Political News

దేశంలో సంచలనం: రెండుగా చీలిపోయిన మాజీ న్యాయమూర్తులు

దేశంలో ఏది జరగకూడదో అదే జరిగింది. అత్యంత అరుదుగా మాత్రమే మీడియా ముందుకు రావాల్సిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు, న్యాయకోవిదులు రెండు వర్గాలుగా చీలిపోయి మీడియా ముందుకు రావడం, ప్రకటనలు గుప్పించడం ఇప్పుడు సంచలనం గా మారింది. న్యాయవ్యవస్థలో సుదీర్ఘ కాలం పనిచేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సమాజానికి అత్యంత ఆదర్శవంతంగా వ్యవహరిస్తారన్నది అందరూ భావించే విషయం. ముఖ్యంగా పారదర్శకతకు, నిష్కర్షకు, నిజాయితీకి వారు నిలువెత్తు దర్పణంగా మారుతారని కూడా అందరూ …

Read More »

నాడు కేకలేసి!.. నేడు వెక్కివెక్కి ఏడ్చి!

ఏపీలో రోజుకో మలుపు తిరుగుతున్న మద్యం కుంభకోణాన్ని విచారిస్తున్న విజయవాడలోని ఏసీబీ కోర్టులో వింత, విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అది కూడా వైసీపీ సీనియర్ నేత, చిత్తూరు జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరెస్టైన తర్వాత ఈ వింతలు ఓ రేంజికి పెరిగిపోయాయి. అరెస్టైన కొత్తలో అటు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కార్యాలయం ప్రాంగణం, ఇటు …

Read More »

‘ఇక్కడుండి చెప్పడం కాదు.. జనాల్లోకి రండి’

వైసీపీ రాజకీయ వ్యవహారాల రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డికి పార్టీ సీనియర్ నాయకుల నుంచి భారీ సవాలే ఎదురైంది. గత రెండురోజులుగా ఆయన పార్టీ జిల్లా స్థాయి నాయకులతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వర్క్‌షాపులు నిర్వహిస్తున్నారు. పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి? ఏ విధంగా పార్టీ ఇమేజ్ పెంచాలి? జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రి ఎలా చేయాలి? ఓటు బ్యాంకును తిరిగి ఎలా సొంతం చేసుకోవాలి? అనే విషయాలపై సజ్జల …

Read More »

‘అత‌ని క‌ణ‌తకు తుపాకీ పెట్టి.. జ‌గ‌న్ బెదిరించారు’

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి వ‌ర్సెస్‌.. ప్ర‌తిప‌క్ష వైసీపీకి మ‌ధ్య వివాదం తార‌స్థాయికి చేరింది. వైసీపీ నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు పాల‌క‌మండ‌లి బోర్డు, కార్య‌నిర్వ‌హ‌ణాధికారి స‌హా.. ఇత‌ర అధికారులు దీటుగా స్పందిస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో తిరుమ‌ల భ్ర‌ష్టు ప‌ట్టింద‌ని, ప‌విత్ర‌త ప్ర‌శ్నార్థ‌కంగా మారింద‌ని వైసీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా గోశాల‌లో గోవుల మృతి, తిరుప‌తిలో వైకుంఠ ద‌ర్శ‌న టోకెన్ల విష‌యంలో చోటు చేసుకున్న తొక్కిస‌లాట వంటివి బోర్డుకు …

Read More »

జగన్ తో కానిది బాబుతో పూర్తి!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనను ఆకాశానికెత్తని రోజు లేదంటే అతిశయోక్తి కాదేమో. ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా… తన పాలనా కాలం స్వర్ణయుగమని కూడా ఆయన చెప్పుకున్న సందర్భాలు ఎన్నో. అయితే ఆయన చేయలేక చేతెలెత్తేసిన చాలా పనులను ఇప్పుడు కూటమి సారథి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వరుసబెట్టి చేసేస్తున్నారు. జగన్ కు పాలన ఎంతమాత్రం చేతకాదని కూడా బాబు తన చర్యల ద్వారానే …

Read More »

దివ్యాంగులకు బిగ్ రిలీఫ్ ఇచ్చిన బాబు

ఏపీలో కొన్నిరోజులుగా పలు ప్రాంతాల్లో దివ్యాంగులు తమ పెన్షన్లు రద్దు అయిపోయాయని రోడ్డెక్కిన వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి దివ్యాంగుల పెన్షన్లలో చాలా మంది తమ వైకల్య శాతాన్ని చూపేందుకు తాత్కాలిక సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇలాంటి వారి పెన్షన్లను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. వైకల్య శాతాన్ని చూపే పర్మినెంట్ సర్టిఫికెట్ ఇస్తే పెన్షన్లను తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పారు. అయితే వైకల్య శాతాన్ని నిర్ధారించే సదేరాం క్యాంపుల ఏర్పాటు, బాధితులు వైద్యుల వద్దకు వెళ్లడం ఒకింత సమయాభావంతో కూడుకున్న …

Read More »

ఐఏఎస్ శ్రీల‌క్ష్మి.. ఓ తాట‌కి: భూమ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వైసీపీ సీనియ‌ర్ నేత‌, తిరుప‌తి మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి.. రాజ‌కీయ నేత‌ల‌పై త‌ర‌చుగా విమర్శ‌లు చేయ‌డం తెలిసిందే. అయితే.. తాజాగా ఆయ‌న ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారి శ్రీల‌క్ష్మిపై విరుచు కుప‌డ్డారు. ఆమెను ఏకంగా `తాట‌కి` అంటూ సంబోధించారు. తాజాగా సెల్ఫీ వీడియో విడ‌ద‌ల చేసిన భూమ‌న‌.. ఆర్థిక శాఖ స‌హా మైనింగ్ ఇత‌ర శాఖ‌ల‌కు కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసిన సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి శ్రీల‌క్ష్మిపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌స్తుతం …

Read More »

వైసీపీ ఎఫెక్ట్… జైలుకు ఐపీఎస్ సంజయ్

2019లో ఏపీలో అధికారం చేపట్టిన వైసీపీ… తాను చెప్పినట్టుగా వినే అధికారులను అందలమెక్కించి… ఆ పనులు పూర్తి అయ్యాక వారు కోరిన శాఖలకు బదిలీ చేసి అందిన కాడికి దోచుకోండి అంటూ వదిలేశారని చాలా ఆరోపణలే ఉన్నాయి. అందులో భాగంగా పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు కూటమి సర్కారు వచ్చాక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే డీజీ స్థాయి అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టై విడుదల కాగా… తాజాగా మంగళవారం …

Read More »

వైసీపీ మరో తప్పు.. అలా వద్దంటున్న నేతలు..!

ఏపీ ప్రతిపక్షం వైసీపీలో తప్పులపై తప్పులు జరుగుతూనే ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు వలంటీర్లను నమ్ముకుని నిండా మునిగారు. అప్పట్లో నాయకులకు ప్రాధాన్యం ఇవ్వలేదు. కార్యకర్తలను పట్టించుకోలేదు. దీంతో పార్టీ పరిస్థితి ఎన్నికల నాటికి ఇబ్బందిగా మారిపోయింది. అంతేకాదు, నమ్ముకున్న వలంటీర్లు యూటర్న్ తీసుకున్నారు. దీనిని అప్పట్లోనే నాయకులు హెచ్చరించారు. తమకు ప్రాధాన్యం లేకుండా వలంటీర్లకే సర్వాధికారులు ఇస్తున్నారని వగర్చారు. అయినా అధినేత పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు పార్టీని గాడిలో పెట్టేందుకు, …

Read More »

బొట్టు బొట్టుకు లెక్క: డేంజర్‌లో వైసీపీ..!

Delhi Liquor Scam : CBi Charge Sheet Revelas Shocking Details

వైసిపి హయాంలో జరిగిన 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో కూపీ లాగుతున్నకొద్దీ అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బొట్టు బొట్టుకు లెక్క కట్టి అప్పట్లో సొమ్ములు చేసుకున్నారనేది తాజాగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు చెబుతున్నారు. ఇటీవల వైసిపి సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణస్వామిని విచారించినప్పుడు కొన్ని విషయాలు ఆయన స్పష్టంగా వెల్లడించారు. ఈ క్రమంలో మద్యానికి సంబంధించి బొట్టు బొట్టుకు …

Read More »

వైసీపీ ఫైర్ బ్రాండ్లు.. మ‌రో మూడేళ్లు ఇంతే..!

వైసీపీలో కొంతమంది నాయకుల పరిస్థితి తీవ్ర ఇబ్బందిగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు వారు వ్యవహరించిన తీరు కావచ్చు, వారి నోటి దురుసు కావచ్చు.. కారణాలు ఏవైనా మరో మూడు సంవత్సరాల వరకు వారు బయటకు వచ్చే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. కొంతమంది నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీలపై వ్యక్తిగత దూష‌ణ‌లకు దిగడం, వ్యక్తిగత విమర్శలు చేయడం, అదేవిధంగా బూతులతో విరుచుకుప‌డ‌డం వంటివి తెలిసిందే. తద్వారా వారు సాధించింది ఏమీ …

Read More »

మంత్రుల వెనుకబాటు.. రీజన్లు ఇవేనా..!

చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్న టిడిపి నాయకులకు ఇటీవల ర్యాంకులు కేటాయించారు. వీటిలో పాలకొల్లు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నిమ్మల రామానాయుడు మొదటి స్థానంలో ఉండగా, కృష్ణా జిల్లాకు చెందిన కొల్లు రవీంద్ర, శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చం నాయుడు, అనంతపురం జిల్లాకు చెందిన పయ్యావుల కేశవ్ వంటి వారు చివరి స్థానాల్లో నిలబడ్డారు. దీంతో అసలు మంత్రులు ఎందుకు వెనుకపడుతున్నారు, దీనికి కారణాలు ఏంటి అన్న విషయంపై పార్టీలోనూ, మంత్రివర్గంలోనూ …

Read More »