ఐపీఎల్ వచ్చిందంటే చాలు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానుల హడావుడి మామూలుగా ఉండదు. ఈ జట్టుకు కేవలం బెంగళూరులోనే కాదు.. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో మాంచి ఫాలోయింగ్ ఉంది. అందుకు ప్రధాన కారణం లీగ్ ఆరంభం నుంచి ఈ జట్టుకు విరాట్ కోహ్లి ప్రాతినిధ్యం వహిస్తుండడం. కోహ్లి అనే కాక క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మ్యాక్స్వెల్ లాంటి ఎంటర్టైనర్లు ఈ జట్టుకు ఆడడం వల్ల ఎప్పుడూ ఈ …
Read More »మంటల్లో కాలిపోయిన మేనేజింగ్ డైరెక్టర్
తెలంగాణలోని ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సంగారెడ్డి జిల్లా, హత్నూర మండలం చందాపూర్ వద్ద ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఎస్బీ పరిశ్రమలో మేనేజింగ్ డైరెక్టర్ రవి మంటల్లో కాలిపోయారు. ఆయనతోపాటు మరో ఆరుగురు కూడా మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయినట్టు అధికారులు తెలిపారు. మరో 10 మంది వరకు కార్మికులు తీవ్రంగా …
Read More »‘Z’ కేటగిరీ.. లోకేష్కు ప్లస్సా.. మైనస్సా?!
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్కు కేంద్ర ప్రభుత్వం నేరుగా ‘Z’ కేటగిరీ భద్రతను కల్పించింది. ఆయన ఇప్పుడు ఇంటి గుమ్మం నుంచి బయటకు రాగానే ‘ఏపీ 47’ తుపాకులు పట్టుకుని ఉన్న నలుగురు ఆయనను ఫాలో అవుతారు. వీరితో పాటు ఇతర భద్రతా సిబ్బంది కూడా.. ఉంటారు. మొత్తంగా ఆయన కట్టదిట్టమైన భద్రతలో అయితే ఉండిపోయారు. ఇది బాగుందని టీడీపీ నాయకులు అంటున్నారు. అయితే.. వాస్తవం …
Read More »100 కోట్ల నమ్మకం నిజమవుతుందా
టిల్లు స్క్వేర్ కి పాజిటివ్ టాక్ వేగంగా పాకుతోంది. మార్నింగ్ షోల నుంచే ఆక్యుపెన్సీలు గట్టిగా ఉన్నా కొంచెం నెమ్మదిగా కనిపించిన బిసి సెంటర్స్ లో మధ్యాన్నం నుంచే స్పీడ్ అందుకోవడం కలెక్షన్లలో కనిపిస్తోంది. ఆ ఆనందాన్ని పంచుకోవడానికి టీమ్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టడం దానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. మొదటి రోజు 25 కోట్ల దాకా గ్రాస్ వస్తుందని, ఫైనల్ రన్ అయ్యేలోగా 100 కోట్లు వసూలు చేస్తుందనే …
Read More »బిలియనీర్ల సిటీగా ముంబయి.. బీజింగ్ ను దాటేసింది!
తాజాగా విడుదలైన హురుస్ గ్లోబల్ రిచ్ లిస్టులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బిలియనీర్ల సిటీగా ముంబయికి గుర్తింపు లభించింది. ఆసక్తికరమైన అంశం ఏమంటే చైనా రాజధాని బిజింగ్ ను దాటేసింది దేశ ఆర్థిక రాజధాని. తాజాగా విడుదలైన జాబితాలో ముంబయిలో 92 మంది అత్యంత సంపన్నులు ఉన్నారని.. అదే సమయంలో బీజింగ్ లో ఈ సంఖ్య 91గా ఉండటం గమనార్హం.చైనాలో మొత్తం 814 మంది బిలియనీర్లు ఉండగా.. భారత్ …
Read More »పిక్ టాక్: చందమామకు ఐపీఎల్ రంగులద్దితే..
తెలుగు యువతకు అత్యంత నచ్చిన రెండు విషయాలు.. సినిమా, క్రికెట్. సోషల్ మీడియాలో మన నెటిజన్ల చర్చలు ప్రధానంగా వీటి చుట్టూనే తిరుగుతాయి. మీమ్స్, జోక్స్ అన్నీ కూడా ప్రధానంగా వీటి చుట్టూనే తిరుగుతుంటాయి. ఇక ఐపీఎల్ టైం వచ్చిందంటే క్రికెట్, సినిమాలు మిక్స్ చేసి ఎడిట్ల మోత మోగిస్తుంటారు మన నెటిజన్లు. ఇందుకోసం హీరోలు, కమెడియన్లనే కాదు.. హీరోయిన్లను కూడా బాగానే ఉపయోగించుకుంటారు. తాజా కాజల్ అగర్వాల్కు, ఐపీఎల్ …
Read More »మాస్కోలో మారణ కాండ!
అది సంగీత విభావరి జరుగుతున్న సమయం. గాయకులు తన్మయత్వంతో గీతాలను ఆలపిస్తున్నారు. వీక్షకులు.. మంత్ర ముగ్ధులై.. గాయకుల సంభ్రమలో మునిగి.. సంగీతంలో ఓలలాడుతున్నారు. ఇలా.. సాగుతున్న సంగీత కచేరీలో అకస్మాత్తుగా.. బాంబుల వర్షం… మారణ కాండ.. రక్తపుటేరులు. ఎటు చూసినా.. పదుల సంఖ్యలో మృతదేహాలు కన్నుమూసి తెరిచేలోగా.. ఏం జరిగిందో కూడా తెలియనంతగా భీతావహ దృశ్యాలు.. ఇవీ.. రష్యా రాజధాని మాస్కోలో జరిగిన మారణకాండ తాలూకు పరిస్థితి. రష్యా అధ్యక్షుడిగా …
Read More »ముఖ్యమంత్రులను అరెస్టుచేసిన అధికారికి ‘జడ్ +’ భద్రత..?
నెల రోజుల వ్యవధిలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఈడీ అరెస్టు చేసింది. అయితే.. ఈడీ అరెస్టు చేసిన సమయంలో దీనికి ప్రాతినిధ్యం వహించిన అధికారి ఒకరే కావడంతో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈయనకు కేంద్ర హోం శాఖ తాజాగా జడ్+ భద్రతను కల్పించింది. జార్ఖండ్ సీఎంగా ఉన్న(ఇప్పుడు మాజీ) హేమంత్ సొరేన్ను అరెస్టు చేసింది.. ఈడీ అదనపు డైరెక్టర్ కపిల్ రాజ్. ఇక, తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి …
Read More »వీరు మామూలు తల్లీకూతుళ్ళు కాదు
మగువలు.. తెగువ చూపిస్తే ఎలా ఉంటుందో.. ఆ తల్లీకూతుళ్లు చేసి చూపించారు. కత్తులు, కర్రలు కాదు.. ఏకంగా తుపాకీతో ఇంట్లోకి చొరబడిన దొంగలను అడ్డుకుని చితక్కొట్టేశారు. హైదరాబాద్ నడిబొడ్డు ప్రాంతం బేగంపేటలో తల్లీకూతుళ్లు చూపిన ధైర్యం అందరితోనూ ప్రశంసలు అందుకునేలా చేస్తోంది. వారు దొంగలపై తిరగబడ్డారు. కత్తులకు బెదరలేదు… తుపాకీకి జడవలేదు. ఎదురుతిరిగారు… దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ తల్లీకూతుళ్ల సాహనం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్ …
Read More »ధోని విషయంలో ఇక ఫిక్సయిపోవచ్చు
భారత లెజెండరీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని కెరీర్ ముగింపు దశకు చేరుకున్నట్లేనా? ఈ ఏడాది ఐపీఎల్తో అతను ఆటకు గుడ్బై చెప్పబోతున్నట్లేనా? ఔననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ధోని ఈసారి ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు కెప్టెన్గా వ్యవహరించట్లేదన్న వార్త బయటికి వచ్చినప్పటి నుంచి ఈ చర్చే జరుగుతోంది. చెన్నై యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్కు అతను పగ్గాలు అప్పగించేశాడు. ధోని రెండేళ్ల ముందు కూడా ఇలాగే చేశాడు. రవీంద్ర జడేజాకు …
Read More »సద్గురు కు ఏమైంది?
ఈశ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, సద్గురు జగ్గీ వాసుదేవ్ పరిచయం లేని వారు లేరు. సింపుల్గా ఉంటూ.. హోమాలు, యజ్ఞాలకు దూరంగా ఉంటూ.. తనదైన శైలిలో ఆధ్యాత్మికతను సైన్స్కు జోడిస్తూ ఆయన ప్రచారం చేయడం, శిబిరాలు నిర్వహించడం తెలిసిందే. ప్రతి ఏటా మహాశివరాత్రి నాడు.. ఆయన తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న తన ఆశ్రమంలో పెద్ద పండుగే చేస్తారు. దీనికి కేంద్ర మంత్రుల నుంచి ప్రముఖుల వరకు, ప్రపంచ …
Read More »‘సంతోషం’లో మనమెక్కడ?
మరో ఆసక్తికర రిపోర్టు వచ్చింది. దాన్ని చదివినప్పుడు ఒకలాంటి నిరాశ కమ్మేస్తుంది. దీనికి కారణం భారతదేశం దూసుకెళుతుందన్న పాలకుల మాటకు భిన్నంగా ప్రపంచంలో అత్యంత సంతోషకర దేశాల్లో మన ర్యాంక్ అత్యంత దారుణంగా ఉండటమే దీనికి కారణం. అంతర్జాతీయ ఆనంద దినోత్సవంగా మార్చి 20ను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో యూఎస్ కు చెందిన ఒక సంస్థ తాజాగా జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ …
Read More »