విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి. లక్ష్మీనారా యణ సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపేసేందుకు కుట్ర చేస్తున్నారని.. ఏక్షణంలో అయినా.. తనను లేపేస్తారన్న భయం ఉందని ఆయన పేర్కొన్నారు. తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఆయన పోలీసులను వేడుకున్నారు. ఈ క్రమంలో విశాఖ నగర పోలీసు కమిషనర్ అయ్యన్నార్కు ఆయన లిఖిత పూర్వక ఫిర్యాదుతోపాటు.. విన్నపాలు …
Read More »మంగళగిరిలో లావణ్యకు సీన్ అర్దమైపోయిందా
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ నారా లోకేష్, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇంకోసారి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో చాలా తక్కువ ఓట్ల తేడాతో వైసీపీ నేత ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు నారా లోకేష్. అయితే, ఈసారి మాత్రం, ఓటర్లు పూర్తి స్థాయిలో నారా లోకేష్కి మద్దతిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు సంబంధించి కోడ్ అమల్లోకి …
Read More »అట్లుంటది మల్లారెడ్డి తోని..
శాసనసభ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలలో ఎలాగైనా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నది. నాలుగు నెలల కాంగ్రెస్ వైఫల్యాలను తూర్పారబడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బహిరంగ సభలు పెట్టిన కేసీఆర్ బస్సు యాత్రతో అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నాడు. పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఇన్ని ఆపసోపాలు పడుతుంటే మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ …
Read More »నిమిషాల్లో హరీష్ రావు కు రేవంత్ కౌంటర్
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ సీనియర్ నేత హరీష్ రావు.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ.. రాసిన లేఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సటైర్లు పేల్చారు. “హరీష్ రావు రాసింది రాజీనామా కాదు.. సీసపద్యం” అని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. గన్ పార్కు వద్ద హరీష్రావు.. తన రాజీనామా పత్రాన్ని మీడియాకు వెల్లడించడాన్ని రేవంత్ తప్పుబట్టారు. “సీస పద్యం రాసుకొచ్చి.. మీడియా ముందు వదిలిండు. ఇక, దీన్ని.. …
Read More »చేతిలో రూ.20 వేలుతో పిఠాపురంలో నామినేషన్.. !
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలో ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇక్కడ నుంచి మొత్తం 35 మంది నామినేషన్లు వేశారు. వీరిలో వైసీపీ అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్ రెండు సెట్లు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నాలుగు సెట్ల నామినేషన్లు వేశారు. ఇక, మిగిలిన వారంతా చిన్న చితకా పార్టీలకు చెందిన వారు కాగా.. ఇతరులు ఇండిపెండెంట్లు. అయితే.. వీరిలోనూ ఒకరు …
Read More »రాయచోటి : గడికోట బద్దలయ్యేనా ?!
రాయచోటి. పాత కడప జిల్లా, ప్రస్తుత అన్నమయ్య జిల్లా కేంద్రం అయిన ఈ నియోజకవర్గం హాట్ సీట్ అనే చెప్పాలి. కాంగ్రెస్ కు కంచుకోట అయిన ఈ స్థానం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తొలిసారి 2009లో కాంగ్రెస్ తరపున, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున 2012, 2014, 2019లలో ఎన్నికవుతూ వస్తున్నాడు. రాయచోటి అంటే గడికోట, గడికోట అంటే రాయచోటి అన్నట్లు ఈ స్థానాన్ని పటిష్టం …
Read More »జగన్ గేరు మార్చాడు
వైసీపీ అధినేత, సీఎం జగన్ మరో యాత్రకు రెడీ అవుతున్నారు. అదే.. ‘విజయయాత్ర’. ఇదేదో ఎన్నికల పోలింగ్ అయిపోయి.. రిజల్ట్ కూడా వచ్చేసిన తర్వాత.. తీరిగ్గా జూన్ 5న ప్రారంభిస్తారని అనుకుంటున్నారేమో.. కాదు.. కాదు. ఈ నెల 27 నుంచి ఆయన విజయయాత్రకు రెడీ అవుతున్నారు. అది కూడా సుడిగాలి పర్యటనలకు ఆయన సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నిక ల్లో తమ పార్టీ అభ్యర్థుల పక్షాన.. సీఎం జగన్ ఈ విజయయాత్ర …
Read More »ఒక మాజీ సీఎం తరఫున మరో మాజీ సీఎం ప్రచారం
ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అనేక చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరంటే ఒకరికి పడని నాయకులు చేతులు కలుపుతున్నారు. ఒకరంటే.. ఒకరు నిప్పులు చెరిగే నేతలు.. కౌగిలించుకుని.. ఎన్నికల పోరులో ప్రత్యేకత చాటుతున్నారు. ఇలాంటి వారిలో ఇప్పుడు.. మాజీ ముఖ్యమంత్రులు.. నారా చంద్రబాబు.. నల్లారి కిరణ్లు మరింత ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. ఇద్దరూ కూడా ఒకే జిల్లా చిత్తూరుకు చెందిన వారు. జిల్లా ఒకటే అయినా.. పార్టీలు …
Read More »జగన్ బ్యాండేజ్పై సునీత పంచ్
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండగా. వైఎస్ కుటుంబంలో తీవ్ర స్థాయిలో పరస్పరం మాటల దాడి జరుగుతోంది. వైఎస్ జగన్, అవినాష్ రెడ్డి ఓ వైపు ఉంటే… మరోవైపు షర్మిళ, సునీత నిలిచారు. వైఎస్ వివేకా హత్య విషయంలో ఒకరి మీద ఒకరు తీవ్రంగా విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. పులివెందులలో జరిగిన సభలో షర్మిళ, సునీతల మీద జగన్ ఎలా విరుచుకుపడ్డాడో తెలిసిందే. ఆ వ్యాఖ్యలు హాట్ టాపిక్గా …
Read More »పలచనైపోతాం.. చులకనైపోతాం.. కేటీఆర్లో ఎంత మార్పు!
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ జోరు ప్రదర్శించారు. విదేశీ పర్యటనలు, కార్పొరేట్ సంస్థలతో మీటింగ్లతో బిజీగా ఉండేవారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గానూ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉండేవారు. ప్రత్యర్థి పార్టీల విమర్శలకు, ఆరోపణలకు తనదైన స్టైల్లో దూకుడుగా రిప్లే ఇచ్చేవారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. రాజకీయాల్లో ఓడలు బడ్లవడం కామనే. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో లేదు. ప్రతిపక్షంలో …
Read More »పిఠాపురంలో ఇంకో ఇద్దరు పవన్ కళ్యాణ్లు?
రాజకీయంగా తనకు ప్రధాన ప్రత్యర్థి నారా చంద్రబాబు నాయుడే అయినప్పటికీ.. వైఎస్ జగన్ దృష్టి ఎక్కువగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీదే ఉంటుందన్నది వాస్తవం. 2014లో విజయం ఖాయమనుకున్న తనకు ఓటమి ఎదురవడానికి బాబుకు పవన్ ఇచ్చిన మద్దతే కారణమని జగన్ భావిస్తారు. అందుకే పవన్ను విమర్శినంత దారుణంగా చంద్రబాబును కూడా టార్గెట్ చేయరంటే అతిశయోక్తి కాదు. ప్రతి మీటింగ్లోనూ దత్త పుత్రుడు అని, ప్యాకేజ్ స్టార్ అని, …
Read More »జగన్కు వివేకా భార్య బహిరంగ లేఖ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయమై ఇప్పటికే ఆయన తనయురాలు సునీత, ఆయన అన్న కూతురు షర్మిళ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిల మీద ఎలా తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడుతున్నారో తెలిసిందే. దీనికి జగన్, అవినాష్ కూడా గట్టిగానే బదులిస్తున్నారు. కానీ వివేకా హత్య అంశం రోజు రోజుకూ బలమైన రాజకీయ అంశంగా మారుతున్న నేపథ్యంలో వివేకా సతీమణి సౌభాగ్యమ్మ ఇప్పుడు లైన్లోకి వచ్చారు. వివేకా హత్య …
Read More »