ఏపీ రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు పిల్లిమొగ్గలు వేస్తున్నారంటూ.. జగన్ సొంత మీడియాలో ఓ కార్టూన్ వచ్చింది. కార్టూనిస్టు స్వేచ్ఛను ఎవరూ హరించలేదు. నిర్బంధాలు కూడా పెట్టలేరు. కానీ.. దీని వెనుక ఉన్న ఔచిత్యాన్ని మాత్రం ప్రశ్నించడంలో తప్పులేదు. అమరావతి నేమ్ బోర్డును పట్టుకున్న సీఎం చంద్రబాబు.. ఒకసారి నెత్తిమీద, మరోసారి కుడి వైపు.. ఇంకోసారి ఎడమవైపు.. మరోసారి.. తలకిందు లుగా పట్టుకుని ఉన్నట్టుగా ఈ కార్టూన్ గీశారు. దీని …
Read More »ఫారిన్ ట్రిప్ కు వెళ్లిన అర్చకులకు గర్భాలయంలో పూజలకు నో
విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు దేవస్థానాల ప్రధాన గర్భాలయాల్లో పూజలు నిర్వహించటానికి వీల్లేదంటూ దేవాదాయ శాఖ (ధార్మిక పరిషత్).. శృంగేరి శారదా పీఠం జారీ చేసిన మార్గదర్శకాలకు సంబంధించి తాజాగా హైకోర్టు పూర్తి స్పష్టత ఇచ్చింది. ధార్మిక పరిషత్.. శృంగేరి శారదా పీఠం మార్గదర్శకాల్ని దేవాదాయ శాఖ కూడా సర్క్యులర్ జారీ చేసింది. ఈ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలేం జరిగిందంటే.. ఫారిన్ ట్రిప్ లకు వెళ్లి వచ్చిన …
Read More »అజ్ఞాతంలో వైసీపీ మాజీ ఎంపీ?
వైసీపీ నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు నందిగం సురేశ్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారట. ఆది నుంచి నేరాలు, కేసులతో సహవాపం చేస్తూ సాగుతున్న సురేశ్.. ఎంపీ హోదాలో ఓ సంస్థకు చెందిన వ్యక్తెుల నుంచి రూ.25 లక్షలు తీసుకున్నారట. అయితే ఆ పనిని పూర్తి చేయకపోగా… డబ్బును కూడా వాపస్ ఇవ్వలేదట. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా… తుళ్లూరు పోలీసులు సురేశ్ పై కేసు నమోదు చేశారట. ఈ విషయం తెలుసుకున్న సురేశ్… తనను పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న భయంతో సురేశ్ అజ్ఞాతంలోకి …
Read More »జగన్ డబ్బును చూస్తే.. బాబు భవిష్యత్తు చూస్తున్నారు..!
సాధారణంగా మనలో ఎక్కువమంది అనుకునేది “డబ్బుదేముంది ముందు పని కానివ్వండి. భవిష్యత్తులో డబ్బు దానంతట అదే వస్తుంది.“ అని. ఇక, భవిష్యత్తును ఊహించుకుని ఒక సాధారణ ఆటో కార్మికుడు కూడా తన పిల్లలను ఉన్నత స్థాయి విద్యను చదివించాలని భావిస్తాడు. దీనికి కారణం అతని దగ్గర డబ్బు ఎక్కువ ఉండి కాదు.. ఇప్పుడు కష్టపడినా భవిష్యత్తులో పిల్లలు ఎదుగుతారు… భవిష్యత్తులో పిల్లల జీవితం బాగుంటుంది అనే ఒక దూరదృష్టి. ఒక …
Read More »ఊపిరి పీల్చుకున్న గులాబీ
అసెంబ్లీ నుంచి పంచాయతీ ఎన్నికల వరకు.. తీవ్రస్థాయిలో దెబ్బతిన్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు .. తాజాగా రెండు మునిసిపల్ చైర్మన్ పీఠాలు దక్కడం ఆ పార్టీకి ఒకింత ఆక్సిజన్ ఇచ్చే పరిణామంగా మారింది. రెండు మునిసిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ కి చెందిన నాయకులు.. పదవులు దక్కించుకున్నారు. వీటిలో 1) ఇబ్రహీంపట్నం. 2) కీలకమైన క్యాతన్పల్లి. తాజాగా ఈ రెండు స్థానాల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించారు. రెండు …
Read More »కవితకు మరో షాక్ ఇవ్వనున్న బీఆర్ఎస్?
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్` పేరును వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. `పార్టీ పార్టీ కొత్త జెండా` నినాదంతో ఆమె చేసిన ప్రకటన తెలిసిందే. అంటే.. ఆమె పార్టీ పేరును టీఆర్ ఎస్గా ప్రకటించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా ఆమెచూచాయగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉందని.. ఎవరైనా దీనిని …
Read More »జగన్ను రెడ్లు కూడా సమర్థించడం లేదా?
పార్టీలకు నాయకులు, నాయకులకు సామాజిక వర్గాలు మద్దతు అనేది అనాదిగా ఉన్న సంప్రదాయం. ఏ పార్టీకి ఆ పార్టీ సామాజిక వర్గాల వారీగానే రాజకీయాలు చేస్తున్న రోజులు ప్రబలుతున్నాయి. ఈ క్రమంలో ఎవరు అవునన్నా, కాదన్నా సామాజిక వర్గాల ఆధారంగానే రాజకీయాలు సాగుతున్నాయి. వైసీపీకి రెడ్ల మద్దతు అవసరం అనేది ఆ పార్టీ నాయకులు చెబుతున్న మాట. 2019లో దీనిని సాధించారు. కానీ, 2019–24 మధ్య రెడ్డి సామాజిక వర్గానికి …
Read More »ఈసారి అమరావతి లక్ష్యం… గురి తప్పకూడదు!
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే మిగిలి ఉంది. ఇది కూడా త్వరలోనే పూర్తవుతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అయితే.. ఎలానూ చట్టబ ద్దత వచ్చేసినట్టే కాబట్టి.. రాజధాని పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. తాజాగా శనివారం సాయంతం అమరావతి పనులపై చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. అమరావతి నిర్మాణం ఇక …
Read More »మావిగన్ క్రెడిట్… జగన్ పై తోసేసిన సజ్జల
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మావిగన్ లాంటి ఆలోచనలు జగన్ లాంటి వారికే వస్తాయని అధికార కూటమి విమర్శలు గుప్పిస్తుంటే… అమరావతి కంటే మెరుగైన రాజధాని ప్రతిపాదనను జగన్ చేశారంటూ వైసీపీ నేతలు వంత పాడుతున్నారు. తాజాగా మావిగన్ అన్నది జగన్ ఆలోచన కాదని, అది ఎవరో సలహా ఇస్తే జగన్ దానిని వల్లె వేశారన్న …
Read More »కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పై దాడి… ఏం జరిగింది?
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రేణులు ఈ దాడికి పాల్పడ్డాయి. సిద్ధిపేట డీసీసీ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి నేతృత్వంలో భారీ సంఖ్యలో గజ్వేల్ కు తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు… కేసీఆర్ క్యాంపు కార్యాలయంలోకి చొచ్చుకుని వెళ్లాయి. ఈ దాడిలో కార్యాలయంలోని ఫర్నీచర్ ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి …
Read More »ఇంకో మెట్టు ఎక్కేసావయ్యా లోకేష్
ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండడంలోనే అసలైన గౌరవం, మర్యాద ఉంటాయని మరోసారి ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చాటి చెప్పారు. తరచుగా ఆయన ఆడంబరాలకు పోకుండా.. సాధారణ నాయకుడిగానే వ్యవహరిస్తున్నారు. నిజానికి ఇటు పార్టీ పరంగా చూసుకున్నా.. అటు ప్రభుత్వ పరంగా చూసుకున్నా.. లోకేష్ ఉన్నతస్థానంలోనే ఉన్నారు. ముఖ్యమంత్రి కుమారుడిగానే కాకుండా..మంత్రిగా(నాలుగు శాఖలకు) ఆయన వ్యవహరిస్తున్నారు. ఇక, రాష్ట్రంలో అతి పెద్ద పార్టీ టీడీపీకి …
Read More »గీత దాటితే వేటు వేస్తా.. బాబు డెడ్లీ వార్నింగ్
పదవుల కోసం తన చుట్టూ తిరగడం కాదని, ప్రజల చుట్టూ తిరగాలని టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు హితబోధ చేశారు. క్షేత్రస్థాయిలో బాగా పనిచేస్తేనే పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యత పెరుగుతుందని అన్నారు. భవిష్యత్తులో వచ్చే ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీకి ఓటింగ్ శాతం పెరిగితేనే నేతలు బాగా పనిచేసినట్టని చెప్పారు. ఈ క్రమంలోనే కొందరు టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై ఆయన ఫైర్ అయ్యారు. నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates