Political News

హుజూరాబాద్ లో డబ్బే డబ్బు

అవును మీరు చదివింది అక్షరాల నిజమేనట. కాకపోతే నియోజకవర్గానికి అందుతున్న నిధులన్నీ ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల రూపంలో వస్తున్నాయి. కానీ జనాలు చెప్పుకుంటున్న డబ్బంతా పార్టీలు వెదలజల్లుతున్నది. పార్టీలు వెదజల్లుతున్న డబ్బంటే అనధికారికంగా స్ధానికనేతలకు అందిస్తున్న డబ్బన్నమాట. ఎప్పుడు జరుగుతుందో స్పష్టతలేని హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఒకవైపు కేసీయార్, మరోవైపు ఈటల రాజేందర్ పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఎవరికివారుగా స్దానికంగా …

Read More »

పీకే.. కాంగ్రెస్‌కే కాదు అస‌లు రాజ‌కీయాల‌కే ఇప్పుడు దూరం

ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా గొప్ప పేరు తెచ్చుకున్న ప్ర‌శాంత్ కిషోర్ (పీకే) ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రావాల‌నే త‌న నిర్ణ‌యాన్ని వాయిదా వేసుకున్నారా? ఆయ‌న ఇప్ప‌ట్లో కాంగ్రెస్ పార్టీలో చేర‌డం లేదా? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. కొద్ది కాలం పాటు ఈ రాజ‌కీయాలు.. ఎన్నిక‌ల గొడ‌వ నుంచి ఆయ‌న దూరంగా ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం. 2014 ఎన్నిక‌ల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంలో న‌రేంద్ర మోడీ ప్ర‌ధాని కావ‌డంలో కీల‌క పాత్ర పోషించిన …

Read More »

విజయమ్మ చెపిందేమిటి ? చేసిందేమిటి ?

పైకి చెప్పిందేమో రాజకీయాలకు అతీతమైన సమావేశమని. అందుకే తాము నిర్వహించిన సమావేశానికి ఆత్మయ సమావేశమని చెప్పుకున్నారు. కానీ సమావేశంలో జరిగింది మొత్తం రాజకీయమే. మరి ఇంతోటిదానికి విజయమ్మ వివిధ పార్టీల్లోని ఒకప్పటి వైఎస్సార్ అభిమానులు, మద్దతుదారులను ఎందుకు పిలిచారో అర్ధం కావటంలేదు. దివంగత సీఎం వైఎస్సార్ 12వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు విజయమ్మ పేరుతో సుమారు 350 మందికి ఆహ్వానాలు పంపారు. …

Read More »

సొంత పార్టీ నుంచే సెగ‌.. రేవంత్ ఏం చేస్తారో?

తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీల‌న్ని హుజూరాబాద్ ఉప ఎన్నిక‌పైనే దృష్టి పెట్టాయి. ఇప్పుడు ఎలాంటి అడుగులు వేసినా ఆ ఎన్నిక‌ల్లో విజ‌యాన్ని ల‌క్ష్యంగా చేసుకునే వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఆ దిశ‌గా త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌ను ముందుగానే రంగంలోకి దించాయి. అధికార టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ భార‌తీయ జ‌న‌తా పార్టీ నుంచి మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ బ‌రిలో దిగ‌డం ఖాయ‌మైన‌ట్లే. ఇక రాష్ట్రంలో మూడో ప్రధాన పార్టీగా ఉన్న …

Read More »

ప్టాలిన్ పై పవన్ ట్వీట్.. తమిళనాడు అసెంబ్లీలో చర్చ..!

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. పవన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. పవన్ ట్వీట్ చేశారు. అయితే.. ఇప్పుడు అదే ట్వీట్..తమిళనాడు అసెంబ్లీలో పెద్ద చర్చకు దారితీయడం గమనార్హం. శాసన సభ లో తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్ర మణియన్‌ ప్రసంగిస్తూ… ఈ ట్వీట్‌ గురించి ప్రస్తావించారు. ప్రతి పక్షం, అధికార పక్షం అనే తేడా …

Read More »

వ్యాక్సిన్ వేయించుకుంటేనే ఆల్కహాల్..!

కరోనా మహమ్మారి విజృంభించకుండా ఉండేందుకు.. దానిని అరికట్టేందుకు అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతూనే ఉంది. అయితే.. ఇప్పటికీ చాలా మంది వ్యాక్సిన్ వేయించుకోవడం లేదు. అందులో మందుబాబులు ఎక్కువ మంది ఉన్నారట. వ్యాక్సిన్ వేయించుకుంటే కొద్ది రోజుల పాటు మద్యానికి దూరంగా ఉండాల్సి వస్తుందని.. వ్యాక్సిన్ వేయించుకోనివారు కూడా ఉన్నారట. అందుకే.. ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఓ ఫిట్టింగ్ పెట్టింది. సచ్చినట్టూ మందుబాబులు కూడా వ్యాక్సిన్ …

Read More »

నిరుద్యోగులకు ప్రభుత్వం షాక్

ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిపెంపు విషయంలో నిరుద్యోగులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్ద షాకే ఇచ్చింది. వయోపరిమితిని 5 ఏళ్ళ సడలింపులో ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు మాత్రమే వర్తించేట్లుగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తాజా నిర్ణయం వల్ల ఓసీ, బీసీ, ఈబీసీ విద్యార్ధులు దారుణంగా దెబ్బతినబోతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు వయోపరిమితి పెంచినట్లే తమకు కూడా పెంచాలని పై క్యాటగిరీల నిరుద్యోగులు ఎంత అడిగినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఓసీలకు ఐదేళ్ళు వయోపరిమితిని పెంచాలని …

Read More »

పార్టీ కాదన్నా హాజరయ్యింది వీళ్ళేనా ?

మొత్తానికి రాజకీయంగా ఎంతో ఆసక్తిని రేకెత్తించిన వైఎస్సార్ 12వ వర్దంతి ఆత్మీయ సదస్సు ముగిసింది. వైఎస్ ఆత్మీయులు, సన్నిహితులు, మద్దతుదారులంటు సుమారు 350 మందిని విజయమ్మ ఆత్మీయ సదస్సుకు పిలిచారు. రెండురాష్ట్రాల్లోని అధికారపార్టీలకు చెందిన టీఆర్ఎస్, వైఎస్సార్సీపీల నుండి నేతలెవరు హాజరుకాలేదు. అయితే కాంగ్రెస్, బీజేపీల్లోని కొందరు నేతలు మాత్రం హాజరయ్యారు. రెండు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరు హాజరు కాకూడదని పార్టీ స్పష్టంగా చెప్పినా నలుగురు నేతలు …

Read More »

ఆఫ్ఘన్లో పెరిగిపోతున్న ఆకలి కేకలు

ఆప్ఘన్లో ఆకలి కేకలు పెరిగిపోతున్నాయి. లక్షలాది మంది జనాలు కడుపునిండా తిండితిని రోజులైపోయాయట. ఐక్యారాజ్య సమితి అంచనా ప్రకారం దేశంలోని మొత్తం జనాభాలో సుమారు 30 శాతంకి ఒకపూట భోజనం దొరకటం కూడా చాలా కష్టమైపోతోందట. వీరిల్లో ముసలివాళ్ళు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఒకవైపు తాలిబన్ల అరాచకం, మరోవైపు ఆకలి బాధలతో జనాలు అల్లాడిపోతున్నారు. ఆగష్టు 15వ తేదీన దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్న రెండు రోజులకు సమస్యలు మొదలైనట్లు అంచనా. …

Read More »

చిక్కులు మంచివే చింత‌మ‌నేని !!

చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌. త‌ర‌చుగా మీడియాలోకి వ‌స్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న చింత‌మ‌నేని.. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ యువ నాయ‌కుడు.. అబ్బాయి చౌద‌రి విజ‌యం ద‌క్కించుకున్నారు. వాస్త‌వానికి చింత‌మ‌నేని గెలిచి ఉండాలి. కానీ, కొద్ది తేడాతో ఆయ‌న ప‌రాజ‌యం పాల‌య్యారు. అయితే.. గెలుపు ఓట‌ములను స‌మానంగా భావించిన ఆయ‌న‌.. ఆదిలో టీడీపీ త‌ర‌ఫున బాగా దూకుడు చూపించారు. చంద్ర‌బాబు …

Read More »

జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఎన్నికల్లో చౌదరి ప్యానెల్ ఏకగ్రీవం

హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ పాలక మండలి కోసం నిర్వహించిన ఎన్నికల్లో నరేంద్ర చౌదరి ప్యానెల్ ఏకగ్రీవం అయింది. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ అధ్యక్షుడిగా సి.వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షురాలిగా ఎ.హిమబిందు ఎన్నికయ్యారు. కార్యదర్శిగా టి.హనుమంతరావు, సంయుక్త కార్యదర్శిగా ఎం.జనార్దన్ రెడ్డి ఎన్నికయ్యారు. పాలకమండలి సభ్యులుగా అమితారెడ్డి, తిరుపతిరావు, రమేశ్ చౌదరి, కిలారు రాజేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, వెంకటసోమరాజు, అశోక్ రావు, శివప్రసాద్, జగ్గారావు, రవీంద్రనాథ్, సుభాష్ ఎన్నికయ్యారు. ఈ నూతన పాలకమండలి రెండేళ్ల …

Read More »

ఆప్త మిత్రులు.. బ‌ద్ధ శ‌త్రువులుగా

తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో ఉద్య‌మ పార్టీగా టీఆర్ఎస్‌కు ఎంత‌టి కీల‌క పాత్ర పోషించిందో.. ఆ పార్టీతో సాగిన నాయ‌కులు హ‌రీశ్‌రావు, ఈట‌ల రాజేంద‌ర్ కూడా అంతే పాత్ర పోషించార‌నేది కాద‌న‌లేని నిజం. పార్ఠీ అధినాయ‌కుడు కేసీఆర్‌తో క‌లిసి వీళ్లిద్ద‌రు ఉద్య‌మంలో చురుగ్గా వ్య‌వ‌హ‌రించారు. త‌మ మ‌ధ్య ఉన్న మంచి మైత్రితో ఆప్త మిత్రులుగా సాగారు. అధికారంలోకి వ‌చ్చాక మంత్రివ‌ర్గంలో కీల‌క ప‌ద‌వులు చేప‌ట్టి పాల‌న‌లోనూ త‌మ ముద్ర చూపించారు. ఒక‌ప్పుడు …

Read More »