Political News

తాడిపత్రిలో పొలిటికల్ హీట్… పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి

అనంతపురం జిల్లా తాడిపత్రిలో శుక్రవారం పొలిటికల్ హీట్ రాజుకుంది. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా టీడీపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమవగా, మరోవైపు వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. రెండు వర్గాలు ఒకే రోజు పోటాపోటీ కార్యక్రమాలకు సిద్ధం కావడంతో శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావించిన …

Read More »

ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ దాకా…!

ట్రూ అప్ అంటే తెలుసు కదా. విద్యుత్ వినియోగంలో వినియోగదారులపై ఆయా ప్రభుత్వాలు ఎప్పుడో వాడిన విద్యుత్ కు… చాలా కాలం తర్వాత వసూలు చేసే అధిక చార్జీలు. ట్రూ అప్ అమలు చేస్తున్నారంటే… మనం గతంలో వాడిన విద్యుత్ పై పెంచిన బిల్లులను ప్రస్తుత వినియోగంతో కలిపి కట్టడమన్నమాట. ఏపీలో వైసీపీ హయాంలో ఐదేళ్ల వ్యవధిలోనే ఏకంగా 9 సార్లు ట్రూ అప్ చార్జీలను వసూలు చేశారు. మరి …

Read More »

విద్యాశాఖ‌ విజేత‌… నారా లోకేష్‌!

విద్యాశాఖ మంత్రిగా టీడీపీ యువ నాయ‌కుడు, జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌.. నారా లోకేష్ దూకుడు చూపిస్తున్నారు. నిజానికి విద్యా శాఖ అంటేనే చాలా సునిశిత‌మైన శాఖ‌. అంతేకాదు.. సెంటిమెంటుతో పాటు.. అనేక స‌మ‌స్య‌లు ఉన్న శాఖ కూడా. అయినా..త‌న‌కు న‌చ్చి-మెచ్చి ఈ శాఖ‌ను తీసుకున్న నారా లోకేష్‌.. రెండు సంత్స‌రాలు పూర్తిచేసుకున్నారు. నిజానికి విద్యాశాఖ‌తోపాటు నారా లోకేష్ ఐటీ స‌హా మాన‌వ‌వ‌న‌రుల శాఖ‌ను కూడా చూస్తున్నారు. దీంతో ఆయ‌న‌పై ప‌నిభారం …

Read More »

ఉపముఖ్యమంత్రి పవన్… ఎన్నడూ హద్దులు దాటలేదు!

రాష్ట్రంలో కూట‌మిప్ర‌భుత్వంఏర్ప‌డి జూన్ 12కు రెండేళ్లు పూర్త‌య్యాయి. 2024లో ఏర్ప‌డిన కూట‌మి ప్ర‌భుత్వంలో ఉప‌ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు చేప‌ట్టారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌. దీంతో త‌ర‌చుగా ఆయన ప‌నితీరు.. విధానం వంటివాటిపై స‌మాజంలో చ‌ర్చ సాగుతూనే ఉంది. రాజ‌కీయాలు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఓ ఉప ముఖ్య‌మంత్రిగా, అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రిగా ఆయ‌న ప‌నితీరుపై ప్ర‌జ‌లు నిశితంగానే గ‌మ‌నిస్తార‌ని అంటున్నారు. అందుకే ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా త‌న …

Read More »

ఆ ఇద్దరి చేతికి బేడీలు

ఏపీలో పెను కలకలం రేపిన మద్యం కుంభకోణంలో ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చేసింది. వైసీపీ హయాంలో జరిగిందని ఆరోపణలున్న లిక్కర్ స్కాంపై విచారణను వేగిరం చేసిన ఈడీ అధికారులు.. గురువారం రెండు కీలక చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో పాటుగా పాత్ర ఉందని భావిస్తున్న వారి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసిన అధికారులు… ఈ కేసులో కీలక నిందితులుగా పరిగణిస్తున్న …

Read More »

బీజేపీ ఖాతాలోకి మీనాక్షి సీటు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పోరాటం బరిలోకి దిగకుండానే ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆమెకు కేటాయించిన సీటు కాస్తా బీజేపీ ఖాతాలోకి చేరిపోయింది. మీనాక్షి నామినేషన్ వేసిన స్థానం నుంచి పోటీకి దిగిన రజనీశ్ అగర్వాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం అధికారికంగా ప్రకటించింది. వెరసి ఇక మీనాక్షి.. ఆమె తరఫున కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో పోరాటం చేసినా ఇక …

Read More »

లిక్కర్ స్కాంలో ‘కారుమూరి’కీ పాత్ర ఉందా…?

ఏపీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణం తవ్వుతున్న కొద్దీ సరికొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. దాదాపుగా రూ.3 వేల కోట్లకు పైగా అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు ఉన్న ఈ కుంభకోణంలో తాజాగా వైసీపీకి చెందిన మరో కీలక నేత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వైసీపీ హాయంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన తణుకు మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేరు ఇప్పుడు ఈ కుంభకోణంలో ప్రముఖంగా వినిపిస్తోంది. …

Read More »

ధరలు పెరుగుతుంటే ఇష్టమంటారా ట్రంప్

అమెరికాలో వస్తువుల ధరలు గత మూడు సంవత్సరాలలో ఎన్నడూ లేనంత వేగంగా పెరిగిపోతుండటంతో జనాల్లో విషయం చర్చనీయాంశంగా మారింది. గత నెల మే నెలకు సంబంధించిన అధికారిక లెక్కల ప్రకారం అమెరికాలో ద్రవ్యోల్బణం (ఇన్ఫ్లేషన్) 4.2 శాతానికి చేరుకుంది. ఈ పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, తనకు ఇన్ఫ్లేషన్ అంటే చాలా ఇష్టమని వైట్ హౌస్ లో వ్యాఖ్యానించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ధరలు పెరుగుతుంటే దేశ అధినేత …

Read More »

తనకు దక్కని రాజ్యసభ సీటు పై స్పందించిన షర్మిల

రాజ్యసభ స్థానాల అభ్యర్థుల ఎంపికలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పేరు ప్రముఖంగా వినిపించింది. ఆమెను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. అయితే ఒక్కసారిగా సీన్ తారుమారైంది. కాంగ్రెస్ పార్టీ జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో అసలేం జరిగింది అనే అంశంపై చర్చ మొదలైంది. తన అభ్యర్థిత్వంపై ఇంతవరకు స్పందించని షర్మిల ఇప్పుడు నోరు విప్పారు. ‘‘రాజ్యసభ సీటు మాట ఇచ్చిన వాళ్లకు, మాట …

Read More »

గ‌వ‌ర్న‌ర్ గిరా… మంత్రి ప‌ద‌వా.. మీ ఇష్టం: బాబుకు బిగ్ ఆఫ‌ర్‌?

ఢిల్లీలో ప‌ర్య‌టిస్తున్న సీఎం చంద్ర‌బాబుకు కేంద్రంలోని పెద్ద‌లు బిగ్ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఎన్డీయే కూట‌మిని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు బీజేపీ పెద్ద‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దేశ‌వ్యాప్తంగా పెరుగుతున్న పార్టీల జోరు.. ఇండియా కూట‌మి వేస్తున్న అడుగుల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్న ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాలు.. ప్ర‌స్తుత కూట‌మిని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనిలో భాగంగా ద‌క్షిణాదిలో త‌మ‌కు కీల‌క పార్టీలుగా …

Read More »

టార్గెట్ కాంగ్రెస్‌… పవన్ కీల‌క వ్యూహం?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజ‌కీయంగా త‌న‌కు ఉన్న ల‌క్ష్యాన్ని కూడా వివ‌రించారు. దేశాన్ని ఐక్యం చేయ‌డంతోపాటు.. ఉత్త‌ర‌-ద‌క్షిణ ప్రాంతాలు అనే భేదాన్ని తుడిచి పెట్టి.. అంద‌రూ ఒక్క‌టే అనే విధంగా దేశాన్ని క‌లిపి ఉంచాల‌న్న త‌న మ‌న‌సులోని భావాల‌ను వెల్ల‌డించారు. అదేస‌మ‌యంలో త‌న టార్గెట్ కూడా కాంగ్రెస్ పార్టీనేన‌ని ఆయ‌న ప‌రోక్షంగా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ విధానాల కార‌ణంగానే దేశంలో విభ‌జ‌న వాదం …

Read More »

నేనూ కాక్రోచ్ అవుతానంటున్న జగన్

ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్ కాక్రోచ్ పార్టీ ఆవిర్భావం. అంతా అప్ డేట్ అవుతుంటే… తాను కూడా అదే బాటన నడవాలని అనుకున్నారో, ఏమో తెలియదు గానీ… వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అప్ డేట్ అయిపోతున్నారు. జగన్ లో ఈ అప్ డేషన్ గురువారం …

Read More »