Political News

6 నెలలే డెడ్ లైన్ – చంద్రబాబు

పార్టీలో కొత్త రక్తం ఎక్కించేందుకు చంద్రబాబునాయుడు 6 నెలలను డెడ్ లైనుగా పెట్టుకున్నారు. కుప్పం మున్సిపాలిటి ఓటమిపై కుప్పం నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతు పార్టీ బోలోపేతానికి కొత్తరక్తం ఎక్కించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం 6 నెలలు డెడ్ లైన్ పెట్టుకున్నట్లు చెప్పారు. కుప్పంలోనే కాకుండా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా పనిచేయని నేతలను మార్చేస్తానని స్పష్టంగా చెప్పారు. పార్టీ నేతలను మార్చటానికి రెండు పాయింట్లమీదే ఫోకస్ …

Read More »

జగన్ కి బ్యాడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

“సార్‌! ఏపీలోని నాలుగు జిల్లాలు అత‌లాకుత‌లం అయ్యాయి. వెంట‌నే స్పందించి వెయ్యి కోట్టు సాయం చేయండి!“ అని సీఎం జ‌గ‌న్‌.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వానికి లేఖ‌లు రాసి.. దాదాపు మూడు వారాలు గ‌డిచిపోయింది. అయినప్ప‌టికీ.. కేంద్రం రాష్ట్ర విప‌త్తుల నిధులు వాడుకోండి..అని అప్ప‌ట్లోనే స‌మాధానం చెప్పింది. అయితే.. ఈ విష‌యాన్ని ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పార్ల‌మెంటు స‌మావేశాల్లో.. వైసీపీ ఎంపీలు నిత్యం కేంద్రం దృష్టికి తీసుకువెళ్తున్నారు. దీంతో కేంద్రం పార్ల‌మెంటు …

Read More »

ముందే చెప్పా.. జ‌గ‌న్ వ‌స్తే ఇంతే: KA పాల్

కేఏ పాల్ గుర్తున్నారా?  గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జాశాంతి పార్టీ త‌ర‌ఫున అభ్య‌ర్థుల‌ను నిల‌బ‌డుతున్నాన‌ని.. చంద్ర‌బాబును, జ‌గ‌న్‌ను కూడా ఓడించి ఏపీలో అధికారంలోకి వ‌స్తాన‌ని.. ప‌దే ప‌దే చెబుతూ.. మీడియా ముందుకు వ‌చ్చిన కేఏ పాల్‌.. ఎన్నిక‌ల‌ త‌ర్వాత‌.. అడ్ర‌స్ లేకుండా పోయారు. అయితే.. త‌ర‌చుగా ఆయ‌న జూమ్ ద్వారానో.. ఆన్‌లైన్ ద్వారానో.. యూట్యూబ్ ద్వారానో.. త‌న అభిప్రాయాలు వెల్ల‌డిస్తున్నారు. మీడియా డిబేట్‌ల‌లోనూ ఆయ‌న త‌న గ‌ళం వినిపిస్తున్నారు. తాజాగా …

Read More »

జగన్ హిట్లర్ అవ్వకూడదు: వైసీపీ ఎంపీ

తాజాగా జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వైసీపీ ఎంపీల మధ్య మాటల యుద్దం జోరుగా సాగుతోన్న సంగతి తెలిసిందే. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును ఆ పార్టీ ఎంపీలు అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి జగన్ పై, వైసీపీ నేతలపై రఘురామ మండిపడ్డారు. ఈ క్రమంలోనే జగన్ పై ఆర్ఆర్ఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కూడా ముస్సోలిని, హిట్లర్ వంటి నియంతలలాగా …

Read More »

మోడీకి తన గ్రాఫ్ పడిపోతోందని అర్థమైందా ?

చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. లేకపోతే పార్లమెంటుకు ఎంపీలు హాజరవ్వాలని, పార్లమెంట్ లో జరిగే చర్చల్లో సక్రమంగా పాల్గొనాలని ఎంపీలకు క్లాసు ఎందుకు పీకుతారు ? ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీల వైఖరిపై ప్రధాని చాలా సీరియస్ అయ్యారు. చాలామంది ఎంపీలు అసలు పార్లమెంటుకే హాజరు కావడం లేదని తన అసహనాన్ని వ్యక్తంచేశారు. ఎంపీలందరూ పార్లమెంటు సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవ్వాలని చిన్నిపిల్లలకు చెప్పినట్టు …

Read More »

రేవంత్ ని హర్ట్ చేసిన ఢిల్లీ కాంగ్రెస్

ఇప్ప‌టికే హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో దారుణ ఫ‌లితంతో ఢీలా ప‌డ్డ రాష్ట్ర కాంగ్రెస్‌కు ప్ర‌స్తుతం ఢిల్లీలో అధిష్ఠానం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఇబ్బందిక‌రంగా మారుతుంద‌నే సూచ‌న‌లు కనిపిస్తున్నాయి. ఇక్క‌డ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి పోరాటం చేస్తుంటే.. అటు ఢిల్లీలో టీఆర్ఎస్ మంత్రుల‌తో క‌లిసి కాంగ్రెస్ స‌మావేశం నిర్వ‌హించ‌డం రాష్ట్ర నేత‌ల‌కు ఇబ్బందిక‌రంగా మారింది. దీనిపై జాతీయ నేత‌లు దృష్టి సారించాల‌ని రాష్ట్ర …

Read More »

అయ్యో మోత్కుప‌ల్లి.. ఆ చ‌ప్పుడే లేదు!

కొన్ని రోజుల క్రితం మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు పేరు టీఆర్ఎస్ వ‌ర్గాల‌తో పాటు మీడియాలోనూ ఎక్కువ‌గా వినిపించింది. ద‌ళిత బంధు కోసం కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన స‌మీక్ష‌లో ఆయ‌న సీఎం ప‌క్క‌న కూర్చోవ‌డం.. ఆ త‌ర్వాత అసెంబ్లీలో ప్ర‌సంగం స‌మ‌యంలోనే మోత్కుప‌ల్లి శాస‌న‌స‌భ‌కు వెళ్ల‌డం లాంటి విష‌యాలే అందుకు కార‌ణం. ఆయ‌న్ని టీఆర్ఎస్‌లో చేర్చుకున్న కేసీఆర్ ద‌ళిత బంధు ఛైర్మ‌న్‌గా చేస్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగింది. కానీ …

Read More »

రైతు ఉద్యమంపై కీలక నిర్ణయం ?

దాదాపు ఏడాదికి పైగా ఢిల్లీ శివార్లలో ఉద్యమం చేసి అనుకున్నది సాధించిన భారతీయ కిసాన్ యూనియన్ తన ఉద్యమానికి ముగింపు పలకబోతోందా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏడాది కాలంగా చేసిన ఉద్యమానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోడి రైతు సంఘాలకు గతంలోనే విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయమై తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా రైతుసంఘాలకు విజ్ఞప్తి కూడా అందింది.  ప్రధాన డిమాండ్ అయిన వ్యవసాయ చట్టాలను …

Read More »

రేవంత్ జోస్యం నిజ‌మైందా..?

ధాన్యం కొనుగోలుకు సంబంధించి టీఆర్ఎస్‌పై రేవంత్‌రెడ్డి చెప్పిన జోస్య‌మే నిజ‌మైందా.. మోడీతో ఆ పార్టీ ఎంపీలు కుమ్మ‌క్క‌య్యారన్న ఆరోప‌ణ వాస్త‌వ‌మేనా..? అన్నఅనుమానాలు రాష్ట్ర ప్ర‌జ‌ల్లో నెల‌కొన్నాయి. టీఆర్ఎస్ ఎంపీలు ఇక‌పై కేంద్రంతో ఎలా పోరాడ‌తారు..? రాష్ట్రంలో రైతుల మ‌ద్ద‌తు ఎలా కూడ‌గ‌డుతారు..? లేదా రేవంత్ రెడ్డి మాట‌ల‌ను నిజం చేస్తారా..? అని ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు స‌మ‌స్య‌పై పార్ల‌మెంటులో టీఆర్ఎస్ ధ‌ర్నాలు చేసింది నిన్న‌టి వ‌ర‌కు. ఈరోజు …

Read More »

పార్లమెంటులో టీఆర్ఎస్ ఒంటరైందా ?

పార్లమెంటు శీతాకాల  సమావేశాలను బహిష్కరించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. పార్లమెంట్ ఈనెల 23వ తేదీన ముగుస్తున్న విషయం తెలిసిందే. బాయిల్డ్ రైస్ కొనాలని, పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయాలనే డిమాండ్లతో గడచిన వారంరోజులుగా పార్లమెంటు ఉభయసభల్లో టీఆర్ఎస్ లోక్ సభ+రాజ్యసభ ఎంపీలు రకరకాలుగా ఆందోళనలు చేశారు. అయితే వీళ్ళ ఆందోళనలను, డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇదే విషయమై మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ ఆందోళనలను  కేంద్రం పట్టించుకోవడం …

Read More »

వామ్మో ఇదేం స్కీమ్ జగనన్న

వైసీపీ పాలనలో నిర్మాణ రంగం బాగా దెబ్బతిందని, కాంట్రాక్టర్లకు, బిల్లర్లకు బిల్లుల చెల్లింపు సకాలంలో జరగడం లేదని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కారణంతోనే కొత్తగా ఏవైనా నిర్మాణాల కోసం ప్రభుత్వం టెండర్లకు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో బిల్డర్లు, కాంట్రాక్టర్లు, రియల్టర్లకు ఏపీ ప్రభుత్వం మరో షాకిచ్చింది. ఇక నుంచి పట్టణ ప్రాంతాల్లో రాబోయే లేఅవుట్లలో …

Read More »

సీఎం అయ్యాక చేసే మొదటి పని అదే: CBN

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాము అధికారంలోకి రాగానే.. ఫ‌స్ట్‌.. త‌మ పార్టీ కార్య‌కర్త‌ల‌ను, నాయ‌కుల‌ను వేధించిన వారి అంతుచూస్తామ‌ని.. వెల్ల‌డించారు. ప్ర‌తి ఒక్క‌రినీ గుర్తు పెట్ఉట‌కుంటున్నామ‌ని.. చెప్పారు. అదేస‌మ‌యంలో ప్రతి కార్యకర్తకు టిడిపి అధిష్టానం అండగా ఉంటుందని చంద్రబాబు నాయుడు తెలిపారు.   నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులతో తాజాగా ఆయ‌న  సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో …

Read More »