Political News

ప‌దేళ్లు నేనే సీఎం: రేవంత్‌

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సంచ‌లన‌ వ్యాఖ్య‌లు చేశారు. మ‌రో పదేళ్ల‌పాటు తానే సీఎంగా ఉంటాన‌ని తేల్చి చెప్పారు. అంతేకాదు.. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఏ విధంగా సీఎం అవుతారో చూస్తాన‌ని స‌వాల్ రువ్వారు. తాజాగా పోలీసు నియామ‌కాల‌కు సంబంధించి అభ్య‌ర్థుల‌కు నియామ‌క ప‌త్రాలు అందించే కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. “సీఎంగా ప్రమాణం చేసినప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందో.. ఉద్యోగ …

Read More »

ఎన్నిక‌ల‌కు దూరం.. పోటీ చేయ‌కూడ‌ద‌న్న చంద్ర‌బాబు!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నెల‌లో జ‌ర‌గ‌నున్న రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో టీడీపీ పోటీ చేయ‌కూ డ‌ద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. మ‌రో మూడు రోజుల్లో రాజ్య‌సభ ఎన్నిక‌ల‌కు సంబంధించిన నామినేష‌న్ల ప‌ర్వం ముగియ‌నుం ది. ఈ నెల 27న ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌నున్నాయి. మొత్తం 3 రాజ్య‌స‌భ స్థానాల‌కు ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇవి అన్నీ ఎమ్మెల్యేల కోటాలోనే ఉన్న నేప‌థ్యంలో ఎన్నిక‌లు అనివార్యంగా మారాయి. ఇప్ప‌టికే …

Read More »

కడపలో టీడీపీకి ఇంత పోటీనా

టికెట్ కోసం ఈ నియోజకవర్గంలో నలుగురు నేతలు చాలా సీరియస్ గా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరి ఫైనల్ గా ఎవరు సక్సెస్ అవుతారన్నది సస్పెన్సుగా మారింది. ఇంతకీ విషయం ఏమిటంటే కడప జిల్లాలోని కీలకమైన నియోజకవర్గాల్లో ప్రొద్దుటూరు కూడా ఒకటి. ఈ నియోజకవర్గంలో పోటీ చేయడానికి సీనియర్ తమ్ముళ్ళ మధ్య పోటీ రోజురోజుకు పెరిగిపోతోంది. ఒకవైపు మాజీ ఎంఎల్ఏ నంద్యాల వరదరాజులరెడ్డి, మరోవైపు మాజీ ఎంఎల్ఏ మల్లెల లింగారెడ్డి, ఇంకోవైపు …

Read More »

కేసీఆర్ వ్యాఖ్య‌ల‌పై దుమారం.. రేవంత్ ఫైర్‌

తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర దుమారం రేగింది. మాజీ సీఎం, బీఆర్ ఎస్ చీఫ్ కేసీఆర్.. “ఏం పీక‌నీకి పోయినవ్‌” అంటూ.. సీఎంను విమ‌ర్శించ‌డాన్ని.. ముఖ్య‌మంత్రి రేవంత్ తీవ్రంగా ప‌రిగ‌ణించారు. ఇదేనా సంప్రదాయం.. అంటూ నిల‌దీశారు. ఇప్ప‌టికే 4 కోట్ల మంది ప్ర‌జ‌లు కేసీఆర్ ఫ్యాంటు ఊడ‌బీకార‌ని.. ఇక‌, మిగి లిన అంగీని కూడా లాగేసేందుకు సిద్ధంగా ఉన్నార‌ని సీఎంరేవంత్ వ్యాఖ్యానించారు. దీంతో స‌భ‌లో బీఆర్ఎస్‌, కాంగ్రెస్ సభ్యుల మ‌ధ్య తీవ్ర …

Read More »

రాజ్య‌స‌భ‌కు రేణుక‌మ్మ‌.. ఖ‌మ్మంలో క్లియరెన్స్‌?

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు.. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత రేణుకా చౌద‌రికి ఊ హించ‌ని గిఫ్ట్ త‌గిలింది. పార్టీ నుంచి ఆమెకు రాజ్య‌స‌భ సీటు ఆఫ‌ర్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ ఎన్నిక‌లు జ‌రగ‌నున్న నేప‌థ్యంలో రేణుక‌కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఖ‌రారు చేయ‌డం.. రేణుక శిబిరంలో ఆనందం పం చుతోంది. ఇదేస‌మ‌యంలో వ్య‌తిరేక వ‌ర్గంలోనూ సంబ‌రాలు చేసుకుంటున్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ రాజ్య‌స‌భ స్థానాల్లో 3 స్థానాలు …

Read More »

రెడ్లకు టీడీపీపై మోజు పుట్టిందా?

వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు తెలుగుదేశంపార్టీలో చేరబోతున్నారా ? అవుననే సమాధానం వినిపిస్తోంది. చేరబోతున్న ముగ్గురు కూడా రెడ్డి సామాజికవర్గంలోని ప్రముఖులే కావడం గమనార్హం. విషయం ఏమిటంటే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి టీడీపీలో చేరటానికి రంగం సిద్ధమైపోయిందని సమాచారం. మాగుంటకు వైసీపీలో టికెట్ దొరకలేదు కాబట్టి టీడీపీలో చేరబోతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నదే. మరి నెల్లూరు …

Read More »

రాజధానిపై కొత్త డ్రామా

రాజధానిపై వైసీపీ కొత్త డ్రామా మొదలుపెట్టింది. వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్నంలో పరిపాలనా రాజధానిని నిర్మించేంత వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కంటిన్యూ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సరిగ్గా ఎన్నికలకు ముందు వైవీ ఈ కొత్త డిమాండ్ ను తెరమీదకు ఎందుకు తీసుకొచ్చారో అర్ధం కావటంలేదు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరికొంతకాలం పొడిగించాలని అధికారపార్టీ నేతలు ఎవరూ, ఎప్పుడూ ప్రస్తావించలేదు. …

Read More »

కేసీయార్లో ఫ్రస్ట్రేషన్ బయటపడిందా ?

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, తన హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు బయటకు వస్తున్నాయన్న ఫ్రస్ట్రేషన్ కేసీయార్ లో పేరుకుపోయినట్లుంది. అందుకనే నల్గొండలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రభుత్వాన్ని పట్టుకుని నోటికొచ్చినట్లు మాట్లాడారు. ప్రభుత్వ పెద్దలను పట్టుకుని అరేయ్..ఓరేయ్..ఏ పీకుతారు అనే పదాలు వాడారు. పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీయార్ నుండి ఇలాంటి భాషను జనాలు ఆశించలేదు. మేడిగడ్డకు పోయి ఏమి పీకుతారంటు రేవంత్ రెడ్డి అండ్ కో …

Read More »

రేవంత్.. ఇలా చేస్తే మంచి పనే

తెలంగాణాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో జరిగిన భారీ అవినీతికి బాధ్యులపై రెవిన్యు రికవరీ యాక్ట్ ప్రయోగించబోతున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇపుడీ విషయంపైనే చర్చలు మొదలయ్యాయి. రెవిన్యు రికవరీ యాక్ట్ ప్రయోగం అన్నది మామూలుగా జరగదు. అసాధారణ పరిస్ధితుల్లో మాత్రమే ఈ యాక్ట్ ను గుర్తించిన బాధ్యుతలపై ప్రభుత్వం ప్రయోగిస్తుంది. అయితే ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో వేల కోట్ల రూపాయల దోపిడి జరిగిందని రేవంత్ పదేపదే అంటున్నారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని …

Read More »

ఈ విషయంలో మీరు మారాలి బాబూ !

రాజకీయాల్లో ఆటుపోట్లు.. ఎత్తుపల్లాలు.. గెలుపోటములు సహజం. ఏది ఉన్నా లేకున్నా సాహసంతో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ.. ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ప్రతి విషయం మీదా అవసరానికి మించి ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలో వెంటనే తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో .. నానపెడుతూ అనవసరమైన విమర్శలకు అవకాశం ఇస్తుంటారు. ఆయన రాజకీయ జీవితాన్ని చూస్తే.. ఒక విషయం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటుంది. ఏ విషయాన్ని తేల్చుకోలేక.. …

Read More »

175 సీట్ల‌కు 353 ద‌ర‌ఖాస్తులు.. కాంగ్రెస్ ప‌ట్టు పెరుగుతుందా!

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ద‌ర‌ఖాస్తులు తీసుకుంటున్న ఏపీ కాంగ్రెస్‌కు తొలి రెండు రోజులు నిరాశే ఎదురైంది. అయితే.. త‌ర్వాత‌.. ష‌ర్మిల ఊపు.. మీడియా క‌థ‌నాల నేప‌థ్యంలో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి కూడా.. పోటీ పెరిగింది. మొత్తం 175 అసెంబ్లీ స్తానాల‌కు గాను.. ఇప్ప‌టి వ‌ర‌కు 353 ద‌రఖాస్తులు అందాయ‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా క‌డ‌ప జిల్లాలోని క‌డ‌ప‌, పులివెందుల‌, మైదుకూరు, రాజంపేట వంటి స్థానాల‌కు డిమాండ్ ఎక్కువ‌గా ఉన్న‌ట్టు …

Read More »

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అనుమ‌తి నిరాక‌ర‌ణ.. ప‌ర్య‌ట‌న వాయిదా!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు వైసీపీ ప్ర‌భుత్వం నుంచి భారీ షాక్ త‌గిలింది. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌లేదు. దీంతో తాజాగా భీమవ‌రానికి చేరుకోవాల్సిన ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ను వాయిదా వేసుకున్నారు. వాస్త‌వానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ నెల 14 నుంచి ఏపీలో ప‌ర్య‌ట‌న‌లు చేయాల‌ని ప్ర‌ణాళిక సిద్ధం చేసుకున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించి.. పార్టీని బ‌లోపేతం చేయాల‌ని అనుకున్నారు. కానీ, ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి …

Read More »