Political News

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు. అంతేకాదు.. గ‌త ఐదేళ్ల‌లో ఇక్క‌డ చంద్ర‌బాబును ఓడించేందుకు వైసీపీ చేసిన ప్ర‌య‌త్నాలు కూడా నిర్వీర్య మ‌య్యాయి. మ‌రోసారి కూడా చంద్ర‌బాబుకు ఇక్క‌డి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు. భ‌విష్య‌త్తులో చంద్ర‌బాబు క‌నుక త‌ప్పుకొంటే.. నారా భువ‌నేశ్వ‌రి ఇక్క‌డ నుంచి పోటీ చేయ‌నున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇదిలావుంటే.. ఇప్పుడు కుప్పం మాదిరిగానే …

Read More »

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే నిర్వహించింది. ఇందులో ప్రధానంగా ఏ పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు, ఏ అంశాలపై అసంతృప్తిగా ఉన్నారు, ఏ శాఖలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అనే విషయాలను పరిగణలోకి తీసుకున్నారు. ఈ సర్వేలో భాగంగా ప్రధానంగా రెవెన్యూ శాఖపై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఫిర్యాదులు రావడం …

Read More »

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి, ధర్మ పరిరక్షణకు చేసిన కృషికి ఇటీవల “అభినవ శ్రీ కృష్ణదేవరాయ” బిరుదు అందుకున్న పవన్ కళ్యాణ్, తాజాగా మార్షల్ ఆర్ట్స్ రంగంలో “టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్” అనే అంతర్జాతీయ స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్నారు. గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ఈ ప్రతిష్టాత్మక బిరుదుతో ఆయనను ఘనంగా సత్కరించింది. …

Read More »

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో ఘాటు ప్రేమ అంటూ ఆమెను వేధిస్తున్నారని మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏరి కోరి ఆ మహిళా ఐఏఎస్ అధికారిని నల్గొండ జిల్లాకు ట్రాన్స్ ఫర్ చేయించుకున్న సదరు మంత్రి, ప్రేమ పేరుతో ఆ అధికారిణి వెంట పడుతున్నారని జరుగుతున్న ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో …

Read More »

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా రాలేదు. పైగా రాజధాని రైతులు ఉద్యమించినప్పుడు, న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో తిరుమల వరకు పాదయాత్ర చేసిన సమయంలో ప్రజలు విస్తృతంగా సంఘీభావం ప్రకటించారు. వైసీపీ నాయకుల్లో కూడా కొందరు రైతులకు మద్దతుగా నిలిచారు. కాబట్టి రాజధానిపై మాట్లాడే అధికారం వారికి ఉంటుంది. కానీ ఆది నుంచి అమరావతిపై …

Read More »

అమరావతిపై 48 గంటల్లో టోన్ మార్చిన వైసీపీ!

ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని తక్కువ చేసి మాట్లాడడంతో పాటు, దీనిని నదీ గర్భంలో నిర్మిస్తున్నారని, దీని వెనుక మాఫియా ఉందని ఆయన ఆరోపించారు. అదే సమయంలో ఇంత భూమి, రెండు లక్షల కోట్ల రూపాయల వ్యయం అవసరమా అని కూడా ప్రశ్నించారు. మొత్తంగా తన మనస్తత్వాన్ని ఆయన రెండు రోజుల కిందట జాతీయ …

Read More »

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనసేన బలపరిచిన అభ్యర్థులు కొన్నిచోట్ల విజయం సాధించారు. వారితో కొండగట్టు పర్యటన సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించి తెలంగాణలో పార్టీ భవిష్యత్తుపై దశానిర్దేశం చేశారు. ఆ తర్వాత కమిటీలు అన్నీ రద్దు చేసి నూతనంగా అడ్‌హాక్ …

Read More »

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు చేస్తోందని ఆరోపించారు. ఇటీవల కాలంలో తిరుమల, ఇతర దేవాలయాలకు సంబంధించిన ఘటనలు తరచూ వివాదాస్పదంగా మారాయి. గతంలో పరకామణి చోరీ, లడ్డూ నెయ్యి కల్తీ ఆరోపణలు, తాజాగా మద్యం బాటిళ్ల వ్యవహారం వంటి అంశాలు భక్తుల్లో ఆందోళనను కలిగించాయి. ఇవన్నీ సహజ సంఘటనలేనా? లేక రాజకీయ లెక్కలతో సాగుతున్న …

Read More »

పవన్… ‘ఒక్కరోజు విలేజ్’ పిలుపు ఫలించేనా?

నెల‌లో ఒక్క‌రోజు గ్రామీణ ప్రాంతాల‌కు రావాలని.. ఇక్క‌డి వారికి వైద్య సేవ‌లు అందించాల‌ని డాక్ట‌ర్ల‌కు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పిలుపునిచ్చారు. మాన‌వ‌త్వానికి వైద్యం చిరునామా అని పేర్కొన్న ఆయ‌న‌.. నెల‌లో ఒక్క‌రోజైనా గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌లకు ఆధునిక వైద్యం అందించేందుకు వైద్యులు కృషి చేయాల‌ని కోరారు. పిఠాపురంలో ప‌ర్య‌టిస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కాకినాడ లోని ప్ర‌ఖ్యాత రంగరాయ మెడిక‌ల్ కాలేజీలో నూత‌న భ‌వ‌న నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు. …

Read More »

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట చేసిన వ్యాఖ్యలపై ఆయన శనివారం నేరుగా స్పందించారు. నదీగర్భంలో రాజధానిని నిర్మిస్తున్నారని, రెండో విడత భూములు సేకరిస్తున్నారని జగన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తిప్పికొట్టారు. జగన్‌కు నాగరికత తెలియదని మండిపడ్డ చంద్రబాబు, నదుల ఒడ్డునే నాగరికత విలసిల్లిందన్న కనీస జ్ఞానం కూడా ఆయనకు లేదన్నారు. అందుకే మిడిమిడి జ్ఞానంతో …

Read More »

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ అధినేత కార్యవర్గంతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు” అని శనివారం సాయంత్రం పార్టీ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ కమిటీలు, కార్యాచరణను కూడా ప్రారంభించామని తెలిపింది. రాష్ట్రంలోని 117 మునిసిపాలిటీలకు …

Read More »

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ, నదీ తీర ప్రాంతంలో నగర నిర్మాణం సాధ్యం కాదన్న వ్యాఖ్యలు ప్రజల్లో, ముఖ్యంగా రాజధాని రైతుల్లో ఆగ్రహాన్ని కలిగించాయి. అమరావతి కేవలం భౌగోళిక అంశం కాదని, ప్రజల త్యాగాలు, ఆకాంక్షలతో ముడిపడిన అంశమనే భావనను జగన్ వ్యాఖ్యలు విస్మరించాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యతిరేకత నేపథ్యంలో వైసీపీ నష్ట …

Read More »