ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా రాలేదు. పైగా రాజధాని రైతులు ఉద్యమించినప్పుడు, న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో తిరుమల వరకు పాదయాత్ర చేసిన సమయంలో ప్రజలు విస్తృతంగా సంఘీభావం ప్రకటించారు. వైసీపీ నాయకుల్లో కూడా కొందరు రైతులకు మద్దతుగా నిలిచారు. కాబట్టి రాజధానిపై మాట్లాడే అధికారం వారికి ఉంటుంది. కానీ ఆది నుంచి అమరావతిపై …
Read More »అమరావతిపై 48 గంటల్లో టోన్ మార్చిన వైసీపీ!
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని తక్కువ చేసి మాట్లాడడంతో పాటు, దీనిని నదీ గర్భంలో నిర్మిస్తున్నారని, దీని వెనుక మాఫియా ఉందని ఆయన ఆరోపించారు. అదే సమయంలో ఇంత భూమి, రెండు లక్షల కోట్ల రూపాయల వ్యయం అవసరమా అని కూడా ప్రశ్నించారు. మొత్తంగా తన మనస్తత్వాన్ని ఆయన రెండు రోజుల కిందట జాతీయ …
Read More »తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనసేన బలపరిచిన అభ్యర్థులు కొన్నిచోట్ల విజయం సాధించారు. వారితో కొండగట్టు పర్యటన సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించి తెలంగాణలో పార్టీ భవిష్యత్తుపై దశానిర్దేశం చేశారు. ఆ తర్వాత కమిటీలు అన్నీ రద్దు చేసి నూతనంగా అడ్హాక్ …
Read More »‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు చేస్తోందని ఆరోపించారు. ఇటీవల కాలంలో తిరుమల, ఇతర దేవాలయాలకు సంబంధించిన ఘటనలు తరచూ వివాదాస్పదంగా మారాయి. గతంలో పరకామణి చోరీ, లడ్డూ నెయ్యి కల్తీ ఆరోపణలు, తాజాగా మద్యం బాటిళ్ల వ్యవహారం వంటి అంశాలు భక్తుల్లో ఆందోళనను కలిగించాయి. ఇవన్నీ సహజ సంఘటనలేనా? లేక రాజకీయ లెక్కలతో సాగుతున్న …
Read More »పవన్… ‘ఒక్కరోజు విలేజ్’ పిలుపు ఫలించేనా?
నెలలో ఒక్కరోజు గ్రామీణ ప్రాంతాలకు రావాలని.. ఇక్కడి వారికి వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. మానవత్వానికి వైద్యం చిరునామా అని పేర్కొన్న ఆయన.. నెలలో ఒక్కరోజైనా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆధునిక వైద్యం అందించేందుకు వైద్యులు కృషి చేయాలని కోరారు. పిఠాపురంలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్.. కాకినాడ లోని ప్రఖ్యాత రంగరాయ మెడికల్ కాలేజీలో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. …
Read More »‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట చేసిన వ్యాఖ్యలపై ఆయన శనివారం నేరుగా స్పందించారు. నదీగర్భంలో రాజధానిని నిర్మిస్తున్నారని, రెండో విడత భూములు సేకరిస్తున్నారని జగన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తిప్పికొట్టారు. జగన్కు నాగరికత తెలియదని మండిపడ్డ చంద్రబాబు, నదుల ఒడ్డునే నాగరికత విలసిల్లిందన్న కనీస జ్ఞానం కూడా ఆయనకు లేదన్నారు. అందుకే మిడిమిడి జ్ఞానంతో …
Read More »అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ అధినేత కార్యవర్గంతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు” అని శనివారం సాయంత్రం పార్టీ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ కమిటీలు, కార్యాచరణను కూడా ప్రారంభించామని తెలిపింది. రాష్ట్రంలోని 117 మునిసిపాలిటీలకు …
Read More »జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ, నదీ తీర ప్రాంతంలో నగర నిర్మాణం సాధ్యం కాదన్న వ్యాఖ్యలు ప్రజల్లో, ముఖ్యంగా రాజధాని రైతుల్లో ఆగ్రహాన్ని కలిగించాయి. అమరావతి కేవలం భౌగోళిక అంశం కాదని, ప్రజల త్యాగాలు, ఆకాంక్షలతో ముడిపడిన అంశమనే భావనను జగన్ వ్యాఖ్యలు విస్మరించాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యతిరేకత నేపథ్యంలో వైసీపీ నష్ట …
Read More »చంద్రబాబుపై బండ్ల గణేష్ అభిమానం వెలకట్టలేనిది
చిత్ర నిర్మాత బండ్ల గణేశ్ మరోసారి తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు. ఇటీవల దీపావళి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని తన నివాసానికి ఆహ్వానించి ప్రత్యేక వేడుక నిర్వహించిన బండ్ల గణేశ్, తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. షాద్నగర్ నుంచి తిరుమల వరకు ‘మహా పాదయాత్ర’ చేపట్టనున్నట్లు వెల్లడించారు. చంద్రబాబు నాయుడుపై తనకు ఉన్న అభిమానాన్ని, భక్తిని చాటుకునే భాగంగానే ఈ పాదయాత్ర చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో స్కిల్ …
Read More »శుభ సంకల్పం: రెండు రాష్ట్రాల మధ్య కొత్త స్నేహం!
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దాదాపు ఒకే మాట చెప్పుకొని రావడం.. కలసి కూర్చుని చర్చించుకుంటే.. సమస్యలు పరిష్కరించుకోవచ్చన్న దిశగా ఆలోచన చేయడం.. ప్రస్తుతం నెలకొన్న సమస్యల పరిష్కారానికి శుభసంకల్పమేనని అంటున్నారు పరిశీలకులు. ఇరు రాష్ట్రాల మధ్య గత ఆరు మాసాలుగా నీళ్లు నిప్పులుగా మారాయి. పోలవరం-బనకచర్ల నుంచి నాగార్జున సాగర్వరకు.. అనేక ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ, ఏపీల మధ్య …
Read More »పవన్ కల్యాణ్ గారూ… మీరే దిక్కు!
ఆదీవాసీ సమాజానికి ఐకాన్గా కనిపిస్తున్న ఏకైక నాయకుడు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఆదివాసీలు(గిరిజనులు) నివసిస్తున్న గ్రామాలు, తండాలకు రహదారి సౌకర్యం కల్పించడంతో పాటు విద్యుత్ వెలుగులు కూడా తీసుకువస్తున్నారు. ఆయా పనులను ప్రత్యక్షంగా ఆయన పరిశీలిస్తున్నారు. అంతేకాదు.. పండుగలు, శుభకార్యాలను దృష్టిలో పెట్టుకుని వారికి పండ్లు, చెప్పులు.. ఇతరత్రా వస్తువులను కూడా పంపిణీ చేస్తున్నారు. దీంతో ఆదివాసీ జనాలకు ఇప్పుడు పవన్ కల్యాణ్.. పెద్దదిక్కుగా మారిపోయారు. …
Read More »నేను సంబరాల రాంబాబునైతే…మరి పవన్?
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గతంలో సంక్రాంతి సందర్భంగా గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్ వేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. సంబరాల రాంబాబు అంటూ టీడీపీ, జనసేన నేతలు రాంబాబుపై విమర్శలు గుప్పించారు. ఇక, సోషల్ మీడియాలో అయితే రాంబాబును నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. ఇంకాస్త ముందుకెళితే పవన్ కల్యాణ్ నటించిన బ్రో చిత్రంలో అంబటి పాత్రను పృథ్వీ పోషించారని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates