రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చట్టవిరుద్ధంగా సాగిన ఈ పార్టీలో దొరికిన వారిలో రాజకీయ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వైద్యురాలు, పేరు మోసిన లాయర్ ఇలా పలు రంగాలకు చెందిన వారు ఉండటం విశేషం. ఇదంతా ఒక ఎత్తు అయితే, డ్రగ్స్ వినియోగానికి సంబంధించి పోలీసులు …
Read More »అమరావతికి విగ్రహ శోభ… చంద్రబాబు ఏమన్నారంటే!
ఏపీ రాజధాని అమరావతికి విగ్రహ శోభ వచ్చింది. ఇప్పటికే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇదే అమరావతిలో తొలి విగ్రహం.. కాగా, ఇప్పుడు అమరజీవి, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు భారీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనిని ఆయన 126వ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని …
Read More »బీఆర్ ఎస్ అంతర్మథనం: రోహిత్ వివాదం నుంచి బయటపడేదెలా?
డ్రగ్స్ కేసులో పట్టుబడి జైలుపాలైన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వ్యవహారం నుంచి బీఆర్ ఎస్ పార్టీ బయట పడేదెలా? ఇదీ.. ఇప్పుడు ఆ పార్టీని కుదిపేస్తున్న ప్రధాన అంశం. రేవంత్ రెడ్డి పాలనను.. ఆయన విధానాలను.. ఎండగట్టాలని నిర్ణయించుకున్న బీఆర్ఎస్కు ఇప్పుడు రోహిత్ రెడ్డి వ్యవహారం కొరుకుడుపడడం లేదు. సర్కారును నిలదీసేందుకు ఏవిషయాన్ని ఎంచుకున్నా.. తమవైపే పెద్ద ఎత్తున డ్రగ్స్ భూతం కనిపిస్తోంది. సొంత పార్టీ నాయకుడు, మాజీ …
Read More »ఫ్లవర్ కాదు.. ఫైరే: బడ్జెట్ భేటీపై అస్త్రశస్త్రాలు!
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. 2026-27 వార్షిక బడ్జెట్ను ఈ నెల 20 లేదా 21న సభలో ప్రవేశ పెట్టాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు కూడా పూర్తయింది. ఇక, తొలి రోజు కేవలం.. గవర్నర్ ప్రసంగంతో సరిపుచ్చేసినా.. అసలు సభ మాత్రం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. అయితే.. ఈ దఫా కూడా.. సభ వాడివేడిగా కంటే.. మరింత హాట్ హాట్గానే ముందుకు సాగనుంది. ప్రభుత్వ …
Read More »ఉగాది తర్వాత.. ఏ క్షణమైనా.. బాబు కీలక నిర్ణయం..!
ఈ నెల 19న జరిగే ఉగాది తర్వాత ఏ క్షణమైనా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుత మంత్రి వర్గాన్ని ప్రక్షాళన చేయాలని చూస్తున్నారు. పనిచేస్తున్న వారిని కొనసాగించినా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఆయన పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసినట్టు కూడా తెలుస్తోంది. నాయకుల మధ్య వివాదాలు, విభేదాలతో సాగుతున్న మంత్రులను పక్కన పెట్టడం …
Read More »అనకాపల్లిపై బాబుగారికి మోజు పోలేదే.. !
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం రాజకీయాలపై జనసేన పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ నాగబాబుకు ఇంకా మక్కువ పోలేదని తెలుస్తోంది. గత 2024 పార్లమెంటు ఎన్నికల సమయంలో ఆయన అనకాపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు దాదాపు నాలుగు మాసాల ముందు నుంచి కూడా నియోజకవర్గంలో పర్యటించారు. సమస్యలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేశారు. అదే సమయంలో వైసీపీ నాయకులపై …
Read More »కొండా కోనల్లో.. లోయల్లో.. పోలింగ్ కేంద్రాలు ఇవే!
సాధారణంగా జనావాసాలు ఉండే నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆయా కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది చేరుకోవడం.. పోలింగ్ యంత్రాలను తరలించడం కూడా పెద్ద కష్టం కాదు. ఇక, భద్రతా పరంగా కూడా భారీ సంఖ్యలోనే పోలీసులను మోహరిస్తారు. అయితే.. కొన్ని కొన్నిసార్లు ఇవే సమస్యాత్మకంగా మారుతున్నాయి. అనేక ఇబ్బందులు తీసుకువస్తున్నాయి. అయితే.. అసలు నడిచేందుకు దారి కూడా లేని ప్రాంతాలు.. పులుల కోసం ఏర్పాటు …
Read More »పుట్టా మహేష్ వివాదంపై స్పందించిన బాబు
ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలపై నమ్మకంతో ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆ పార్టీల నేతలను గెలిపించారు. వైసీపీ విధ్వంసకర పాలనతో బెంబేలెత్తిన ప్రజలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఓవైపు రాష్ట్రంలో పెట్టుబడుల వేట… మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణ పనులతో బిజీగా ఉన్న సీఎం చంద్రబాబుకు కొందరు టీడీపీ నేతలు కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతున్నారు. …
Read More »పొలిటికల్ చిత్రం: జగన్కు నాగబాబు సూచనలు.. !
వైసీపీ అధినేత జగన్కు జనసేన పార్టీముఖ్య నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. కీలక సూచనలు చేశారు. అయితే.. జగన్ ఎవరి మాటా వినరు.. అనే పేరుబడ్డ నేపథ్యంలో ఇప్పుడు నాగబాబు చెప్పింది మాత్రం ఆయన తలకెక్కించుకుంటారా? అనేది చూడాలి. అయితే..నిత్యం రాజకీయ విమర్శలు-ప్రతివిమర్శలు చేసుకునే వైసీపీ-జనసేనల మధ్య ఈ సూచనలు, సలహాల రాజకీయం తెరమీదికి రావడం కూడా ఆసక్తిగా మారింది. ఏదేమైనా నాగబాబు చేసిన సూచనలు బాగానే ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. …
Read More »హాట్ టాపిక్: లోకేష్ చెప్తే అయిపోవాలంతే!
మంత్రి లోకేష్ చెప్పిన మాటలను ఎమ్మెల్యేలు తు.చ. తప్పకుండా చేస్తున్నారనడానికి శనివారం రాష్ట్రంలో జరిగిన కొన్ని పరిణామాలే ఉదాహరణ. వాస్తవానికి గతంలోనూ నారా లోకేష్ చెప్పిన అనేక విషయాల్లో కొందరు ఎమ్మెల్యేలు ముందుండి పనిచేశారు. తాజాగా ఉమ్మడి కృష్నాజిల్లాలోని ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనంపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్నం సరిగా ఉడకకపోవడంతోపాటు కొందరి పళ్లాల్లో పురుగులు కూడా కనిపించడం తీవ్ర వివాదాస్పదమైంది. దీంతో విద్యార్థులు తమ …
Read More »డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీకి పాజిటివ్
బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ పార్టీలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కూడా పాల్గొన్న వైనం షాకింగ్ గా మారింది. అయితే, ఎంపీ పుట్టా మహేష్కు యూరిన్ టెస్ట్ లో నెగటివ్ వచ్చినట్లు నిన్న ఈగల్ టీమ్ పోలీసులు వెల్లడించారు. కానీ, తాజాగా …
Read More »అక్కడ `జనసేన` ఉడుంపట్టు
గిరిజన ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలపై జనసేన ఉక్కుపిడికిలి బిగిస్తోంది. ఇటీవల కాలంలో ఆయా నియోజకవర్గాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. కార్యక్రమాల జోరు పెంచడంతోపాటు.. వ్యక్తిగతంగా కూడా వారికి చేరువ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా.. తండాలలో నిర్వహించడం ద్వారా గిరిజనుల మనసు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి తొలుత పిఠాపురంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. కానీ, …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates