కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు తీసుకు వచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు-2024 పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆమోదం పొందింది. దీనికి ముందు సుదీర్ఘకాలం కసరత్తు చేసిన కేంద్రం.. అన్ని రాష్ట్రాలను దాదాపు ఒప్పించే ప్రయత్నం చేసింది. మరీ ముఖ్యంగా ఎన్డీయే భాగస్వామ్య పార్టీలను కదిలించింది. నిజానికి ఈ దఫా ఎన్డీయే మిత్రపక్షాలుగా.. లౌకిక వాద పార్టీలుగా ముద్ర వేసుకున్న జేడీయూ(బిహార్ అధికార పార్టీ), టీడీపీ(ఏపీలో కూటమి పార్టీ)లు ఉన్నాయి. …
Read More »రాహుల్ చేతికి రక్తపు మరకలు: కేటీఆర్
బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ చేతికి.. రక్తపు మరకలు అంటాయని ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. కంచ గచ్చబౌలిలోని హైద రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై స్పందించారు. ఇక్కడి 400 ఎకరాల భూములను రేవంత్రెడ్డి సర్కారు తీసుకునే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు కదం …
Read More »ఏపీలో సర్కారీ వైద్యానికి కూటమి మార్కు బూస్ట్
ప్రభుత్వ వైద్య సేవల గురించి పెదవి విరవని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. వాస్తవ పరిస్థితులు అలా ఉన్నాయి మరి. అయితే ఎల్లకాలం అవే పరిస్థితులు ఉండవు కదా. ఇతరత్రా రంగాలకు మాదిరిగానే సర్కారీ వైద్య రంగంలోనూ ఇప్పుడిప్పుడే మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులను మరింతగా ముందుకు తీసుకెళ్లే దిశగా ఏపీలోని కూటమి సర్కారు నడుం బిగించింది. ఈ మేరకు శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షలో టీడీపీ …
Read More »వైసీపీ ఆ ఇద్దరి రాజకీయాన్ని చిదిమేసిందా?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో మొదలైన పార్టీ వైసీపీ..ఎందరో నేతలను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. కొందరిని అసెంబ్లీలోకి అడుగుపెట్టిస్తే… మరికొందరిని ఏకంగా పార్లమెంటు గడపనే తొక్కేలా చేసింది. అదే సమయంలో చాలామంది నేతల రాజకీయ నేతల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసిందని చెప్పాలి. ఈ కోవకు చెందిన నేతలతో పాటుగా వారి వారసుల ఆశలను కూడా చిదిమేసిందనే చెప్పాలి. ఈ జాబితాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు నేతలను ప్రధానంగా …
Read More »లెక్కంటే లెక్కే.. బాబు మార్కు పదవుల భర్తీ
నిజమే.. లెక్కంటే లెక్కే. ఏదో చేతికి వచ్చినంత ఇచ్చుకుంటూ పోతే ఎక్కడో ఒక చోట బొక్క బోర్లా పడిపోతాం. అలా అభాసుపాలు కాకుండా ఉండాలంటే… అందుబాటులో ఉన్న లెక్కలను ఆధారం చేసుకుని ముందుకు సాగాల్సిందే. ఈ ఈక్వేషన్ ను టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పక్కాగానే అమలు చేస్తున్నట్లు ఉన్నారు. ఏపీలో అదికారంలో ఉన్న కూటమిలో టీడీపీతో పాటుగా జనసేన, బీజేపీలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ …
Read More »కాకాణికి టెన్షన్.. హైకోర్టు కీలక నిర్ణయం!
వైసీపీ మాజీ మంత్రి, కీలక నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం వరకు ఈ పిటిషన్పై ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని..అప్పటి వరకు ఎదురు చూడాల్సిందేనని తాజాగా తేల్చి చెప్పింది. దీంతో కాకాణికి మరింత టెన్షన్ పెరిగింది. నెల్లూరు జిల్లా పొదలకూరులోని రుస్తుం మైనింగ్ లో రూ.250 కోట్ల విలువైన క్వార్ట్జ్ ఖనిజాన్ని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారన్నది …
Read More »కేతిరెడ్ది గుర్రాలకోట ఏమైంది
అవినీతి మకిలి అంటకుండా సాగితే…అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా కడుపులో చల్ల కదలకుండా నిర్భయంగా ఉండొచ్చు. అదే అవినీతిలో నిండా మునిగి తేలితే.. అదికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా నిత్యం భయంభయంగానే సాగాలి. అధికారంలో ఉన్నప్పుడు ఈ మకిలీని ఎలాగోలా కప్పిపుచ్చినా…విపక్షంలో చేరితే మాత్రం దాయడం, దాని నుంచి దూరంగా జరగడం కుదరదు కదా. అధికారంలో ఉండగా…ఎంచక్కా జల్సాల కోసం తీర్చిదిద్దుకున్న ప్రత్యేక ఏర్పాట్లనూ ఎంజాయ్ చేయలేని దుస్థితి దాపురిస్తుంది. …
Read More »‘వక్ఫ్’పై వైసీపీ డబుల్ గేమ్ ఆడిందా..?
దేశంలోని మెజారిటీ ముస్లిం మైనారిటీలు వ్యతిరేకించిన వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రపతి ఈ బిల్లుపై సంతకం చేసేస్తే… బిల్లు చట్టంగా మారిపోతుంది. ఇలాంటి తరుణంలో ఏపీలోని రాజకీయ పార్టీల మధ్య శుక్రవారం ఓ విషయంపై పెద్ద రచ్చకు తెర లేసింది. అధికారి కూటమి.. అందులోనూ కూటమి కీలక భాగస్వామి టీడీపీ, విపక్ష వైసీపీల మధ్య ఈ రచ్చ ఓ రేంజిలో సాగుతోంది. వక్ఫ్ సవరణ …
Read More »మిథున్ రెడ్డి మాదిరే.. కసిరెడ్డికీ హైకోర్టులో షాక్
ఏపీలో భారీ ఎత్తున జరిగిందని భావిస్తున్న మద్యం కుంభకోణంలో గురువార ఓ కీలక పరిణామం చోటుచేసుకోగా… ఆ మరునాడు శుక్రవారం కూడా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న నాటి ప్రభుత్వ సలహాదారు, వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. మద్యం కుంభకోణంలో విచారణకు రావాలంటూ సీఐడీ జారీ …
Read More »కన్నతల్లిని మోసం చేసిన జగన్..: షర్మిల
కన్నతల్లిని మోసం చేసిన రాజకీయ నాయకుడిగా జగన్ కొత్త చరిత్ర సృష్టించారని కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్, జగన్ సోదరి వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ఇలాంటి కొడుకును కన్నందుకు.. ఆతల్లి రోజూ కుమిలి పోతోందని వ్యాఖ్యానించారు. సరస్వతి భూములు, షేర్లకు సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందంపై జగనే స్వయంగా సంతకం చేశారని.. కానీ.. ఇప్పుడు తాను ఇంకా సంతకం చేయలేదని.. ప్రాసెస్ నిలిపివేశామని చెప్పి.. మోసానికి దిగారని ఆమె ఆరోపించారు. …
Read More »‘హెచ్సీయూ’ భూ వివాదం.. ఎవరికోసం?
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఆనుకుని ఉన్న 400 ఎకరాల భూముల విషయంపై తీవ్ర వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు కూడా సీరియస్గానే స్పందించింది. ఈ భూముల్లో చెట్ల నరికి వేతను ఆపివేస్తూ.. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. అదేసమయంలో అన్ని పక్షాల వాదనలు వింటామని పేర్కొంది. ఇదిలావుంటే.. అసలు ఈ భూముల విషయం ఎందుకు వివాదంగా మారిందన్నది ప్రశ్న. విద్యాసంస్థలకు .. గతంలో కేటాయించిన భూములు నిరుపయోగంగా …
Read More »పని మొదలు పెట్టిన నాగబాబు..
జనసేన నాయకుడు.. ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి పోటీ లేకుండానే విజయం దక్కించుకున్న కొణిదల నాగబాబు.. రంగంలోకి దిగిపోయారు. తన సోదరుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో నిర్వహిస్తున్న పలు అధికారికా కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నా రు. అయితే .. గతంలోనూ ఆయన ఇక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నా.. అప్పట్లో ఎలాంటి ప్రొటోకాల్ లేదు. కానీ.. ఇప్పుడు ఎమ్మెల్సీ కావడంతో ఆ ప్రొటోకాల్ ప్రకారం.. …
Read More »