Political News

వైసీపీలో కొత్త చిచ్చు..

జిల్లాల స్థాయిలో వైసీపీ ఇప్ప‌టికే క‌ష్టాల్లో ఉంది. అనేక జిల్లాల్లో పార్టీ ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా ఉంద‌ని.. నాయ‌కుల మ‌ధ్య స‌మ‌న్వ‌యం కొర‌వ‌డింద‌ని.. పార్టీ అధిష్టానం ఇప్ప‌టికే త‌ల్ల‌డిల్లుతోంది. అయిన‌ప్ప‌టికీ.. నాయ‌కులు మాత్రం ఎక్క‌డా త‌గ్గేదేలే అంటున్నారు. ఎవ‌రికి వారు త‌మ ఇష్టం వ‌చ్చిన విధానంలో ముందుకుసాగుతున్నారు. తాజాగాఅన‌కాప‌ల్లి జిల్లాలో వైసీపీ పాలిటిక్స్‌ హీటెక్కుతున్నాయి. యలమంచిలి ఎమ్మెల్యేగా కన్నబాబు రాజుకు జిల్లాకు చెందిన యువ మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ వ‌ర్గం పొగ‌పెడుతోంద‌నే …

Read More »

ఉచితాల‌తో దేశాన్ని నాశ‌నం చేస్తారా?: సుప్రీం కోర్టు

రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలు తీవ్రమైన అంశమని సుప్రీం కోర్టు సీరియ‌స్‌గా స్పందించింది. దీనిపై చర్చ జరగాల్సిందేనని అభిప్రాయపడింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం లేదని సీజేఐ జస్టిస్‌ రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ప్రశ్నించింది. ఉచితాలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయబోతున్నాయని హెచ్చ‌రించింది. రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం వచ్చేంత వరకు ఉచిత వాగ్దానాలు ఆగబోవని స్పష్టం చేసింది. …

Read More »

కుప్పంలో హైటెన్షన్‌ .. బాబుకు చుక్కలు చూపించారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనకు తొలిరేజే ఆటంకాలు సృష్టించిన వైసీపీ నాయ‌కులు.. రెండో రోజు మరింత అలజడికి యత్నిస్తున్నారు. రామకుప్పం పర్యటనలో తమపై దాడి చేశారంటూ నిరసన ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమైంది. ఈమేరకు కార్యకర్తలంతా కుప్పం రావాలని వైసీపీ నాయకులు వాట్సప్ సందేశాలు పంపారు. అలాగే ప్రైవేటు విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం నాయకులు.. చలో కుప్పం చేపట్టాలని నిర్ణయించారు. ఈమేరకు …

Read More »

చెత్త‌ప‌న్ను కోసం.. ఇంత పీడించాలా..

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం డ‌బ్బుల కోసం.. ఏదైనా చేస్తుంద‌నే వాద‌న జోరుగా వినిపిస్తోంది. కేంద్రం ఒత్తిళ్లకు త‌లొగ్గో.. లేక‌.. ఖ‌జానాలో సొమ్ము లేక‌పోవ‌డంతోనో.. ప్ర‌జ‌ల‌పై వివిధ రూపాల్లో ప్ర‌భుత్వం ఒత్తిడి తీసుకు వ‌స్తోంద‌నే వాద‌న అన్ని వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. అయినా.. కూడా ఎక్క‌డా అధికారులు వెన‌క్కి త‌గ్గడం లేదు. ముఖ్యంగా ప్ర‌జ‌ల ముక్కు పిండి అయినా.. చెత్త‌ప‌న్నును వ‌సూలు చేయాల‌ని.. అధికారులు భావిస్తున్నారు. వారికి పైనుంచి తీవ్ర‌స్థాయిలో ఒత్తిళ్లు …

Read More »

ఫొటో టాక్: ఏపీలో వైసీపీ గ‌ణ‌ప‌తి..

ఏ మాట‌కు ఆమాటే చెప్పుకోవాలి. వైసీపీలో ఉన్నంత మంది స్వామి భ‌క్తులు ఇత‌ర పార్టీలో మ‌న‌కు క‌నిపిం చ‌డం లేదు. అదా.. ఇదా.. అనే తేడా లేదు. ఎవ‌రో చూస్తారు.. ఏదో అంటారు. క‌ల‌డో లేడో అనే సంశ‌యం లేకుండా.. అధినేత మ‌న‌సు మెప్పించేలా.. నాయ‌కులు.. వేస్తున్న క‌లర్స్‌ అన్నీ ఇన్నీ కావు. సృష్టి ఆది యందు అన్న‌ట్టుగా.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన కొత్త‌లో త‌నంత‌ట త‌నే పాఠ‌శాలలు, పంచాయ‌తీ …

Read More »

ప్రాజెక్టు పూర్త‌య్యాకే ఎన్నిక‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్ చెప్పాడంటే.. చేస్తాడంటే! అని వైసీపీ నాయ‌కులు ప‌దే ప‌దే చెబుతుంటారు. కానీ, ఆయ న ఎన్నో చెప్పినా.. కొన్ని మాత్ర‌మే చేశార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. అయితే.. అవి ఎలా ఉన్నా.. ఇప్పుడు కూడా సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మ‌రి ఇది ఏం చేస్తారో చూడాలి. 2023 సెప్టెంబరులో వెలి గొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ప్రాజెక్టును ప్రారంభించాకే …

Read More »

ఏపీ స‌ర్కారుపై హైకోర్టు ఫైర్‌

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం లెక్క‌లేని విధంగా నియ‌మిస్తున్న స‌ల‌హాదారుల విష‌యంపై రాష్ట్ర హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అస‌లు స‌ల‌హాదారులు ఎందుకు? అని ప్ర‌శ్నించింది.  స‌ల‌హాదారులు కేవ‌లం స‌ల‌హాల‌కే ప‌రిమితం కావ‌డం లేద‌ని.. రాజ్యాంగేత‌ర శ‌క్తులుగా మారిపోతున్నార‌ని.. తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగింది. సలహాదారులను నియమించేందుకు అధికారుల కొరతేమైనా ఉందా అని న్యాయ‌మూర్తుల ధ‌ర్మాస‌నం నిలదీసింది. మంత్రులకు సలహాదారులు ఉంటే అర్థం ఉందిగానీ.. శాఖలకు సలహాదారు ఏమిటని ప్రశ్నించింది. ఇలానే వదిలేస్తే …

Read More »

వైసీపీ వ్యూహాలు అంతుచిక్కడం లేదే

వైసీపీ అధిష్టానం చేస్తున్న చ‌ర్య‌లు తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారితీస్తున్నాయి. ఎస్సీలకు అండ‌గా ఉంటామ‌ని ప‌దే ప‌దే చెప్పే పార్టీ.. ఇప్పుడు అదే ఎస్సీ నేత‌ల మ‌ధ్య చిచ్చు పెట్టి వినోదం చూస్తున్న‌ద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. గుంటూరు జిల్లా తాడికొండ ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం. ప్రస్తుతం ఇక్కడ అధికార పార్టీలో రాజకీయా లు వేగంగా మారుతున్నాయి. తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నియమిస్తున్నట్లు.. వైసీపీ …

Read More »

కుప్పం.. చంద్ర‌బాబు కాన్వాయ్‌పై రాళ్ల‌దాడి

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అధినేత చంద్ర‌బాబు .. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ప‌ర్య‌టించడాన్ని స‌హించ‌లేక పోయారు. వ్యూహాత్మ‌కంగా.. చంద్ర‌బాబు కాన్వాయ్‌పై వైసీపీ నేతలు రాళ్ల‌దాడితో చెల‌రేగిపోయారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం చంద్ర‌బాబు కుప్పం చేరుకున్నారు. ఈ క్ర‌మంలో చంద్రబాబుకు రాష్ట్ర సరిహద్దు కొంగనపల్లెలో వద్ద టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అయితే.. ఇక్కడ నుంచి చంద్ర‌బాబు రామ‌కుప్పం చేరుకోవాల్సి ఉంది. అక్క‌డ నిర్వ‌హించే కార్య‌క్ర‌మంలో ఆయ‌న …

Read More »

రాజ‌కీయ మంట‌లు.. పోలీసుల మధ్య గొడవ

శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడాల్సిన … ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ‌గా నిల‌వాల్సిన పోలీసులు ఇప్పుడు ఎదురు ప‌డితే చాలు.. కొట్టుకునే ప‌రిస్తితికి చేరుతున్నారు. నువ్వెంత .. అంటే నువ్వెంత‌.. అంటూ.. ఒకరిపై ఒక‌రు కాలు దువ్వుతున్నారు. ఇంత‌కీ ఇది ఎక్క‌డో కాదు.. మ‌న ద‌గ్గ‌రే.. ఏపీ-తెలంగాణ పోలీసులే! ఒక‌రిపై ఒక‌రు కాలు దువ్వుతున్నారు. `నువ్వు నా స‌రిహ‌ద్దు దాటొద్దు..` అని ఒక‌రికి ఒక‌రు ఆదేశాలు జారీ చేసుకుంటు న్నారు. దీనికి కార‌ణం.. రెండు …

Read More »

కలెక్టర్లకు జగన్ హోం వర్క్

మామూలుగా హోంవర్కంటే ఇంట్లో కూర్చుని పిల్లలు చేసేది. కానీ ఇక్కడ కలెక్టర్లకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హోంవర్క్ ఏమిటంటే ప్రతి నెల గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించటమే. ప్రతినెలా ప్రతి నియోజకవర్గంలోని 6 సచివాలయాలను కలెక్టర్లు విధిగా సందర్శించాల్సిందే అని తాజాగా ఆదేశించారు. గడపగడపకు వైసీపీ ప్రభుత్వం అనే కార్యక్రమంలో కలెక్టర్లు సచివాలయాలను సందర్శించాల్సిందే అని, వాటి పరిధిలో డెవలప్మెంట్ కార్యక్రమాలను టేకప్ చేయాల్సిందే అని స్పష్టంగా చెప్పారు. ఇప్పటివరకు …

Read More »

వైసీపీలో గుబులు రేపుతున్న సుప్రీం వ్యాఖ్య‌లు

కొన్ని కొన్ని విష‌యాలు ఎక్క‌డో జ‌రుగుతుంటాయి. కానీ, వాటితాలూకు మూలాలు మాత్రం ఏపీలో క‌నిపిస్తు న్నాయి. దీంతో అధికార పార్టీ నేత‌ల‌కు ఒకింత గుబులు రేగుతోంది. త‌మ ప‌రిస్థితి ఏంటి? అనే చ‌ర్చ కూడా చేస్తున్నారు. ఇప్పుడు కూడా అలాంటి చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. తాజాగా దేశ‌వ్యాప్తంగా.. రాజ‌కీయ పార్టీలు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇస్తున్న ఉచిత హామీలు.. త‌ర్వాత‌.. ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్న ఉచిత సంక్షేమం వంటి అంశాల‌పై దేశ …

Read More »