Political News

చేసిన మంచిని మ‌రిచి.. న‌న్ను తిడుతున్నారు: ప‌వ‌న్

“చేసిన మంచిని మ‌రిచి.. న‌న్ను తిడుతున్నారు“- అని జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్యానించారు. అయినా.. తాను బాధ‌ప‌డ‌డం లేద‌ని, ఇంకా మంచి చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని అన్నారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో నిర్వ‌హిస్తున్న `సేన‌తో సేనాని` కార్య‌క్ర‌మంలో ప‌లు విష‌యాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. ముఖ్యంగా క‌ర్నూలు జిల్లాకు చెందిన విద్యార్థిని సుగాలి ప్రీతి దారుణ హ‌త్య‌, అనంత‌ర ప‌రిణాల‌ను ప్ర‌స్తావిస్తూ.. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 2017-18 మ‌ధ్య సుగాలి …

Read More »

కొద్ది మందితో పెద్ద ప్లాన్: ప‌వ‌న్ వ్యూహం ఇదేనా?

జ‌న‌సేన పార్టీ వ్య‌వ‌హారాలు, ప్ర‌జ‌ల్లో ఆ పార్టీకి పెర‌గాల్సిన ఇమేజ్ స‌హా అనేక అంశాల‌పై చర్చించేందుకు డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ విశాఖ వేదిక‌గా సేన‌తో సేనాని కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్య‌క్ర‌మం మూడు రోజుల పాటు జ‌ర‌గ‌నుంది. చివ‌రి రోజు బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేశారు. తాజాగా గురువారం ప్రారంభ‌మైన తొలిరోజు కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పాల్గొన్నారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ …

Read More »

తెలంగాణ స‌భా స‌మ‌రం ముహూర్తం రెడీ..!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం పెట్టారు. ఈ నెల 30వ తేదీ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా స్పీకర్ ప్రసాదరావు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఈ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే అంశాలను చర్చించాలనే విషయంపై సమావేశాలు ప్రారంభమైన రెండో రోజు బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీనికి అన్ని పార్టీల నేతలను …

Read More »

చంద్ర‌బాబు నిఘా నేత్రం: ఇక త‌ప్పు చేస్తే క‌ష్ట‌మే..!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వాన్ని న‌డిపిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు త‌న పార్టీ నేత‌ల‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌లు, వివాదాల‌కు త‌న‌దైన శైలిలో చెక్ పెట్ట‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క, ఇక నుంచి మ‌రో లెక్క అన్న‌ట్టుగా చంద్ర‌బాబు నిర్ణ‌యాలు తీసుకునేందుకు రెడీ అయ్యారు. ముగ్గురు ఐఏఎస్‌ల‌తో ఏర్పాటుచేసిన అంత‌ర్గ‌త క‌మిటీ ఇటీవ‌ల ఆయ‌న‌కు నివేదిక స‌మ‌ర్పించింది. నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కుల దూకుడును క‌ట్ట‌డి చేయ‌డంతో పాటు అభివృద్ధిని ఎలా ప‌రుగులు …

Read More »

కమ్యూనిస్టుల్లో కుల చిచ్చు.. ఏపీలో ఏం జరిగిందంటే!

కమ్యూనిస్టులు అంటేనే కులాలకు, మతాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తారన్న పేరుంది. కుల జాడ్యాలు, మూఢ నమ్మకాల‌కు వ్యతిరేకంగా వారు పోరాటాలు చేసిన సంస్కృతి కూడా ఉంది. అయితే ఇప్పుడు ఇవన్నీ కాగితాలకే, గతానికే పరిమితం అయ్యే పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది. దేశంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)లో తాజాగా కుల చిచ్చు రేగింది. ముఖ్యంగా కీలక పదవి విషయంలో కామ్రెడ్స్ రెండుగా చీలిపోయినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. …

Read More »

కేంద్ర మంత్రి: ఈ సారి సీమకేనా??

కేంద్రంలో మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌కు రంగం రెడీ అయింది. వ‌చ్చే నెల 9న ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ఉంది. ఇది పూర్తికాగానే.. ద‌స‌రా సంద‌ర్భంగా(అక్టోబ‌రు తొలివారం) మంత్రివ‌ర్గాన్ని ప్ర‌క్షాళ‌న చేయాల‌ని ప్ర‌ధాన‌మంత్రి నిర్ణ‌యించుకున్నారని తెలుస్తోంది. త్వర‌లోనే బీహార్‌లో ఎన్నిక‌లు ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో త‌మిళ‌నాడులోనూ వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో ఆయా రాష్ట్రాల‌కు చెందిన కీల‌క నాయ‌కుల‌కు ప‌ద‌వులు ఇవ్వాల‌ని భావిస్తున్నారు. త‌మిళ‌నాడు నుంచి అవ‌స‌ర‌మైతే .. రాజ్య‌స‌భ‌కు …

Read More »

మెద‌క్‌-కామారెడ్డిలు అల్లకల్లోలం… ఏమైంది?

తెలంగాణ‌లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు రాజ‌ధాని హైద‌రాబాద్ నీట మునిగింది. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జల‌ను ప్ర‌భుత్వం సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించింది. రాజ‌ధాని కావ‌డంతో అధికార యంత్రాంగం హుటా హుటిన స్పందించి.. ప్ర‌జ‌ల‌ను ఆదుకుంది. కానీ, వ‌ర్షాల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న మెద‌క్‌, కామారెడ్డి జిల్లాల్లో ప‌రిస్థితి దారుణంగా తయారైంది. స‌హాయ‌క సిబ్బంది త‌క్కువ‌గా ఉండ‌డం.. వ‌ర్షాల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే.. మెద‌క్-కామారెడ్డి …

Read More »

15 ఏళ్ల త‌ర్వాత‌.. భార‌త్ ప్ర‌య‌త్నం.. సాకార‌మ‌య్యేనా?

దాదాపు 15 ఏళ్ల త‌ర్వాత‌.. భారత్ చేస్తున్న ప్ర‌య‌త్నం.. కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల నిర్వ‌హ‌ణ‌కు పావులు క‌ద‌ప‌డం. దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు ప్ర‌ధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ప‌చ్చ జెండా ఊపింది. దీనికి సంబంధించి అంత‌ర్జాతీయ కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల సంఘం నిర్వ‌హించే బిడ్డింగ్‌లో పాల్గొనాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది. ఇప్పుడు వేసే బిడ్ ద్వారా 2030లో నిర్వ‌హించే కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల‌కు భార‌త్ …

Read More »

త్రిముఖ వ్యూహం: టీడీపీ గ్రాఫ్ పైపైకి ..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. యువ‌త‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు. పార్టీలో కీల‌క ప‌ద‌వులను యువ‌త‌కు అప్ప‌గించ‌డం ద్వారా.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు యుద్ధాన్ని ఇప్ప‌టి నుంచే ప్రారంభించాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు. ప్ర‌స్తుతం ఉన్న అంచనాల ప్ర‌కారం.. పార్టీలోని 40 శాతం మంది యువ‌త‌కు అవ‌కాశాలు ఇవ్వ‌నున్నారు. జిల్లాల వారీగా యువ‌త‌ను ప్రోత్స‌హించ‌డం ద్వారా.. పార్టీలో యువ నాయ‌క‌త్వాన్ని పెంచాల‌ని యోచిస్తున్నారు. ఈ క్ర‌మంలో మూడు ప్ర‌ధాన అంశాల‌ను లెక్క‌లోకి తీసుకుంటున్నారు. 1) …

Read More »

ట్రంప్ టారిఫ్ దెబ్బకు.. మోడీ ‘సొంత’ వైద్యం!

భారత దేశంపై అమెరికా విధిస్తున్న అదనపు సుంకాలు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే 25 శాతం మేరకు సుంకాలు విధించిన అమెరికా, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారన్న నెపంతో భారత్‌పై మరో 25 శాతం మేరకు సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి అమెరికా అంతర్గత భద్రతా విభాగం సమాచారం కూడా ఇచ్చింది. వివిధ దేశాలపై అమెరికా విధించిన సుంకాల్లో భారత్‌పై …

Read More »

స్వామి సలహా: ఫస్ట్ టైమ్ జగన్ గణపతి పూజ

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తొలిసారి వినాయక చవితి పూజలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏటా గణపతి ఉత్సవాలు నిర్వహించినా, దానికి ఆయన కడుదూరంగా ఉంటారు. గత ఏడాది కూడా వైవీ సుబ్బారెడ్డి సహా కొందరు పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొనగా, జగన్ మాత్రం వినాయక చవితి వేడుకలకు దూరంగా ఉన్నారు. కానీ, ఈసారి మాత్రం ఆయనే నేరుగా ఈ పూజల్లో …

Read More »

ఇక మోడీ తప్పించుకోలేరు.. బాంబు పేల్చిన ట్రంప్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా బాంబు లాంటి సంచలనం విషయాన్ని వెల్లడించారు. ఇక దీని నుంచి ప్రధాని నరేంద్ర మోడీ తప్పించుకునే అవకాశం లేదని, ఆయన వివరణ ఇవ్వక తప్పదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. జమ్ము కశ్మీర్‌లోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం పహల్గాంలో ఏప్రిల్‌లో ఉగ్రవాదులు చొరబడి పర్యాటకులపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 21 మంది (ఒకరు నేపాలీ) మృతి చెందారు. దీనికి ప్రతీకారంగా …

Read More »