ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు శుభవార్త చెప్పారు మంత్రి నారాయణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు, ఈ నెల 6వ తేదీ వరకు తీసుకున్న రూ.1.50 లక్షల వరకు రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. రాజధాని ప్రాంత రైతులకు రుణమాఫీ చేయాలని ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ చేసిన విజ్ఞప్తిపై సీఎంతో చర్చించగా, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. అలాగే రైతులకు చెల్లించే కౌలు పెంపుపై …
Read More »రాజ్యసభ ఎఫెక్ట్: 4 మాసాల ముందే కర్చీఫ్లు వేసేశారా.. ?
రాష్ట్రంలో ఈ ఏడాది నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో మూడు వైసిపి అభ్యర్థులకు సంబంధించినవి ఉండడం విశేషం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, ఉత్తరాది రాష్ట్రానికి చెందిన పరిమళ నత్వాని, అదేవిధంగా మంగళగిరి కి చెందిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఈ ముగ్గురు వైసీపీ తరఫున రాజ్యసభకు ఎంపికయ్యారు. టీడీపీకి చెందిన సానా సతీష్ బాబు కూడా ఈ ఎడాది రిటైర్ కారున్నారు. …
Read More »కవిత రాజీనామాకు ఆమోదం… ఇంత ఆలస్యం ఎందుకు?
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎమ్మెల్సీ పదవికి కవిత చేసిన రాజీనామాను శాసన మండలి ఛైర్మన్ ఆమోదించలేదు. ఈ క్రమంలోనే మండలి సమావేశాల్లో సోమవారంనాడు పాల్గొన్న కవిత..తన తండ్రి కేసీఆర్ పై, సోదరుడు కేటీఆర్ పై, బీఆర్ఎస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. అయితే, మండలి సమావేశాలు ముగిసిన వెంటనే కవిత రాజీనామాను …
Read More »సుజనా చౌదరిని చూసి నేర్చుకోవాల్సిందే.. !
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపి నాయకుడు ప్రముఖ పారిశ్రామికవేత్త సుజనా చౌదరి ఆదర్శంగా నిలుస్తున్నారు. తన నియోజకవర్గంలో చేపడుతున్న పనులను నిశితంగా పరిశీలించడంతోపాటు ఆయా పనులకు అవుతున్న ఖర్చులు అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్న అవసరాలను పసిగట్టి దానికి అనుగుణంగా ఆయన వ్యవహరిస్తున్నారు. అధికారులు చెప్పారని, స్థానికంగా ఉన్న నాయకులు వచ్చి కోరారని కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను స్వయంగా తెలుసుకుని ఆయా పనులకు …
Read More »అసత్య కథనంపై అలుపెరగని పోరాటం
తనపై వచ్చిన అసత్య కథనంపై ఏపీ మంత్రి నారా లోకేష్ అలుపెరగని పోరాటం చేస్తున్నారు. విశాఖలోని 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో సాక్షి పత్రికపై దాఖలు చేసిన పరువునష్టం దావా కేసుకు సంబంధించి ఈరోజు ఆయన కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే రెండు దఫాలు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తికాగా, మూడోసారి క్రాస్ ఎగ్జామినేషన్కు తన న్యాయవాదులతో కలిసి హాజరయ్యారు. ‘చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి’ అనే శీర్షికతో 2019 …
Read More »భారీ టాస్క్ భుజాన వేసుకున్న పవన్.. సక్సెస్ అయ్యేనా.. ?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పాలన పరంగా భారీ టాస్కులు భుజాన వేసుకుంటున్నారు. గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయడంతోపాటు.. గిరిజన ప్రాంతాల్లో రహదారులు కూడా నిర్మిస్తున్నారు. ఇక, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఇవన్నీ ఒక ఎత్తయితే.. మరోవైపు.. తాజాగా ఆయన తీర ప్రాంత పరిరక్షణ సహా పచ్చదనం పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కొన్నాళ్లుగా కసరత్తు ముమ్మరం చేసిన ఆయన …
Read More »జనవరి వచ్చిందంటూ గుర్తుచేస్తున్న షర్మిల
ఏటా జనవరి వస్తోంది.. పోతుంది… సంవత్సరాలు మారుతూ క్యాలెండర్ మారుతున్నాయి అంటూ ఏపీసీసీ చీఫ్ షర్మిల గుర్తు చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా అని సరిపెట్టుకోవడం కాదండీ.. జనవరి వచ్చింది. ఫస్ట్ తారీఖున ఇస్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏదీ అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. పనిలో పనిగా గత వైసీపీపై కూడా ఆమె సెటైర్లు వేశారు. ఐదేళ్లపాటు జాబ్ క్యాలెండర్ పేరుతో ఆ పార్టీ యువత చెవుల్లో …
Read More »ముగిసిన `మండలి`- కవిత స్పీచే రికార్డ్!
తెలంగాణ శాసన మండలి శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఈ సీజన్లో మొత్తం 5 రోజుల పాటు మాత్రమే ఈ సమావేశాలు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) నిర్ణయంతో ఐదు రోజుల పాటు జరిగిన సమావేశాలు మంగళవారం సాయంత్రంతో ముగిసినట్టు చైర్మన్ ప్రకటించారు. అనంతరం.. నిరవధికంగా మండలిని వాయిదా వేశారు. ఈ ఐదు రోజుల్లో మొత్తం దాదాపు 20 గంటల పాటు మండలి కార్యకలాపాలు సాగాయి. వాస్తవ సమయం 19 గంటల …
Read More »పోలవరం పరుగులు పెడుతుందండోయ్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులు, వేగం పుంజుకున్నాయి. గత 18 నెలల వ్యవధిలో ప్రాజెక్టు పనులు 13 శాతం మేర పూర్తికాగా, మొత్తం నిర్మాణం ఇప్పటివరకు 87.8 శాతానికి చేరుకుంది. 2014 నుంచి 2019 మధ్యకాలంలోనే సివిల్ పనులు 72 శాతం పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. అయితే 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల పాలనలో కనీసం 2 శాతం పనులు కూడా ముందుకు …
Read More »హద్దు దాటిన రోజా: ‘పోలీసులు నీళ్లు లేని బావిలో దూకి చావాలి’
నిన్న మొన్నటి వరకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అధికారులను, పోలీసులను కూడా బెదిరించిన విషయం తెలిసిందే. తాట తీస్తా, తోలు తీస్తా, సప్త సముద్రాలకు అవతల ఉన్నా తీసుకువచ్చి శిక్షలు వేస్తా అంటూ జగన్ హెచ్చరించారు. ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నాయకురాలు జబర్దస్త్ రోజా ఎంట్రీ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత ఆమె మీడియా ముందుకు వచ్చారు. వచ్చీ రాగానే అధికారులపై విరుచుకుపడ్డారు. …
Read More »మాల్దీవ్స్ తరహాలో… ఏపీలో ఐ ల్యాండ్ టూరిజం
పర్యాటకానికి ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా 2024-2029 స్వర్ణాంధ్ర టూరిజం పాలసీ అమల్లోకి వచ్చింది. 2030 నాటికి ఆసియాలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా ఎదగడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ప్రణాళికలు తయారు చేస్తుంది. సూర్యలంకతో పాటు సూళ్లూరు పేట వద్ద ఉన్న చిన్ని చిన్న ద్వీపాలను కూడా బీచ్ టూరిజం కింద అభివృద్ధి చేయవచ్చు అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు భావన. మాల్దీవ్స్ తరహాలో ఐ ల్యాండ్ …
Read More »రాజధాని రైతులు కోరుకున్నట్టు వాస్తు ప్రకారమే..
ఏపీ రాజధాని అమరావతి రైతుల విషయంలో మరోసారి సీఎం చంద్రబాబు తన మనసు చాటుకున్నారు. రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలను ఆయన పరిష్కరించే ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో వీధి శూల ఉన్న 112 ప్లాట్లకు ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపునకు అంగీకరించారు. నిజానికి ఈ సమస్య పై గతంలో రైతుల నుంచిపెద్ద ఎత్తున ఫిర్యాదులు, విన్నపాలు వచ్చాయి. వీటిని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates