వైసీపీ నుంచి సస్పెండ్ అయిన నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో చెప్పిన అనేక విషయాలు పొల్లు పోకుండా జరిగాయని.. ఇప్పుడు కూడా అదేవిధంగా తాను అంచనా వేసి.. కొన్ని విషయాలు చెబుతున్నానంటూ.. కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. 1999 ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని చెప్పినట్టు తెలిపారు. అదేవిధంగా టీడీపీ గెలిచిందన్నారు. తర్వాత వచ్చిన 2004 ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని …
Read More »తగ్గని బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. కేసీఆర్ నిర్ణయంపైనే విమర్శ!
రాబోయే తెలంగాణ ఎన్నికల కోసం ఒకేసారి 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ రాజేశారు. కొన్ని స్థానాల్లో సిట్టింగ్ లకు పక్కనపెట్టిన కేసీఆర్.. మరో నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టారు. ఓ వైపు టికెట్ దక్కని నేతల నుంచి వచ్చిన అసమ్మతిని నెమ్మదిగా తగ్గించుకుంటూ వస్తున్నారు. మరోవైపు ఆ నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం టికెట్ల కోసం బీఆర్ఎస్ నేతల …
Read More »తెలంగాణపై ఫోకస్.. ఖర్చుకు తగ్గేదే లేదంటున్న కాంగ్రెస్
రాబోయే తెలంగాణ ఎన్నికలపై కాంగ్రెస్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. గట్టిగా ప్రయత్నిస్తే.. శక్తివంచన లేకుండా కష్టపడితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలవొచ్చనే అంచనాలతో హస్తం పార్టీ ఉంది. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్రంలో దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు.. ప్రజలు కాంగ్రెస్ గురించి మరింత ఎక్కువగా మాట్లాడుకునేందుకు పార్టీ రంగంలోకి దిగింది. తొలిసారి హైదరాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు నిర్వహిస్తోంది. తెలంగాణలో …
Read More »కాంగ్రెస్ సభలోనే షర్మిల పార్టీ విలీన ప్రకటన?
కాంగ్రెస్ లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనానికి రంగం సిద్ధమైందా? ఆదివారం (సెప్టెంబర్ 17న) జరిగే కాంగ్రెస్ విజయభేరి సభలోనే షర్మిల పార్టీ విలీనం ప్రకటన రానుందా? అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఈ సభలోనే కాంగ్రెస్ లో షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీన ప్రకటన వెలువడుతుందనే అంచనాలు కలుగుతున్నాయి. ఎన్నికలకు ముందు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని …
Read More »నేను సార్ అంటే.. జగన్ పవన్ అన్నాడు
తెలుగుదేశం పార్టీతో పొత్తును ప్రకటించిన తర్వాత తొలిసారి జరిగిన పార్టీ సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శల దాడిని మరింత పెంచాడు. జగన్ ఇగో, నిరంకుశ వైఖరిని మంగళగిరిలో జరిగిన పార్టీ సమావేశంలో పవన్ దుయ్యబట్టాడు. జగన్ అహంకారం గురించి మాట్లాడుతూ.. 2019 ఎన్నికల అనంతరం ఒకసారి తాను జగన్కు ఫోన్ చేశానని.. తాను ఆయన్ని సార్ సార్ అని సంబోధిస్తుంటే.. …
Read More »జమిలి ఎన్నికలకు నో… తేల్చేసిన కాంగ్రెస్
దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై అధ్యయనానికి ఇప్పటికే మాజీ రాష్ట్రపతి నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే.. జమిలి ఎన్నికలపై పలు పార్టీల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీని ప్రత్యక్షంగా, పరోక్షంగా సమర్థిస్తున్న పార్టీలు, నేతలు జమిలికి మద్దతిచ్చిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మాత్రం జమిలి …
Read More »బాబు కోసం ఊహించని మద్దతు
గతంలో టీడీపీ వ్యవస్థాపకులు, తెలుగు వారి అన్నగారు ఎన్టీఆర్ తాను నిర్వహించిన సభలకు వచ్చిన జనాలను ఉద్దేశించి… “నింగి వంగిందా.. నేల ఈనిందా.. అన్నట్టు వచ్చిన నా తెలుగు ప్రజలు” అంటూ వ్యాఖ్యానించేవారు. అప్పటి సంగతి ఏమో కానీ.. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, జైలు అంశాలపై ప్రజల్లో సంచలన కదలిక వచ్చింది. చంద్రబాబు అరెస్టు, ఆయనను జైలుకు పంపిన విధానాన్ని నిరసిస్తూ.. అచ్చం నింగి వంగిందా.. నేల …
Read More »నీటి వాటా తేల్చలేని వ్యక్తి విశ్వగురువా?: కేసీఆర్
చాన్నాళ్ల తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన విమర్శలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొన్ని దశాబ్దాలుగా ఉన్న నీటి వివాదాన్ని పరిష్కరించలేని వ్యక్తి… తనను తాను విశ్వ గురువుగా పరిగణించుకుం టూ ప్రచారం చేసుకుంటున్నారని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు గుప్పించారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చమని అనేక సందర్భాల్లో తాను స్వయంగా కేంద్రానికి లేఖలు రాశానని.. అయితే, ఇప్పటికీ చేతకాని దద్దమ్మ మాదిరిగా …
Read More »బాబు స్కిల్స్ ఇస్తే.. జగన్ లిక్కర్, గంజాయి ఇస్తున్నారు: బ్రాహ్మణి
ఏపీ సర్కారుపై టీడీపీ అధినేత చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో యువతకు గత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నైపుణ్యాలను నేర్పించి ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం యువతకు గంజాయి, లిక్కర్ విరివిగా అందిస్తోందని బ్రాహ్మణి తీవ్రస్థాయిలోఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన తప్పేంటని, ఆయనను తెల్లవార కుండానే ఎందుకు అరెస్టు చేశారని, ఎందుకు జైల్లో పెట్టారని ఆమె నిప్పులు చెరిగారు. …
Read More »కేసీఆర్ పోస్టర్ల రాజకీయానికి రేవంత్ కొత్త చెక్
ఏ మాత్రం అవకాశం దొరికినా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ తమ ప్రతిష్టాత్మక సిడబ్ల్యుసి సమావేశాలకు హైదరాబాద్ను వేదికగా చేసుకున్న సంగతి తెలిసింది. కాంగ్రెస్ అగ్ర నేతలంతా విచ్చేసి అట్టహాసంగా జరుగుతున్న ఈ సమావేశాల సమయంలో తెలంగాణలో పోస్టర్ల కలకలం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోని సిడబ్ల్యుసి సభ్యులంతా అవినీతిపరులని పేర్కొంటూ హైదరాబాద్ లోని పలుచోట్ల పోస్టల్ దర్శనమిచ్చాయి. ఈ పరిణామం సహజంగానే రాజకీయంగా …
Read More »లోకేష్ ప్లాన్.. జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా!
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు, రిమాండ్ విషయాన్ని జాతీయ స్థాయిలో హైలెట్ చేయాలన్న లోకేష్ ప్లాన్ ఫలిస్తున్నట్లే కనిపిస్తోంది. ఇప్పుడు జాతీయ స్థాయిలో బాబు అరెస్టు హాట్ టాపిక్ గా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ నేతలు కూడా ఈ విషయంపై స్పందిస్తుండటమే అందుకు నిదర్శనమని చెప్పొచ్చు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పేరుతో నిధులు మళ్లించారనే ఆరోపణలతో ఆయన్ని సీఐడీ అరెస్టు …
Read More »చంద్రబాబు దొంగగా దొరికారు: జగన్ సంచలన వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును దొరికిన దొంగగా ఆయన పేర్కొన్నారు. అయితే, దొంగగా దొరికినప్పటికీ.. ఆయనకు ఉన్న బలమైన ముఠా ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతోందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిబంధనలను పక్కన పెట్టి నకిలీ ఒప్పందంతో ప్రజాధనాన్ని దోచుకున్నారని సీఎం జగన్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ప్రాంతంలో నిర్వహించిన వైఎస్సార్ కాపు నేస్తం నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates