ఆంధ్రా,తెలంగాణ అధికారులు కేంద్ర హోం శాఖ నియమించిన త్రి సభ్య కమిటీ సభ్యులతో వర్చువల్ మీటింగ్ లో నిన్నటి వేళ పాల్గొన్నా ఫలితాలేవీ ఆశాజనకంగాలేవు.అనుకున్న సమయానికి అనుకున్న విధంగానే అనుకున్న అజెండాతో మీటింగ్ ప్రారంభం అయినా కూడా అధికారుల స్థాయిలో ఎవరి పంతం వారిదే అన్న విధంగా ఉన్నారు. ఎవరికి వారే తమ మాట నెగ్గించుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఏడేళ్ల కాలంలో కేంద్ర హోంశాఖ చూపని చొరవ సడెన్ …
Read More »పుట్టినరోజు కూడా కేసీఆర్ విషయంలో… షర్మిల అదే మాట
క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా లేనప్పటికీ ఆన్లైన్లో తెలంగాణ సీఎం కేసీఆర్ పై దూకుడుగా స్పందించే వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల మరోమారు గులాబీ దళపతి పుట్టినరోజు సందర్భంగా ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్ పుట్టిన రోజు నేపథ్యంలో ఆమె వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. రోజుకో రైతు చస్తున్నా, వారానికో నిరుద్యోగి తల్లికి గర్భశోకం మిగిలిస్తున్నా, పంటనష్టపోయి అప్పుల పాలవుతున్నా, జనాలు అరిగోసల పాలవుతున్నా… దొరగారూ పుట్టిన రోజు వేడుకలు చేసుకోండి …
Read More »పంతం నెగ్గించుకున్న కోమటి రెడ్డి..!
తెలంగాణ కాంగ్రెస్ ను పట్టిపీడిస్తున్న జాడ్యాలు వదలడం లేదా..? పరిస్థితి సవ్యంగా ఉందనుకున్నప్పుడల్లా మరో ఉపద్రవం వచ్చి పడుతోందా..? కోమటి రెడ్డితో రేవంత్ భేటీ పైపై పటారమేనా..? వీరి భేటీ వెనుక రహస్య ఎజెండా మరొకటి ఉందా..? అదే అమలైతే పలువురు అభ్యర్థులకు ఆశనిపాతంగా మారుతుందా..? అంటే అవుననే సమాధానాలు ఇస్తున్నారు పార్టీ నేతలు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కోమటి రెడ్డి తీవ్రంగా ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఆ …
Read More »కేసీఆర్ ఫోన్ కోసం జగన్ వెయిటింగ్..?
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. జాతీయ రాజకీయాల గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత.. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం వరుసగా అధికారంలోకి వచ్చింది. దీంతో ఏపీ, తెలంగాణలకు న్యాయబద్ధంగా.. విభజన చట్టం ప్రకారం దక్కాల్సిన లబ్ధి దక్కడం లేదు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంపై తిరుగుబాటుకు తతెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. బీజేపీయేతర ప్రాంతీయ పార్టీలు, …
Read More »ప్రభుత్వానికి వైసీపీ ఎమ్మెల్యే శాపనార్ధాలు !
సొంత పార్టీ ఎంఎల్ఏ ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వానికి శాపనార్ధాలు పెట్టారు. జిల్లాల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగిందని నేతలతో మాట్లాడుతూ ఆనం చెప్పారు. అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ తర్వాత నామరూపాలు లేకుండా పోయిందట. తమ కుటుంబానికి రాజకీయంగా ప్రాధాన్యత లేకుండా చేయాలని నియోజకవర్గాన్ని విభజించిన ఒక నేతకూ అదే గతి పట్టిందట. జనం మాట వినకుండా జిల్లాల విభజన చేస్తే అధికారపార్టీకి కూడా అదే గతి పడుతుందని …
Read More »హఠాత్తుగా ప్రత్యక్షమైన అఖిల ప్రియ
చాలా కాలానికి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కనబడింది. నియోజకవర్గంలో ఆమె కనబడటమే అరుదైపోయింది. హైదరాబాద్, కడపలో భూ ఆక్రమణలు, కిడ్నాపులు, హత్యలకు కుట్ర తదితర కేసుల్లో పూర్తిగా కూరుకుపోయిన అఖిల అసలు నియోజకవర్గంలో కనబడటమే అరుదైపోయింది. ఇలాంటి సమయంలో హఠాత్తుగా ఆళ్ళగడ్డలో ప్రత్యక్షమయ్యారు. రావటం రావటమే ఆళ్ళగడ్డలో అవినీతి జరుగుతోందని, దాన్ని తాను నిరూపిస్తానంటు సవాలు విసరటమే విచిత్రంగా ఉంది. తాను మంత్రిగా ఉన్న కాలంలో అందరి దగ్గర …
Read More »చంద్రబాబుకు అతిపెద్ద సంకటం
టీడీపీ అధినేత చంద్రబాబు నానాటికీ చిక్కుల్లో కూరుకుపోతున్నారా? ఆయనకు అవకాశం కూడా చిక్క డం లేదా? అంటే..ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా జాతీయ రాజకీయాల్లో మార్పులు కొరుకుం టూ .. పలు ప్రాంతీయ పార్టీలు వ్యూహాలు రెడీ చేసుకుంటున్నాయి. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు.. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారును గద్దె దింపే వరకు నిద్రపోనని చెప్పారు. ఆ క్రమంలోనే ఆయన ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అధికార పార్టీలతో …
Read More »గౌతం సవాంగ్కు కీలక పదవి.. జగన్ వ్యూహాత్మక నిర్ణయం
ఏపీ మాజీ డీజీపీ గౌతం సవాంగ్ను ప్రభుత్వం అత్యంత కీలకమైన.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్( ఏపీపీఎస్సీ) చైర్మన్గా నియమించింది. రాష్ట్రంలో ఉద్యోగుల నిరసనల నేపథ్యంలో విజయవాడలో నిర్వహించి న చలో విజయవాడ కార్యక్రమంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సర్కారు.. ఈ క్రమంలో డీజీపీ గౌతం సవాంగ్ ను ఇటీవల ఆ పదవి నుంచి దింపేసిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం అనుకున్న విధంగా ఉద్యోగులు ఉద్యమాన్ని కంట్రోల్ …
Read More »టీఆర్ఎస్ ప్రచారం: తెలంగాణా-ఏపీ కలిసిపోతాయా?
ఇపుడిదే అంశంపై జనాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే కొద్దిరోజులుగా కేసీయార్, మంత్రులు హరీష్ రావు, కేటీయార్ ఇదే విషయాన్ని పదే పదే చెబుతున్నారు. మళ్ళీ బీజేపీకి ఓట్లేసి గెలిపిస్తే తెలంగాణా, ఏపీని కలిపేస్తారంటు గోల పెడుతున్నారు. మొదటి కేసీయార్ ఈ అనుమానాన్ని వ్యక్తం చేశారు. తర్వాత హరీష్ రావు ఇదే నిజమంటు ఒక బహిరంగ సభలో చెప్పారు. తాజాగా నిజామాబాద్ పర్యటనలో కేటీయార్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అంటే …
Read More »చినబాబును కాకాపడితే టీడీపీ టిక్కెట్ ఖాయమా?
వచ్చే ఎన్నికల్లో టికెట్ల కోసం.. టీడీపీలో అప్పుడే గుసగుస ప్రారంభమైంది. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే అభ్యర్థులను నిర్ణయించడం ద్వారా.. పార్టీని పరుగులు పెట్టించాలని.. చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలో యువతకు కూడా టికెట్లు ఎక్కువగానే ఇవ్వాలని నిర్ణయించారు. అయితే.. యూత్లో ఎక్కువ మంది.. లోకేష్కుసన్నిహితులు ఉన్నారు. ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరు ముగ్గురు కూడా లోకేష్కు టచ్లో ఉన్నారు. వీరు ఇప్పుడు తమ ఆశలన్నీ.. లోకేష్పైనే పెట్టుకున్నారు. లోకేష్కు …
Read More »వైసీపీ ఎంపీ గొడవ పడింది నిజమేనా?
బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కేంద్రంగా వివాదాలు పెరిగిపోతున్నాయి. రెగ్యులర్ గా ఏదో వివాదంలో ఎంపీ ఎందుకు ఇరుక్కుంటున్నారో అర్ధం కావటం లేదు. తాజాగా తన అనుచరులతో ఎంపీ కృష్ణలంక పోలీసుస్టేషన్ లో వీరంగం చేసినట్లు, పోలీసులపై దౌర్జన్యం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సరే ఈ ప్రచారాన్ని ఎంపీ ఖండిస్తున్నారనుకోండి అది వేరే సంగతి. పోలీసుస్టేషన్లో జరిగింది చాలా చిన్న ఘటనైతే దాన్ని తానంటే పడని మీడియా బూతద్దంలో చూపిస్తోందంటు …
Read More »రాజాసింగ్కు ఈసీ వార్నింగ్.. 24 గంటల్లో వివరణకు పట్టు!
సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే తెలంగాణ బీజేపీ నేత, ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రస్తాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్ను ఆయన ప్రభావితం చేసేలా.. ప్రజలను బెదిరించేలా మాట్లాడారంటూ.. చేసిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం స్పందించింది. యూపీ ఎన్నికల సందర్భంగా యోగి ఆదిత్యానాథ్కు మద్దతుగా రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేశారు. దీనిలో ఓటర్లను బెదిరించినట్టు చేసిన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates