ఏపీ రాజధాని అమరావతిని అన్ని కోణాల్లోనూ ప్రమోట్ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు.. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అమరావతి పేరును జగద్వితం చేయాలని ఆయన నిర్ణయించారు. ఈ క్రమంలో ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలి పెట్టకుండా అమరావతిని ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడుల పేరుతో రాజధాని పేరును ప్రపంచ వ్యాప్తంగా వినిపించేలా చేశారు. అదేవిధంగా ‘క్వాంటమ్ వ్యాలీ’, ఏఐ యూనివర్సిటీ వంటి కీలక రంగాల్లోనూ …
Read More »సేనతో సేనాని: జనసేన వినూత్న కార్యక్రమం
ఏపీ కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న జనసేన పార్టీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘సేనతో సేనాని’ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను జనసేన రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్, మంత్రి నాదెండ్ల మనోహర్ తాజాగా ఆదివారం విశాఖపట్నంలోని జనసేన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఇది పూర్తిగా పార్టీ కార్యక్రమమని ఆయన చెప్పారు. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమంలో పార్టీ …
Read More »జగన్ కోసం 300 కోట్లు కడుతున్న ప్రభుత్వం!?
అదేంటి అనుకుంటున్నారా? నిజమే. వైసీపీ అధినేత జగన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 312 కోట్ల రూపాయలను నెల నెలా చెల్లిస్తోందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆయన హయాంలో చేసిన అప్పులకు సంబంధించిన వడ్డీలను ఈ నెల నుంచి నెలకు 312 కోట్ల రూపాయల చొప్పున చెల్లించాల్సి వచ్చిందని ఆర్థిక శాఖ వెల్లడించింది. మొత్తం అప్పులు 4.23 లక్షల కోట్లు ఉన్నాయని.. దీనిలో 2.86 లక్షల కోట్ల రూపాయలను అచ్చంగా …
Read More »సీనియర్లతో సమస్య కాదు.. కొత్త ఎమ్మెల్యేలతోనే చిక్కు..
తెలుగు రాజకీయాల్లో పాత తరానికి కొత్త తరానికి మధ్య సంధిదశ అధినేతగా ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడ్ని చెప్పాలి. ఆయనలో సంప్రదాయ రాజకీయ నాయకుడికి ఉండే లక్షణాలతో పాటు కొత్త తరం నేతలకు ఉండే లక్షణాలు కనిపిస్తాయి. పాలన విషయంలో కొత్త తరహాలో ఆలోచించే ఆయన కట్టు తప్పే పార్టీ నేతలపై చర్యల విషయంలో మాత్రం పాతతరం అధినేతగా వ్యవహరిస్తూ ఉంటారు. క్రమశిక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే చంద్రబాబు …
Read More »జగన్… ఇప్పుడు ఏం డిమాండ్ చేసినట్టు..?
రాజకీయాల్లో ఉన్న వారు తామున్న పరిస్థితిని మరిచిపోయి ఎదుటివారి పరిస్థితిని ఎద్దేవా చేయడం కామనే. తమ వరకు వస్తే అప్పుడు మాత్రం కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఇప్పుడు ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల వ్యవహారంలో తాము ఎన్డీయేకు మద్దతు ఇస్తామని వైసీపీ ప్రకటించింది. ఇది తప్పుకాకపోవచ్చు. తమ పార్టీ తీసుకునే నిర్ణయం …
Read More »విగ్రహాల జోలికొస్తే తాట తీస్తా: చంద్రబాబు
రాష్ట్రంలో రాజకీయ నేతల విగ్రహాలను కూలదోయడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాల జోలికి వస్తే తాట తీస్తానని హెచ్చరించారు. పార్టీల పరంగా విమర్శలు చేయాలి కానీ దివంగత నేతల విగ్రహాల విషయంలో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు? అని విపక్ష పార్టీల నాయకులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా శనివారం ఉదయం కృష్ణాజిల్లాలోని కైకలూరులో ఇటీవలి ఏర్పాటు చేసిన కాపు నాయకుడు వంగవీటి రంగా విగ్రహాన్ని కొందరు …
Read More »బాబు రెండు వ్యూహాలు… మరో 20 ఏళ్లు..!
రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని మరో 20 ఏళ్లపాటు కొనసాగించాలన్నది సీఎం చంద్రబాబు వ్యూహం. ప్రస్తుతం జరుగుతున్న పాలన కాకుండా మరో 20 ఏళ్లపాటు ఇలానే ఒకే ప్రభుత్వం ఏర్పడేలా, ప్రజలు కూడా ఒకే ప్రభుత్వాన్ని ఎన్నుకునేలా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట కూడా ఇదే. అయితే పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్లు అంటున్నారు. సో ఎలా చూసుకున్నా ఇద్దరు నాయకులు …
Read More »ఏంటా బిల్లు.. ఏమా కథ.. బీజేపీ నిజాయితీ ఎంత?
కేంద్ర ప్రభుత్వం ఉరుములు లేని పిడుగు మాదిరిగా తీసువచ్చిన మూడు రాజ్యాంగ సవరణల బిల్లు ఇప్పుడు దేశం యావత్తును కుదిపేస్తోంది. ఏ ఇద్దరు నేతలు కలిసినా ఈ బిల్లుపైనే చర్చించుకుంటున్నారు. ఇక మేధావులు తమ తమ శైలిలో విశ్లేషణలు చేస్తున్నారు. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రుల నుంచి కేంద్ర, రాష్ట్ర స్థాయి మంత్రుల వరకు కూడా తీవ్ర నేరాల్లో చిక్కుకుని జైలు పాలైతే.. 30 రోజులకు కూడా వారికి బెయిల్ దక్కకపోతే.. …
Read More »సభా సమరం ముగిసింది.. గెలుపెవరిది?
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాయి. గత నెల జూలై 21న ప్రారంభమైన సమావేశాలు గురువారం (ఆగస్టు 21)తో నిరవధికంగా వాయిదా పడ్డాయి. సాధారణంగా.. సమావేశాలు అనే మాట ఎప్పుడో తెరమరుగైంది. సమరమే తప్ప.. సమావేశాలు, సుహృద్భావ చర్చలకు దేశంలో అసెంబ్లీలే కాదు.. దేశానికి దిశానిర్దేశం చేయాల్సిన పార్లమెంటు కూడా ఎప్పుడో తెరదించేశాయి. ఇప్పుడు ఏ సమావేశం అయినా.. సమరాన్నే తలపిస్తున్నాయి. అధికార పక్షంపై ప్రతిపక్షం, ప్రత్యర్థి పక్షంపై అధికార పక్షం …
Read More »‘అయ్యా.. అక్షరం ముక్కరాదు.. అక్రమం చేస్తానా?’
ఇదేదో సినిమా డైలాగు కాదు. వైసీపీకి చెందిన మాజీ మంత్రి, ఎస్సీ నాయకుడు, సీనియర్ నేత కిళత్తూరు నారాయణ స్వామి చెప్పిన మాట. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటివరకు 48 మందిపై కేసు నమోదు చేశారు. 13 మందిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఈ పరంపరలో అప్పట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా వ్యవహరించిన నారాయణ స్వామి …
Read More »జగన్ మోడీ ఫేవరెట్.. షర్మిల కామెంట్స్
వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్పై ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మోడీ ఫేవరెట్ అని వ్యాఖ్యానించారు. ముసుగు తీసేశారని, ఆయన వైఖరి తెలుగు జాతికి ద్రోహం చేసేలా ఉందని తీవ్రంగా స్పందించారు. ఇప్పటి వరకు ముసుగు వేసుకుని యుద్ధం చేస్తున్నట్టు నటించారని, ఇప్పుడు ఆ ముసుగు తొలగించారని అన్నారు. తెలుగు వారు జగన్ను ఎలా నమ్మాలని …
Read More »ఆగిన ఉద్యమ గళం: కమ్యూనిస్టు యోధుడు సురవరం కన్నుమూత
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) అగ్రనేత, ప్రజా ఉద్యమాలకు అలుపెరుగని గళం వినిపించిన నాయకుడు సురవరం సుధాకర్రెడ్డి ఇక లేరు. 83 ఏళ్ల సురవరం గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 11.40 నిమిషాల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1942, మార్చి 25వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates