Political News

లోకేష్‌కు షాక్ అనుకున్నారు.. కానీ!

టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్.. సోమవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సమయంలో ఆయనకు నిరసనగా అంగన్‌వాడీ కార్యకర్తలు.. రహదారులపై వచ్చారని, ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారని వైసీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇదంతా.. తల్లికి వందనం నిధుల గురించేనని కూడా వైసీపీ నాయకులు వ్యాఖ్యానించారు. గత ఎన్నికలకు ముందు వైసీపీ అమ్మ ఒడి పథకం అమలు చేసిందని.. ఆ …

Read More »

క‌బ్జా దారుల చిట్టా బ‌య‌ట పెట్టిన రంగ‌నాథ్‌

తెలంగాణ ప్ర‌భుత్వం 2024లో తీసుకువ‌చ్చిన హైడ్రా వ్య‌వ‌స్థ పెను సంచల‌నంగా మారిన విష‌యం తెలిసిందే. కుంట‌లు, భూములు, చెరువుల‌ను ఆక్ర‌మించి చేసిన నిర్మాణాల‌తోపాటు.. మూసీ రివ‌ర్‌ను ఆక్ర‌మించి క‌ట్టిన భ‌వ‌నాల‌ను కూడా కుప్ప‌కూల్చిన సంగ‌తి రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయింది. అయితే.. ఈ సంద‌ర్భంగా హైడ్రా క‌మిష‌న‌ర్, ఐపీఎస్ అదికారి రంగ‌నాథ్ వ్య‌వ‌హార శైలిపై హైకోర్టులో అనేక కేసులు న‌మోద‌య్యాయి. ముఖ్యంగా ఆయ‌న‌పై 63 కోర్టు ధిక్క‌ర‌ణ కేసులే ఉన్నాయ‌ని …

Read More »

రంగ‌నాథ్‌ను తప్పించండి… హైడ్రాపై హైకోర్టు సీరియ‌స్‌!

తెలంగాణ‌లో ఆక్ర‌మ క‌ట్టడాల‌కు సింహ స్వ‌ప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ మాటంటే హైడ్రాకు లెక్క‌లేక‌పోవ‌డం అత్యంత సీరియ‌స్ ప‌రిణామంగా పేర్కొంది. ముఖ్యంగా హైడ్రా క‌మిష‌న‌ర్, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్ పై హైకోర్టు మ‌రింత తీవ్రంగా స్పందించింది. ఆయ‌న తీరు అత్యంత దారుణంగా ఉంద‌ని పేర్కొన్న న్యాయ‌స్థానం.. త‌క్ష‌ణ‌మే ఆయ‌న‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ పోస్టు నుంచి త‌ప్పించాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని ఆదేశించ‌డం గ‌మ‌నార్హం. …

Read More »

జోగి ఫ్యామిలీలో `కోడ‌లి` కుదుపు!

వైసీపీ నేత‌, ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మాజీ మంత్రి జోగి ర‌మేష్ ఫ్యామిలీలో కోడ‌లు చేసిన ఆరోప‌ణలు పెను కుదుపున‌కు దారి తీశాయి. త‌న‌ను మాన‌సికంగా వేధించార‌ని.. అద‌న‌పు క‌ట్నం కోసం చిత్ర‌హింస‌లు పెట్టార‌ని ఆమె ఆరోపించిన విష‌యం తెలిసిందే. తాజాగా త‌న‌పై నాలుగు సార్లు హ‌త్యాయ‌త్నం కూడా చేశార‌ని జోగి ర‌మేష్ కుమారుడు జోగి రాజీవ్ భార్య మేఘ‌న ఆరోపించ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇప్ప‌టికే గ‌త నాలుగు రోజులుగా …

Read More »

రఘురామ వెరీ హ్యాపీ: ఆకివీడు రామాల‌యానికి సుప్రీం ఓకే!

ఏపీలో గ‌త 2 మాసాల కింద‌టి వ‌ర‌కు తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌నీయాంశం అయిన ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా, ఉండి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఆకివీడు రామాల‌య నిర్మాణం వ్య‌వ‌హారానికి సుప్రీంకోర్టు ప‌చ్చ జెండా ఊపింది. నిర్విఘ్నంగా ఈ రామాల‌యాన్ని నిర్మించుకోవ‌చ్చ‌ని పేర్కొంది. అదేస‌మ‌యంలో జిల్లా క‌లెక్ట‌ర్ ఇచ్చిన నాన్ అబ్జెక్ష‌న్ స‌ర్టిఫికెట్‌ను కూడా సుప్రీంకోర్టు స‌మ‌ర్థించింది. దీంతో రామాల‌యానికి స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ప‌చ్చ‌జెండా ఊపిన‌ట్టు అయింది. ఆకివీడులోని పెద‌పాడు గ్రామంలో పురాత‌న …

Read More »

కొట్టే హ‌క్కు పోలీసుల‌కు ఉందా?: సుప్రీంకోర్టు ఘాటు ప్ర‌శ్న‌

ప్ర‌జ‌లు, శాంతియుతంగా నిర‌స‌న చేస్తున్న‌వారిని కొట్టే హ‌క్కు పోలీసుల‌కు ఉందా? అని సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం భ‌యం గుప్పిట్లో లాఠీ చెప్పుచేత‌ల్లో జీవించాల‌ని అనుకుంటున్నారా? అని నిల‌దీసింది. దీనిని ఎట్టి ప‌రిస్థితిలోనూ స‌హించేది లేద‌ని స్ప‌ష్టం చేసింది. పోలీసులు ఏమీ ప్ర‌త్యేకం కాద‌ని.. రాజ్యాంగం అంద‌రికీ స‌మానంగానే హ‌క్కులు క‌ల్పిస్తుంద‌ని పేర్కొంది. ఈ మేర‌కు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో …

Read More »

సొంత పార్టీ లేన‌ట్టే… సాయిరెడ్డి వెనుక‌డుగు రీజ‌నిదేనా?

వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వి. విజ‌యసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడ‌తాన‌ని కొన్నాళ్ల కింద‌టే ప్ర‌క‌టించారు. వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి దాదాపు ఏడాదిన్న‌ర అయిపోయింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న బీజేపీ వైపు కానీ.. లేదా టీడీపీలో కానీ చేరుతార‌ని పెద్ద ఎత్తున రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌సాగింది. అయితే.. అప్ప‌ట్లో మౌనంగా ఉన్న సాయిరెడ్డి.. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణం కేసులో ఈడీ అధికారులు …

Read More »

బోండా ఉమపై వర్మ ఫైర్

టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ సొంత పార్టీపై కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. 2019-24 మధ్య పార్టీ కోసం తాను కష్టపడ్డా తనకు మంత్రి పదవి దక్కలేదని ఉమ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇక, వైసీపీ నుంచి వచ్చిన పార్థసారథి, కొండపల్లి శ్రీనివాస్, సవితలకు మంత్రి పదవులిచ్చి తనకు ఇవ్వలేదని ఉమ చేసిన కామెంట్లు టీడీపీ అధిష్టానానికి కోపం తెప్పించాయి. …

Read More »

పార్టీ అధిష్టానానికే బోండా ఉమ సవాల్?

ముద్రగడ పద్మనాభం సంతాప సభకు హాజరైన అంశంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాను వైసీపీ నిర్వహించిన సభకు వెళ్లలేదని, జనసేన మాజీ నేత దాసరి రాము ఏర్పాటు చేసిన సంతాప సభకే హాజరయ్యానని స్పష్టం చేశారు. అక్కడ అంబటి రాంబాబు కనిపించడంతో మర్యాదపూర్వకంగా పలకరించానని తెలిపారు. తనను ఇప్పటివరకు పార్టీ అధిష్ఠానం వివరణ కోరలేదని, ఒకవేళ అడిగితే తప్పకుండా ఇస్తానన్నారు. …

Read More »

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ నేతలు ఓ రేంజిలో ఎలివేషన్లు ఇస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ విశేషణాలేమీ ఆయనలో లేవని తాజాగా తేలిపోయిందన్న వాదన ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇతరుల సంగతి అలా పక్కనపెడితే… తోడబుట్టిన చెల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి… ఏకంగా ఆపరేషన్ చేయించుకున్నా కూడా జగన్ లో ఏమాత్రం స్పందన కనిపించలేదు. వెరసి తోడబుట్టిన చెల్లి బాగోగులే పట్టించుకోని జగన్.. …

Read More »

జ‌న‌సేన ఎమ్మెల్యే రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తారా ..?

తిరుప‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన జ‌న‌సేన నాయ‌కుడు, సీనియ‌ర్ నేత ఆర‌ణి శ్రీనివాసులు రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీనుంచి త‌ప్పుకొంటున్నార‌న్న చ‌ర్చ జ‌న‌సేన వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే.. దీనిపై ఆర‌ణి మాత్రం ఇంకా స్పందించ‌లేదు. ప్ర‌ధానంగా రెండు కార‌ణాల‌తో ఆర‌ణి త‌ప్పుకొంటున్న‌ట్టు జ‌న‌సేన వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ వ్య‌వ‌హారం తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనే కాకుండా పార్టీలోనూ హాట్ టాపిక్ …

Read More »

హెచ్చరికలతో సరిపెడితే ఎలా బాబు గారు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వైఖ‌రి.. పార్టీ నాయ‌కులకు బాగా క‌లిసి వ‌స్తోంద‌న్న‌వాద‌న వినిపిస్తోంది. ఇప్ప‌టికి రెండు సంవ‌త్స‌రాలుగా చంద్ర‌బాబు.. త‌మ్ముళ్ల‌కు హెచ్చ‌రిక‌ల‌తోనే స‌రిపెడుతున్నారు. ఎంత పెద్ద త‌ప్పు చేసినా.. కేవ‌లం స‌స్పెన్ష‌న్తోనే స‌రిపుచ్చుతున్నారు. దీంతో మూడు మాసాలు ఆగి..త‌ర్వాత వారు భేషుగ్గా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. దీనివ‌ల్ల పార్టీ నాయ‌కుల‌కు పెద్ద‌గా సీరియ‌స్ నెస్ క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు. అయినా.. చంద్ర‌బాబు మాత్రం సీరియ‌స్ యాక్ష‌న్‌ను కేవ‌లం ప్ర‌క‌ట‌న‌ల‌తోనే స‌రిపెడుతున్నారు. గుడివాడ‌లో …

Read More »