Political News

రోజాకు ఇబ్బందులు తప్పవా?

ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో ముందంతా మంత్రి రోజాకు ఇబ్బందులు తప్పేట్లే లేదు. మామూలుగానే రోజాకు నియోజకవర్గంలో బలమైన ప్రత్యర్ధివర్గం చాలా యాక్టివ్ గా ఉంటుంది. మంత్రయిన తర్వాత ప్రత్యర్ధివర్గంతో విభేదాలు సర్దుకుంటాయని అనుకుంటే అవి మరింతగా పెరుగుతున్నాయి. తాజాగా మంత్రికి సంబందం లేకుండానే నిండ్రం మండలంలోని కొప్పేడు గ్రామంలో రైతుభరోసా కేంద్రం, వెల్ నెస్ కేంద్రం నిర్మాణానికి భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమంతోనే రోజా మండిపోయారు. తన నియోజకవర్గంలో తనకు …

Read More »

కేసీఆర్ ఏపీ టూర్‌… మూడుపై ఏం చెపుతారో!

త్వ‌ర‌లోనే తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఏపీలో ప‌ర్య‌టించ‌నున్నారు. అందునా ఆయ‌న తొలిసభ విశాఖ లేదా విజ‌య‌న‌గ‌రంలో ఏర్పాటు చేసేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర‌స‌మితి(టీఆర్ఎస్‌)ని భార‌త రాష్ట్ర‌స‌మితి(బీఆర్ఎస్‌)గా మార్చిన ద‌రిమిలా.. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట‌కు రాలేదు. అయితే.. త్వ‌ర‌లోనే ఏపీతో ప్రారంభించి.. ద‌క్షిణాది రాష్ట్రాల్లో సుడిగాలి ప‌ర్య‌ట‌న చేయ‌నున్న‌ట్టు ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఏపీపైనే ఎక్కువ‌గా టార్గెట్ చేస్తున్నారు. అయితే.. ఏపీకి రావ‌డం …

Read More »

టీఆర్ఎస్ ఎంపీకి ఈడీ భారీ షాక్‌..

సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి.. కేంద్రంలో చ‌క్రం తిప్పుతాన‌ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో కేంద్రం కూడా అలెర్ట‌యిన‌ట్టు క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో త‌న‌దైన శైలిలో కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తోంది. తాజాగా.. టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్ ఇచ్చింది. ఎంపీ ఆస్తులను జప్తు చేస్తున్నట్లుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది. ఎంపీ నామా కు చెందిన రూ.80.65 కోట్లు విలువైన స్థిర, చర ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. రాంచి …

Read More »

ఈయనకు టికెట్ కన్ఫర్మ్ అయినట్లే

గుంటూరు జిల్లాలోని వినుకొండ నియోజకవర్గంలో జీవీ ఆంజనేయులుకు టికెట్ కన్ ఫర్మయ్యిందని సమాచారం. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ స్ధాయి సమీక్షా సమావేశంలో మాజీ ఎంఎల్ఏ జీవీ కృషిని అభినందించారు. 2014లో జీవీ పార్టీ తరపున మొదటి సారి గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రతిపక్షంలోకి వచ్చినప్పటినుండి పార్టీ కార్యక్రమాలను ముందుండి బాగానే నడుపుతున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా ప్రస్తావించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ ఇచ్చిన పిలుపును …

Read More »

‘వైసీపీ విముక్త ఏపీ’నే మా నినాదం: ప‌వ‌న్

‘వైసీపీ విముక్త ఏపీ’నే ఇక నుంచి త‌న నినాద‌మ‌ని.. జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు. ఏపీ నుంచి వైసీపీని త‌రిమికొట్టేందుకు ఎంత‌వ‌ర‌కైనా వెళ్తాన‌ని చెప్పారు. ఇది సాకారం అయ్యేవ‌ర‌కు.. తాను విశ్ర‌మించేది లేద‌న్నారు. విశాఖ నుంచి విజ‌య‌వాడ చేరుకున్న ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీపై నిప్పులు చెరిగారు. “ఆంధ్రప్రదేశ్‌ నుంచే రాయలసీమకు ఎక్కువ మంది ముఖ్యమంత్రులు వచ్చారు. అంత మంది సీఎంలు వచ్చినా.. రాయలసీమ ఎందుకు వెనుకబడి …

Read More »

వైసీపీ హింస‌ను కోరుకుంటోంది.. అయినా.. మేం: ప‌వ‌న్

తన విమర్శలు ఎప్పుడైనా విధానపరంగానే ఉంటాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. విశాఖ గర్జన ప్రకటించిన తర్వాతే జనవాణి ప్రకటించామని అనడం సరికాదని.. వైకాపా కార్యక్రమానికి ఇబ్బంది కలిగించడం జనసేన ఉద్దేశం కాదని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, పార్టీ నేత నాగబాబు మీడియా సమావేశంలో …

Read More »

వివేకా కేసులో కీల‌క ట్విస్ట్‌.. పోలీసులు చేతులు క‌లిపేశార‌ట‌!!

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసు ఇప్ప‌టికి నాలుగేళ్లుగా సాగుతూనే ఉంది. ఈ నేప‌థ్యంలో.. ఇప్ప‌టికైనా.. కేసును ప‌రిష్క‌రించి.. త‌మ‌కు న్యాయం చేయాల‌ని బాధిత వివేకా కుటుంబం కోరుకుంటోంది. అయితే.. పొలీసులు మాత్రం పైకి ఒక‌విధంగా.. లోలోన మ‌రో విధంగా వ్య‌వహ‌రిస్తున్నార‌ని.. సీబీఐ ఆరోపిస్తోంది. ముఖ్యంగా నిందితుల‌తో పోలీసులు చేతులు క‌లిపార‌ని.. నిందితుల‌తో పోలీసులు చేతులు క‌లిపార‌ని కూడా …

Read More »

జగన్‌కు పవన్ థ్యాంక్స్ చెప్పాల్సిందే

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏదో ఒక వివాదాన్ని కొని తెచ్చుకోని, ఎంతో కొంత చెడ్డ పేరు సంపాదించని రోజంటూ ఉండట్లేదు ఈ మధ్య. ప్రతిపక్షంలో ఉండగా రాజధానిగా అమరావతికి సంపూర్ణ మద్దతు ప్రకటించి.. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చి.. మూడేళ్ల పాటు రాజధాని విషయమై అసలేమీ చేయకపోవడం ద్వారా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది జగన్ సర్కారు.తాజాగా విశాఖ గర్జన పేరుతో …

Read More »

ఏపీలో ‘ఏకైక’ పోరాటం.. చేతులు క‌లుపుతున్న పార్టీలు!!

‘నువ్వు ఉత్త‌రం అయితే.. నేను ద‌క్షిణం’ అన్న‌ట్టుగా ఉన్న పార్టీల ప‌రిస్థితి ఇక‌.. ప‌క్కకు పోనుందా.. సిద్ధాంతాలు.. రాద్ధాంతాలు.. ఇక‌పై ఉండ‌బోవా?! అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టి వ‌ర‌కు.. ఎదుటి పార్టీకి ముల్లుగుచ్చుకుంటే.. మాకెందుకులే అనుకున్న‌వారంతా.. ఇప్పుడు.. త‌మ దాకా వ‌చ్చేసరికి.. విష‌యం తెలుసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఇక‌, అంద‌రిదీ ఒకే బాట‌.. అన్న‌ట్టుగా ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు .. జ‌న‌సేనను చూసి.. …

Read More »

రాజమండ్రిలో ఉద్రిక్తత.. రాధా.. ప‌రిటాల‌.. అరెస్టు?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలో గ‌త రాత్రి నుంచి(ఆదివారం) ఉద్రిక్త‌త నెల‌కొంది. ఇక్క‌డ రాజ‌ధారి రైతులు.. నిర్వ‌హిస్తున్న మ‌హాపాద‌యాత్ర 2.0 నేడు.. రాజ‌మండ్రిలోకి అడుగు పెట్ట‌నుంది. అయితే.. దీనిని అడ్డుకుని తీరుతామ‌ని.. ప్ర‌భుత్వ పెద్ద‌లు ఇప్ప‌టికే నిర్ణ‌యించుకున్నారు. దీనికి సంబంధించి ప్ర‌క‌ట‌న‌లు కూడా చేశారు. ఈ నేప‌థ్యంలోనే రాజ‌మండ్రి బ్రిడ్జిపై.. రాక‌పోక‌ల‌ను నిషేధించారు. రిపేర్ పేరుతో.. బ్ర‌డ్జిని మూసేశారు. అయిన‌ప్ప‌టికీ.. పాద‌యాత్ర కొన‌సాగించి తీరుతామ‌ని.. అవ‌స‌ర‌మైతే.. ప‌డ‌వ‌ల ద్వారా.. నదిని …

Read More »

దీక్ష‌కు.. సిద్ధ‌మ‌వుతున్న జ‌న‌సేనాని

“ఔను! ఇదేమంత తేలిక విష‌యం కాదు. దీనిపై తాడోపేడో తేల్చుకోవాల్సిందే”-ఇదీ.. జ‌న‌సేన నాయ‌కులు అంటు మాట‌. సాదార‌ణంగా.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌కు ప్ర‌స్తుత వైసీపీ స‌ర్కారులో అనేక ఇబ్బందులు వ‌స్తున్నాయి. గ‌త ఏడాది అక్టోబ‌రు 2న రోడ్ల‌పై గుంత‌లు పూడ్చేందుకు గాంధీ స్పూర్తితో శ్ర‌మ‌దానం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన‌ప్పుడు కూడా.. ఆయ‌న‌ను ఏపీలోకి రాకుండా.. అడ్డుకునే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయ‌ని.. నాయ‌కులు చెబుతున్నారు. అయినా.. ప‌వ‌న్ ఏదో ఒక రూపంలో వ‌చ్చారు.. త‌ర్వాత‌.. …

Read More »

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎంపీగా జేపీ పోటీ?

లోక్‌స‌త్తా పార్టీ పెట్టి ఒక‌ప్పుడు యువ‌త దృష్టిని బాగా ఆక‌ర్షించిన జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ.. తనపై పెట్టుకున్న అంచ‌నాల‌ను నిల‌బెట్టుకోలేక‌పోయారు. కూక‌ట్ ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయ‌న ప‌నితీరు ఆశించినంత గొప్ప‌గా అయితే లేక‌పోయింది. ఆయ‌నేమీ మిగ‌తా ఎమ్మెల్యేల్లా అవినీతి, అక్ర‌మాల‌తో ఎప్పుడూ వార్త‌ల్లో నిలిచింది లేదు కానీ.. జేపీ గురించి జ‌నం ప్ర‌త్యేకంగా మాట్లాడుకునే స్థాయిలో అయితే ఎమ్మెల్యేగా త‌న‌దైన ముద్ర వేయ‌లేక‌పోయారు. దీంతో ఒక పర్యాయానికే ఎమ్మెల్యే …

Read More »