Political News

జగన్ వస్తేనే చంద్రబాబు స్పందిస్తున్నారా?

ఏ విష‌యంపైనైనా ముందు తాను మాట్లాడిన త‌ర్వాతే.. సీఎం చంద్ర‌బాబు స్పందిస్తున్నార‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఇటీవ‌ల కృష్ణ‌లంక‌కు చెందిన సాయికృష్ణ దారుణ ఘ‌ట‌న‌కు సంబంధించి తాను వెళ్లి బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన త‌ర్వాతే.. ఈ ప్ర‌భుత్వంలో కొంచెమైనా చ‌ల‌నం క‌లిగింద‌న్నారు. అప్ప‌టి వ‌ర‌కు క‌నీసం సాయికృష్ణ త‌ల్లి ఇచ్చిన ఫిర్యాదుల‌ను కూడా డీజీపీ సైతం తీసుకోలేద‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై చంద్ర‌బాబుకు అంత ఇంట్ర‌స్ట్ ఏంట‌ని ప్ర‌శ్నించారు. …

Read More »

‘ప్రజలు కూడా గొడ్డలి పార్టీ అనే పిలవాలి’

వైసీపీ అధినేత జ‌గ‌న్ కూట‌మి ప్ర‌భుత్వంపై భారీ ఎత్తున విమ‌ర్శ‌లు చేసిన నేప‌థ్యంలో ఇదేస‌మ‌యంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు.. నెల్లూరులో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో వైసీపీ పై నిప్పులు చెరిగారు. వైసీపీని విధ్వంస‌క‌ర పార్టీగా ఆయ‌న అభివ‌ర్ణించారు. ఆ పార్టీ ప్ర‌భుత్వం రాష్ట్రాన్ని ధ్వంసం చేసింద‌న్నారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను కూడా నీరు గార్చింద‌ని దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌తి వ్య‌వ‌స్థ‌ను ధ్వంసం చేసింద‌ని విమ‌ర్శించారు. రాష్ట్రంలో గొడ్డ‌లి పార్టీ ఉంది. దీనిని మీరు కూడా …

Read More »

అమరావతిపై అక్కసు తగ్గదా జగన్?

అంతా గందరగోళం.. అమరావతిపై అదే అక్కసు.. దాదాపు పదేళ్లుగా నిలకడ లేని విధానం.. స్పష్టతలేని ప్రకటనలు.. ప్రజలను గందరగోళంలోకి నెట్టడం.. తద్వారా రాజకీయ లబ్ధిని పొందాలని ప్రయత్నించడం.. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న చదరంగంలో అమరావతి రైతులు పావులుగా మారుతున్నారు. అధికారం కోల్పోయి దాదాపు 18 నెలల పాటు ప్రెస్‌మీట్లకే పరిమితమైన వైఎస్ జగన్, ఏడాది తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపడతానని చెబుతున్నారు. ఈలోగా అమరావతి రాజధానిపై మరోసారి …

Read More »

విజయ్ సర్కారును కూల్చేందుకు ఇంత పెద్ద కుట్ర?

తమిళనాడు వ్యవహారాలు ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే తెర తీస్తున్నాయి. ఇటీవలే జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన దళపతి విజయ్ ఘన విజయం సాధించి సినిమా హీరో నుంచి నేరుగా సీఎం కుర్చీలో కూర్చున్నారు. తాజాగా విజయ్ సర్కారును కూల్చేందుకు ఓ భారీ యత్నమే జరిగిందని, దానిని తమిళనాడు పోలీసులు భగ్నం చేశారన్న వార్తలు బుధవారం …

Read More »

మావిగన్ నచ్చితేనే నాకు ఓటు వెయ్యండి: జగన్!

ఏపీలో ఎప్పటికప్పుడు రాజకీయం వేడెక్కిపోతోంది. వాటన్నింటినీ తలదన్నేలా బుధవారం ఓ కీలక అంశం రంగంలోకి దిగింది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉండగానే…ఆ ఎన్నికల్లో తమ అజెండా ఇదేనంటూ వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఎజెండా మావిగనే అని ఆయన కుండబద్దలు కొట్టారు. మావిగన్ కు మద్దతు పలికే వారే …

Read More »

కేసీఆర్ పశుపతి… పోలిక సెట్ కాలేదు రేవంత్

మరోసారి బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. పదునైన మాటలు.. దానికి తగ్గట్లే వివరణ.. వీటికి తోడు లాజిక్ మిస్ కానట్లుగా ఉండే రేవంత్ మాటలకు భిన్నంగా తాజాగా ఆయన పోలిక ఉందని చెప్పాలి. ప్రాస కోసం పాకులాడినట్లు ఉన్నారే తప్పించి.. తాజా పోలిక తేలిపోయేలా.. ముఖ్యమంత్రి ఇమేజ్ ను దెబ్బ తీసేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రేవంత్ …

Read More »

బాబు మ‌రీ ఇంత సెన్సిటివా?

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇటీవ‌ల కాలంలో చిన్న చిన్న ఘ‌ట‌న‌ల‌పై కూడా చాలా సెన్సిటివ్‌గా స్పందిస్తున్నారు. ఆయా ఘ‌ట‌న‌ల‌పై త‌న ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డంతోపాటు.. బాధితుల‌కు అండ‌గా కూడా నిలుస్తున్నారు. విదేశాల్లో చిక్కుకుపోయిన వారి వీడియో త‌న దృష్టికి వ‌స్తే.. వెంట‌నే స్పందిస్తున్నారు. ఆయా కుటుంబాల‌కు అండ‌గా ఉంటున్నారు. అలానే ఇటీవ‌ల హోర్ముజ్ జ‌ల‌సంధిలో విశాఖ‌కు చెందిన నేవీ ఉద్యోగి అమెరికా సైన్యం జ‌రిపిన దాడిలో మృతి చెందిన విష‌యం …

Read More »

ఏపీలో సంచ‌ల‌నం… దువ్వాడ శ్రీను అదృశ్యం?

వైసీపీ నేత‌, ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం వ్య‌వ‌హారం రాష్ట్రంలో సంచ‌లనంగా మారింది. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స‌మ‌యంలో పోలీసు స్టేష‌న్‌కు వెళ్తున్నాన‌ని చెప్పిన ఆయ‌న రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు ఆచూకీ లేకుండా పోవ‌డంతో పెను దుమారంగా మారింది. దీనిపై ఆయ‌న స‌న్నిహితురాలు మాధురి పోలీసుల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. వారే దువ్వాడ శ్రీనును అప‌హ‌రించి ఉంటార‌ని వ్యాఖ్యానించారు. ఇదేస‌మ‌యంలో దువ్వాడ మ‌ద్ద‌తుదారులు, వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న‌కు …

Read More »

కొడాలి నానీపై చ‌ర్య‌లు వ‌ద్దు

kodali

వైసీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే కొడాలి నానీపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని ఏపీ హైకోర్టు తాజాగా మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇచ్చింది. త‌మ త‌దుప‌రి ఆదేశాలు వెలువ‌డే వ‌ర‌కు ఆయ‌న‌ను అరెస్టు చేయ‌డం కానీ.. ఇత‌ర చ‌ర్య‌లు తీసుకోవ‌డం కానీ, చేయొద్ద‌ని పోలీసుల‌ను ఆదేశించింది. తాజా కేసులో పొలిటిక‌ల్ అప్పియ‌రెన్స్ ఉన్న‌ట్టు క‌నిపిస్తోంద‌న్న న్యాయ‌వాది వాద‌న‌ల‌తో ఏకీ భ‌వించిన కోర్టు పోలీసుల చ‌ర్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టింది. ఇలాంటి కేసుల‌పై ఉన్న శ్ర‌ద్ధ‌.. సాధార‌ణ …

Read More »

తెలంగాణ బీజేపీపై హై కమాండ్ సీరియస్

తెలంగాణ బీజేపీని బ‌లోపేతం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం ద‌క్కించుకోవాల‌ని భావిస్తోంది. అయితే.. పైకి అలా అనుకున్నా.. క్షేత్ర‌స్థాయిలో కీల‌క నాయ‌కుల మ‌ధ్య మాత్రం అంత‌ర్గ‌త విభేదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. సాక్షాత్తూ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బీన్ పాల్గొన్న వ‌రంగ‌ల్ స‌భ‌లోనే విభేదాలు బ‌య‌ట ప‌డ్డాయి. వేదిక‌పైనే ఉన్న‌ప్ప‌టికీ.. కేంద్ర‌మంత్రులు, బీజేపీ అగ్ర‌నేత‌లుగా భావిస్తున్న బండి సంజ‌య్‌, కిష‌న్ రెడ్డిలు ప‌న్నెత్తు ప‌ల‌క‌రింపు …

Read More »

ట్రంప్ కు సుప్రీంకోర్టు షాక్… పౌరసత్వంపై కీలక తీర్పు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన బర్త్ రైట్ సిటిజన్ షిప్ పరిమితుల ప్రయత్నానికి అమెరికా సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. అమెరికాలో పుట్టిన పిల్లలకు రాజ్యాంగం కల్పించిన పౌరసత్వ హక్కును కొనసాగిస్తూ కీలక తీర్పు వెలువరించింది. అక్రమ వలసదారులు లేదా తాత్కాలిక వీసాలపై ఉన్న వారి పిల్లలకు ఆటోమేటిక్ గా పౌరసత్వం ఇవ్వకూడదని ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్తర్వుపై పలు కోర్టుల్లో సవాళ్లు దాఖలయ్యాయి. చివరకు ఈ వ్యవహారం …

Read More »

వైసీపీని వెంటాడుతున్న అమ‌రావ‌తి.. సీరియ‌స్‌.. !

అమ‌రావ‌తి రాజ‌ధాని వ్య‌వ‌హారాన్ని వైసీపీ అధినేత జ‌గ‌న్ లైట్ తీసుకుంటున్నారు. ప్ర‌జ‌లు త‌న‌వెంటే ఉంటార‌ని.. తాను ఏం చెప్పినా ఓకే అంటార‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఈ ఏడాది ఆయ‌న మూడు రాజ‌ధా నుల‌ను ప‌క్క‌న పెట్టి మావిగ‌న్ అనే మాట తెర‌మీదికి తెచ్చారు. దీనిపై అనేక మంది మేధావులు విస్మ‌యం వ్య‌క్తం చేశారు. కానీ, సాధార‌ణ ప్ర‌జ‌లు మాత్రం త‌న‌తోనే ఉన్నార‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. నిజానికి అమ‌రావ‌తి విష‌యంలో ప‌క్కా …

Read More »