Political News

కేసీఆర్ పోటీ వెనుక రూ.2వేల కోట్ల భూములే టార్గెట్: రేవంత్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద సంచలన ఆరోపణ చేశారు టీపీసీసీ రథసారధి రేవంత్ రెడ్డి. తాజా ఎన్నికల్లో గజ్వేల్ తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్న కేసీఆర్ అసలు లక్ష్యం వేరే ఉందన్న ఆయన.. రూ.2వేల కోట్ల భూములు గుంజుకునేందుకు కుట్ర పన్నినట్లుగా ఆరోపించారు. ఓటుకు రూ.10వేలు ఇచ్చి రూ.200 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైనట్లుగా పేర్కొన్నారు. కామారెడ్డిలోని రూ.2 వేల కోట్ల భూములు గుంజుకోవటానికి సిద్ధమైనట్లు చెప్పిన …

Read More »

ధరణి లోపాలను అంగీకరించారా ?

భూ సమస్యల పరిష్కారం కోసం కేసీయార్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ బాగా వివాదాస్పదమైంది. ధరణి మొత్తం లోపాల పుట్టగా కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పదేపదే ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో కేసీయారేమో అన్నీ సమస్యలకు చెక్ పెట్టగలిగింది ధరణి మాత్రమే అని బహిరంగసభల్లో ఒకటికి పదిసార్లు చెబుతున్నారు. ధరణి వల్లే సమస్యలన్నీ పరిష్కారమైనట్లుగా కేసీయార్ చెబుతున్నారు. ఈ నేపధ్యంలోనే బిక్కనూరు రోడ్డుషోలో కేటీయార్ మళ్ళీ అధికారంలోకి రాగానే …

Read More »

30 నియోజకవర్గాలే డిసైడింగ్ ఫ్యాక్టరా ?

తెలంగాణా ఎన్నికల తేది దగ్గర పడుతున్న కొద్దీ ఓట్ల పోలరైజేషన్ పై చర్చలు పెరిగిపోతున్నాయి. మామూలుగా గత ఎన్నికల వరకు తమ ఊరికి, కాలనీకి ఏమిచేస్తారని అభ్యర్ధులను జనాలు అడిగేవారు లేకపోతే నిలదీసేవారు. కానీ ఈసారి ఎన్నికల ట్రెండ్ మారింది. తమ సామాజికవర్గానికి ఏమిచేస్తారు ? తమ మతానికి ఏమి చేయబోతున్నారని బహిరంగంగానే డిమాండ్లు చేస్తున్నారు, హామీలు తీసుకుంటున్నారు. నిజానికి ఎన్నికల నిబంధనల ప్రకారం మతం, కులం గురించి ఎన్నికల్లో …

Read More »

పాదయాత్రకు మళ్ళీ రెడీ అవుతున్నారా ?

మధ్యలో ఆపేసిన యువగళం పాదయాత్రను నారా లోకేష్ మళ్ళీ ప్రారంభించబోతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ విషయమై కొంతకాలంగా కసరత్తు చేస్తున్నారట. పార్టీలోని కొందరు సీనియర్లతో చర్చలు జరిపిన లోకేష్ పాదయాత్రను పునఃప్రారంభించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఈనెల 24వ తేదీనుండే యువగళంతో లోకేష్ మళ్ళీ జనాల్లోకి వెళ్ళబోతున్నారట. పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే చంద్రబాబునాయుడు అరెస్టయిన విషయం తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో పాదయాత్ర జరుగుతున్నపుడు …

Read More »

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇది ‘మూడో ఉద్య‌మం’: రేవంత్‌

ప్ర‌స్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు మూడో ద‌ఫా ఉద్య‌మానికి రెడీ అయ్యార‌ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికి తెలంగాణ ప్ర‌జ‌లు రెండు సార్లు ఉద్య‌మాలు చేశార‌ని చెప్పారు. ప్ర‌స్తుతం తెలంగాణ ఎన్నిక‌ల్లో ఆత్మ‌గౌర‌వం కోసం.. ఉద్య‌మించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తొలి ద‌శ‌లో నిజాం దురహంకారానికీ, నియంతృత్వానికి వ్య‌తిరేకంగా తెలంగాణ ప్ర‌జలు ఉద్య‌మించార‌ని రేవంత్‌రెడ్డి చెప్పారు.ఈ క్ర‌మంలోనే సాయుధ …

Read More »

నారా లోకేష్ ఎక్క‌డ‌? టీడీపీలో గుస‌గుస‌

టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేష్ ఎక్క‌డున్నారు? ఏం చేస్తున్నారు? ఇదీ.. ఇప్పుడు ఏపీ టీడీపీలో నేత‌ల మ‌ధ్య జ‌రుగుతున్న గుస‌గుస‌! గ‌త 20 రోజులుగా నారా లోకేష్ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు మ‌ధ్యంతర బెయిల్ వ‌చ్చిన త‌ర్వాత‌.. నారా లోకేష్ జాడ క‌నిపించ‌లే దని పార్టీలోనే చ‌ర్చ సాగుతోంది. జ‌న‌సేన‌-టీడీపీల పొత్తు ప్ర‌క‌ట‌న‌, త‌ర్వాత‌.. సంయుక్త అజెండా రూప‌కల్పన‌, ఉమ్మ‌డి మేనిఫెస్టోపై చ‌ర్చ‌ల …

Read More »

కేసీయార్ పై కాంగ్రెస్ ఆరోపణలు కరెక్టేనా ? సేమ్ సైడ్ గోల్

ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుండి తానేం మాట్లాడుతున్నారో కూడా కేసీయార్ కు అర్ధమవుతున్నట్లు లేదు. ప్రముఖ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎన్డీయేలో చేరాలని అనుకున్నమాట నిజమే అని అంగీకరించారు. అలాగే కేటీయార్ ముఖ్యమంత్రిని చేయాలని అనుకుని నరేంద్రమోడీ ఆశీర్వాదం అడిగిన మాట కూడా నిజమే అని అంగీకరించారు. కేసీయార్ ఇంటర్వ్యూ ఇపుడు ఎన్నికల సమయంలో సంచలనంగా మారింది. కేసీయార్ ఇంటర్వ్యూ 27వ తేదీ మ్యాగజైన్లో ఉంది. …

Read More »

నిజామాబాద్‌లో దారుణం… ఎమ్మెల్యే అభ్య‌ర్థి ఆత్మ‌హత్య‌

Suicide

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఒక‌వైపు పార్టీలు, నాయ‌కులు క్ష‌ణం తీరిక లేకుండా బిజీగా ఉన్నారు. ప్ర‌జ‌లను క‌లుస్తున్నారు. గుప్పెడు మెతుకులు తింటున్నారో కూడా తెలియ‌దు.. ఇలాంటి బిజీ వాతావ‌ర‌ణంలో కీల‌క‌మైన నిజామాబాద్ స్థానంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీకి దిగిన అభ్య‌ర్థి.. ఆదివారం ఉద‌యం ఇంట్లో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. నిజామాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అత్యంత కీల‌క‌మైంద‌నే విషయం తెలిసిందే. ఇక్క‌డ నుంచి కాంగ్రెస్‌, …

Read More »

గంటి పోటీపై ఉత్కంఠ

తెలుగుదేశంపార్టీలో యువనేత గంటి హరీష్ మాధుర్ పోటీచేసే స్ధానంపై జిల్లాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. గంటి హరీష్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు కానీ లోక్ సభ మాజీ స్పీకర్ బాలయోగి కొడుకు హరీష్ అంటే మాత్రం వెంటనే గుర్తుపడతారు. యువత కోటాలో తనకు టికెట్ దక్కుతుందని అనుకుంటున్నాడు. హరీష్ దృష్టంతా అమలాపురం లేదా పీ గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాలపైనే ఉందని పార్టీలో టాక్. అయితే పార్టీ మాత్రం హరీష్ ను …

Read More »

బీజేపీ డౌన్ ఫాల్ కు ఈటల కారణమా ?

బీజేపీకి రాజీనామా చేసిన విజయశాంతి అలియాస్ రాములమ్మ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. తెలంగాణాలో బీజేపీ డౌన్ ఫాల్ కు హుజూరాబాద్ ఎంఎల్ఏ ఈటల రాజేందరే కారణమన్నారు. బీజేపీలో ఈటల చేరిన తర్వాతే పార్టీకి దరిద్రం పట్టుకున్నదన్నట్లుగా ఘాటు వ్యాఖ్యలుచేశారు. ఆమె చేసిన ఆరోపణలను గమనిస్తే అసలు ఈటలను బీజేపీలోకి చేర్చిందే కేసీయార్ అన్నట్లుగా ఉంది. ఎందుకంటే బీజేపీలో కేసీయార్ నాటిన విత్తనమే ఈటల అని రాములమ్మ ఆరోపించారు. రాములమ్మ …

Read More »

విపక్ష నేతలను కుక్కలతో పోల్చిన కేసీఆర్

ప్రతిపక్ష నేతలపై సీఎం కేసీఆర్ మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. జనగామ వచ్చి కుక్కలు మొరిగిపోయాయని బిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి బాధపడుతున్నారని కాంగ్రెస్ నేతలనుద్దేశించి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుక్కలు మొరుగుతూనే ఉంటాయని, విపక్ష నేతలనుద్దేశించి కేసీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ కు పిండం పెడతానంటున్నారని, కానీ ఎవరికి పిండం పెట్టాలో ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. ఉద్యమం సమయంలో బచ్చన్నపేటలో నీటి ఎద్దడి చూసి ఏడ్చానని, …

Read More »

పొలిటికల్ కూలీల డిమాండ్ పెరిగిపోతోందా ?

ఎన్నికలకు ఇక ఉన్నది 11 రోజులే కావటంతో అభ్యర్ధుల ప్రచారం ముమ్మరం చేశారు. 10వ తేదీవరకు నామినేషన్లకు సరిపోయింది. 15వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ కూడా అయిపోయింది. దాంతో పోటీలో ఉన్న అభ్యర్ధులు ఎవరన్నది ఫైనల్ అయిపోయింది. దాంతో ఒక్కసారిగా అభ్యర్ధులందరు ఒక్కసారిగా ప్రచారంలో వేడిని పెంచేశారు. ఎప్పుడైతే అభ్యర్ధులు ప్రచారంలో వేడిని పెంచారో అప్పుడే కూలీలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. పొలిటికల్ కూలీలకు డిమాండ్ ఎందుకు పెరిగిపోయిందంటే పార్టీలకు …

Read More »