Political News

గుడివాడలో నాని!.. ఏమాత్రం తగ్గలే!

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని… చాలా రోజుల తర్వాత తన సొంతూరు గుడివాడకు శుక్రవారం వచ్చారు. 2024 ఎన్నికల్లో పరాజయం తర్వాత గుడివాడను వీడిన నాని… హైదరాబాద్ కేంద్రంగానే ఉంటున్నారు. అడపాదడపా కోర్టు కేసుల నిమిత్తం గుడివాడ వచ్చినా… ఆ తంతు ముగించుకుని వెంటనే తిరిగి వెళ్లిపోయేవారు. అయితే శుక్రవారం గుడివాడ వచ్చిన నాని… వెన్నుపోటుకు రెండేళ్లు పేరిట వైసీపీ చేపట్టిన …

Read More »

మళ్ళీ హద్దు మీరిన అంబటి

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్నారని చెప్పాలి. ఇదివరకే టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన అంబటి… పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా రేగిన అలజడులతోనే ఆయన ఇంటిపైనా దాది జరిగింది. అంబటి అరెస్టు కూడా అయ్యారు. అయినా గానీ అంబటిలో ఏమాత్రం మార్పు రాలేదని …

Read More »

మేం ఏపీ కోసం త్యాగం చేశాం: ప‌వ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు!

తాము ఏపీ కోసం.. ఏపీ ప్ర‌జ‌ల కోసం త్యాగం చేశామ‌ని.. జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్యానించారు. 21 సీట్ల‌కే రాజీ ప‌డ‌డం వెనుక త్యాగం ఉంద‌న్నారు. రాష్ట్రంలో జ‌రిగిన 2024 ఎన్నిక‌ల్లో పార్టీలు గెల‌వ‌లేద‌ని.. ప్ర‌జ‌లు విజ‌యం సాధించార‌ని పేర్కొన్నారు. తిరుప‌తిలో జ‌రిగిన విజ‌యోత్స‌వ స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌సంగించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌వచిస్తున్న స‌బ్ కా సాథ్‌-స‌బ్ కా వికాస్ లక్ష్యంతోనే తాము …

Read More »

మీరు రమ్మంటేనే… లేదంటే లేదు: లారెన్స్

తమిళనాడు రాజకీయాల్లో సినీ స్టార్ల హవా ఓ రేంజిలో కొనసాగుతోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాదించిన స్టార్ హీరో దళపతి విజయ్… ఇప్పుడు ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. సింగిల్ దెబ్బకు సీఎం సీటు వచ్చి విజయ్ ఒడిలో వాలిపోయిన తీరు నిజంగానే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. విజయ్ విజయంతో మరింత మంది సినీ స్టార్లు పాలిటిక్స్ బాట పట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. ఆ వరుసలో …

Read More »

తాడిపత్రిలో పొలిటికల్ హీట్… పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి

అనంతపురం జిల్లా తాడిపత్రిలో శుక్రవారం పొలిటికల్ హీట్ రాజుకుంది. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా టీడీపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమవగా, మరోవైపు వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. రెండు వర్గాలు ఒకే రోజు పోటాపోటీ కార్యక్రమాలకు సిద్ధం కావడంతో శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావించిన …

Read More »

ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ దాకా…!

ట్రూ అప్ అంటే తెలుసు కదా. విద్యుత్ వినియోగంలో వినియోగదారులపై ఆయా ప్రభుత్వాలు ఎప్పుడో వాడిన విద్యుత్ కు… చాలా కాలం తర్వాత వసూలు చేసే అధిక చార్జీలు. ట్రూ అప్ అమలు చేస్తున్నారంటే… మనం గతంలో వాడిన విద్యుత్ పై పెంచిన బిల్లులను ప్రస్తుత వినియోగంతో కలిపి కట్టడమన్నమాట. ఏపీలో వైసీపీ హయాంలో ఐదేళ్ల వ్యవధిలోనే ఏకంగా 9 సార్లు ట్రూ అప్ చార్జీలను వసూలు చేశారు. మరి …

Read More »

విద్యాశాఖ‌ విజేత‌… నారా లోకేష్‌!

విద్యాశాఖ మంత్రిగా టీడీపీ యువ నాయ‌కుడు, జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌.. నారా లోకేష్ దూకుడు చూపిస్తున్నారు. నిజానికి విద్యా శాఖ అంటేనే చాలా సునిశిత‌మైన శాఖ‌. అంతేకాదు.. సెంటిమెంటుతో పాటు.. అనేక స‌మ‌స్య‌లు ఉన్న శాఖ కూడా. అయినా..త‌న‌కు న‌చ్చి-మెచ్చి ఈ శాఖ‌ను తీసుకున్న నారా లోకేష్‌.. రెండు సంత్స‌రాలు పూర్తిచేసుకున్నారు. నిజానికి విద్యాశాఖ‌తోపాటు నారా లోకేష్ ఐటీ స‌హా మాన‌వ‌వ‌న‌రుల శాఖ‌ను కూడా చూస్తున్నారు. దీంతో ఆయ‌న‌పై ప‌నిభారం …

Read More »

ఉపముఖ్యమంత్రి పవన్… ఎన్నడూ హద్దులు దాటలేదు!

రాష్ట్రంలో కూట‌మిప్ర‌భుత్వంఏర్ప‌డి జూన్ 12కు రెండేళ్లు పూర్త‌య్యాయి. 2024లో ఏర్ప‌డిన కూట‌మి ప్ర‌భుత్వంలో ఉప‌ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు చేప‌ట్టారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌. దీంతో త‌ర‌చుగా ఆయన ప‌నితీరు.. విధానం వంటివాటిపై స‌మాజంలో చ‌ర్చ సాగుతూనే ఉంది. రాజ‌కీయాలు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఓ ఉప ముఖ్య‌మంత్రిగా, అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రిగా ఆయ‌న ప‌నితీరుపై ప్ర‌జ‌లు నిశితంగానే గ‌మ‌నిస్తార‌ని అంటున్నారు. అందుకే ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా త‌న …

Read More »

ఆ ఇద్దరి చేతికి బేడీలు

ఏపీలో పెను కలకలం రేపిన మద్యం కుంభకోణంలో ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చేసింది. వైసీపీ హయాంలో జరిగిందని ఆరోపణలున్న లిక్కర్ స్కాంపై విచారణను వేగిరం చేసిన ఈడీ అధికారులు.. గురువారం రెండు కీలక చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో పాటుగా పాత్ర ఉందని భావిస్తున్న వారి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసిన అధికారులు… ఈ కేసులో కీలక నిందితులుగా పరిగణిస్తున్న …

Read More »

బీజేపీ ఖాతాలోకి మీనాక్షి సీటు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పోరాటం బరిలోకి దిగకుండానే ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆమెకు కేటాయించిన సీటు కాస్తా బీజేపీ ఖాతాలోకి చేరిపోయింది. మీనాక్షి నామినేషన్ వేసిన స్థానం నుంచి పోటీకి దిగిన రజనీశ్ అగర్వాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం అధికారికంగా ప్రకటించింది. వెరసి ఇక మీనాక్షి.. ఆమె తరఫున కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో పోరాటం చేసినా ఇక …

Read More »

లిక్కర్ స్కాంలో ‘కారుమూరి’కీ పాత్ర ఉందా…?

ఏపీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణం తవ్వుతున్న కొద్దీ సరికొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. దాదాపుగా రూ.3 వేల కోట్లకు పైగా అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు ఉన్న ఈ కుంభకోణంలో తాజాగా వైసీపీకి చెందిన మరో కీలక నేత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వైసీపీ హాయంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన తణుకు మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేరు ఇప్పుడు ఈ కుంభకోణంలో ప్రముఖంగా వినిపిస్తోంది. …

Read More »

ధరలు పెరుగుతుంటే ఇష్టమంటారా ట్రంప్

అమెరికాలో వస్తువుల ధరలు గత మూడు సంవత్సరాలలో ఎన్నడూ లేనంత వేగంగా పెరిగిపోతుండటంతో జనాల్లో విషయం చర్చనీయాంశంగా మారింది. గత నెల మే నెలకు సంబంధించిన అధికారిక లెక్కల ప్రకారం అమెరికాలో ద్రవ్యోల్బణం (ఇన్ఫ్లేషన్) 4.2 శాతానికి చేరుకుంది. ఈ పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, తనకు ఇన్ఫ్లేషన్ అంటే చాలా ఇష్టమని వైట్ హౌస్ లో వ్యాఖ్యానించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ధరలు పెరుగుతుంటే దేశ అధినేత …

Read More »