తెలంగాణలో జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులు జోష్ చూపించారు. భారీ ఎత్తున పంచాయతీలను కైవసంచేసుకున్నారు. 193 మండలాల పరిధిలోని 3వేల, 911 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు జరిగిన రెండో విడత పోలింగ్లో కాంగ్రెస్ మద్దతుతో రంగంలోకి దిగిన 1,728 మంది సర్పంచ్లు జయకేతనం ఎగురవేశారు. నిజానికి తొలి విడతలో కాంగ్రెస్ పార్టీ హవాను చూసిన బీఆర్ఎస్ పార్టీ తన మద్దతు దారులకు …
Read More »`టీజేపీ`… కవిత పార్టీపై కసరత్తు!?
బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కవిత తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలిగా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కొత్త రాజకీయ పార్టీ విషయంపై నోరు మెదపని ఆమె.. ఇక, స్వయంగా ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయినట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. తాజాగా ఆమె ఆ పనిపైనే ఉన్నారని తెలిసింది. తెలంగాణ రాష్ట్రసమితి(టీఆర్ఎస్)గా ఏర్పడిన కేసీఆర్ పార్టీ ప్రజలకు …
Read More »వైసీపీకి ఆ 40 % నిలబడుతుందా.. !
40 % ఓటు బ్యాంకు గత ఎన్నికల్లో వచ్చిందని చెబుతున్న వైసిపికి అదే ఓటు బ్యాంకు నిలబడుతుందా లేదా అన్నది పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. గత ఎన్నికల్లో ఉన్నట్టుగానే వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితిలు ఉండకపోవచ్చు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఇస్తున్న నిధులు, చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రజల్లో సంతృప్తిని ఎప్పటికప్పుడు అంచనా …
Read More »రెండో విడతలోనూ హస్తం పార్టీదే హవా!
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలి దశ ఫలితాలలో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. రేవంత్ సర్కార్ పై నమ్మకం పెట్టుకున్న ప్రజలు లోకల్ వార్ లో కూడా హస్తం గుర్తుకే ఓటు వేసి గెలిపించారు. ఇక, నేడు జరిగిన రెండో దశ ఎన్నికల ఫలితాల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 784 స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. అయితే, రెండో దశ ఫలితాల్లోనూ …
Read More »కేసీఆర్ హరీష్తో జాగ్రత్త!: మహేష్ కుమార్
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్కు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో బీఆర్ ఎస్ పార్టీని ఉద్దేశించి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. సొంత మేనల్లుడు, మాజీ మంత్రి హరీష్ రావు ఏదో ఒక సమయంలో వెన్నుపోటు పొడవడం ఖాయమని …
Read More »ఎన్నికల్లో పోటీపై నాగబాబు సంచలన ప్రకటన
ఇకపై తాను ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటానని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు సంచలన ప్రకటన చేశారు. తాను వచ్చే ఎన్నికల్లోనేకాదు.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా పోటీ పడలేనన్నారు. పార్టీ కార్యకర్తగా ఉండేందుకే తాను ఇష్టపడతానని చెప్పారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నానని.. తనకు ఇది చాలని సంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. అయితే.. వచ్చే ఐదారేళ్ల తర్వాత.. ఏం జరుగుతుందో చెప్పలేనని ఆయన …
Read More »నిన్నటిదాకా తిట్లు… కానీ ఇప్పుడేమో
ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలోనే అత్యంత మేటి ఆటగాళ్లలో ఒకడైన లియోనెల్ మెస్సి రెండోసారి ఇండియాకు వస్తున్నాడని గత రెండు వారాలుగా ఇండియన్ మీడియా ఎంత హైప్ ఇస్తూ వచ్చిందో తెలిసిందే. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం మెస్సి.. కోల్కతా, కోచి, ముంబయి, ఢిల్లీ నగరాల్లో పర్యటించాలి. ఐతే కేరళలో ఏదో ఇబ్బంది తలెత్తి కోచి టూర్ క్యాన్సిల్ అయింది. అనుకోకుండా హైదరాబాద్ లిస్టులోకి వచ్చింది. ఐతే మెస్సిని ఇండియాకు రప్పించి మూడు రోజులు పర్యటించేలా చేయడంమంటే చిన్న …
Read More »బీజేపీ విజయానికి కాంగ్రెస్ నేత సంబరాలు!
కేరళ రాష్ట్రంలో తొలిసారి బీజేపీ విజయం దక్కించుకుంది. కేరళలోని రాజధాని నగరం తిరువనంతపురంలో తాజాగా జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ 50 స్థానాలు దక్కించుకుని అతి పెద్దపార్టీగా అవతరించింది. దాదాపు 45 ఏళ్ల తర్వాత.. బీజేపీ విజయం దక్కించుకోవడం ఒక ఎత్తు అయితే.. ఇక్కడి బలమైన కమ్యూనిస్టు కోటలను బద్దలు కొట్టి కమల వికాసం జరగడం మరో ఎత్తు. దీంతో బీజేపీనాయకులు సంబరాలు చేసుకున్నారు. అయితే.. ఇదేసమయంలో కాంగ్రెస్ పార్టీ …
Read More »నారా బ్రాహ్మణికి ప్రతిష్టాత్మక అవార్డు
ఏపీ మంత్రి నారా లోకేష్ సతీమణి, నటసింహం బాలయ్య గారాలపట్టి నారా బ్రాహ్మణి అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకున్నారు. దేశంలో `అత్యంత ప్రభావవంతమైన మహిళా వ్యాపార వేత్త` అవార్డును ఆమె అందుకున్నారు. మహారాష్ట్ర రాజధాని దేశ వాణిజ్య రాజధాని ముంబైలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ వాణిజ్య పత్రిక `బిజినెస్ టుడే` ఈ అవార్డును అందించింది. ప్రస్తుతం బ్రాహ్మణి హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. 2025-26 సంవత్సరానికి గాను …
Read More »బీజేపీలో జగన్ కోవర్టులు.. అధిష్టానం ఆరా…?
ఏపీ బీజేపీలో నాయకుల మధ్య లుకలుకలు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పడకపోవడం.. ఒకరిపై మరొకరు ఆధిపత్య రాజకీయాలు చేయడం వంటివి కామన్గా మారాయి. అయితే.. సాధారణంగా ఏ పార్టీలో అయినా.. ఇలాంటి ఆధిపత్య రాజకీయాలు ఉంటాయి. అదేసమయంలో క్షేత్రస్థాయి నాయకులు కూడా తమ తమ శైలిలో రాజకీయాలు చేస్తుంటారు. దీనిని పార్టీలు కూడా సహిస్తుంటాయి. కానీ.. ప్రత్యర్థి పార్టీలకు కోవర్టులుగా వ్యవహరించే వారి విషయమే ఎప్పుడూ ఇబ్బందులకు దారి తీస్తుంది. …
Read More »పొలిటికల్ చిచ్చు రాజేసిన ఈటల మాటలు
బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో ఉండాలో.. ఏ పార్టీ తరఫున పనిచేయాలో ప్రజలే తేల్చుకుంటారని అన్నారు. ప్రస్తుతం తనపై జరుగుతున్న ప్రచారం విషయాన్ని బీజేపీ హైకమాండ్ చూసుకుంటుందన్నారు. తనపై వస్తున్న ఆరోపణలను కూడా ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. ఇక, గత కొంత కాలంగా బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కేంద్ర …
Read More »11 సీట్లు ఎలా వచ్చాయన్నదానిపై కోటి సంతకాలు చేయించాలి
ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్లైన్ను మళ్లీ మళ్లీ పొడిగించారు. కోటి సంతకాలు సేకరించి గవర్నర్ నజీర్ను కలిసి పీపీపీకి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవాలన్నది వైసీపీ అధినేత జగన్ ఉద్దేశం. అయితే వైసీపీ చేస్తున్న ఈ ప్రయత్నాలను తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు టీడీపీ నేతలకు పిలుపునిస్తున్నారు. కానీ టీడీపీ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates