తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఎప్పటికప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ఈ తరహా పరిస్థితులు కొత్తేమీ కాకున్నా… గతంలో కంటే ప్రస్తుత పరిస్థితులు పెద్దవేమీ కాకున్నా… ఎప్పటికప్పుడు పార్టీలో నిరసన గళాలు క్రమంగా వినిపిస్తున్న తీరుపై ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. గతంలో గుట్టుచప్పుడు కాకుండా అసంతృప్తులు వ్యక్తం కాగా… ఇప్పుడు ఆ అసంతృప్తులు బహిరంగంగానే వ్యక్తం అవుతుండటం ఒకింత ఆందోళనకరమేనని చెప్పాలి. అంతేకాకుండా వరుసబెట్టి వినిపిస్తున్న ఈ ఆందోళనలు సీఎం రేవంత్ …
Read More »కొత్త విద్యా మంత్రిగా జోషి… ఎవరీయన?
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. కర్ణాటకకు చెందిన జోషి… 2019 నుంచి కేంద్ర కేబినెట్ లో మంత్రిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌర సరఫరాల శాఖ మంత్రిగా కొనసాగుతున్న జోషికి విద్యా శాఖ బాధ్యతలను కూడా అదనంగా అప్పగించారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము శనివారం రాత్రి ఓ కీలక ప్రకటన …
Read More »జగన్ లాజిక్… ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ కి లోకేష్ కు ముడి!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ అక్కడ కేంద్ర మంత్రి రాజీనామా చేశారు కదా.. ఇక్కడ కూడా డీఎస్సీ వ్యవహారంలో రాష్ట్ర మంత్రి కూడా రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దాదాపు పాతిక రోజులపాటు విద్యార్థులు లాఠీ దెబ్బలు తిని రోడ్లపై ఆందోళనకు దిగినా పట్టించుకోని జగన్ ఇప్పుడు ఆ అంశంపై మాట్లాడటం, దానిని ఏపీకి …
Read More »బెజవాడ నడిబొడ్డున ముద్రగడ విగ్రహం
కాపు ఉద్యమ నేత, సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త ముద్రగడ పద్మనాభం విగ్రహం బెజవాడలో త్వరలోనే ఏర్పాటు కానుంది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన ముద్రగడ… మెజారిటీ కాలం కాపులకు ప్రత్యేక రిజర్వేషన్ల సాధన కొరకే కేటాయించారు. కాపుల కోటా కోసం ముద్రగడ చేపట్టిన వినూత్న నిరసనలు ఈ తరానికి తెలియవేమో గానీ… తెలుగు నేల రాజకీయాలపై ఓ మోస్తరు అవగాహన ఉన్న వారెవరికైనా ఇట్టే గుర్తుకు రాక మానవు. కులం కోసం రాజకీయాలనే పక్కనపెట్టి మరీ పోరాటం సాగించిన ముద్రగడ …
Read More »కాబోయే విద్యాశాఖ మంత్రి ఎవరు?
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను ఢిల్లీకి రావాలని బీజేపీ అధిష్టానం ఆహ్వానించినట్లు సమాచారం. ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను కూడా ఢిల్లీకి పిలిచినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కేంద్ర మంత్రివర్గంలో ఫడ్నవీస్కు విద్యాశాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న ఊహాగానాలు …
Read More »యువత తిరగబడింది… రాజ్యం ఉలికిపడింది!
నిజమే… యువత తిరగబడింది. రాజ్యం ఉలిక్కిపడింది. యువతలో ఆగ్రహావేశాలకు కారణంగా నిలిచిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామం నిజంగానే మోదీ సర్కారు ఉలికిపాటును చాటి చెప్పింది. కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో దేశ యువత చేపట్టిన ఆందోళనలు నానాటికీ తీవ్రమవుతున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ధర్మేంద్ర తన మంత్రి పదవికి రాజీనామా చేయక …
Read More »ధర్మేంద్ర రాజీనామా… బొద్దింకలకు సరిపోదు!
కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. యువత భవిష్యత్తు కోసమే రాజీనామా చేశానని ఆయన చెప్పారు. దేశ భవిష్యత్తుకు, నవ భారతావనికి సరికొత్త వారసులు యువతేనని అన్నారు. 10 రోజులుగా జరుగుతున్న ఘటనలు తీవ్రంగా బాధించాయని, అందుకే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. కేంద్ర మంత్రిగా తనకు అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి …
Read More »సంచలనం: కేంద్రమంత్రి ధర్మేంద్ర రాజీనామా!
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్షల నిర్వహణలో అక్రమాల వివాదం చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రాజీనామా చేసే వరకు దారితీసింది. విద్యార్థి లోకం, విపక్షాల నుంచి వెల్లువెత్తిన తీవ్ర నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో ఆయన శనివారం తన రాజీనామా లేఖను ప్రధాన మంత్రికి సమర్పించారు. పరీక్షల నిర్వహణలో తలెత్తిన లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని …
Read More »మోడీకి కళ్లు చెదిరేలా స్వాగత ఏర్పాట్లు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో వారంలో ఏపీకి రానున్నారు. ఆగస్టు 1వ తేదీన ఆయన విజయనగరం జిల్లా భోగాపురానికి రానున్నారు. భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ విమానాశ్రయం నిర్మాణం 99 శాతం పూర్తయింది. దీనిని గత నెలలోనే ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అయితే.. ప్రధాని అప్పాయింట్మెంటు లభించకపోవడంతో దీనిని ఆగస్టు 1కి వాయిదా వేశారు. ఇక, ప్రధాని రాక నేపథ్యంలో …
Read More »రాళ్లను మెట్లుగా మార్చి.. అదే మోదీ ప్రత్యేకత..!
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమైన వేళ ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన అర్థరాత్రి సెల్ఫీ వీడియో రాజకీయంగా, సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. తనపై వచ్చిన విమర్శలను, వ్యతిరేకతను ప్రజలతో నేరుగా మాట్లాడే అవకాశంగా మలుచుకున్నారని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి, వీడియో విడుదలైన కొద్ది గంటల్లోనే అది భారీ స్పందనను రాబట్టింది. తనపై విసిరిన రాళ్లను మెట్లుగా మార్చుకోవడం అంటే.ఇదేనేమో? గురువారం అర్థరాత్రి …
Read More »షర్మిల ఎక్కడున్నారు… ఫోన్ స్విచ్ఛాఫ్!?
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అనే విషయాలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చేపట్టిన విద్యార్థుల ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో అన్ని రాష్ట్రాల్లోనూ నిరసనలు చేపట్టారు. గవర్నర్ బంగళాలను(లోక్భవన్) ముట్టడించే కార్యక్రమాలు చేపట్టారు. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక సహా.. అన్ని దక్షిణాది రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఉద్యమించింది. మరి …
Read More »మోడీ పై ఆర్ ఎస్ ఎస్ గుస్సా…?
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు మధ్య అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనపై ఆర్ ఎస్ ఎస్ అంతర్మథనం చెందుతున్నట్టు తెలుస్తోంది. ఆర్ ఎస్ ఎస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి.. విద్యార్థులకు మద్దతుగా స్పందించడంతో ఈ వ్యవహారం బీజేపీలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. వాస్తవానికి.. బీజేపీ విధానపరమైన నిర్ణయాల వెనుక ఆర్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates