సీఎం చంద్రబాబును దూషించిన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. అయితే, గత ఏడాది నవంబర్ 12న పోలీసుల విధులను అడ్డుకున్నారన్న కేసులో అంబటి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ పై ఉన్న విషయం విదితమే.
ఈ నేపథ్యంలోనే తాజాగా అంబటికి కోర్టు భారీ ఊరటనిచ్చింది. ఆ కేసులోనూ అంబటికి బెయిల్ లభించింది. ఈ క్రమంలోనే జైల్లో ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత రేపు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అంబటి విడుదలయ్యే అవకాశముంది.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తామన్న కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అంబటి రాంబాబు ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో అంబటిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని గుంటూరు కోర్టులో పట్టాభిపురం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
తాజాగా ఆ పిటిషన్ ను డిస్మిస్ చేసిన కోర్టు అంబటికి బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు, తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని ఏపీ హైకోర్టులో అంబటి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ పెండింగ్ లో ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates