Political News

అంబటి మీద అన్ని కేసులా?

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబుపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఇల్లు, ఆఫీసుపై దాడి జరిగింది. అంబటిపై పలు కేసులు నమోదు కావడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే అంబటికి వైద్య పరీక్షలు నిర్వహించి గుంటూరు మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలోనే అంబటికి 14 రోజుల …

Read More »

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. అయితే.. ఇటీవ‌ల ఈ కేసు విచార‌ణ‌ను పూర్తి చేసిన సీబీఐ నేతృత్వంలోని ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) నివేదిక ఇచ్చింది. దీనిలో అది నెయ్యే కాద‌ని.. అలాగ‌ని పంది కొవ్వు, ఆవు కొవ్వు క‌లిసిన‌ట్టు ఆన‌వాళ్లు లేవ‌ని పేర్కొన్న‌ట్టు వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. ఇది గ‌త కొన్నాళ్లుగా …

Read More »

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే సిట్ అధికారులు ఆయనను ఆన్ కెమెరా విచారణ జరిపారు. అయితే, సిట్ విచారణకు ముందు బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ లంచ్ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారని తెలుస్తోంది. ఈ గదిలో కూర్చొని ఈ ఇంట్లో నుంచే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర …

Read More »

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి అంద‌రూ ఎన్నిక‌ల ఏడాది కావ‌డంతో(నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్నాయి).. ఖ‌చ్చితంగా ఆయా రాష్ట్రాల‌కు మేలు చేసేలా కేంద్ర బ‌డ్జ‌ట్‌ను వండి వారుస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ.. అనూహ్యంగా ప్ర‌స్తుత బ‌డ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేవు. అంటే.. ప్ర‌త్య‌కంగా ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల‌పై ప్రేమ …

Read More »

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. వాడు వీడు అంటూ సంబోధిస్తూ…లోకేశ్ ను అసభ్య పదజాలంతో జోగి రమేశ్ దుర్భాషలాడారు. ఓ వైపు సీఎం చంద్రబాబుపై అంబటి చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యల వేడి సద్దుమణగక ముందే జోగి రమేశ్ ఈ తరహాలో వ్యాఖ్యానించడంతో టీడీపీ నేతలు, కార్యకర్తల ఆగ్రహం రెట్టింపైంది. ఈ …

Read More »

ల‌డ్డూ ఎఫెక్ట్‌: టీటీడీ ఈవో సింఘాల్‌పై చ‌ర్య‌లు

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగం వ్య‌వ‌హారం.. కీల‌క మ‌లుపు తిరిగింది. ఈ క‌ల్తీ వ్య‌వ‌హారంపై విచార‌ణ జ‌రిపిన సీబీఐ ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం.. గ‌తంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఈవోలుగా ప‌నిచేసిన అనిల్‌కుమార్ సింఘాల్‌, ధ‌ర్మారెడ్డి స‌హా ప‌లువురు అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి సిఫార‌సు చేసింది. మ‌రోవైపు.. ఈ న‌కిలీ నెయ్యి ఉదంతంపై నెల్లూరు కోర్టులో చార్జిషీట్ దాఖ‌లు చేసింది. దీనిపై ఒక‌వైపు …

Read More »

బ‌డ్జెట్ స‌మావేశాల‌ కోసం అసెంబ్లీకి జ‌గ‌న్‌.. ?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. పార్టీ వ‌ర్గాలతో చ‌ర్చ‌లు జ‌రిపిన ఆయ‌న‌.. బ‌డ్జెట్ స‌మావేశాల‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు అత్యంత విశ్వ‌స‌నీయ నాయ‌కుడి ద్వారా తెలిసింది. తాడేప‌ల్లి కేంద్ర కార్యాలయం వ్య‌వ‌హారాలు చూసే ఓ కీల‌క నాయ‌కుడు, ప్ర‌జాప్ర‌తినిధి ఆఫ్ దిరికార్డుగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. వ‌చ్చే నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ బ‌డ్జ‌ట్ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి …

Read More »

బడ్జెట్ ముందు నిర్మలమ్మకు చక్కెర పెరుగు… ఎందుకిలా?

ప్రతి ఏటా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోయే కొన్ని ఘడియల ముందు దేశ రాష్ట్రపతి ఆమెకు చక్కెర కలిపిన పెరుగు (దహి – చక్కర్) తినిపించడం ఆనవాయితీ. అయితే దీని వెనుక కారణం ఏంటని చాలామందికి సందేశం కలగక మానదు. ఇది మన భారతదేశ సాంప్రదాయాల్లో ఒకటి. ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు హిందూ సాంప్రదాయం ప్రకారం చక్కెర కలిపిన పెరుగును తినిపిస్తారు. ఇలా చేస్తే …

Read More »

స‌రిహ‌ద్దు కంచె: ఇది క‌దా `ఎన్నిక‌ల‌ రాజ‌కీయం` అంటే!

+ దేశ స‌రిహ‌ద్దులను కాపాడాల్సిన బాధ్య‌త ఎవ‌రిది? నిస్సందేహంగా కేంద్ర ప్ర‌భుత్వానిదే. + దేశ స‌రిహ‌ద్దుల నుంచి పెరుగుతున్న చొర‌బాట్ల‌ను ఎవ‌రు అరిక‌ట్టాలి? దీనికి సందేహం ఎందుకు.. కేంద్ర‌మే!. + దేశాన్ని ర‌క్షించేందుకు.. ఎలాంటి చ‌ర్య‌లైనా తీసుకునే అధికారం ఎవ‌రికి ఉంటుంది..? దీనికి స‌మాధానం కూడా కేంద్ర‌మే. ఇలా.. దేశాన్ని, దేశ స‌రిహ‌ద్దుల‌ను ర‌క్షించేందుకు కేంద్రానికి మాత్ర‌మే అధికారం ఉంటుంది. ఉందికూడా. కానీ, ఈ విష‌యంలో ప్ర‌స్తుత కేంద్ర హోం …

Read More »

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఉదయం నుంచి గుంటూరులో హైడ్రామా నడిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి, ఆ తర్వాత తాను తిట్టింది చంద్రబాబును కాదని.. దాడికి పాల్పడిన వాడినని చెబుతూ.. రెడ్ బుక్కుకి తన ఇంట్లో కుక్క కూడా భయపడదు, అరెస్టు చేస్తే చేసుకోండి …

Read More »

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన ఘటన రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. కల్తీ నెయ్యి ఇష్యూలో వైసీపీ నేతలపై రాజకీయ విమర్శలకే టీడీపీ నేతలు పరిమితం కాగా…అంబటి హద్దు మీరి చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు దిగారు. దీంతో, అంబటిపై టీడీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడూ సైలెంట్ గా …

Read More »

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సారి నంది నగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి కేసీఆర్ పీఏ చేతికి నోటీసులిచ్చిన సిట్ అధికారులు…రెండోసారి మాత్రం నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోని గోడకు నోటీసులు అంటించి వచ్చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్ హర్ట్ అయ్యారు. సిట్ విచారణకు వస్తానని, …

Read More »