‘మాటకు-మాట’ అన్నట్టుగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై నిగ్గు తేలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనిపై 15 మాసాల కిందట వేసిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కూడా ప్రజల ముందు ఉంచు తామని చెప్పారు. అంతేకాదు.. దీనిపై అసెంబ్లీలోనే చర్చించి.. భరతం పడతామని .. తాజాగా మీడియాకు వెల్లడించారు. అవినీతి, ఆశ్రిత పక్ష పాతంతో తెలంగాణ ప్రజల ధనాన్ని దోచుకున్నారని సీఎం వ్యాఖ్యానించారు. …
Read More »ప్రాజెక్టుల నిర్మాణం వెనుక అవినీతి-ఆశ్రిత పక్షపాతం: రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన.. ప్రాజెక్టుల వెనుక అవినీతి, ఆశ్రిత పక్షపాతం ఉన్నాయని.. సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై నియమితులైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై మంత్రి వర్గంలో చర్చించారు. అనంతరం.. ఈ కమిషన్ సహా.. అధ్యయన కమిటీ ఇచ్చిన రెండు నివేదికల(ఘోష్ కమిటీ 620 పేజీలు, అధ్యయ కమిటీ 62 పేజీలు)ను కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఈ నివేదికలను అసెంబ్లీలో …
Read More »తండ్రి ఫ్యామిలీకి కవిత దూరమైనట్టేనా?
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబంలో ఇటీవల మార్పులు చాలా వేగంగా చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పార్టీ తరఫున ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కేసీఆర్ కుమార్తె కవిత తనకు చట్టసభల్లో అవకాశం కల్పించిన పార్టీని విమర్శిస్తూ సాగుతున్నారు. తాజాగా కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్ ను ఎలా టార్గెట్ చేయాలన్న దానిపై తీవ్ర కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ సర్కారు యత్నాలను అడ్డుకునే క్రమంలో …
Read More »కవిత వర్సెస్ జగదీష్.. రోడ్డున పడ్డ నేతలు!
ఇద్దరూ బీఆర్ ఎస్ గూటి పక్షులే. కానీ.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుని.. పార్టీనిబజారున పడేస్తున్నార న్న కామెంట్లు వినిపిస్తున్నాయి. లిల్లీ ఫుట్ అంటూ… జగదీష్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు.. తీవ్ర సంచలనంగా మారాయి. ప్రస్తుతం ఆమె ఏమన్నా.. కూడా ఎవరూ మాట్లాడకపోయినా.. అంతర్గతంగా మాత్రం కవిత వ్యవహార శైలిపై చర్చిస్తున్నారు. ఆమెను పార్టీ నుంచి తీసేయలేని పరిస్థితి.. చర్యలు తీసుకునే పరిస్థితి కూడా లేదన్నది నాయకులు …
Read More »‘కల్లుగీత’కు బాబు రెండో ‘లడ్డూ’ ఇచ్చేశారు!
తెలుగు దేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గానీ, ప్రస్తుత అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గానీ బీసీలకు అన్నింటా అగ్ర తాంబూలమే వేశారు. చంద్రబాబు ఆ సంప్రదాయాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే బీసీలకు ఎంపీ, ఎమ్మెల్యే, నామినేటెడ్ సీట్లలో అనుకున్న దాని కంటే కూడా మెరుగైన రీతిలోనే సీట్లను ఇచ్చిన బాబు… ప్రభుత్వ పథకాల్లోనూ వారి కోటాకు ఎక్కడ …
Read More »‘కారు’లో నుంచి ‘గువ్వ’ల ఎగిరిపోయింది!
తెలంగాణలో సోమవారం అటు అధికార పక్షం కాంగ్రెస్ తో పాటు ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు అత్యంత ప్రత్యేకమైన రోజు అని చెప్పుకున్నాం కదా. అలాంటి ప్రత్యేకమైన రోజే బీఆర్ఎస్ కు, ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు గట్టి షాక్ తగిలింది. ఆది నుంచి పార్టీ క్రియాశీలకంగా పనిచేసిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను …
Read More »ఇక్కడ రేవంత్ … అక్కడ కేసీఆర్
తెలంగాణలో సోమవారం నిజంగానే ఓ ప్రత్యేకమైన రోజు అని చెప్పక తప్పదు. ఎందుకంటే… రోజుల తరబడి సాగిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు అయిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించగా… దానిపై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సమీక్షించింది. అదే సమయంలో కేబినెట్ లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్న దానిపై కేబినెట్ భేటీకి ముందే బీఆర్ఎస్ అదినేత, మాజీ సీఎం కేసీఆర్… …
Read More »జగన్ చుట్టూ ఇక ‘ప్రైవేట్’ రక్షకులు!
ఏపీలో విపక్ష పార్టీ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రభుత్వంపై పూర్తిగా విశ్వాసం కోల్పోయినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏడాదికి ముందు తాను కూడా రాష్ట్రాన్ని పాలించిన అనుభవాన్ని మరిచిన జగన్… ప్రభుత్వ యంత్రాంగం గౌరవం దిగజారేలా వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు రేకెత్తుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే జగన్ కు సరిపడ భద్రతను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నా… ఆయన మాత్రం ఏకంగా 50 మంది దాకా ప్రైవేట్ …
Read More »ఆర్ఆర్ఆర్ పై కేసు పెట్టి తప్పుచేశా.. : కానిస్టేబుల్
ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే, టీడీపీ నేత రఘురామకృష్ణరాజు (ఆర్ ఆర్ ఆర్)పై కేసు పెట్టి తప్పు చేశానని ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ మహమ్మద్ ఫరూక్ సుప్రీంకోర్టుకు వెల్లడించారు. ఈ కేసును కొనసాగించే అవకాశం తనకు లేదన్నారు. అందుకే ఆయనపై నమోదు చేసిన కేసు సహా కోర్టులో వేసిన పిటిషన్లను కూడా వెనక్కి తీసుకుంటున్నానని ఆయన సుప్రీంకోర్టుకు తెలియజేశారు. అయితే దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. …
Read More »ఉపాసనకు కీలక పోస్టు ఇచ్చిన సీఎం రేవంత్
మెగాస్టార్ చిరంజీవి ఇంటి కోడలు, మెగా హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదలకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవిని అప్పగించింది. స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణకు ఆమెను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కో-చైర్మన్గా నియమించారు. ఈ నేపథ్యంలో మెగా స్టార్ సహా ఉపాసన ఇద్దరూ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయనకు అభినందనలు తెలిపారు. తనను కో చైర్మన్గా నియమించినందుకు ఉపాసన ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన …
Read More »ఈ నాయుడి ముందు అంతా జుజూబీలే!
వెంకటేశ్ నాయుడు… వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి బాల్య స్నేహితుడిగా పరిచయమై.. ఏపీ లిక్కర్ స్కాంలో అందరి కంటే కీలక భూమిక పోషించిన వ్యక్తిగా ఇప్పుడు ఓ రేంజిలో ఈయనకు హైప్ వచ్చేసింది. మొన్నటిదాకా ఈయన ముఖం కూడా ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా నిండా ఈయన గారి వింతలు, విశేషాలు, జల్సాలు, నోట్ల కట్టల లెక్కింపులు… అబ్బో ఒకటా, …
Read More »కొడాలి నానిపై మరో కేసు… ఎక్కడో తెలుసా?
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నానిని ఇప్పుడప్పుడే కేసులు వదిలేలా లేవు. ఇప్పటికే నాని ప్రాతినిధ్యం వహించిన గుడివాడ కేంద్రంగా పలు కేసులు నమోదు కాగా…గుండె సంబంధిత వ్యాధి, దానికి చికిత్స, ముంబైలో ఆపరేషన్ తదితర కారణాలతో జైలు నుంచి తప్పించుకున్నారన్న వాదనలు ఉన్నాయి. అయితే తాజాగా నానిపై మరో కేసు నమోదు అయ్యింది. అది కూడా విశాఖపట్నంలో నమోదు కావడం గమనార్హం. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates