కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీకి భారత ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ప్రస్తుతం “టీఆర్ఎస్” పేరును కొనసాగించేందుకు అనుమతి లేదని స్పష్టం చేస్తూ పార్టీ పేరును మార్చాలని ఆదేశించింది. టీఆర్ఎస్ పేరుపై ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు అందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. తెలంగాణ అస్తిత్వం, భావోద్వేగాలకు ముడిపడిన “టీఆర్ఎస్” పేరును మరో రాజకీయ పార్టీ వినియోగించడంపై తెలంగాణ …
Read More »లోకేష్నే వైసీపీ టార్గెట్ చేసిందా?
ఏపీలో విపక్షం వైసీపీ ఇటీవలి కాలంలో తిరిగి యాక్టివ్ మోడ్ లోకి వచ్చినట్టే కనిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రదాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిన వైసీపీ… చాన్నాళ్ల పాటు బయటకే రాలేని పరిస్థితి. ఆ స్థితి నుంచి ఇప్పుడిప్పుడే ఆ పార్టీ బయటకు వస్తోంది. అదే సమయంలో తన టార్గెట్ ఎవరన్న విషయాన్ని కూడా ఆ పార్టీ విస్పష్టంగానే చెప్పేస్తోంది. తమ అంతిమ టార్గెట్ టీడీపీ జాతీయ కార్యనిర్వాహక …
Read More »రిషికొండ ప్యాలెస్ నుండి ప్రభుత్వానికి ఆదాయం ఉంటుందా?
రిషికొండ పాలెస్ లను వినియోగంలోకి తీసుకువచ్చే దిశగా ఎట్టకేలకు ఓ కీలక అడుగు అయితే.పడింది. సాగర నగరం విశాఖ పర్యాటక కేంద్రంగా ఇప్పటికే ఓ రేంజికి ఎదగగా… తాజాగా కూటమి సర్కారు చేపడుతున్న చర్యల కారణంగా నగర పరిసరాలకు మరింత మేర పర్యాటక శోభ వస్తోంది. అందులో భాగంగానే రిషికొండ ప్యాలెస్ లను ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చే దిశగా ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ఈ తంతు త్వరగానే …
Read More »అమరావతి కీలక అధికారి రాజీనామా… ఏం జరుగుతుంది?
ఏపీ రాజధాని అమరావతిపై చర్చ జరుగుతున్న సమయంలో కీలక అధికారి, మాజీ ఐఏఎస్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. అసలు ఎందుకిలా జరిగిందని ఆయన ప్రశ్నించారు. దీంతో ప్రస్తుతం సదరు అధికారి రాజీనామా వ్యవహారం కూడా చర్చకు దారి తీసింది. ఎవరాయన? మాజీ ఐఏఎస్ అధికారి ఎస్వీఆర్ శ్రీనివాస్. ఆయనను కూటమి ప్రభుత్వం ఏరికోరి తెచ్చుకుని అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ …
Read More »మహిళా మంత్రి గారు మళ్ళీ అలిగారా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, ప్రస్తుత మంత్రి కొండా సురేఖ మళ్లీ అలిగారా? కీలకమైన మంత్రి వర్గ సమావేశానికి గైర్హాజయ్యారా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. మంత్రి వర్గంలో దేవదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ.. గత ఏడాది కాలంగా అసంతృప్తితోనే ఉన్నారు. తనకు ప్రాధాన్యం లేదని.. తనను హైజాక్ చేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యానికి తోడు.. నటుడు నాగార్జున విషయంలో ఏర్పడిన వివాదంపై తాను …
Read More »రేవంత్ కోరి ఖర్చులు పెంచుకుంటున్నారా?
ఒకవైపు రాష్ట్రంలో సొమ్ములు లేవని.. ఎవరూ డబ్బులు డిమాండ్ చేయద్దని సాక్షత్తూ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అంతేకాదు.. బీఆర్ ఎస్ హయాంలో చేసిన 8.5 లక్షల కోట్ల రూపాయల అప్పుతో రాష్ట్రం ఆ సొమ్ములకు వడ్డీలు కట్టేందుకే ఇబ్బంది పడుతోందని కూడా అంటున్నారు. ఇక, ఫీజు రీయింబర్స్మెంటు బకాయిలపై హైకోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసింది. అలానే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కూడా ప్రభుత్వం అప్పులు చేస్తున్న పరిస్థితి …
Read More »మావిగన్ రచ్చలో మాజీ ఎంపీ
వైసిపి చేసిన మావిగన్ ప్రతిపాదన వల్ల ప్రయోజనం ఏంటి అని మాజీ ఎంపీ, అదే పార్టీ నుంచి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు మరో మూడేళ్లు సమయం ఉందనగా ఏపీ రాజధాని అంశంపై వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త ప్రతిపాదనను తెరమేదికి తీసుకువచ్చారు. మావిగన్ అజెండాగా తాము వచ్చే ఎన్నికలకు వెళతామని తీర్చి చెప్పారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగడమే వైసీపీకి కావలసింది. ఇప్పుడు అదే జరుగుతోంది.. …
Read More »‘చనిపోకపోతే ప్రేమ విషయం మీ ఇంట్లో చెప్పేస్తా’
మానవ జీవన యానంలో ఎప్పటికప్పుడు కొత్త పోకడలు, కొంగొత్త మోసాలు, సభ్య సమాజాన్ని నివ్వెరపరిచే నయా వేధింపులు… ఇలా ఒక్కటేమిటి నిత్యం ఎక్కడో ఒక చోట ఈ తరహా సరికొత్త ఘటనలు నమోదు అవుతున్నాయి. ఈ తరహా ఘటనల్లో ఓ సారి మగాడు చనిపోతుంటే… మరోసారి ఆడవారు బలైపోతున్నారు. వెరసి ఆడ, మగల మధ్య స్నేహం, ప్రేమల్లో దారుణాతి దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి ఓ కొత్త ఘటనలో మగాడు మృగాడిగా …
Read More »కవిత అరెస్టు తీరును ఖండించిన జనసేన
జనసేన పార్టీ మహిళలకు ఎంత ప్రాధాన్యతనిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర లేదు. వీర మహిళలు అని సంబోధిస్తూ పార్టీలో మహిళలకు జనసేన అధినేత పవన్ అత్యంత గౌరవమిస్తారన్న సంగతి తెలిసిందే. పార్టీ సిద్ధాంతాన్ని జనసేన నేతలు కూడా తూ.చ తప్పుకుండా పాటిస్తుంటారు. తాజాగా కల్వకుంట్ల కవితను అరెస్టు చేసిన తీరును జనసేన తెలంగాణ జనరల్ సెక్రటరీ, నిర్మాత రామ్ తాళ్లూరి ఖండించిన తీరు అందుకు నిదర్శనం. ఇడుపు కాగితం సినిమా పేరుపై …
Read More »జగన్ వ్యూహం.. బాబుకు కొత్త సవాల్!
ప్రస్తుతం రాజధాని అమరావతి ప్రాంతం అభివృద్ధిలో ముందుకు సాగాలన్నది ప్రపంచ స్థాయి నగరంగా మారాల న్నది సీఎం చంద్రబాబు ఆలోచన. వ్యూహం కూడా. అందుకే.. అనేక వ్యయ ప్రయాసలకు సిద్ధమై.. దీనిని తిరిగి పట్టాలెక్కించారు. అయితే.. ఇప్పుడు దీనికి గండి కొట్టడం ద్వారా తన పంతం నెగ్గించుకునేందుకు వైసీపీ అధినేత జగన్ ప్రయత్నం చేస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. మావిగన్ ప్రకటన చేయడం ద్వారా ఒక కల్లోల పరిస్థితిని సృష్టించి …
Read More »అరకుపై పవన్ అస్త్రం పని చేస్తుందా?
ఏపీలోని అల్లూరి సీతారామ రాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాల పరిధిలో విస్తరించిన అరకు పార్లమెంటు స్థానం పెద్దది. ఈ నియోజకవర్గం పరిధిలో పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకులోయ, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ నియో జకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఒక్క పార్వతీపురం మినహా అన్నీ ఎస్టీ నియోజకవర్గాలే కావడం గమనార్హం. పార్వ తీపురం కూడా ఎస్సీలకు రిజర్వ్ చేసిన నియోజకవర్గం. ఈ ఏడు నియోజకవర్గాల్లోనూ వైసీపీకి బలమైన కేడర్తోపాటు …
Read More »కడపపై పట్టు కోల్పోయిన జగన్
తన సొంత జిల్లా కడపపై వైసీపీ అధినేత జగన్ పట్టుకోల్పోయారా? ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది ? ఏనేత ఏం చేస్తున్నారు? అనే విషయాలపైనా ఆయన దృష్టి పెట్టలేక పోతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు నాయకులు. ఇటీవల మూడు రోజుల పాటు కడప జిల్లాలోనే తిష్ఠవేసి.. పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ పనులను ఎంపీ అవినాష్ తన పార్లమెంటు నిధులతో చేపట్టారు. అయితే.. ఆయా కార్యక్రమాలకు పలువురు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates