వ్యవసాయ ఆధారిత దేశమైన మనదగ్గర ఓటు బ్యాంకు కూడా వ్యవసాయ ఆధారిత రాష్ట్రాల్లోనే పోటెత్తుతుండడం గమనార్హం. ఎన్ని పట్టణాలు ఉన్నా.. నగరాలు ఉన్నా.. పల్లెల్లోనే ఓటు బ్యాంకు సంపూర్ణం. అయితే, ఇప్పుడు అదే పల్లెల్లో ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఆయన తీసుకువచ్చిన కొత్త రైతు చట్టాలపై అన్నదాతలు ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. మద్దతు ధరలకు నానాటికీ గండి కొడుతున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దీనిని పూర్తిగా కార్పొరేట్ …
Read More »అభ్యర్ధి ప్రచారం కన్నా వెనక ప్రచారమే కొంప ముంచేట్లుంది
తొందరలో జరగబోతున్న తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ ఎంపి బల్లి దుర్గాప్రసాదరావు మరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఉపఎన్నిక ఖాయమైపోయిన తర్వాత తమ సత్తా ఏమిటో చాటు కోవాలని అన్నీ పార్టీలు సహజంగానే ఉత్సాహం చూపుతున్నాయి. ఇందులో బాగంగానే ముందుగా బీజేపీ పోటీకి రెడీ అంటు ప్రకటించేసింది. తర్వాత చంద్రబాబునాయుడు ఏకంగా అభ్యర్ధినే ప్రకటించేశారు. ఇదే సమయంలో ఆనవాయితికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి …
Read More »తమ్మినేని Vs చంద్రబాబు.. సరిపోయింది
ఒకసారి అసెంబ్లీ స్పీకర్ స్ధానంలో కూర్చున్న తర్వాత సదరు నేత అసెంబ్లీలోని అన్నీ పార్టీలకు సమాన వ్యక్తిగా మారిపోతారు. ఈ సంప్రదాయం ఎప్పుడో ఉండేది కానీ ఇపుడు టార్చిలైట్ వేసినా ఎక్కడా కనబడటం లేదు. తాజాగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విదానం చూస్తుంటే ఆ విషయం అర్ధమైపోతోంది. మరీ గడచిన మూడు రోజులుగా సభలో జరుగుతున్న వ్యవహారాలు చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. మూడు రోజుల సమావేశాల్లో చర్చలు జగన్మోహన్ రెడ్డి, …
Read More »జగన్ చేసింది రైటా రాంగా?
బుధవారమంతా సోషల్ మీడియాలో తెలుగువాళ్ల పొటిలికల్ చర్చలన్నీ ఒక వీడియో మీదే నడిచాయి. అసెంబ్లీలో వైకాపా సర్కారు చంద్రబాబుకు సంబంధించి ప్రదర్శించిన ఓ వీడియో తెగ వైరల్ అయిపోయింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నపుడు జనాల్ని పోలవరం ప్రాజెక్టు వద్దకు బస్సులు పెట్టి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అందులో ఓ బృందంలోని మహిళలు జయము జయము చంద్రన్నా అంటూ పాటలు పాడిన వీడియోను స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే అడిగి …
Read More »కేశినేని ఇంటా-బయటా ఒంటరైపోతున్నారా ?
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే టీడీపీలోనే కాకుండా మామూలు జనాల్లో కూడా ఇదే అనుమానం పెరిగిపోతోంది. మొన్నటి ఎన్నికల్లో విజయవాడ ఎంపిగా అతికష్టం మీద గెలిచారు. వైసీపీ అభ్యర్ధి పొట్లూరి వరప్రసాద్ మీద నాని గెలిచింది కేవలం 6 వేల ఓట్లతోనే. సరే 60 వేలైనా 6 వేలైనా గెలుపు గెలుపే అన్నదాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడైతే నాని గెలిచారో టీడీపీ ఘోరంగా ఓడిపోయిందో అప్పటి నుండే పార్టీతో …
Read More »రామోజీరావు మరో డిజిటల్ ఐడియా
మీడియా సంస్థ ఏదైనా కానీ.. దానికి ప్రకటనల మీద వచ్చే ఆదాయం చాలా ముఖ్యం. ఇందుకోసం సదరు మీడియా సంస్థలు పడే పాట్లు అన్నిఇన్ని కావు. వ్యాపారం అన్నాక ఆదాయం కోసం ఎంతోకొంత కష్టం తప్పదు. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో ప్రకటనల ఆదాయం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. కరోనా పుణ్యమా అని.. ప్రింట్ మీడియాకు భారీ దెబ్బ పడింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. డిజిటల్ …
Read More »తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కొత్త టార్గెట్ ఏమిటో తెలుసా ?
తెలుగురాష్ట్రాల్లో బీజేపీ డేంజరస్ గేమ్ మొదలుపెట్టిందా ? అంటే అవుననే అనుమానాలు పెరిగిపోతున్నాయి. వచ్చే సార్వత్రక ఎన్నికల్లో ఎలాగైనా తెలుగురాష్ట్రాల్లో తన బలాన్ని పెంచుకోవాలన్న టార్గెట్ తో ఎంతటి సాహసానికైనా రెడీ అంటోంది. కేంద్రంలో అధికారంలో ఉండటంతో పాటు రాష్ట్రాల అధ్యక్షుల దూకుడు మంత్రం కూడా పార్టీకి బాగా కలిసి వస్తోంది. తెలంగాణా అధ్యక్షుడు బండి సంజయ్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి చాలా దూకుడుగా వెళుతున్నారు. జనాల్లో భావోద్వేగాలు రగల్చటానికి …
Read More »చంద్రబాబుకు జగన్ భయపడ్డాడా?
గత ఏడాది ఎన్నికల్లో ఏకంగా 151 సీట్లు సాధించింది వైఎస్సార్ కాంగ్రెస్. తెలుగుదేశం 23 స్థానాలకు పరిమితమైంది. ఇక అప్పట్నుంచి ప్రతిపక్షాన్ని అధికార పక్షం ఎలా ఆడుకుంటూ ఉందో చూస్తూనే ఉన్నాం. ఎప్పుడూ అధికార పార్టీ.. తెలుగుదేశంను ఇబ్బంది పెట్టడం, భయపెట్టడమే చూస్తున్నాం. ప్రతిపక్షం లేవనెత్తే ఏ అంశాన్నీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. పంతానికి అయినా వాళ్ల డిమాండ్లను విస్మరిస్తూ వస్తోంది. ఇక అసెంబ్లీలో అయితే అధికార పార్టీ ఎంత దూకుడుగా …
Read More »రజనీ కన్నా పవనే నయమా ?
రాజకీయ పార్టీ పెట్టడంలో తమిళనాడులో రజనీకాంత్ తో పోల్చుకుంటే మన జనసేనాని పవన్ కల్యాణ్ నూరుశాతం నయమని అనిపిస్తోంది. పవన్ తో పోల్చుకుంటే రజనీకి తమిళనాడులో కోట్లాదిమంది అభిమానులున్నారు. రజనీ ఏమి చెబితే దాన్ని గుడ్డిగా అభిమానించి, ఫాలో అయిపోయే అభిమానులు రజనీ సొంతం. అలాంటిది రాజకీయ పార్టీ పెట్టే విషయంలో నిర్ణయం తీసుకునేందుకు ఇన్ని సంవత్సరాల గడువు ఎందుకు తీసుకుంటున్నాడో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇదిగో పార్టీ …
Read More »గుంటూరు టీడీపీలో ఎసరు పెట్టిన ఎంపీ రాజకీయం
టీడీపీ కంచుకోట.. గుంటూరు జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? నాయకులు ఎలా వ్యవహరిస్తున్నారు? అనే విషయం ఇటీవల చర్చకు వచ్చింది. దీనికి కారణం.. చంద్రబాబు రెండు రోజుల కిందట నిర్వహించిన కీలక నేతల టెలీ కాన్ఫరెన్స్లో కొందరు గుంటూరు నాయకులు ఎంపీ గల్లా జయదేవ్పై ఫిర్యాదులు చేశారు. ఆయన వ్యవహార శైలిపై విమర్శల బాణాలను సంధించారు. తమకు అందుబాటులో ఉండడంలేదని, నియోజకవర్గంలో ప్రజలకు కూడా అందుబాటులో లేరని.. …
Read More »గ్రేటర్లో ఓట్ల శాతం పెరుగుతుందా? ఎవరికి లాభం!
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుందా? కొన్ని పార్టీ లు వ్యూహాత్మకంగా పోలింగ్ పర్సంటేజ్ పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రచార పర్వం ముగిసింది. మరికొన్ని గంటల్లోనే పోలింగ్ జరగనుంది. అయితే.. ఈ నేపథ్యంలో ఎవరు గ్రేటర్ పీఠాన్ని దక్కించుకుంటారు? అనే చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి.. ఒకవైపు ఎవరి ఊహలు, ఎవరి అంచనాలు, ఎవరి విశ్లేషణలు వారికి …
Read More »చంద్రబాబు మాట చెల్లుబాటవుతుందా ?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికలు హీట్ పెంచేస్తున్నాయి. గెలుపు కోసం అధికార టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీలు చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేసుకుంటున్నాయి. ఈ పరిస్ధితుల్లో కాంగ్రెస్ గురించి కానీ లేకపోతే టీడీపీ గురించి కానీ అసలు పట్టించుకునే వాళ్ళే లేకుండాపోయారు. తమ గురించి ఎవరు పట్టించుకోకపోయినా ఆ రెండు పార్టీలు మరెందుకు పోటీ చేస్తున్నాయి ? ఎందుకంటే కేవలం ఉనికి కోసమనే చెప్పాలి. నిజానికి టీడీపీ గనుక …
Read More »