Political News

దావూద్‌ జ‌గ‌న్ .. ఇంటికి పంపిస్తా! : చంద్ర‌బాబు

క‌ర్నూలు జిల్లాలో ప‌ర్య‌టించిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం.. రాష్ట్రం కోసం.. ఏ త్యాగానికైనా తాను సిద్ద‌మ‌ని, అవ‌స‌ర‌మైతే జైలుకు సైతం వెళ్లేందుకు తాను రెడీగానే ఉన్నాన‌ని అన్నారు. “ఏ జైల్లో పెడ‌తారో పెట్టండి. ఏకేసు పెడ‌తారో పెట్టండి. అన్నింటికీ సిద్ధ‌మే” అని చంద్ర‌బాబు తీవ్ర ఆవేశం వ్య‌క్తం చేశారు. మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా తొలిరోజు చంద్ర‌బాబు.. పత్తికొండలో భారీ …

Read More »

ఇదే చివ‌రి ఎన్నిక‌.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి: చంద్ర‌బాబు

క‌ర్నూలు జిల్లాలోని పత్తికొండ‌, నంద్యాల‌, కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌ర్య‌టించారు. మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం క‌ర్నూలుకు వెళ్లిన చంద్ర‌బాబు ఇక్క‌డి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయా ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చంద్ర‌బాబు ప్ర‌సంగించారు. ప‌త్తికొండ‌లో నిర్వ‌హించిన ర్యాలీ, అనంత‌రం స‌భ‌లో చంద్ర‌బాబు ప్ర‌సంగిస్తూ.. ఒకింత భావోద్వేగానికి గుర‌య్యారు. గ‌త ఏడాది అసెంబ్లీలో జ‌రిగిన ఘ‌ట‌న‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. “నేను సీనియర్ నాయకుడిని. నన్ను …

Read More »

కేసీఆర్‌కు ఎందుకీ పొర్లు దండాలు?

ఔను! ఇప్పుడు నెటిజ‌న్లు ఇదే ప్ర‌శ్న సంధిస్తున్నారు. ఎందుకీ పొర్లు దండాలు? ఏం ఆశించి కాళ్ల పై ప‌డుతున్నారు? ఇంద‌కేనా ఉన్న‌త చ‌దువు చ‌దివింది? అని నిష్క‌ర్ష‌గా ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. ఒక జిల్లాకు అధికారి అయిన వ్య‌క్తులు దండాలు పెట్టారంటే, కాళ్ల‌పై ప‌డ్డారంటే తెలిసి చేశారో.. తెలియ‌క చేశారో.. అని స‌రిపుచ్చుకోవ‌చ్చు. కానీ, రాష్ట్రం మొత్తానికి అధికారి.. అయిన తెలంగాణ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస‌రావు.. తాజాగా సీఎం కేసీఆర్ కాళ్ల‌పై …

Read More »

‘క్యాసినో కేసు’లో మంత్రి త‌ల‌సాని సోద‌రుల హ‌స్తం?

తెలంగాణలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్నాళ్ల కింద‌ట‌ సంచలనం సృష్టించిన చీకోటి ప్ర‌వీణ్ క్యాసినో కేసు వ్యవహారంలో తాజాగా మరో సంచ‌ల‌న‌ విషయం వెలుగు చూసింది. ఈ కేసులో మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌ సోదరులకు భాగం ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఓ ర‌హ‌స్య ప్ర‌దేశంలో వీరిద్దరిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీకి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. తెలంగాణలోని …

Read More »

కేసీఆర్ కు ఏపీ పై జాలి తో కూడిన ప్రేమ?

పొరుగు రాష్ట్రం ఏపీ విష‌యంలో తెలంగాణ మంత్రులు ఒక‌విధంగా వ్య‌వ‌హ‌రిస్తుంటే.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రో విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో అస‌లు దీని వెనుక ఏదైనా వ్యూహం ఉందా? అనే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మంత్రుల‌ను తీసుకుంటే.. హ‌రీష్ రావు, కొప్పుల ఈశ్వ‌ర్ వంటివారు ఏపీపై ఇటీవ‌ల కాలంలో తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. వాస్త‌వానికి హ‌రీష్‌రావు అయితే.. కొన్నాళ్లుగా ఏపీని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నిక …

Read More »

ఒంట‌రి పోరుతో ప‌వ‌న్‌కు మిగిలేది ఇంతేనా…!

ఏపీలో మ‌రో ఏడాదిన్న‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో పొత్తులు పెట్టుకుని ముందుకు సాగాల‌ని అనుకున్నా.. అనివార్య‌మైన ప‌రిస్థితులు జ‌న‌సేన‌ను మ‌రోసారి ఒంట‌రిగానే ముందుకు న‌డిపిస్తున్నాయ‌నే వాద‌న వినిపిస్తోంది. మ‌రి ఒంట‌రి పోరుతో జ‌న‌సేనాని సాధించేది ఏంటి? ఎంత మేర‌కు పుంజుకుంటారు? ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్‌ను సీఎం గా చూడాల‌ని భావిస్తున్న కాపులు ఏమేర‌కు ఆయ‌నకు ర‌క్ష‌ణ‌గా నిలుస్తారు? అనేది ఆస‌క్తిగా మారింది. ఒంట‌రి పోరుతో ప‌వ‌న్‌కు ల‌భించే స్థానాలు …

Read More »

జ‌న‌సేన‌లో ఒకేసారి ఇంత పెద్ద మార్పా!

ఇప్ప‌టి వ‌ర‌కు స్త‌బ్దుగా ఉన్న జ‌న‌సేన పార్టీలో క‌ద‌లిక‌లు ప్రారంభ‌మ‌య్యాయా? నాయ‌కులు ముందుకు క‌దులుతున్నారా? ప్ర‌జ‌ల్లోకి వ‌స్తున్నారా? అంటే.. తాజాగా గ‌త నాలుగు రోజులుగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో జ‌న‌సేన నేత‌ల క‌ద‌లిక‌లు బాగానే ఉన్నా య‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి పార్టీ పెట్టి 8 సంవత్స‌రాలు పూర్త‌యినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆశించిన రీతిలో ప్ర‌జాఉద్య‌మం మాత్రం నిర్మించ‌లేక పోయారు. ప్ర‌జ‌ల్లొకి కూడా వెళ్ల‌లేక పోయారు. …

Read More »

బాబును లైట్ తీసుకుంటున్న వైసీపీ.. లెక్క‌లేంటి?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏం మాట్లాడినా.. వెంట‌నే రియాక్ట్ అయ్యే వైసీపీ నాయ‌కులు, పార్టీ అధిష్టానం.. కీల‌క నేత‌లు కూడా ఇటీవ‌ల కాలంలో లైట్ తీసుకుంటున్న విష‌యం తెలుసా? గ‌తంలో చంద్ర‌బాబు ఎక్క‌డ ఏం మాట్లాడినా.. వెంట‌నే వైసీపీ నాయ‌కులు రియాక్ట్ అయ్యేవారు. కౌంట‌ర్ ఎటాక్ చేసేవారు. కానీ, ఇటీవ‌ల కాలంలో మాత్రం ఎవ‌రూ బాబు విష‌యంలో రియాక్ట్ కావ‌డం లేదు. మ‌రి ఎందుకు ఇలా.. వ్యూహం మారిపోయింది? ఇదీ.. …

Read More »

అందరి చూపు విశాఖ వైపు… ఎందుకో

రాజకీయాలకు కేంద్ర బిందువు విశాఖపట్నం రాజకీయంగా కీలక ప్రాంతం కాబోతోంది. అన్ని పార్టీలు ఇప్పుడు విశాఖ వైపే చూస్తున్నాయి. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ చేస్తామని జగన్ ప్రకటించినప్పటి నుంచి అందరి దృష్టి విశాఖవైపే ఉంది. విశాఖ కేంద్రంగా అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రధాని మోదీ ఇటీవల జరిపిన 15 వేల కోట్ల రూపాయల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను కూడా విశాఖలో జరిగే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేసింది. …

Read More »

ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై టీడీపీలో ఇంత సెలైన్స్ ఎందుకు!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏం మాట్లాడినా ఫైర్ ఉంటుంది. అంతో ఇంతో.. ఆయ‌న చేసే కామెంట్లు వైర‌ల్ అవుతుంటాయి. ముఖ్యంగా యూత్‌లో అయితే.. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు మ‌రింత డిమాండ్ ఉంది. ప‌వ‌న్ కొన్నిరోజుల కింద‌ట వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి నా.. కొడ‌..ల్లారా అంటూ చెప్పు చూపించిన విష‌యం తెలిసిందే. ఈ ఫొటోలు.. చాలా రోజుల వ‌ర‌కు కూడా.. వైర‌ల్ అయ్యాయి. ఇక‌, ఆయ‌న డైలాగులు కూడా అలానే యూత్‌లో …

Read More »

టీడీపీలో కాక‌రేపుతోన్న బాబు నిర్ణ‌యం!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల జ‌రిగినపార్టీ సీనియ‌ర్ నేత‌ల స‌మావేశంలో ఆయ‌న వెల్ల‌డించిన ఒక అంశం ఇటు పార్టీలోనూ.. అటు పార్టీ అభిమానుల్లోనూ చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు అంటే.. 40 ఏళ్ల చంద్ర‌బాబు పొలిటిక‌ల్‌ హిస్ట‌రీలో తీసుకోని ఒక సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని బాబు తీసుకోబోతున్నార‌ని అంటున్నారు. అదేంటంటే.. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు రెండు స్థానాల నుంచి పోటీ చేయ‌డం. నిజానికి …

Read More »

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌కు కేసీఆర్ వార్నింగ్‌!

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌పై నిఘా పెట్టిన‌ట్టు సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు. అంతేకాదు.. ఎమ్మెల్యేల ఫోన్ల‌ను కూడా వింటున్న‌ట్టు వెల్ల‌డించేశారు. నిజానికి ఇలా విన‌డం టెలీగ్రాఫ్ చ‌ట్టం ప్ర‌కారం చెల్ల‌దు. కానీ, సీఎం ఎందుకు ఇలా చెప్పారో తెలియ‌క‌.. నేత‌లు త‌ల‌ప‌ట్టుకున్నారు. ఇక‌, టీఆర్ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ మ‌రిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు, పార్టీ శ్రేణులంతా ఎన్నికల సమరానికి సిద్ధం …

Read More »