Political News

చంద్ర‌బాబు పేరిట త‌ప్పుడు ప్ర‌చారం.. స్ట్రాంగ్ వార్నింగ్‌

ఏపీలో పోలింగ్ ప్ర‌క్రియ‌కు మ‌రికొన్ని గంట‌ల ముందు.. సంచ‌ల‌నం చోటు చేసుకుంది. కూట‌మి పార్టీల ముఖ్య నేత‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈ ఎన్నికల్లో అనేక హామీలు సంధించారు. తాము అధికారంలోకి వ‌స్తే.. ప్ర‌జ‌ల‌కు సూప‌ర్ సిక్స్‌ పేరుతో సంక్షేమాన్ని అమ‌లు చేస్తామ‌న్నారు. వీటిలో ప్ర‌ధానంగా ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం.. మూడు సిలిండ‌ర్లు, పింఛ‌ను ను రూ.4000ల‌కు పెంపు, 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రైతులకు …

Read More »

జ‌గ‌న్ చేయాల్సిన ప‌ని.. బాబు చేస్తున్నారు..

ఏపీలో చిత్ర‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. శ‌నివారం సాయంత్రంతో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిపోవ‌డంతో నాయ‌కులు, పార్టీల అధినే త‌లు ఎక్క‌డిక‌క్క‌డ సేద దీరుతున్నారు. ఇది త‌ప్పుకాదు. 55 రోజుల పాటు నిర్విరామంగా ప్ర‌చారం చేసి.. ఎండ‌ల్లో మ‌ల‌మ‌ల మాడిన నాయ‌కుల‌కు ఇప్పుడు ఒకింత రిలాక్స్ అయ్యే చాన్స్ లభించింది. కానీ, ఇది ఇత‌ర పార్టీలు,నాయ‌కుల విష‌యంలో ఒకింత సేద‌దీరేందుకు అవ‌కాశం ల‌భించింద‌ని అనుకున్నా.. బాధ్య‌తా యుత‌మైన ముఖ్య‌మంత్రి(ఆప‌ద్ధ‌ర్మ కొవొచ్చు) స్థానంలో ఉన్న …

Read More »

పవన్‌కు ప్రాణం, జగన్‌కు ఓటు.. మారుతుందా?

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో యూత్‌లో పవన్‌కు ఉన్నది మామూలు క్రేజ్ కాదు. సినిమాల్లో సూపర్ స్టార్ ఇమేజ్ వల్ల పవన్ యువతలో భారీగా క్రేజ్ సంపాదించుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చాక కూడా యూత్‌లో తన క్రేజ్ ఉపయోగపడుతుందని ఆశించారు. కానీ పవన్‌ను చూడగానే వెర్రెత్తిపోయి కేకలు పెట్టే అభిమానులు.. ఎన్నికల్లో మాత్రం ఆయనకు ఆశించిన స్థాయిలో అండగా నిలవలేదు. ఈ విషయమై పవన్‌ స్వయంగా ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. …

Read More »

జగన్‌ సీట్లపై పీకే లేటెస్ట్ అంచనా

ఆంధ్రప్రదేశ్‌లో గత పర్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ 151 సీట్లతో ఘనవిజయం సాధించడంలో ఆ పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిశోర్ పాత్ర కూడా కీలకమే. ఆయన వ్యూహాలను అనుసరించే ఎన్నికల్లో పోటీ పడింది వైసీపీ. చంద్రబాబు ప్రభుత్వం మీద జనాల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచడంలో, వైసీపీ గ్రాఫ్ పెరగడంలో పీకే అండ్ టీం వేసిన ప్రణాళికలు బాగా పని చేశాయి. ఐతే అప్పట్లో ఐప్యాక్ టీంకు ప్రశాంత్ కిశోరే …

Read More »

ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్‌

దాదాపు 55 రోజుల పాటు అవిశ్రాంతంగా పార్ల‌మెంటు ఎన్నిక‌ల ప్ర‌చారం చేసిన తెలంగాణ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ పీసీసీచీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి.. ఆదివారం ఒకింత సేద‌దీరారు. ఎన్నిక‌ల టెన్ష‌న్ నుంచి రిలాక్స్ అయ్యారు. హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో కొంద‌రితో క‌లిసి ఆయ‌న ఫుట్ బాల్ ఆడ‌డం.. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. చిత్రం ఏంటంటే.. ఆట మ‌ధ్యలో సీఎం వేసుకున్న షూ(బూట్లు) పాడైపోయాయి. దీంతో వాటిని పూర్తిగా …

Read More »

భార్యతో పిఠాపురానికి పవన్?

జనసేనాని పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడానికి వైసీపీ నేతలు ఎంచుకునే అంశం.. ఆయన పెళ్లిళ్ల వ్యవహారం. కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తాడని సీఎం జగన్ సహా వైసీపీ నేతలు చాలామంది విమర్శలు చేస్తుంటారు. ఐతే అంతటితో ఆగకుండా ఈ మధ్య పవన్‌కు అయింది మూడు పెళ్లిళ్లే అని తెలిసినా.. నాలుగో పెళ్లి కూడా జరిగినట్లు మాట్లాడేస్తుంటారు. నా నాలుగో పెళ్లాం నువ్వేనా జగన్ అంటూ పవన్ కౌంటర్ ఇచ్చినా కూడా …

Read More »

స్టేషన్లో కార్యకర్తను కొట్టిన కోన వెంకట్

టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్.. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారు అన్న సంగతి తెలిసిందే. ఆయన బాబాయి కోన రఘుపతి వైసీపీ ఎమ్మెల్యే. ఆయన కోసమే గత ఎన్నికల ముంగిట వైసీపీలో చేరి ఎన్నికల ప్రచారం చేశాడు కోన. ఒకప్పుడు పవన్ నా సోల్‌‌మేట్ అన్న కోన.. తర్వాత వైసీపీలో చేరి పవన్ మీద ఘాటు విమర్శలు చేయడంతో అభిమానుల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. ఇక …

Read More »

దేశంలో అత్యధిక ఓటర్లున్నది ఎక్కడో తెలుసా ?

140 కోట్ల ప్రజలున్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. ఇక్కడ సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడం అంటే కత్తి మీద సామే అని చెప్పాలి. అయితే దేశంలో ఉన్న 543 లోక్ సభ స్థానాలలో అత్యధికంగా ఓటర్లున్న నియోజకవర్గాలు ఇక్కడ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. అవి ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. దేశంలో అత్యధిక మంది ఓటర్లున్న నియోజకవర్గం మల్కాజ్ గిరి. దీనిని మినీ ఇండియాగా పిలుస్తారు. ఇక్కడ 2019 లెక్కల ప్రకారం …

Read More »

నంధ్యాల ఎఫెక్ట్ : అల్లు అర్జున్ పై కేసు

టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ పిఠాపురంలో పోటీ చేస్తున్న మామ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కాదని నంద్యాలలో తన మితృడు వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి ప్రచారానికి వచ్చాడు. శిల్పా రవిచంద్రారెడ్డి, అల్లు అర్జున్ పదిహేనేళ్లుగా స్నేహితులు. శిల్పా రవి కోసం అల్లు అర్జున్ సతీసమేతంగా నంద్యాలలో అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో శిల్పా రవి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ ను చూసేందుకు వేలాదిగా జనం …

Read More »

శ్రీకాళ‌హస్తిలో కాల‌ర్ ఎగ‌రేసేది ఎవ‌రో?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. మ‌రొక్క రోజు గ‌డువు మాత్ర‌మే ఉంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థులు ప్ర‌చారాన్ని తీవ్ర‌త‌రం చేశారు. తిరుప‌తి జిల్లాలోని శ్రీకాళ‌హ‌స్తిలోనూ పోరు హోరాహోరీగా సాగుతోంది. ఇక్క‌డ సిటింగ్ వైసీపీ ఎమ్మెల్యే బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డి, టీడీపీ అభ్య‌ర్థి బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ న‌డుస్తోంద‌ని టాక్ వినిపిస్తోంది. అయితే సిటింగ్ ఎమ్మెల్యేను ఓడించే స్థాయికిసుధీర్ ఎదిగాడ‌ని, ఇక్క‌డ టీడీపీకి …

Read More »

యంగ్ అండ్ డేరింగ్ ఎంపీ.. హ్యాట్రిక్ ప‌క్కా!

లోక్‌స‌భ‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ హ‌క్కుల గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, ఏపీ ప్ర‌యోజ‌నాల గురించి ప్ర‌శ్నించిన నేత‌గా టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు ప్ర‌త్యేక‌త సంపాదించుకున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు ప్ర‌త్యేక హోదా కోసం లోక్‌స‌భ‌లో రామ్మోహ‌న్ నాయుడు పోరాడారు. స‌భ‌లో ఆయ‌న స్పీచ్‌లు ఏపీలో జ‌నాల‌ను ఉర్రూత‌లూగించాయి. ఇక వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక కూడా రాష్ట్రంలో జ‌రుగుతున్న అన్యాయం, అరాచ‌కం మీద‌.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం పార్లమెంట్‌లో గ‌ళం …

Read More »

వైఎస్ జగన్ ఒంటరి.!

‘సింగిల్ సింహం’ అని ఏ ముహూర్తాన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సినిమాటిక్ డైలాగుని రాజకీయాల్లో చెప్పారో, అప్పటినుంచి.. ఆయనకి ఏదీ కలిసి రావడంలేదు.! తోడబుట్టిన చెల్లి, వైసీపీకి రాజకీయ ప్రత్యర్థిగా మారిపోయింది. చివరికి కన్న తల్లి కూడా, వైసీపీ ఓటమిని కోరుకుంటోంది.! రాజకీయాల్లో అన్నదమ్ములు వేర్వేరు పార్టీలో వుండడం మామూలే. అన్నా చెల్లెళ్ళ మధ్య కూడా రాజకీయంగా విభేదాలు వుండొచ్చు. కానీ, చెల్లెల్ని ఏడిపించిన ‘అన్న’ని ఎక్కడైనా చూశామా.? …

Read More »