ఇక‌, చంద్ర‌బాబుపై ‘ఆ మ‌ర‌క’ పోయిన‌ట్టేనా..?

తాజాగా దివంగ‌త ఎన్టీఆర్ వ్య‌వ‌హారం.. మ‌రోసారి ప్ర‌ధాన మీడియా స్రవంతిలోకి వ‌చ్చి చేరింది. ఇటీవ‌ల కా లంలో వైసీపీ నాయకులు.. టీడీపీని కార్న‌ర్ చేసే ఉద్దేశంతో.. వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నారం టూ .. కామెంట్లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇవి.. చినుకు.. చినుకు.. గాలివాన‌గా మారిన‌ట్టుగా.. ప‌రిస్థితి మారి పోయింది. దీంతో దీనికి చెక్ పెట్టే ఉద్దేశంతోనే.. టీడీపీ నాయ‌కుడు, న‌టుడు బాల‌య్య నిర్వ‌హించి న ‘అన్ స్టాప‌బుల్‌’ షోలో.. చంద్ర‌బాబును తీసుకువ‌చ్చారు.

స‌రే.. ఈ సంద‌ర్భంగా.. చంద్ర‌బాబు అప్ప‌టి ప‌రిణామాల‌ను వివ‌రించారు. దీనిని స‌మ‌ర్థించిన వారు ఉన్నారా.. లేరా.. అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఈ విష‌యంలో చంద్ర‌బాబు చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యారు. ఎలాగంటే.. ఆ రోజు ఏం జ‌రిగింద‌నేది తాను చెబుతూ.. అదేస‌మ‌యంలో అన్న‌గారి చిన్న‌కుమారుడు.. బాల‌కృష్ణ‌తోనూ.. చెప్పించారు. మ‌ధ్య మ‌ధ్య‌లో బాల‌య్య కూడా.. అప్పుడు ఏం జ‌రిగిందో వివ‌రించారు. అంతేకాదు.. ”ఆ నిర్ణ‌యం ఏ ఒక్క‌రిదో కాదు.. అంద‌రూ క‌లిసి తీసుకున్న నిర్ణ‌యం” అని తెలిపారు.

అంటే.. ఎన్టీఆర్ నుంచి పార్టీని తీసుకున్నారు… అనే విష‌యంలో ఎవ‌రైనా.. చంద్ర‌బాబును విమ‌ర్శిస్తే.. అది నంద‌మూరి కుటుంబాన్ని కూడా విమ‌ర్శించినట్టే.. అనే సందేశాన్ని స్ప‌ష్టంగా స‌మాజంలోకి పంపేశా రు. ఇప్ప‌టి వ‌ర‌కు కొంద‌రు వైసీపీ నాయ‌కులు.. ముఖ్యంగా కొడాలి నాని వంటివారు.. నంద‌మూరి కుటుం బాన్ని ఏమీ అన‌కుండా.. చంద్ర‌బాబును ఏకేస్తున్నారు. ఆయ‌న‌పై విరుచుకుప‌డుతున్నారు. కానీ, ఇప్పు డు.. ‘ఆ త‌ప్పు.. లేదా రైటు’ లేదా.. వైసీపీ భాష‌లో ‘వెన్నుపోటు’ ఏదైనా కూడా.. నంద‌మూరి కుటుంబానికి తెలిసే జ‌రిగింది.

వారి స‌మ‌క్షంలోనే జ‌రిగింది. సో.. ఇక‌పై వైసీపీ నాయ‌కులు.. దీనిపై ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌డానికి లేకుండా పోయింద‌నే వాద‌న వినిపిస్తోంది. అంతేకాదు.. ఈ విష‌యంలో కీల‌క‌మైన ఎన్టీఆర్ కుటుంబం పెద్ద‌ల్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు ఇప్ప‌టి వ‌ర‌కు నోరు మెద‌ప‌లేదు. సో.. మొత్తంగా చూస్తే.. ఇక‌, ఎన్టీఆర్ గురించి కానీ, ఆయ‌న పార్టీ గురించి కానీ.. ఎవ‌రు నోరు విప్పినా.. ఎలాంటి విమ‌ర్శ‌లు చేసినా.. నంద‌మూరి కుటుంబాన్ని కూడా.. అన్న‌ట్టుగానే భావించాల్సి ఉంటుంది. సో.. మొత్తానికి బాబుపై ఇక‌, ఆ మ‌ర‌క పోయిన‌ట్టే!! అంటున్నారు టీడీపీ అభిమానులు.