వైద్య విద్య చదవాలని అనుకునే విద్యార్థులకు దేశవ్యాప్తంగా ఏక కాలంలో నిర్వహించే ‘నీట్’ పరీక్షకు సంబధించిన ప్రశ్నపత్రం లీకై.. సరిగ్గా 75 రోజులు అయింది. ప్రధాని నరేంద్ర మోడీ మాటలో చెప్పాలంటే.. ఇది అత్యంత సుదీర్ఘమైన సమయం. ఆయన ప్రతి రోజునూ గంటలతో కాదు.. సెకన్లతో లెక్కించుకుని పనిచేస్తారు. అందుకే కర్మ యోగి అంటూ.. కమల నాథులు స్థుతిస్తారు. స్తోత్రాలు చేస్తారు. అలాంటి ప్రధాని నీట్ పేపర్ లీకు ఘటనపై …
Read More »షర్మిలకు రెండు ఛాన్స్లు.. వదులుకుంటారా? పట్టుకుంటారా?
తెలంగాణ ఇచ్చాం.. అయినా.. పార్టీ అధికారంలోకి రాలేదు.. అనే స్థాయి నుంచి పదేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఇలా.. పార్టీని చివరి ఆరు మాసాలు(2023కు ముందు) దూకుడుగా ముందుకు తీసుకువెళ్లడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకొన్నదే. ఎంతో మంది ముఖ్యమంత్రుల జాబితాలో ఉన్నా ఈ ఒక్క కారణమే రేవంత్ రెడ్డికి సీఎం సీటును అప్పగించేలా చేసింది. మరి ఈ …
Read More »ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..? నిజం ఇదే..!
నీట్ పరీక్షల నిర్వహణలో జరిగినట్లు ఆరోపణలు వచ్చిన అవకతవకలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. పరీక్షా విధానంలో పారదర్శకత, ప్రశ్నాపత్రాల లీకేజీ, విద్యార్థుల భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి వంటి అంశాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో పెద్దఎత్తున విద్యార్థి సంఘాలు, యువజన సంస్థలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అదే డిమాండ్తో …
Read More »మౌనం వీడిన మోడీ.. కానీ ఇది సరిపోదు!?
నీట్ పరీక్షల అంశంపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదని పేర్కొంటూ, ప్రశ్నాపత్రాల లీకేజీ కేసుల్లో నిందితులకు వేగంగా, కఠిన శిక్షలు పడేలా ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. సంబంధిత అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. …
Read More »ఇంటా బయటా… నీట్ నిప్పులు!
కేంద్ర ప్రభుత్వానికి ఇంటా బయటా కూడా.. నీట్ పరీక్షకు సంబంధించిన సెగ భారీగా తగులుతోంది. నిన్న మొన్నటి వరకు ఈ విషయాన్ని లైట్ తీసుకున్నప్పటికీ.. ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఇటు పార్లమెంటులోను.. అటు బయట కూడా నీట్ పరీక్షలో అవకతవకలు.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాలపై ప్రతిపక్షాలు ఎలుగెత్తాయి. అదేసమయంలో విద్యార్థి సంఘాలు తోడుకావడంతో కాక్రోచ్ జనతా పార్టీకి మరింత మద్దతు పెరిగింది. …
Read More »కొడుకును తప్పించాలని చూసిన వైసీపీ మాజీ మంత్రి అరెస్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన కొడుకు ఆరవ్ ను హిట్ అండ్ రన్ కేసు నుంచి తప్పించేందుకు అప్పల రాజు ప్రయత్నించిన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే అప్పల రాజును అరెస్టు చేసేందుకు పోలీసులు కాశీబుగ్గలోని ఆయన నివాసానికి వెళ్లారు. అయితే, అప్పల రాజు ఇంటి దగ్గరకు భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు చేరుకోవడంతో అక్కడ కాసేపు …
Read More »ధర్మేంద్ర ప్రదాన్… నాడలా, నేడిలా!
దేశ రాజధానిలో రగులుకున్న విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న పరిస్తితి. ఈ పరిస్థితికి కారణం బీజేపీ సీనియర్ మోస్ట్ నేత, కేంద్ర మానవ వనరుల అభివద్ధి మంత్రిత్వ (విద్య) శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్. నరేంద్ర మోదీ కేబినెట్ లో కీలక శాఖకు మంత్రిగా కొనసాగుతున్న ధర్మేంద్ర… నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని విద్యార్థులు ఈ నిరసనలకు తెర తీశారు. అయితే మంత్రి పదవికి …
Read More »మాటలు చెప్పినంత మాత్రాన తాను దీక్ష ఆపేది లేదు
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం తనకు హామీ ఇచ్చినట్లు ప్రముఖ విద్యావేత్త సోనమ్ వాంగ్చుక్ ఇటీవల వెల్లడించారు. జాతీయ స్థాయిలో సంచలనం రేపుతున్న ఈ ఇష్యూలో వాంగ్చుక్ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వాంగ్చుక్ ప్రస్తుతం ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఆసుపత్రిలో చికిత్స …
Read More »తెలంగాణలో విచిత్రం… మంత్రుల అరెస్టు!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసనలకు దిగారు. జిల్లాలు, మండలాలు, నియోజకవర్గాల స్థాయిలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసనగా ధర్నాలు చేపట్టారు. రాజధాని హైదరాబాద్లో గవర్నర్ బంగళాను(లోక్భవన్) కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ మహేష్ గౌడ్ సహా పలువురు మంత్రులు ముట్టడించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మంత్రులతో పాటు పలువురు నేతలను కూడా అరెస్టు చేశారు. ఎందుకీ నిరసన? కేంద్ర ప్రభుత్వం విద్యావ్యవస్థకు సంబంధించి వ్యవహరిస్తున్న …
Read More »మోడీ చంద్రబాబుతో ప్రకటన చేయిస్తారా
అటు పార్లమెంటులోనూ.. ఇటు బయట కూడా.. నీట్ ప్రశ్నపత్రాలకు సంబంధించిన నిరసనలు కొనసాగుతున్న సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడం ఆసక్తిగా మారింది. ప్రధానంగా ఆగస్టు 1న విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రావాలంటూ ప్రధాని మోడీని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ప్రధానికి ఇచ్చారు. పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో మోడీని కలిసిన చంద్రబాబు.. ఈ మేరకు …
Read More »వావ్… ఏపీ లో యూఏఈ పెట్టుబడులు
ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో ఒప్పందం సాకారం అయిందని తెలిపారు. దుబాయ్(యూఏఈ) ఫుడ్ క్లస్టర్ ద్వారా ఏపీలోని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎగుమతులు, వాణిజ్యం, పెట్టుబడులను పెట్టేలా ఏపీ ఈడీబీ-యూఏఈకి చెందిన ఫుడ్ క్లస్టర్ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, యూఏఈ ఆర్ధిక, పర్యాటక విభాగం మంత్రి అబ్దుల్లా బిన్ …
Read More »జగన్ ఎలా అంటే కేటీఆర్ కూడా అలానే
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ పార్టీకార్యకర్తలను వేధించినా.. పోలీసులు సహా ఇతర అధికారులను కూడా వదిలి పెట్టేదిలేదని ఆయన వార్నింగులు ఇస్తున్నారు. అంతేకాదు.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సప్తసముద్రాల ఆవల ఉన్నా.. వారిని తీసుకువచ్చి కోర్టులో నిలబెడతామని, చట్టం ప్రకారం శిక్షిస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపినా.. జగన్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates