ఆ అంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు. అంతకంటే ముందు వచ్చే తెలుగు అక్షరం అ అంటే మాత్రం అప్పుల అప్పారావు అని ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశం మొత్తం తెలిసిపోయింది. ఇక పైసా లేదు. ఎలా చేస్తాడో ఏమిటో అని స్వపక్షం టెన్షన్, విపక్షం ఆనంద పడుతున్న టైమ్ లోనే సీఎం జగన్నోహన్ రెడ్డి వేల కోట్లు అప్పు తెచ్చేస్తారు. ఏ నెలకు ఆ నెల ఎలా సాగుతుందోనని జనం టెన్షన్ పడుతుండొచ్చు.. …
Read More »ట్విస్ట్ : జగన్ సర్కారుపై స్వరూపానంద ఆగ్రహం
స్వరూపానంద స్వామి. విశాఖలోని శారదాపీఠాధిపతి. పైగాసీఎం జగన్కు..వైసీపీ నాయకులకు ఎంతో ఆత్మీయ స్వామిగా పేరు తెచ్చుకున్నారు. అయితే, ఆయన తాజాగా వైసీపీ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సింహాచలం అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లపై స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పన్నను సామాన్య భక్తులకు దూరం చేసేలా దేవదాయ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. నా జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యం చూడలేదని ఆయన మండిపడ్డారు. పోలీసులను గుంపులుగా పెట్టారు …
Read More »టీడీపీ సెల్ఫీలతో వైసీపీ ఉక్కిరిబిక్కిరి!
ఏపీలో రాజకీయం అనూహ్యంగా యూటర్న్ తీసుకుంది. ఒకవైపు అధికార పార్టీ వైసీపీ.. ఇంటింటికీ స్టిక్కర్ల పేరుతో ఈ నెల 7 నుంచి కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇది ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం జగన్ హుకుం జారీ చేశారు. ఇక, దీనికి పోటీగా టీడీపీ నాయకులు కూడా యాంటీ స్టిక్కర్ల యుద్ధం ప్రారంభించారు. అయితే.. ఇది వివాదాలకు తావిస్తుండడంతో అనూహ్యంగా సెల్ఫీ యుద్ధం ప్రారంభించారు. టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు …
Read More »చంద్రబాబు ఇమేజ్ను పెంచేస్తున్న వైసీపీ వ్యూహాలు!
టీడీపీ అధినేత చంద్రబాబుకు విజన్ ఉన్న నాయకుడు అనే ఇమేజ్ ఉంది. ఇది చెరిపేస్తే చెరిగేలా లేదు. ఆయన అంత బలంగా పునాదులు వేసుకున్నారు. అయితే.. దీనిని ఖరాబు చేయాలని.. చంద్రబా బుకు ఇమేజ్ లేదని చాటి చెప్పాలని ఏపీ అధికార పార్టీ వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. అందుకే తరచుగా అమరావతిని కేంద్రంగా చేసుకుని ఇక్కడ సినిమా చూపించారు తప్ప ఏమీలేదనే విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే.. …
Read More »జగన్.. భారతిరెడ్డిలను విచారించాలట
రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించిన పరిణామాల గురించి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై టీడీపీ నేత పట్టాభి సంచలన డిమాండ్ చేశారు. వివేకా హత్య కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని.. ఆయన సతీమణి భారతి రెడ్డిలను సీబీఐ విచారించాలన్న కొత్త డిమాండ్ ను ఆయన తెర మీదకు తీసుకొచ్చారు. వివేకా హత్యలో ఇప్పటివరకు విచారించిన …
Read More »ఇలాంటి సర్వేలతో చేటే ఎక్కువ జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల్లో చాలామంది నిన్నట్నుంచి సంబరాల మోడ్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతున్నట్లుగా టైమ్స్ నౌ ప్రకటించిన సర్వేలో తేలడమే అందుక్కారణం. ఏపీలో ఉన్న ఎంపీ సీట్లే 25 అయితే.. ఆ పార్టీ 24 లేదా 25 స్థానాలు దక్కించుకుంటుందని టైమ్స్ నౌ ప్రకటించింది. కేంద్రంలో మోడీ హవా కొనసాగనున్నట్లు.. బెంగాల్లో మమతా బెనర్జీ, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ మెజారిటీ సీట్లు …
Read More »జనసేన సహకరిస్తుందో లేదో చూడాలి..
ఏపీ బీజేపీ విచిత్ర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఎవరితో కలవాలి ఎవరితో కలవకూడదో అర్థం కాక నానా తంటాలు పడుతోంది. జనసేన తమకు సహకరించడం లేదని గగ్గోలు పెట్టి ఇప్పుడు ఆ పార్టీతోనే కలిసిపోయేందుకు సిద్ధమవుతోంది. ఉమ్మడి ఉద్యమాలకు శ్రీకారం చుట్టబోతోంది. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నేత మాధవ్ ఘోర పరాజయం తర్వాత జనసేనపై ఆయన ఆరోపణలు సంధించారు. తమతో పవన్ కల్యాణ్ కలిస రావడం లేదని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ …
Read More »చంద్రబాబుకు రాయపాటి టెన్షన్
టీడీపీ సీనియర్లు చంద్రబాబుకు శిరోభారమయ్యారు. కంట్లో నలుసుల్లా తయారై ఒక్కొక్కరూ ఒక్కో రకంగా ఏడిపిస్తున్నారు. ఒకటికెట్ ఇవ్వడమే గగనమని చంద్రబాబు లెక్కలేసుకుంటుంటే.. ఇంటికి రెండు మూడు టికెట్లు అడుగుతూ వేధిస్తున్నారు. పైగా పార్టీని, అధినేతను బ్లాక్ మెయిల్ చేసేందుకు వెనుకాడటం లేదు. కాళ్లు కదలక వీల్ ఛైర్లో తిరుగుతున్న ఉమ్మడి గుంటూరు జిల్లా నేత రాయపాటి సాంబశివరావు కూడా ఇప్పుడు బ్లాక్ మేయిలర్ల జాబితాలో చేరారు. రెండు నెలల పాటు …
Read More »జగన్ కు వేరేదారి లేదా ?
అనుకోని డెవలెప్మెంట్లు జరిగితే ఏమిచేయాలి ? ఇపుడిదే విషయమై జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారట. వివేకానందరెడ్డి మర్డర్ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇరుక్కుంటే అపుడు ప్రత్యామ్నాయంగా ఏమిచేయాలి అనే విషయాన్ని జగన్ ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం మొదలైంది. జగన్ కు అవినాష్ దగ్గర బంధువే కాదు అత్యంత నమ్మకస్తుల్లో ఒకడనే చెప్పాలి. జగన్ తరపున ఇపుడు జిల్లా వ్యవహారాలన్నింటినీ ఎంపీయే చక్కబెడుతున్నారు. జగన్ దగ్గర అవినాష్ మాటకు తిరుగేలేదు. ఇటు …
Read More »నాడు ప్రజారాజ్యం.. నేడు బీజేపీ
ప్రముఖ వ్యాపారవేత్త, సమాజ సేవకుడు, తులసీ సీడ్స్ అధినేత రామచంద్ర ప్రభు బీజేపీలో చేరారు. రాజమహేంద్రవరంలో జరిగిన బీజేపీ రాష్ట్ర శాఖ కోర్ కమిటీ సమావేశం సందర్భంగా రామచంద్ర ప్రభు కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రధాని మోదీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి తన కుమారుడైన తులసీ సీడ్స్ ఎండీ యోగేష్ చంద్రతో కలిసి పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకకటించారు. ఏపీ బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పుకున్నారు.. నాడు ప్రజారాజ్యం …
Read More »చంద్రబాబు ప్రకటించిన క్యాండిడేట్.. ఎవరీ ఎరిక్షన్ బాబు?
ఎర్రగొండపాలెం చంద్రబాబు పర్యటనలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దళితులకు క్షమాపణలు చెప్పి చంద్రబాబు ఎర్రగొండపాలెంలో పర్యటించాలని మంత్రి ఆదిమూలపు సురేశ్ డిమాండ్ చేశారు. డిమాండ్ చేసినట్లుగానే చంద్రబాబు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంతేకాదు టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. మంత్రి ఆఫీసుపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పలువురు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో మంత్రి ఆదిమూలపు సురేశ్పై చంద్రబాబు నాయుడు ఆగ్రహం …
Read More »ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ, టీటీడీ కు అడ్డంగా దొరికిపోయారు
పెద్దల సభ సభ్యుడు తిరుమలలో అక్రమాలకు తెర తీసారు. ఎమ్మెల్సీగా తిరుమలలో తనకు ఉన్న అవకాశాలను సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నించారు. టీటీడీ విజిలెన్స్ కు అడ్డంగా దొరికిపోయారు. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు ఎప్పుడూ పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. అయితే, శ్రీవారిని త్వరగా దర్శించుకొని వెళ్లిపోవాలని కొందరు ప్రయత్నిస్తుంటారు. దానికోసం అడ్డదారులు తొక్కి అడ్డంగా దొరికిపోయిన సందర్భాలు ఉంటాయి. ఇక, తమకు ఉన్న పలుకుబడితో ప్రజాప్రతినిధులు, నేతలు కూడా భక్తులకు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates