వైసీపీ సీనియర్ నేత, మాచర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలపై హైకోర్టు సీరియస్ అయింది. వారిని ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. ప్రస్తుతం వారు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారని, అందుకే అరెస్టు చేయలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అయితే తాము బెయిల్ ఇవ్వలేదని, అలాంటప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని హైకోర్టు నిలదీసింది. అనంతరం పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన …
Read More »రేవంత్ వర్సెస్ చంద్రబాబు మరో కీలక చిక్కు..!
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలోనే భేటీ కానున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి రాజధాని వరకు ఏర్పాటు చేసే 6 లైన్ల హైవే అంశంపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించి ఒక నిర్ణయానికి రానున్నారు. ప్రధానంగా ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తున్న రహదారి ఎక్కువ భాగం ఏపీలోనే ఉండనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అత్యంత కీలకంగా మారింది. వాస్తవానికి హైదరాబాద్ నుంచి అమరావతి …
Read More »విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులు, ప్రత్యేకంగా వీరికోసమే!
విశాఖపట్నానికి సీఎం చంద్రబాబు డబుల్ డెక్కర్ వన్నెలు తెచ్చారు. తాజాగా పర్యాటకుల కోసం.. డబుల్ డెక్కర్ బస్సులను ఆయన ప్రారంభించారు. విశాఖ ప్రస్తుతం పర్యాటక ప్రాంతాల్లో నెంబర్ 1గా ఉందని.. దీనికి మరింత శోభను చేకూర్చేందుకు డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశ పెట్టామని సీఎం తెలిపారు. శుక్రవారం విశాఖలో పర్యటించిన ఆయన.. సాయంత్రం విశాఖలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం రామకృష్ణా బీచ్లో వీటిని ఆయన ప్రారంభించారు. అనంతరం.. పార్టీ నాయకులు, …
Read More »కోటంరెడ్డి హత్యకు ప్లాన్..? కుట్ర వెనుకున్నది ఎవరు?
ఏపీలో 11 సీట్లకే పరిమితమైనప్పటికీ వైసీపీ నేతల అరాచకాలు అంతకంతకూ పెరుగుతున్నాయని చెప్పేందుకు మరో నిలువెత్తు సాక్ష్యం ఇది. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందే వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ ఎన్నికల్లో తనకు గట్టి పట్టున్న నెల్లూరు రూరల్ నుంచి మరోమారు ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీలతో సంబందం లేకుండా గెలుస్తూ వస్తున్న కోటంరెడ్డిని హత్య చేసేందుకు ఓ వైసీపీ నేత ఏకంగా భారీ ప్లానే వేశారు. ఆ వైసీపీ నేత ఎవరన్నది తెలియకున్నా… ప్లాన్ లో పాలుపంచుకునే …
Read More »`రుషికొండ ప్యాలెస్`ను ఏం చేయాలో తెలీట్లా!: పవన్
వైసీపీ పాలనా కాలంలో విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ ను ఏం చేయాలో తెలియడం లేదని జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. దీని నిర్మాణానికి 500 కోట్లకు పైగానే ప్రజా ధనం వెచ్చించారని తెలిపారు. విశాఖలో సేనతో సేనాని కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో తాజాగా పవన్ కల్యాణ్ రుషికొండను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన.. ప్యాలెస్లోని ప్రతి గదినీ పరిశీలించారు. …
Read More »బెజవాడ నేతల పై లోకేష్ అసహనం.. కారణం ఏమిటి..!
విజయవాడ నేతలపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీపై కూడా ఆయన అసహనంతో ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థలను టిడిపి నాయకులు కైవసం చేసుకున్నారు. సాధ్యం కాదు అనుకున్న చీరాల, విశాఖపట్నం వంటి చోట్ల కూడా టిడిపి నాయకులు జెండా పాతారు. ప్రస్తుతం 70 శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు టిడిపి పరిధిలోకి వచ్చాయి. జనసేన …
Read More »ఇదేం పద్ధతి: భూమన పై జగన్ ఫైర్..!
వైసీపీ సీనియర్ నాయకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెను పదజాలంతో దూషించడంతో పాటు అవినీతి, అక్రమాలు, వ్యక్తిగత అంశాలను కూడా ప్రస్తావిస్తూ రెచ్చిపోయారు. ఆయన ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అన్నది పార్టీలో చర్చగా మారగా, వైసీపీ అధినేత జగన్ భూమనను హెచ్చరించారన్నది పార్టీ వర్గాల మాట. సీనియర్ …
Read More »చేసిన మంచిని మరిచి.. నన్ను తిడుతున్నారు: పవన్
“చేసిన మంచిని మరిచి.. నన్ను తిడుతున్నారు“- అని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అయినా.. తాను బాధపడడం లేదని, ఇంకా మంచి చేయాలని ప్రయత్నిస్తున్నానని అన్నారు. తాజాగా విశాఖపట్నంలో నిర్వహిస్తున్న `సేనతో సేనాని` కార్యక్రమంలో పలు విషయాలను ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాకు చెందిన విద్యార్థిని సుగాలి ప్రీతి దారుణ హత్య, అనంతర పరిణాలను ప్రస్తావిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. 2017-18 మధ్య సుగాలి …
Read More »కొద్ది మందితో పెద్ద ప్లాన్: పవన్ వ్యూహం ఇదేనా?
జనసేన పార్టీ వ్యవహారాలు, ప్రజల్లో ఆ పార్టీకి పెరగాల్సిన ఇమేజ్ సహా అనేక అంశాలపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ వేదికగా సేనతో సేనాని కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు జరగనుంది. చివరి రోజు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. తాజాగా గురువారం ప్రారంభమైన తొలిరోజు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ …
Read More »తెలంగాణ సభా సమరం ముహూర్తం రెడీ..!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం పెట్టారు. ఈ నెల 30వ తేదీ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా స్పీకర్ ప్రసాదరావు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఈ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే అంశాలను చర్చించాలనే విషయంపై సమావేశాలు ప్రారంభమైన రెండో రోజు బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీనికి అన్ని పార్టీల నేతలను …
Read More »చంద్రబాబు నిఘా నేత్రం: ఇక తప్పు చేస్తే కష్టమే..!
ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తన పార్టీ నేతలపై వస్తున్న విమర్శలు, వివాదాలకు తనదైన శైలిలో చెక్ పెట్టనున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అన్నట్టుగా చంద్రబాబు నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అయ్యారు. ముగ్గురు ఐఏఎస్లతో ఏర్పాటుచేసిన అంతర్గత కమిటీ ఇటీవల ఆయనకు నివేదిక సమర్పించింది. నియోజకవర్గాల్లో నాయకుల దూకుడును కట్టడి చేయడంతో పాటు అభివృద్ధిని ఎలా పరుగులు …
Read More »కమ్యూనిస్టుల్లో కుల చిచ్చు.. ఏపీలో ఏం జరిగిందంటే!
కమ్యూనిస్టులు అంటేనే కులాలకు, మతాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తారన్న పేరుంది. కుల జాడ్యాలు, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా వారు పోరాటాలు చేసిన సంస్కృతి కూడా ఉంది. అయితే ఇప్పుడు ఇవన్నీ కాగితాలకే, గతానికే పరిమితం అయ్యే పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది. దేశంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)లో తాజాగా కుల చిచ్చు రేగింది. ముఖ్యంగా కీలక పదవి విషయంలో కామ్రెడ్స్ రెండుగా చీలిపోయినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates