Political News

ముద్ర‌గ‌డ‌తో వంగ‌వీటి కుమార్తె భేటీ?

కాపు ఉద్య‌మ మాజీ నాయ‌కుడు, ప్ర‌స్తుత వైసీపీ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంతో ప్ర‌ముఖ నాయ‌కుడు, దివంగత వంగ‌వీటి రంగా కుమార్తె.. ఆశా కిర‌ణ్ భేటీ అయ్యార‌న్న వార్త ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. గ‌త ఏడాది మ‌ధ్య‌లో తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్టు.. ఆశా కిర‌ణ్ మీడియా ముందు ప్ర‌క‌టించారు. అయితే.. స్వ‌చ్ఛంద సేవా కార్య‌క్ర‌మాల ద్వారా ముందు ప్ర‌జా క్షేత్రంలోకి అడుగు పెడ‌తాన‌ని.. త‌ర్వాత రాజ‌కీయాలవైపు వ‌స్తాన‌ని ఆమె …

Read More »

ముందు పగ… తర్వాతే అభివృద్ది అంటే ఎలా జగన్?

2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం పక్కా అని భావించిన వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. అంతే అప్పటిదాకా ఓ రేంజిలో ధీమా చూపించిన వైసీపీ శ్రేణులంతా గప్ చుప్ అయిపోయాయి. ఆపై కొంతకాలం పాటు సైలెంట్ గానే ఉన్న వైసీపీ శ్రేణులు…తమ పరాజయానికి కారణమేమిటన్న దానిపై బాగానే ఆలోచించాయి. ఈ సందర్భంగా తమ పరాజయం కంటే కూటమి పార్టీల గెలుపునకు కారణమేమిటన్న దానిపైనే వైసీపీ నేతలంతా దృష్టి సారించినట్లున్నారు. లోకేశ్ …

Read More »

చిన్ని వర్సెస్ నాని… పీక్స్ కు వెళ్లినట్టే!

కేశినేని శ్రీనివాస్ అలియాస్ కేశినేని నాని… కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్ని… ఇద్దరూ తోడబుట్టిన అన్నదమ్ములే. అంతేనా వారిద్దరూ ఒకే పార్టీతోనే రాజకీయాలు మొదలుపెట్టారు. ఇద్దరూ బెజవాడ నుంచే ఎంపీలుగా విజయం సాధించారు. 2024 ఎన్నికల దాకా ఈ అన్నాదమ్ముల మధ్య ఎంత విభేదాలున్నా బయటకు అయితే రాలేదు. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు కాస్తంత ముందుగా పొడచూపిన విభేదాలతో టీడీపీని వీడిన నాని వైసీపీలో చేరిపోయారు. ఇక అప్పటి …

Read More »

లోకేశ్ చెప్పినట్టు ‘రాయల్’ సీమే!

మొన్నటిదాకా రాయలసీమ అంటే కరువు సీమ కిందే లెక్క. ఏ రాజకీయ పార్టీ అదికారంలోకి వచ్చినా… రాయలసీమ ఓట్లను గంపగుత్తగా వేయించుకునేందుకు రాయలసీమను రతనాల సీమ చేస్తామంటూ చెప్పేవారు. ఎన్నికల సమయంలో అందరి నోటా వినిపించే ఈ మాట… ఆ తర్వాత ఎప్పుడో ఆయా పార్టీల బహిరంగ సభల్లోనే వినిపించేది. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. కూటమి పాలనలో రాయలసీమ రతనాల సీమ కాలేకున్నా… ‘రాయల్’ సీమగా అయితే మారిపోయింది. …

Read More »

పశ్చిమలో కూటమిలో కుంపట్లు.. బాబు, పవన్ సీరియస్.. ?

గోదావరి జిల్లాల రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్‌గానే ఉంటుంది. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తీర్పు ఇస్తే రాష్ట్రంలో అధికారం ఎవరిదో తేలిపోతుందనేది ఒక బలమైన సెంటిమెంట్. 2014లో అయినా, మొన్నటి ఎన్నికల్లో అయినా పశ్చిమ జనం కూటమికి వన్‌సైడ్ విజయాన్ని అందించి బ్రహ్మరథం పట్టారు. అయితే, అధికారం దక్కిన ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం, జనసేన నేతల మధ్య …

Read More »

జగన్ సభకు అనుమతి ఎందుకు లేదు పవన్: రేవంత్ రెడ్డి

తెలంగాణ‌లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌.. ఈ నెల 2న నిర్వ‌హించ త‌ల‌పెట్టిన తెలంగాణ న‌వ‌నిర్మాణ సంక‌ల్ప స‌భ‌కు పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌ని విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న అదే రోజు.. త‌న ఇంట్లోనే మీడియా స‌మావేశం పెట్టారు. ఈ సంద‌ర్భంగానే తెలంగాణ మీ జాగీరా? అని ప్ర‌శ్నించారు. ఈ వ్య‌వ‌హారం.. పెద్ద దుమారం రేపిన విష‌యం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నేత‌లు, మంత్రులు సైతం .. పెద్ద ఎత్తున ప‌వ‌న్ …

Read More »

అసెంబ్లీ వ‌ద్దు.. ప్ర‌జ‌లూ వ‌ద్దు.. జ‌గ‌న్ ల‌క్ష్యం ఏంటి.. ?

ఏపీలో ప్ర‌తిప‌క్ష పార్టీ(ప్ర‌ధాన కాదు)గా ఉన్న వైసీపీ రెండేళ్ల కాలంలో ఏం చేసింది? ఏం సాధించింది? అనేది ఆస‌క్తిక‌రం. శుక్ర‌వారం(జూన్ 12) నాటికి రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఏర్ప‌డి రెండు సంవ‌త్స‌రాలు పూర్త‌య్యాయి. ఈ రెండేళ్ల కాలంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ ఏం చేశారు? అనేది ముఖ్యం. ప్ర‌భుత్వం ప‌రంగా గెలిచినా ఓడినా.. ఎమ్మెల్యేగా అసెంబ్లీని గౌర‌వించాలి. అసెంబ్లీకి రావాలి. స‌మ‌స్య‌ల‌పై ఎలుగెత్తాలి. మ‌రీ ముఖ్యంగా మాజీ సీఎంగా ఆయ‌న‌కు ఉండే …

Read More »

మళ్లీ డీలిమిటేషన్ రచ్చ షురూ

దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ రచ్చను జనం మరిచిపోకముందే…మరోమారు అదే అంశంపై చర్చ మొదలైపోయింది. అంతేకాకుండా మునుపటిలా ఈ దఫా కూడా దీనిపై చర్చ ఓ రేంజిలో జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు నుంచి దీనికి సంబంధించి ఎలాంటి మాట వెలువడకున్నా.. అప్పుడే డీలిమిటేషన్ భయాలను వ్యక్తమవుతున్నాయి. …

Read More »

రెడ్ బుక్ తెరిచే ఉంది… వైసీపీకి లోకేష్ వార్నింగ్‌

రెడ్ బుక్ మూసేయ‌లేద‌ని.. అది ఇంకా తెరిచే ఉంద‌ని మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రెడ్ బుక్‌లో ఇంకా చాలా పేజీలు ఉన్నాయ‌న్నారు. ర‌ప్పా.. రప్పా అంటే.. చూస్తూ ఊరుకునేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) పాల‌న‌కు .. ప్ర‌జా పాల‌న‌కు తేడా గ‌మ‌నించాల‌ని ఆయ‌న సూచించారు. గ‌త ఐదేళ్ల‌లో జేసీబీలు వ‌చ్చేవ‌ని, న‌డిరోడ్డుపై దాడులు చేసేవార‌ని.. హ‌త్య‌లు చేసేవార‌ని.. వైసీపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. …

Read More »

‘అన్న లేని లోటును నా పవనన్న తీర్చాడు’

తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు. తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయిన సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన సభలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకున్నాయి. “సినిమాలో పవర్ స్టార్… రాజకీయాల్లో జనసేనాని. ఎక్కడ తగ్గాలో తెలుసు.. ఎక్కడ నెగ్గాలో …

Read More »

బౌల‌ర్స్ మారినా.. బ్యాట్స్‌మెన్ ఓన్లీ సీబీఎన్‌: లోకేష్‌!

రాష్ట్రంలో బౌల‌ర్స్‌(ప్ర‌త్య‌ర్థులు) మారినా బ్యాట్స్‌మెన్ మాత్రం చంద్ర‌బాబు నాయుడేన‌ని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుప‌తిలో జ‌రిగిన ప్ర‌భుత్వ వియోజ‌త్స‌వ స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. గొడ్డ‌లి పార్టీ అరాచ‌కాల‌ను ప్ర‌తి ఇంటికీ వెళ్లి.. గ‌డ‌ప‌గ‌డ‌ప‌లోనూ వివ‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. 2014-19 మ‌ధ్య స్వ‌ర్ణ‌యుగం వంటి పాల‌న‌ను గ‌త ఎన్డీయే అందించింద‌న్నారు. కానీ, 2019-24 మ‌ధ్య ఒక్క‌ఛాన్స్ అంటూ వ‌చ్చిన గొడ్డ‌లి పార్టీ అరాచ‌కాలు సృష్టించింద‌ని తెలిపారు. అరాచ‌క పార్టీని అంత‌మొందించిన …

Read More »

మీనాక్షికి ఊరట దక్కలేదు!

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో పాటు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు షాకిచ్చింది. రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచిన మీనాక్షి నటరాజన్ నామినేషన్ ను సాంకేతిక కారణఆలతో తిరస్కరించిన తీరును సవాల్ చేస్తూ కాంగ్రాస్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. అంతేకాకుండా ఈ వ్యవహారంలో అన్యాయం జరిగిందని భావిస్తే.. నేరుగా కేంద్ర ఎన్నికల …

Read More »