ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన సిరాజ్ – ఉర్ – రెహ్మాన్ అనే వ్యక్తిని ఉగ్రవాద సానుభూతిపరుడిగా గుర్తించిన రెండు తెలుగు రాష్ట్రాల నిఘా వర్గాలు.. తాజాగా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో ఉగ్ర కదలికలు, ఉగ్రవాద సానుభూతి పరుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆరా తీసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అడిగి వివరాలు తెలుసుకున్న కేంద్ర హోం శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. …
Read More »మీ చొరవ అద్భుతం: చంద్రబాబుకు గేట్స్ ప్రశంస
“మీ చొరవ అద్భుతం. మీలాంటి నాయకుడిని నేను మునుపెన్నడూ చూడలేదు. వయసుతో సంబంధం లేకుండా.. నిత్య కృషీవలునిగా మీరు చేస్తున్న అలుపెరుగని కృషి నేటి యువతరానికి ఎంతో ఆదర్శం. మీతో కలిసే అవకాశం నాకు రావడం చాలా సంతోషం. ఆ మధుర స్మృతులు నన్ను ఇప్పటికీ సంతోషానికి గురి చేస్తున్నాయి. మీరు చేస్తున్న కృషికి.. నేను తప్పకుండా ఇతోధికంగా దోహద పడగలనని హామీ ఇస్తున్నా”- అని ఏపీ సీఎం చంద్రబాబును …
Read More »వైసీపీకి ‘గూడెం’ దెబ్బ గట్టిగానే తగలనుందా?
ఏపీలోని కూటమి సర్కారు సోమవారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ అదికారంలో ఉండగా… 2022 మార్చిలో ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో అనుమాస్పద స్థితిలో 22 మంది దాకా చనిపోయారు. ఈ మరణాలకు కల్తీ కల్లే కారణమని నాడు ఆరోపణలు వినిపించినా… ఆ దిశగా నాడు దర్యాప్తు జరిగిన దాఖలా లేదు అయితే బాధితుల కుటుంబాలు ఈ మరణాలపై తమకు అనుమానాలున్నాయని, దర్యాప్తు చేయాలని పోలీసులను ఆశ్రయించాయి. ఇలా జంగారెడ్డిగూడెం పీఎస్ లో …
Read More »కూటమి పాలనకు ఎన్ని మార్కులు వచ్చాయంటే
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఏపీలో కూటమి ప్రభుత్వానికి వచ్చిన ఓట్లు.. 60.02 శాతం. ఈ లెక్క కేంద్ర ఎన్నికల సంఘమే చెప్పింది. ఇటీవల తరచుగా సీఎం చంద్రబాబు కూడా చెబుతున్నారు. అయితే.. 11 మాసాల తర్వాత కూడా.. ఇది అలానే ఉందా? ఏమైనా మార్పు కనిపించిందా? అంటే.. మార్పులేదన్న సంకేతాలు వస్తున్నాయి. ప్రస్తుతం చంద్రబాబు వివిధ వర్గాల నుంచి రాబట్టిన సమాచారం బట్టి.. కూటమికి ప్రజలు వేసిన మార్కులు …
Read More »24 గంటల్లో ఆమరణ దీక్ష చేస్తా: షర్మిల స్టేట్మెంట్
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తాజాగా సంచలన ప్రకటన చేశారు. 24 గంటల్లో విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి.. ఇప్పటికే తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని ఆమె అల్టిమేటం జారీ చేశారు. ఈ క్రమంలో 24 గంటల తర్వాత కూడా.. ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే.. తానే ఆమరణ దీక్షకు దిగుతానని ఆమె హెచ్చరించారు. ‘విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కాంగ్రెస్ పార్టీ అల్టిమేటం …
Read More »‘నీళ్లు లేని ఫైరింజన్లు.. ఆక్సిజన్లేని అంబులెన్సులు’
హైదరాబాద్లోని చార్మినార్ సమీపంలో ఉన్న గుల్జార్ హౌస్లో ఆదివారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదం లో ఒకే కుటుంబంలోని 17 మంది మృతి చెందగా.. మరింత మంది గాయపడ్డారు. అదేవిధంగా పలువరు మృతి చెందారు. ఈ ఘటనా ప్రాంతాన్ని తాజాగా తెలంగాణ మాజీ మంత్ర కేటీఆర్ పరిశీలించారు. రాష్ట్రం లో గత పదేళ్లలో జరిగిన అతి పెద్ద అగ్ని ప్రమాదం ఇదేనని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనతో అయినా.. ప్రభుత్వం …
Read More »24/7 మద్యం షాపులు తీసి ఉంచాలట బాబుగారూ
సర్వే రాయుడిగా పేరొందిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఏం చేసినా కొలతలు తీసుకుంటారు. ఎప్పటికప్పు డు ప్రజల సంతృప్తికి లెక్కలు వేసుకుంటారు. ఈ క్రమంలోనే ఆయన పలు సర్వేలు నిర్వహించడం రివాజే. అయితే.. ఎవరైనా.. విద్య, వైద్యం, ప్రభుత్వ పాలన, మౌలిక సదుపాయాల గురించి ఆరా తీస్తారు. ప్రజల నాడి తెలుసుకుంటారు. ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను బట్టి.. వాటిలో మార్పులు చేర్పుల దిశగా అడుగులు వేస్తారు. ఇది కామనే. అయితే.. …
Read More »కాంగ్రెస్తో కలిమి.. బీజేపీతో చెలిమి..!
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్లే చేస్తున్న పొలిటికల్ ట్రిక్స్ జాతీయ కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బి క్కిరికి గురి చేస్తున్నాయి. కీలక సమయంలో మోడీ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు కాంగ్రెస్కు మింగు డు పడడం లేదు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ ఏమి సేతురా.. అంటూ తల పట్టుకుంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేరళ రాజధాని తిరువనంతపురం పార్లమెంటు సభ్యుడు శశి థరూర్ ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటాడో తెలియక …
Read More »వైసీపీ మాజీ ఎంపీకి మళ్లీ అదే జైలు.. అదే గది!
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్కు జైలు అధికారులు మళ్లీ అదే జైలును, అదే గదిని కేటాయించారు. తాజాగా నందిగం సురేష్ అరెస్టు కావడం తెలిసిందే. టీడీపీ నాయకుడిపై చేయి చేసుకున్నారన్న కేసులో మాజీ ఎంపీపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆదివారం ఆయనను అరెస్టు చేశారు. సోమవారం ఉదయం గుంటూరు కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలో వచ్చే 2వ తేదీ(14 రోజులు) వరకు …
Read More »ఊపిరి వచ్చే వేళ.. ఈ ఉపద్రవాలేంటో?
ఆంధ్రుల హక్కు… విశాఖ ఉక్కు అన్న నినాదాన్ని కూటమి సర్కారు సజీవంగా నిలిపింది. అప్పటిదాకా మార్కెట్లో అంగడి సరుకులా నిలిచిన విశాఖ ఉక్కును పరిరక్షించుందామని హామీ ఇచ్చిన కూటమి సర్కారు…అదికార పగ్గాలు చేపట్టిన వెంటనే ఇచ్చిన హామీని అమలు చేసి తన మాటను నిలబెట్టుకుంది. విశాఖ ఉక్కును అమ్మేద్దామని ప్రణాళికలు రచించి వడివడిగా సాగిన కేంద్ర ప్రభుత్వం చేత అదే విశాఖ ఉక్కుకు ఊపిరి ఊదే బాధ్యతను భుజానికెత్తింది. ఇదంతా …
Read More »అయితే అతి.. లేకపోతే సైలెంట్.. ఈ ఎమ్మెల్యే ఇంతే.. !
అయితే.. అతి చేయడం, లేకపోతే సైలెంట్ అయిపోవడం.. కొందరు ఎమ్మెల్యేల వ్యవహారంగా మారింది. దీంతో నియోజకవర్గంలో సమస్యలు పట్టించుకునే నాథుడు లేకపోవడంతో ప్రజలు ప్రతిపక్ష నాయకుల ను ఆశ్రయిస్తున్నారు. ఉదాహరణకు తిరువూరు, సత్యవేడు, కడప సహా పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నియోజకవర్గాల్లో టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తోంది. అయితే.. ఈ ఎమ్మెల్యేలు ఉంటే దూకుడుగా లేకపోతే.. మౌనంగా ఉంటున్నారు. తిరువూరు ఎమ్మెల్యే విషయం అందరికీ తెలిసిందే. ఆయన …
Read More »సేమ్ ఈక్వేషన్.. గట్టి కూటమి!
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి దాదాపు 11 మాసాలు పూర్తయ్యాయి. ఈ పదకొండు మాసాల్లో చిన్న పాటి ఉపద్రవం కాదు కదా.. విభేదం కూడా రాలేదు. క్షేత్రస్థాయి చిన్నపాటి గొడవలు.. దూరాలు.. ఉన్నా.. ఉన్నత స్థాయిలో మాత్రం కలివిడి స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో కూటమి బలంగానే ఉందన్న సంకేతాలు వస్తున్నాయి. ఇక, పదవుల పంపకం నుంచి గౌరవ మర్యాదల వరకు కూడా.. కూటమి పార్టీల మధ్య ఎలాంటి తేడా కనిపించడం లేదు. …
Read More »