Political News

బొత్స వారసురాలి రాజకీయ రంగ ప్రవేశం

మన దేశంలో రాజకీయ వారసత్వం సర్వ సాధారణం. సినిమాల్లో నెపోటిజం మాదిరిగానే పొలిటికల్ నెపోటిజం వల్ల వచ్చిన పొలిటిషియన్లు చాలామంది ఉన్నారు. తాతల, తండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మహిళా నేతల జాబితా పెద్దదే. తాజాగా ఆ జాబితాలోకి ఏపీలోని సీనియర్ పొలిటిషియన్లలో ఒకరైన మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కూతురు బొత్స అనూష చేరారు. ఈ విషయాన్ని బొత్స సత్యనారాయణ స్వయంగా ప్రకటించారు. బొత్స …

Read More »

నాయకుడు లేకుండా యుద్ధం ఎలా జగన్?

స్థానిక ఎన్నికల్లో గెలుపోటములను ప్రత్యర్థులు ఎలా మేనేజ్‌ చేసినా.. యుద్ధం మాత్రం జరగాలట..! తన పార్టీ కార్యకర్తలకు జగన్‌ ఇస్తున్న రోడ్‌మ్యాప్‌ ఇదే..! స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తన పార్టీ శ్రేణులకు ఇస్తున్న ఈ ఆదేశాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అయితే యుద్ధం చేయాల్సింది క్యాడర్‌ అయితే.. నాయకుడు ఎక్కడ? గత ఎన్నికల నుంచి ఇప్పటివరకు జగన్‌ ఒక్కసారి కూడా …

Read More »

పదో తరగతి విద్యార్థులే రూపారెడ్డి హంతకులు

నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసులో చిక్కుముడి వీడింది. ఇద్దరు పదో తరగతి విద్యార్థులు ఆమెను హత్య చేసినట్టు పోలీసు విచారణలో తేలింది. దాంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలు విస్తుపోయారు. చెడు వ్యసనాల బారిన పడిన విద్యార్థులు దైవంతో సమానంగా గౌరవించాల్సిన గురువును పొట్టన పెట్టుకోవడం కలకలం సృష్టిస్తోంది. గంజాయి మత్తులో జరుగుతున్న నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందన్న …

Read More »

అన్నయ్యను పలకరించాలి బ్రహ్మానందం గారూ…

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వివాదాలకు పూర్తి దూరంగా ఉండే నటుల్లో బ్రహ్మానందం ఒకరు. నటుడిగా ఆయన సంపాదించుకున్న ఆదరణ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అదే సమయంలో బ్రహ్మీకి అందరివాడిగా, మంచి వ్యక్తిగా పేరుంది. దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్లో బ్రహ్మి చుట్టు ముసురుకున్న వివాదాలు పెద్దగా కనిపించవు. అలాంటి వ్యక్తి మీద సొంత అన్నయ్య కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన పేరు శ్రీనివాస్. తన తమ్ముడు …

Read More »

రేవంత్ రెడ్డికి కళ్లు నెత్తికెక్కాయి: కొండా సుష్మిత

పరకాల నుంచి పోటీ చేయాలని మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మితా పటేల్ భావించిన సంగతి తెలిసిందే. అయితే, పరకాల నుంచి రాబోయే ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తారని, ఆయనను గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డిపై సుష్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కళ్లు నెత్తికెక్కాయా అని సుష్మిత ప్రశ్నించిన వైనం తెలంగాణ …

Read More »

మడమ తిప్పిన విజయ సాయిరెడ్డి… కొత్త పార్టీ రెడీ!

వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల నుంచి గత ఏడాది జనవరిలో తప్పుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, స్వచ్ఛందంగా, వ్యక్తిగతంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, తనపై ఎవరి ఒత్తిడి లేదని ఆయన స్పష్టం చేశారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని, వేరే ఏ పదవులు ఆశించడం లేదని కూడా చెప్పారు. ఇకపై వ్యవసాయం చేసుకుంటానని రాజకీయ వైరాగ్యంతో కూడిన మాటలు …

Read More »

మండలిలో చైర్మన్ vs జనసేన మంత్రి

“మీరు నాకు పాఠాలు చెప్ప‌ద్దు స‌ర్‌!. అస‌లు మీరు(ప్ర‌భుత్వ ప‌క్షం) స‌రిగా ఉంటే.. వైసీపీ స‌భ్యులు కూడా స‌రిగానే ఉంటారు. త‌ప్పు ఎక్క‌డ జ‌రుగుతోందో ఆలోచించుకోండి.“ అంటూ.. ఏపీ శాస‌న మండ‌లి చైర్మ‌న్ మోషేన్ రాజు అధికార ప‌క్షం స‌భ్యుల‌ను ముఖ్య‌మంత్రి మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. అంతేకాదు.. స‌భా సంప్ర‌దాయాలు ఒక్క వైసీపీకి మాత్ర‌మే కాద‌ని.. ప్ర‌భుత్వ ప‌క్షానికి కూడా వ‌ర్తిస్తాయ‌ని …

Read More »

డీఎస్సీ నిర్వహణ సూపర్… లోకేష్ కు ఢిల్లీ మంత్రి అభినందనలు

రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన డీఎస్సీ పరీక్షల నిర్వాహణపై ప్రతిపక్ష వైసీపీ రాద్దాంతం చేస్తున్న విషయం తెలిసిందే. ఆధారాలు లేకుండా అక్రమాలు జరిగాయంటూ చేస్తున్న తప్పుడు ప్రచారంపై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ విసిరిన సవాల్ కు మాత్రం వైసీపీ స్పందించడం లేదు. చివరికి డీఎస్సీ అభ్యర్థులు సైతం వైసీపీ తీరును నిరసిస్తూ ర్యాలీలు చేస్తున్నారు. దేశ చరిత్రలో ఒక ప్రతిపక్ష పార్టీకి …

Read More »

మూడో బిడ్డను కంటే సంవత్సరం సెలవు

దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గుతున్న జననాల రేటు నేపథ్యంలో కుటుంబాల్లో పిల్లల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు విజయ్ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు మూడో బిడ్డకు కూడా 365 రోజుల పాటు పూర్తి జీతంతో ప్రసూతి సెలవు కల్పించేందుకు నిర్ణయించింది. ఇప్పటివరకు మూడో బిడ్డకు 12 వారాలకే పరిమితమైన ప్రసూతి సెలవును ఏకంగా ఏడాదికి పెంచడం …

Read More »

20 గంటలు పని… 4 గంటలు రెస్ట్?

తమిళ సినిమాలో అగ్ర నటుడిగా వెలుగొందిన నటుడు విజయ్ అనూహ్యంగా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. స్వర్గ సుఖాల జీవితం నుంచి ముళ్ల కిరీటం ధరించారు. రాజకీయంగా పెద్దగా అనుభవం లేకపోయినప్పటికి అనతికాలంలోనే ఢక్కా మొక్కీలు తింటున్నారు. రోజురోజుకు మరింత బలోపేతం అవుతున్నారు. పగలు రాత్రి తేడాలేకుండా ప్రజల మధ్య గడిపేస్తున్నారు. ఏదో సాధించాలన్న తపన కలిగినందునే చాలా మంది నటులకు కలగా మిగిలిన ముఖ్యమంత్రి పదవిని తొలి ప్రయత్నం లోనే …

Read More »

ఏపీలో ఉద్యోగాల పండగ

ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల‌కు ఏపీ ప్ర‌భుత్వం తీపిక‌బురు చెప్పింది. ఈ ఏడాదిలో 10 వేల‌కుపైగా స‌ర్కారీ కొలువులను భ‌ర్తీ చేసేందుకు ప‌చ్చ‌జెండా ఊపింది. వీటిలో పోలీసు, రెవెన్యూ స‌హా పంచాయ‌తీరాజ్ శాఖ‌ల‌కు సంబంధించిన ఉద్యోగాలు ఉండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌భుత్వ ఉద్యోగాల క‌ల్ప‌న‌లో వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్న ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఉపాధ్యాయులు, పోలీసు కానిస్టేబుళ్ల ఉద్యోగాల‌తో పాటు రెవెన్యూకు సంబంధించిన కొలువుల‌ను కూడా భ‌ర్తీ చేసింది. తాజాగా …

Read More »

తెలంగాణ సర్… కాంగ్రెస్ లేట్ చేసిందా?

తెలంగాణ‌లో కేంద్ర ఎన్నిక‌ల సంఘం చేప‌ట్టిన స్పెష‌ల్ ఇంటెన్సివ్ రిజ‌విజ‌న్(స‌ర్‌) ప్ర‌క్రియ దాదాపు రెండు మాసాల పాటు సాగింది. రెండు సార్లు కూడా పొడిగించారు. కానీ, అప్ప‌ట్లో వ్య‌క్తం చేయ‌ని సందేహాలు.. అప్ప‌ట్లో చురుగ్గా వ్య‌వ‌హ‌రించాల్సిన ప‌రిస్థితి మ‌రిచిపోయిన తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్‌.. అంతా అయిపోయిన త‌ర్వాత‌.. ఇప్పుడు నింపాది గా రియాక్ట్ అయ్యారు. ఎన్నిక‌ల సంఘం.. తెలంగాణ కు అన్యాయం చేసింద‌ని …

Read More »