Political News

బాలినేని పంతం నెగ్గించుకున్నారా

ఒంగోలు ఎంఎల్ఏ, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి తన పంతం నెగ్గించుకున్నట్లే ఉన్నారు. తన నియోజకవర్గంలో అర్హులైన పేదలకు 25 వేల ఇళ్ళపట్టాలను పంపిణీ చేస్తేకాని రాబోయే ఎన్నికల్లో పోటీచేసేది లేదని బాలినేని చాలాకాలంగా చెబుతున్నారు. ఇదే విషయమై పట్టుబట్టి ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టు తిరుగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీచేసే విషయమై బాలినేని చాలాసార్లు అలిగారు కూడా. సరే మార్గం ఏదైనా, ప్రయత్నాలు ఎలాచేసినా 25 వేల ఇళ్ళపట్టాలు పంపిణీ …

Read More »

కాంగ్రెస్ లో చేరికల జోష్..

కాంగ్రెస్ లో చేరికల జోష్ పెరిగిపోతోంది. తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇతర పార్టీల నుండి ముఖ్యంగా బీఆర్ఎస్ నుండి నేతలు హస్తంపార్టీలో చేరుతున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణా ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో పట్నం మహేందర్ రెడ్డి దంపతులు చేరారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు కూడా కాంగ్రెస్ లో చేరారు. అధికారపార్టీ నేత కంచర్ల …

Read More »

టీడీపీ-జ‌న‌సేన-బీజేపీ సీట్ల పంప‌కాలు కొలిక్కి?!

ఏపీలో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్ ను ఎట్టి ప‌రిస్థితిలోనూ గ‌ద్దె దించాల‌ని నిర్ణ‌యించుకున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఆమేర‌కు చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. క్షేత్ర‌స్థాయిలో కొంత అన‌నుకూల ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నా.. ఆయ‌న పొత్తుల దిశ‌గానే అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పొత్తును ప్ర‌క‌టించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇరు పార్టీలూ క‌లిసి వెళ్తాయ‌ని.. టీడీపీ, జ‌న‌సేన అధినేతలు ప్ర‌క‌టించారు. ఈ …

Read More »

టీఆర్ఎస్ లో ఆ నలుగురి మధ్య గ్యాప్ !!

మొదటి నుండి కూడా బీఆర్ఎస్ లో కేసీయార్ తర్వాత నలుగురు నేతలదే మొత్తం పెత్తనంగా ఉండేది. ఉద్యమ పార్టీగా ఉన్నపుడు, అధికారంలో ఉన్న పదేళ్ళు కూడా ఇదే పద్దతి నడిచింది. కాని ఒకే ఒక ఓటమి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దెబ్బకు నలుగురు నాలుగు వైపుల పార్టీని లాగుతున్నారనే చర్చలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి కేసీయార్ కొడుకు కేటీయార్, కూతురు కవిత, …

Read More »

ఏజెంట్ ఆళ్ల రిపోర్టింగ్ సార్

గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ఆసక్తి రేకెత్తించిన నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటి. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు తనయుడు, అప్పటికే మంత్రిగా కూడా పని చేసిన నారా లోకేష్ ఈ నియోజకవర్గం నుంచే తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో లోకేష్‌ను ఓడించి సంచలనం రేపిన నేత.. ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఎన్నికలకు ముందు అమరావతే రాజధానిగా ఉంటుందని ప్రకటన చేసి, ఆ తర్వాత పార్టీ …

Read More »

తలసానికి ఉచ్చు బిగుసుకుంటోందా ?

అధికారంలో ఉన్నపుడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతే తర్వాత అందుకు మూల్యం చెల్లించక తప్పదంటారు పెద్దలు. ఇపుడీ విషయం ఎందుకంటే మాజీమంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ గురించే. మంత్రిగా ఉన్నపుడు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలకు తొందరలోనే మూల్యం చెల్లించక తప్పదంటున్నారు. బీసీ బంధు విషయంలో కేసీయార్ హయాంలో అమలైన పథకాల్లో బీసీలకు గొర్రెల పంపిణీ పథకం కూడా ఒకటి. గొర్రెలను కొనకుండానే కొన్నట్లు, బిల్లులు చెల్లించకుండానే చెల్లించినట్లు రికార్డుల్లో చూపించి కోట్ల రూపాయల …

Read More »

యూట‌ర్న్ పాలిటిక్స్‌.. ఆళ్లదా.. జ‌గ‌న్‌దా?

రాజకీయాల్లో శాశ్వ‌త శ‌త్ర‌వులు, శాశ్వ‌త మిత్రులు ఉండ‌రని అంటారు. అవ‌స‌రం.. అవ‌కాశం అనే రెండు ప‌ట్టాల‌పైనేరాజ‌కీయ రైలు ప‌ర‌గులు పెడుతుంది. అది పార్టీ అయినా.. నాయ‌కులైనా ఫార్ములా అయితే ఒక్క‌టే. ఇప్పుడు ఇదే ఫార్ములా వైసీపీలోనూ క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా మంగ‌ళగిరి ఎమ్మెల్యే, కొన్నాళ్ల కింద‌ట వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి తిరిగి వైసీపీ గూటికి చేరుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో ఆళ్ల‌తో హైద‌రాబాద్‌లో …

Read More »

పవన్ కీలక సమావేశం

ఉభయగోదావరి జిల్లాలోని నేతలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. రాజమండ్రికి చేరుకున్న పవన్ తన అజెండా ప్రకారమే మంగళవారం సమావేశాలు నిర్వహించబోతున్నారు. రెండురోజుల క్రితమే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని నేతలతో విశాఖపట్నంలో సమావేశమైన విషయం తెలిసిందే. అదేపద్దతిలో ఇపుడు ఉభయగోదావరి జిల్లాల్లోని నేతలందరినీ రాజమండ్రికి చేరుకోవాలని కబురుచేయటంతో అందరు చేరుకున్నారు. రాబోయే ఎన్నికల్లో పొత్తులో జనసేన ఎన్ని సీట్లకు పోటీచేయబోతోంది, పోటీచేయబోయే నియోజకర్గాలు ఏవన్న విషయాలనే నేతలతో …

Read More »

ఢిల్లీకి కేసీఆర్‌.. బీజేపీతో పొత్తుకేనా? పొలిటిక‌ల్ టాక్‌!

తెలంగాణ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ అనారోగ్యం కారణంగా మూడు నెలలుగా బయటకు రాకుండా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల నల్గొండ సభకు వచ్చారు. నీళ్ల వివాదంపై ఆయ‌న త‌న‌దైన శైలిలో వ్యాఖ్య‌లు గుప్పించారు. తాజాగా కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఉంటుందని వార్తలు వస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే …

Read More »

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు సెంట్ర‌ల్ సెక్యూరిటీ

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక భ‌ద్ర‌త క‌ల్పించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఎక్క‌డ ప‌ర్య‌టించినా.. రాష్ట్ర పోలీసులు లేదా.. సొంత బౌన్స‌ర్లు మాత్ర‌మే ఆయ‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పిస్తున్నారు. అయితే.. గ‌త ఏడాది విశాఖ‌, విజ‌య‌వాడ‌లో పర్య‌టించిన‌ప్పుడు ప‌వ‌న్ వ్య‌వ‌హారంపై ప్ర‌భుత్వం స్పందించ‌లేదు. ఆయ‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పించే విష‌యంలోనూ తాత్సారం చేసింది. చంద్ర‌బాబు జైల్లో ఉన్న‌ప్పుడు.. ఆయ‌న‌ను ప‌రామ‌ర్శించాలని భావించిన ప‌వ‌న్ వ‌స్తున్న స‌మ‌యంలో అడ్డుకున్నారు. దీంతో …

Read More »

టీడీపీ-జ‌న‌సేన ఒకే పాట‌.. కార్య‌క‌ర్త‌ల గురించే!

టీడీపీ-జ‌న‌సేన పార్టీలు పొత్తు పెట్టుకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ అయిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇరు పార్టీల్లోనూ క‌ల‌వ‌ర ప‌రుస్తున్న ఏకైక విష‌యం.. క్షేత్ర‌స్థాయిలో ఈ నాలుగేళ్ల కాలంలో పార్టీని ముందుకు న‌డిపించిన నాయ‌కులు.. టికెట్లు కోరుతుండ‌డం.. ఆమేర‌కు పార్టీల‌కు టికెట్లు ద‌క్కే ఛాన్స్ లేక‌పోవ‌డం. దీంతో రెండు పార్టీలు కూడా.. కార్య‌క‌ర్త‌ల‌ను బుజ్జ‌గించే ప‌నిచేప‌ట్టాయి. గ‌త కొన్ని రోజులుగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. పార్టీ యువ …

Read More »

మాకు 160, మిగతా 15 సీట్ల‌ కోస‌మే కొట్టుకుంటున్నారు – KA పాల్

ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు, పొలిటిక‌ల్ క‌మెడియ‌న్ అని ప్ర‌తిప‌క్ష పార్టీలు, ఇతర నాయ‌కులు పిలుచుకునే కిలారి ఆనంద పాల్ తాజాగా ఏపీ రాజ‌కీయ నేత‌ల‌కు స‌వాల్ రువ్వారు. అది కూడా ఆయ‌న రెండు ప్ర‌ధాన పార్టీల అధ్య‌క్షుల‌కు స‌వాల్ రువ్వ‌డం గ‌మ‌నార్హం. “విజ‌య‌వాడ‌లో పేద్ద అంబేద్కర్ విగ్రహం పెట్టారు క‌దా.. ఆ విగ్ర‌హం సాక్షిగా నాతో చర్చలకు రావాలి“ అని టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్‌కి సవాల్ విసిరారు. …

Read More »