Political News

నో డిస్ట్రబెన్స్ ప్లీజ్

తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల వరకు తెలంగాణా పీసీసీని మార్చేది లేదని ఐఏసీసీ కీలక నేతలు స్పష్టం చేశారట. రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగాను, పీసీసీ అధ్యక్షుడిగా డబుల్ యాక్షన్ చేస్తున్న విషయం తెలిసిందే. మామూలుగా ఏ రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే వెంటనే పార్టీ అధ్యక్షపదవికి రాజీనామా చేసేస్తారు. అయితే తెలంగాణాలో మాత్రం రేవంత్ అలా చేయలేదు. …

Read More »

తెలంగాణా ఎంపీగా సోనియా ?

తెలంగాణా నుండి రాజ్యసభ ఎంపీగా సోనియాగాంధిని ఎన్నుకోవాలని తెలంగాణా కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోందట. మొదట్లో సోనియాను తెలంగాణాలోని ఏదైనా పార్లమెంటు నియోజకవర్గంలో పోటీచేయించాలని అనుకున్నారు. మెదక్, ఖమ్మం పార్లమెంటు స్ధానాల్లో ఎందులో అయినా పోటీచేయాలని సోనియాకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి రిక్వెస్టుచేసింది. పీసీసీ సమావేశంలో చేసిన తీర్మానాన్ని కూడా ఐఏసీసీకి పంపింది. నేరుగా ఢిల్లీకి వెళ్ళినపుడు రేవంత్ రెడ్డి అండ్ కో కూడా ప్రస్తావించారు. దానిపై సోనియా ఎలాంటి నిర్ణయం …

Read More »

వీల్ ఛైర్లోనే ప్రచారమా ?

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను గెలుచుకోవాలన్నది కేసీయార్ టార్గెట్. అత్యధిక సీట్లను గెలుచుకోకపోతే భవిష్యత్తు రాజకీయాలు చాలా కష్టమైపోతాయని కేసీయార్ కు బాగా తెలుసు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ద్వారా పార్టీలో కుదుపులు మొదలైపోయాయి. ఏ ఎంఎల్ఏ ఏరోజు పార్టీని వదిలేసి కాంగ్రెస్ లో చేరుతారో తెలీని అయోమయం పెరిగిపోతోంది. ఇప్పటికి ఐదుగురు ఎంఎల్ఏలు రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపధ్యంలోనే …

Read More »

ముహూర్తం ఫిక్స్‌.. రంగంలోకి ప‌వ‌న్‌…!

ముహూర్తం ఫిక్స్ అయింది.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా రంగంలోకి దిగ‌నున్నారు. వ‌చ్చే ఎన్నిక ల్లో టీడీపీ తో క‌లిసి ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న జ‌న‌సేనాని.. ఆ మేర‌కు ఇప్ప‌టికే సీట్ల స‌ర్దుబాటు పైనా ఒక లెక్క‌కు వ‌చ్చారు. ఇక‌, సంఖ్య‌, వాసి, రాసి.. అనే విష‌యాల‌ను ప‌క్క‌న పెడితే.. మొత్తంగా క‌లిసి పోటీ చేయ‌డం, వైసీపీని గ‌ద్దె దింప‌డం, రాష్ట్రాన్ని బాగు చేసుకోవ‌డం అనే కాన్సెప్టుతో ముందుకు …

Read More »

చింత‌మ‌నేని Vs అబ్బ‌య్య చౌద‌రి … 4 నెల‌ల ముందే బెట్టింగుల ర‌చ్చ!

దెందులూరు రాజ‌కీయం ఈ సారి మ‌రింత ర‌చ్చ‌గా మారింది. పూర్తిగా వ‌న్‌సైడ్ అయ్యేలా ఉంది. చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ కంచుకోట‌లా ఉన్న దెందులూరులో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ వేవ్‌లో కొఠారు అబ్బ‌య్య చౌద‌రి 17 వేల ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. ఎన్నిక‌ల చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు ప్ర‌భాక‌ర్ హ్యాట్రిక్ కొట్టేస్తార‌న్న అంచ‌నాలు ఉన్నా.. చివ‌ర్లో జ‌గ‌న్ వేవ్‌తో పాటు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిణామాలు అనూహ్యంగా మార‌డం.. తెలుగుదేశం నుంచి కీల‌క‌నేత‌లు వైసీపీలోకి …

Read More »

ఇంకొంతకాలం ఈ సస్పెన్స్ తప్పదా ?

ప్రకాశం జిల్లాలోని రెండు సీట్ల విషయంలో ఇంకొంతకాలం సస్పెన్స్ తప్పేట్లు లేదు. ఇంతకీ ఆ సీట్లు ఏమిటంటే ఒంగోలు అసెంబ్లీ, ఒంగోలు పార్లమెంటు సీట్లే. అసెంబ్లీకి మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి టికెట్ ను జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో కన్ఫర్మ్ చేసేశారు. అయితే సమస్యంతా పార్లమెంటు సీటుమీదే నడుస్తోంది. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి మళ్ళీ టికెట్ ఇవ్వకూడదని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. ఇదే విషయాన్ని మాగుంటకు కూడా చెప్పేశారట. తన కొడుకు …

Read More »

రా.. అన్నా కండువా క‌ప్పుతా: డీఎల్‌కు ష‌ర్మిల ఆహ్వానం

“రా.. అన్నా కండువా క‌ప్పుతా!” అంటూ.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. కాంగ్రెస్ పాత‌త‌రం నేత‌, మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రారెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. ప్ర‌స్తుతం క‌డ‌ప జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ష‌ర్మిల‌.. తొలుత వైఎస్ ఘాట్ వ‌ద్ద నివాళుల‌ర్పించారు. అనంత‌రం.. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారు. ఈ క్ర‌మంలోనే త‌న బాబాయి కుమార్తె డాక్ట‌ర్ సునీత‌తోనూ ఆమె భేటీ అయ్యారు. అనంత‌రం.. కాజీపేటలోని డీఎల్‌ నివాసానికి వెళ్లిన …

Read More »

పోటీ చేసే తీర‌తా.. : వైసీపీ ఎమ్మెల్యే

మైల‌వ‌రం వైసీపీ ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే తీర‌తాన‌ని ఆయ‌న చెప్పారు. అయితే.. అది వైసీపీ త‌ర‌ఫునా, లేదా? అనేది త్వ‌ర‌లోనే చెబుతాన‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ మాత్రం త‌ప్ప‌ద‌ని అన్నారు. ప్ర‌స్తుతం వైసీపీ ఈయ‌న‌ను హోల్డ్‌లో పెట్టిన విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ జిల్లా ప‌రిధిలోని తిరువూరు, విజ‌య‌వాడ వెస్ట్, సెంట్ర‌ల్ వాటికి అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది. …

Read More »

బిహార్ అయిపోయింది.. ఇక‌, జార్ఖండ్‌.. ఈడీ ఎంట్రీ!

కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం క‌న్నేసిన రాష్ట్రం క‌మ‌లం గూటికి చేరుతున్న విష‌యం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌గా మారిన విష‌యం తెలిసిందే. తాము కోరుకున్న రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చేందుకు ఏదో ఒక దారి వెతు క్కుంటారని, లేకుంటే.. ఈడీ, సీబీఐ వంటివాటిని ప్ర‌యోగిస్తార‌ని ప్ర‌తిప‌క్షాలు చెప్ప‌డ‌మూ తెలిసిందే. ఇప్పుడు తాజాగా బిహార్‌లోనూ బీజేపీ ఇదే ఫార్ములాను ప్ర‌యోగించింది. దీంతో ఇక్క‌డ నితీష్ కుమార్ మ‌హాఘ‌ట్‌బంధ‌న్‌తో రాం రాం చెప్ప‌డం..ఆవెంట‌నే క‌మ‌లంతో చేతులు క‌ల‌ప‌డం …

Read More »

చంద్ర‌బాబుకు త‌ప్పిన ముప్పు.. రీజ‌న్ రెండు వెర్ష‌న్లు!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు పెద్ద ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నారు. ఆయ‌న ప్రస్తుతం రా.. క‌ద‌లిరా! స‌భ‌లు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో రాజ‌మండ్రిలో ప‌ర్య‌టించిన ఆయ‌న ఈ స‌భ‌లో పాల్గొన్నారు. భారీ ఎత్తున జ‌నాలు కూడా త‌ర‌లి వ‌చ్చారు. స్టేజ్‌పై కూడా స్థానిక నాయ‌కుల‌కు అవ‌కాశం క‌ల్పించారు. ఇక‌, ప్ర‌సంగం అయిపోయి.. చంద్ర‌బాబు స్టేజీ దిగుతున్న స‌మ‌యంలో ఆయ‌న‌కు ఎదురుగా వ‌చ్చి.. కొంద‌రు పుష్ప‌గుచ్ఛాలు అందించి అభినంద‌న‌లు తెల‌ప‌బోయారు. …

Read More »

ష‌ర్మిల నాలుగో కృష్ణుడు: రోజా

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల‌పై వైసీపీ నాయ‌కురాలు, మంత్రి రోజా విమ‌ర్శ‌లు గుప్పించారు. ష‌ర్మిల‌ను ఏపీకి వ‌చ్చిన నాలుగో కృష్ణుడుగా ఆమె పేర్కొన్నారు. హైద‌రాబాద్‌లో ఉంటూ.. ఆమె ఏపీలో రాజ‌కీయాలు చేస్తు న్నారని.. ఎవ‌రెన్ని చేసినా.. వైసీపీ ప్ర‌భంజ‌నాన్ని ఎవ‌రూ ఆప‌లేర‌ని అన్నారు. నాన్ లోకల్ నేతలు జగన్‌పై మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల నాలుగో కృష్ణుడు లాంటి వారంటూ రాజో వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని విభజించి, వైఎస్సార్ కుటుంబాన్ని …

Read More »

సాక్షిలో నాకూ వాటా ఉంది: షర్మిల

సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శల వెల్లువ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షి పత్రికలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. ఆ మాటకొస్తే సాక్షి మీడియాలో జగన్ తో పాటు తనకు కూడా సమానంగా భాగస్వామ్యం ఉందని షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం …

Read More »