4 వారాల్లో తీర్పు!

వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు తాజాగా తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఈ కేసు విచారణను 4 వారాల్లో ముగించేయాలని, తీర్పు ఇవ్వాలని తేల్చి చెప్పింది. ఇంకా సాగదీయడం సరికాదని వ్యాఖ్యానించింది. సీబీఐ దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో ఈ కేసులో పూర్వాపరాలను విశ్లేషించి తీర్పు వెలువరించాలని బుధవారం సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. …

Read More »

కవిత దీక్ష.. ఎవరికీ పట్టట్లేదా?

బీఆర్‌ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత గత రెండు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే దీనిపై ఎక్కడా చడీచప్పుడు వినిపించడం లేదు. కనిపించడమూ లేదు. ఎవ్వరూ దీనిపై పెద్దగా స్పందించడమూ లేదు. దీంతో కవిత దీక్ష ఎవరికీ పట్టడం లేదా? అనే చర్చ ఆసక్తిగా మారింది. మరోవైపు పోలీసులు కూడా ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ …

Read More »

మల్లారెడ్డికి మళ్ళీ పెళ్లి

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్. ఇక, సోషల్ మీడియాలో అయితే మల్లారెడ్డి ఇంకా పాపులర్. పాలమ్మినా..పూలమ్మినా అంటూ మల్లారెడ్డి చెప్పిన డైలాగ్ అప్పట్లో వైరల్ అయింది. ఆ తర్వాత తన మార్క్ డైలాగులతో, మాటలతో మల్లారెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇక, తాజాగా మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్ గా నిలిచారు. అవును మీరు విన్నది నిజమే..మల్లారెడ్డి …

Read More »

విద్యుత్ చార్జీల పెంపుపై చంద్ర‌బాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

అస‌లే వేస‌వి కాలం.. సాధార‌ణ ఇళ్ల‌లో ఫాన్లు.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఇళ్ల‌లో కూల‌ర్లు, ఆపై త‌ర‌గ‌తుల ఇళ్ల‌లో ఏసీలు క‌నీసంలో క‌నీసం 18 గంట‌ల పాటు తిరుగుతూనే ఉంటాయి. పైగా.. ఈ ఏడాది గ‌తంలో క‌న్నా ఎక్కువ‌గానే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండ‌లు మండిపోతాయ‌ని అధికారులు ఇప్ప‌టికే సంకేతాలు ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో విద్యుత్ వినియోగం, నిరంత‌రాయ స‌ర‌ఫ‌రా వంటివి ప్ర‌భుత్వాల‌కు క‌త్తిమీద సాముగా మారాయి. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ధ‌ర‌లు …

Read More »