పార్లమెంటు ఉభయ సభల్లో ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై ఏపీ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన 18 పార్టీలకు చెందిన ఎంపీలు ప్రసంగించారు. ఇరు సభల్లోనూ సుమారు 4 గంటల పాటు ఈ వ్యవహారంపై చర్చ సాగింది. ఆయా చర్చల్లో ఢిల్లీ, యూపీ, పంబాజ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, బీహార్ సహా.. పలు రాష్ట్రాలకుచెందిన ప్రాంతీయ పార్టీల ఎంపీలు మాట్లాడారు. ఆ సమయంలో పలువురు సీఎం చంద్రబాబు దూరదృష్టిని …
Read More »మండలి ఛైర్మన్ పై చేయి చేసుకున్న మంత్రి అతనేనా?
ఏపీ రాజధాని అమరావతిని శాశ్వితం చేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ ఆనందకర సమయంలో గతంలో అమరావతి కోసం పోరాడిన అంశాల్ని.. రాజధానిగా అమరావతిని వ్యతిరేకించిన అప్పటి వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు గురించిన చర్చ మరోసారి మొదలైంది. అన్నింటికి మించి అమరావతిని శాశ్విత రాజధానిగా ఆమోదం లభించిన నేపథ్యంలో ఏపీ శాసన మండలి ఛైర్మన్ గా వ్యవహరించిన మహమ్మద్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ సంచలన అంశాల్ని …
Read More »పేర్ని నాని… ఎవరికైనా వార్నింగ్ ఇచ్చేయగలరా?
రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే వేరుగా ఉంటుందని చెప్పాలి. అధికారంలో ఉన్నప్పుడే కాదు.. చేతిలో పవర్ లేనప్పుడు కూడా ఏ మాత్రం తగ్గని అతి కొద్ది ఫైర్ బ్రాండ్ నేతల్లో ఆయన ఒకరుగా చెప్పాలి. సందర్భం ఏదైనా.. తాను అనుకున్నదే తప్పించి.. మరే అంశాన్ని పట్టించుకోని మొండితనం ఆయన సొంతం. అధికారంలో లేమన్న విషయాన్ని …
Read More »అలా చెప్పుకోవడం కరెక్టేనా సీఎం గారు?
కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ ధైర్యం వేరే లెవల్ అన్న భావన కలుగక మానదు. కేరళలో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా గ్యారెంటీలను ప్రకటించింది. వీటి అమలుపై అక్కడి రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు. ఇదే అంశాన్ని …
Read More »రాజ్యసభలో రచ్చ… ఎవరీ రేణుక చౌదరి?
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై రాజ్యసభలో మాట్లాడారు. అయితే.. ఆమె.. ఈ సందర్భంగా కేంద్రంలోని మోడీ సర్కారుపై నిప్పులు చెరిగారు. విభజన చట్టం చేసిన 12 సంవత్సరాలు అయ్యాయని చెప్పిన ఆమె.. ఇప్పటి వరకు ఆ చట్టంలోని హామీలను ఎందుకు నెరవేర్చలేదని నిలదీశారు. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. దీనివల్ల …
Read More »మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ… అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతిని శాసన రాజధానికి పరిమితం చేసే దిశగా యత్నించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా అసెంబ్లీలో పాసై శాసనమండలికి వచ్చిన మూడు రాజధానుల బిల్లును నాడు మండలి చైర్మన్ గా కొనసాగిన మహ్మద్ షరీఫ్ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ …
Read More »‘జగన్ – కేసీఆర్’ జోడిని తలపించిన నాని
2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది (జమిలి లేకపోతే). అయితే ఆ రెండు ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారన్న విషయంపై వైసీపీ నేతలకు ఓ స్పష్టమైన అవగాహన అయితే ఉన్నట్టుంది. ఎందుకంటే… ఏపీలో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావులు మరోమారు సీఎంలుగా కొలువుదీరతారన్న అర్థం వచ్చేలా వైసీపీ నేతలు చెబుతున్నారు. తాము …
Read More »సామాన్యుల సమస్యలపై మాట్లాడే ఎంపీకి సొంత పార్టీ షాక్
రాజకీయం రాజకీయమే. రాజకీయమనే తానులో ఉండే ఏ పార్టీ అయినా తీరు ఒక్కటే అన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది. పార్టీ పేర్లు వేర్వేరుగా ఉన్నా.. రాజకీయ పార్టీల డీఎన్ ఏ మాత్రం ఒకేలా ఉంటుందన్న విషయాన్ని స్పష్టం చేసింది ఆమ్ ఆద్మీ. దేశంలోని రాజకీయ పార్టీలకు భిన్నంగా.. రాజకీయాల కంటే కూడా ప్రజల కోసం పోరాటం చేయటమే లక్ష్యమని చెప్పే పార్టీ.. మిగిలిన పార్టీల మాదిరే తన పార్టీకి …
Read More »అమరావతిపై చర్చ.. రాజ్యసభలో దుమ్మురేపిన నాయుడు
అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును బుధవారం లోక్సభ ఆమోదించిన దరిమిలా.. రాజ్యసభలో గురువారం ప్రవేశ పెట్టారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్.. దీనిని సభకు సమర్పించారు. అనంతరం.. చైర్మన్ సీపీ రాధాకృష్ణన్.. చర్చకు అనుమతించారు. తొలుత టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు ఈ చర్చను ప్రారంభించారు. తనదైన శైలిలో ఆయన సభలో దుమ్మురేపారు. రాజధానికి సంబంధించి పూర్వాపరాలతో పాటు.. చంద్రబాబు-జగన్ ప్రభుత్వాల హయాంలో రాజధాని …
Read More »ఎలక్షన్ ఎఫెక్ట్: `ఐప్యాక్`పై ఈడీ నజర్!
పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ.. ఐప్యాక్పై ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఏకకాలంలో గురువారం.. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఐప్యాక్ సంస్థలకు సంబంధించిన కార్యాలయాల్లో తనిఖీ చేపట్టారు. బెంగళూరు, హైదరాబాద్, ముంబై సహా.. ఇతర ప్రాంతాల్లోనూ ఈ తనిఖీలు కొనసాగుతున్నట్టు ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది. వందల కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో తనిఖీలు చేస్తున్నట్టు వివరించింది. అయితే.. పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో ఈ దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. …
Read More »జగన్ మావిగన్… ఇప్పుడు సినిమా అయిపోయింది
మావిగన్.. నిన్న మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్న పదం. ఇప్పటిదాకా ఎన్నడూ వినని ఈ పదం నిన్నటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత వైరల్ అయిపోయింది. 2014 ఎన్నికల్లో గెలిచాక చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని తొలిసారి రాజధానిగా ప్రకటించినపుడు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం అంటూ ప్రకటించి, 2019లో అధికారంలోకి వచ్చాక యుటర్న్ తీసుకుని మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతి నాశనానికి పూనుకున్న జగన్.. ఇప్పుడు …
Read More »తండ్రి బాటలోనే పేర్ని కిట్టు
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి ఎగబడిపోతూ ఉంటారు. తాను చెప్పిందే వేదమంటూ ఆయన చేస్తున్న వాగ్వాదాలు వైరల్ అవుతూ ఉంటాయి. నాని రాజకీయ వారసత్వం పుచ్చుకున్న ఆయన కుమారుడు పేర్ని వాక సాయి కృష్ణమూర్తి అలియాస్ పేర్ని కొట్టు కూడా అచ్చూ తన తండ్రి మాదిరే వ్యవహరిస్తున్నారు. అధికారులన్నా, పోలీసులన్నా ఆయన ఏమాత్రం లెక్క చేయడం లేదు. తాజాగా ఓ సర్కిల్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates