గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీ అధినేత జగన్ దూరం పెడుతున్నారా? తన పార్టీలోని మిగతా నేతలతో ఉన్నంత సఖ్యతతో వంశీతో జగన్ ఉండడం లేదా? ఒక మాజీ ఎమ్మెల్యే అయిన వంశీ కూడా జగన్ ను ఒక సాధారణ కార్యకర్తలాగా బారికేడ్ల అవతల నుంచి కలుస్తున్న వైనం చూస్తుంటే వంశీకి, జగన్ కు మధ్య గ్యాప్ వచ్చినట్లు వస్తున్న పుకార్లు నిజం అనిపించక మానదు. ఇటీవల గన్నవరం …
Read More »ఉరి స్థానంలో ఇంజెక్షన్? కోర్టు ఏం చెప్పిందంటే…
భారతదేశంలో మరణశిక్ష అమలు విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఉరి తీయడానికి బదులుగా ప్రాణాలు తీసేందుకు తక్కువ నొప్పిని కలిగించే ప్రత్యామ్నాయ పద్ధతులను అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రస్తుతానికి దేశంలో ఉరిశిక్ష అమలు విధానం యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఉరితీయడం అనేది చాలా బాధాకరమైన, అమానవీయమైన పద్ధతి …
Read More »కుటుంబానికో ఎకరా… సాధ్యమేనా కవిత గారూ?
2014 ఎన్నికలకు ముందు అప్పటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన హామీలలో దళితులకు 3 ఎకరాల భూమి హామీ ఒకటి. అయితే, ఇది పూర్తి స్థాయిలో అమలు కాలేదు. దీంతో, కాంగ్రెస్, బీజేపీలు ఆ విషయంపై కేసీఆర్ ను నిలదీశాయి. అయితే, తాము దళితులందరికీ 3 ఎకరాల స్థలం ఇస్తామని చెప్పలేదని, స్థలం లభ్యతను బట్టి ఇస్తామని కేసీఆర్ మాట దాటేశారు. రాష్ట్రంలో స్థలాలు సరిపడినన్న లేవు కాబట్టి ఆ …
Read More »తెలుగుదేశానికి కాపు కాయడానికి జనసేన పెట్టలేదు…
టీడీపీ నేతృత్వంలో జనసేన, బీజేపీలు కలిసి ఏపీలో ఎన్డీఏ కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలకు ముందు ఈ కూటమి ఏర్పడడానికి ముందు, తర్వాత కూడా టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉన్నాయి. అయితే, రెండు పార్టీల అధినేతలు తమ నేతలు, కార్యకర్తలకు సర్ది చెప్పుకుంటూ సమన్వయంతో ముందుకు పోవాలని హితబోధ చేస్తూ వస్తున్నారు. కూటమిని విచ్ఛిన్నం చేయడానికి రెడీగా ఉన్న …
Read More »వైసీపీ చెప్పినట్లు సభ నడవదు
డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శాసన మండలి సమావేశాల సందర్భంగా మండలిలో ఈ వ్యవహారంపై వైసీపీ సభ్యులు, మంత్రుల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ఈ క్రమంలోనే నిన్న మండలిని వాయిదా వేశారు. అయితే, జగన్, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రావాలని, అక్కడ ఏ విషయంపై అయినా చర్చకు సిద్ధమని విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. …
Read More »తెరపైకి దిమాగీ నక్సల్స్ జనతా పార్టీ
దేశంలో కొత్త రాజకీయ వాతావరణం కనిపిస్తుంది. మూస పార్టీలకు భిన్నంగా సరికొత్త ఆన్ లైన్ పార్టీలు పుట్టుకొని వస్తున్నాయి. నిముషాల వ్యవధిలో జనంలోకి వెళ్లి పోతున్నాయి. గంటల వ్యవధిలో వేల సంఖ్యలో ఫాలోవర్లు తయారవుతున్నారు. నిన్నా మొన్న వచ్చిన కాక్రోచ్ పార్టీ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడీ దిమాగీ నక్సల్ జనతా పార్టీ ఏం చేయబోతుందో చూడాలి. ఆగస్టు 15వ తేదీన ఎర్రకోట మీదనుంచి ప్రధాని మోదీ …
Read More »భారత ఎన్నికల విధానం అమెరికాలో రావాలి: ట్రంప్
అమెరికా ఎన్నికల వ్యవస్థలో ఓటరు గుర్తింపు నిబంధనలను కఠినతరం చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భారత్లో అమలవుతున్న ఓటరు గుర్తింపు విధానాన్ని ఆయన ప్రస్తావించారు. అమెరికా ఎన్నికల్లో ఓటు వేసేందుకు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరి చేయాలని పేర్కొన్నారు. తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో ట్రంప్ చేసిన పోస్టులో.. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఇటీవల అమెరికా ఎన్నికల్లో …
Read More »తండ్రికే ఎదురు తిరిగిన జోగి రాజీవ్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న టైంలో ఆ పార్టీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ఎంతగా రెచ్చిపోయారో గుర్తుండే ఉంటుంది. ఈ వివాదాస్పద నేత వైసీపీ అధికారం కోల్పోయాక గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసుకు తోడు.. అవినీతి వ్యవహారాలకు సంబంధించిన కేసులతో ఆయన పోరాడుతున్న సంగతి తెలిసిందే. వాటిని మించి కుటుంబ వివాదం జోగి రమేష్ ఇమేజ్కు పెద్ద తలనొప్పిగా మారింది. …
Read More »అంగన్వాడీ టీచర్ కు ఎమ్మెల్సీ ఛాన్స్?
ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి ఒక అంగన్వాడీ టీచర్ ను ఎంపిక చేసి నూతన ఒరవడి సృష్టించారు. ఈ నిర్ణయం పట్ల టీడీపీ శ్రేణులు సైతం ఆశ్చార్యానికి గురయ్యారు. సీనియర్ నాయకులు పలువురు ఎమ్మెల్సీ కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు బాబు మాత్రం తన దైన శైలిలో నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఎమ్మెల్సీ కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు సైతం …
Read More »విద్యార్థుల పోరాటానికి దిగివచ్చిన మరో ప్రభుత్వం
ప్రస్తుతం దేశంలో జెన్ జీ హవా నడుస్తుంది. ఏ నిముషంలో కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం జరిగిందో కానీ దేశంలో ఎక్కడ చూసినా విద్యార్థి లోకం ఉవ్వేత్తున ఎగిసి పడుతోంది. హక్కుల సాధనలో ప్రభుత్వాల మెడలు వంచుతుంది. దాంతో ప్రభుత్వం వర్సస్ జెన్ జీ అన్నట్టు పరిస్థితి తయారైందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో భారీ అవకతవకలు జరిగాయంటూ ఢిల్లీ జంతర్ మంతర్ తరహాలో ఉద్యమం …
Read More »వైసీపీ గ్రూప్ – 1 అక్రమాలు రెండు రోజుల్లో బట్టబయలు?
డీఎస్సీ నియామకాల విషయంలో అక్రమాలు జరిగాయని రచ్చ చేస్తున్న వైసీపీ అధినేత జగన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టి సవాల్ విసిరారు. అసెంబ్లీ లో ఆయన మాట్లాడుతూ…లేనిపోని ఆరోపణలు చేసి ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బ తీయకుండా, కష్టపడి ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయుల సామార్ధ్యాన్ని కించ పరచకుండా అసెంబ్లీ వచ్చి చర్చించాలని సవాల్ చేశారు. నీ ప్రశ్నలన్నిటికీ సాక్షాలతో సమాధానం చెబుతామన్నారు. 1995 నుంచి 2025 వరకు 30 ఏళ్ళల్లో 14 డీఎస్సీల్లో 11 …
Read More »తెలంగాణపై బీజేపీ ఆశలు వదులుకుందా?
ఉత్తరాదిలో బలంగా పాతుకుపోయిన బీజేపీ దక్షిణాదిలో పాగా వేయాలని చాలాకాలంగా విశ్వప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ ప్రయత్నాలు కర్ణాటకలో కొంతవరకు సఫలమైనప్పటికీ కేరళం, ఏపీ, తెలంగాణ, తమిళనాడులో మాత్రం విఫలప్రయత్నాలుగానే మిగిలాయి. కాస్తో కూస్తో తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోంది అనుకున్న తరుణంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తప్పించారని, ఆ తర్వాత పార్టీ గ్రాఫ్ పడిపోయిందని టాక్. ఆ తర్వాత కిషన్ రెడ్డి పగ్గాలు చేపట్టినా..ఆ గ్రాఫ్ మరింత …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates