Political News

ఈ ఇద్దరు నేతలు ఏమిచేస్తారో ?

పశ్చిమగోదావరి జల్లాలోని ఇద్దరు నేతలపైనే అందరి దృష్టిపడింది. ఇద్దరు నేతలు కూడా మిత్రపక్షాలు టీడీపీ, జనసేన కు చెందిన రెండు నియోజకవర్గాలకు చెందిన నేతలు కావటమే గమనార్హం. ఆ ఇద్దరు ఎవరంటే వేటుకూరి శివరామరాజు అలియాస్ కలవపూడి శివ, విడివాడ రామ చంద్రరావు. ఈ ఇద్దరు కూడా టికెట్లు ఆశించి దక్కకపోవటంతో బాగా మండిపోతున్నారు. కలువపూడి ఏమో ఉండి నియోజకవర్గంలో టీడీపీ నుండి టికెట్ ఆశించారు. విడివాడేమో తణుకు నియోజకవర్గంలో …

Read More »

జగన్ ఓపెన్ చేసిన గేట్ ఏమైంది?

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో మొన్న సీఎం జగన్ సభ ఎంతో ఆర్భాటంగా జరిగిన సంగతి తెలిసిందే. తన సొంత నియోజకవర్గానికి చంద్రబాబు నీళ్లు ఇచ్చుకోలేకపోయాడని.. కానీ తమ ప్రభుత్వం మాత్రం ఎంతో చిత్తశుద్ధితో ఈ ప్రాంతానికి నీళ్లు ఇస్తోందని ఆయన ఘనంగా ప్రకటన చేశారు. ఈ పర్యటనలో జగన్ బటన్ నొక్కడం.. గేట్ నుంచి హంద్రీ నీవా నీళ్లు బయటికి …

Read More »

పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు ముందు బీఆర్ఎస్‌కు భారీ షాక్‌!

పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు కేవ‌లం 40 రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంద‌ని తెలుస్తోంది. ఈ లోగానే షెడ్యూల్ కూడా వ‌చ్చేసేందుకు రెడీగా ఉంది. అయితే.. ఇంత‌లోనే తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్‌లో క‌ల‌క‌లం రేగింది. పార్టీని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం చేయ‌డం లేద‌ని.. పార్టీ ప‌రిస్థితి అగ‌మ్యంగా ఉంద‌ని నేత‌ల మ‌ధ్య గుస‌గుస వినిపిస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. ముఖ్య నేత‌, ఎంపీ ఒక‌రు పార్టీ …

Read More »

వైసీపీకి దెబ్బ మీద దెబ్బ‌

ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఎన్నిక‌ల‌కు ముందు హైకోర్టులో దెబ్బ‌మీద దెబ్బ త‌గులుతోంది. వ‌రుసగా హైకో ర్టు స‌ర్కారుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. మంగ‌ళ‌వారం రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంపై కీల‌క తీ ర్పు ఇచ్చిన విష‌యం తెలిసిందే. రైతులకు గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఇచ్చిన ఫ్లాట్ల‌ను ర‌ద్దు చేయడా నికి వీల్లేద‌ని తేల్చి చెప్పింది. ఇది ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీకి భారీ ఎఫెక్ట్‌. ఇక‌, ఇప్పుడు కీల‌క‌మైన మైనింగ్‌పైనా …

Read More »

కేసీయార్ కు రెస్టేనా ?

పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానం పెరిగిపోతోంది. మార్చి 1వ తేదీన పార్టీలోని సుమారు 200 మంది నేతలతో ఛలో మేడిగడ్డ ప్రోగ్రామ్ పెట్టుకున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ ప్రకటించారు. మేడిగడ్డ బ్యారేజి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ఆరోపణలను జనాలందరికీ వివరించటానికే తాము ఛలో మేడిగడ్డ పర్యటనకు వెళుతున్నట్లు కేటీయార్ చెప్పారు. బ్యారేజి నిర్మాణంపై రేవంత్ రెడ్డి, మంత్రులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే …

Read More »

బీజేపీ నేతలే నవ్వుకుంటున్నారా ?

రాజకీయ నేతల మాటల్లో నిజాలకన్నా అబద్ధాలే ఎక్కువుంటాయని అందరికీ తెలిసిందే. జనాలను ఆకర్షించేందుకు నోటికొచ్చిందేదో మాట్లాడేసి అప్పటికి పని పూర్తయిందనిపించుకుంటారు. ఇపుడిదంతా ఎందుకంటే కేంద్రమంత్రి రాజ్ నాధ్ సింగ్ మాటలగురించే. విషయం ఏమిటంటే ఏలూరులో పార్టీ మీటింగుకు రాజ్ నాథ్ హాజరయ్యారు. ఆయన ఏమన్నారంటే రాబోయే ఎన్నికల్లో ఏపీలో కూడా బీజేపీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందన్నారు. ఏపీలో పార్టీ బాగా పుంజుకుని శక్తివంతంగా తయారైందని కేంద్రమంత్రి చెప్పారు. మంత్రి చెప్పిన …

Read More »

వైసీపీకి మాగుంట రాజీనామా.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల‌రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. బుధ‌వారం ఉద‌యం ఒంగోలు లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఈ మేర‌కు ఆయ‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు కూడా చేశారు. నాకు అహంలేదు.. ఆత్మ‌గౌర‌వం ఉంది! అని మాగుంట వ్యాఖ్యానిం చారు. సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానంలో మాగుంట కుటుంబం ఆత్మ‌గౌర‌వాన్ని పోగొట్టుకోలేద‌ని ప‌రోక్షంగా వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీని …

Read More »

తెలంగాణా నుండి రాహుల్ పోటి ?

రాబోయే ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి పోటీ చేయబోతున్నారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం పోటీ చేసేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మధ్య ఢిల్లీలో రాహుల్ ను రేవంత్ రెడ్డితో పాటు చాలామంది మంత్రులు కలిశారు. ఆ సమయంలో తెలంగాణా నుంచి పోటీచేయాలని ఆహ్వానించినట్లు సమాచారం. తెలంగాణాలోని ఖమ్మం, భువనగిరి లేదా నల్గొండలో ఎక్కడ నుంచి పోటీ చేసినా గెలుపు ఖాయమని రాహుల్ …

Read More »

బుజ్జ‌గింపు ప‌ర్వంలో బాబు బిజీబిజీ!!

టీడీపీ అధినేత‌కు టికెట్ల కేటాయింపు క‌న్నా.. బుజ్జ‌గింపులు పెద్ద చిక్కుగా మారాయి. ఇటీవ‌ల ప్ర‌క‌టించిన 94 స్థానాల్లో అభ్య‌ర్థులను ఒక‌వైపు లైన్‌లో పెడుతూనే.. ఆయా స్థానాల్లో టికెట్లు ఆశించి.. భంగ ప‌డిన నాయ‌కుల‌ను బుజ్జ‌గించే ప‌నిలో రోజురోజంతా చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో చ‌ర్చోప‌చ‌ర్చ‌ల్లో మునిగిపోయారు. తన నివాసంలో ఆశావహులను కలుస్తూ.. వారిని ఊర‌డిస్తున్నారు. తొలి జాబితాలో సీటు కోల్పోయిన అభ్యర్థులు వ‌రుస పెట్టి బాబును క‌లుస్తున్నారు. దీంతో ఆయా నేతలను బుజ్జగించి, …

Read More »

నరసరావుపేటకు షిఫ్ట్ చేస్తున్నారా ?

గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో గట్టినేతగా పేరున్న మాజీ ఎంఎల్ఏ యరపతినేని శ్రీనివాసరావును నియోజకవర్గం షిఫ్ట్ చేస్తున్నారా ? పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. పల్నాడు ప్రాంతంలోని గురజాల అసెంబ్లీ నియోజకవర్గం చాలా కీలకమైంది. ఇక్కడ నుండి యరపతినేని ఆరుసార్లు పోటీచేసి మూడుసార్లు గెలిచారు. ఆర్ధిక, అంగ బలాలు పుష్కలంగా ఉన్న యరపతినేని పార్టీకి చాలా అండగా ఉంటున్నారు. ఇలాంటి యరపతినేనికి మొదటిజాబితాలో చోటు …

Read More »

‘అమ‌రావ‌తి’ విష‌యంలో వైసీపీకి మ‌రో షాక్‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో వైసీపీ ప్ర‌భుత్వ దూకుడుకు హైకోర్టు మ‌రోసారి ప‌గ్గాలు వేసింది. రాజ‌దాని కోసం.. 33 వేల ఎక‌రాల‌ను ఇచ్చిన రైతుల‌కు.. అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప్లాట్లు, క‌మ‌ర్షియ‌ల్ స్థ‌లాల‌ను ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. అయితే.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వీటిని ర‌ద్దు చేస్తూ.. నిర్న‌యం తీసుకుంది. ఈ క్ర‌మంలో జీవోలు కూడా జారీ చేసింది. అయితే.. వీటిని తాజాగా హైకోర్టు కొట్టివేసింది. దీంతో అమ‌రావ‌తి …

Read More »

‘జ‌గ‌న్‌పై పోటీ చేస్తా.. చిత్తుగా ఓడిస్తా’

“జ‌గ‌న్‌పై పోటీ చేస్తా.. చిత్తుగా ఓడిస్తా”- అని వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హ‌త్య కేసులో నిందితుడు, అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరి ప్ర‌క‌టించాడు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తాను పోటీ చేస్తాన‌ని చెప్పాడు. రాజ‌కీయాల కార‌ణంగానే తాను ఇరుక్కు పోయి.. బ‌లి అయిపోయాన‌ని.. ఈ నేప‌థ్యంలో తాను కూడా రాజ‌కీయాల్లోకి వ‌చ్చి.. త‌నేంటే చూపిస్తాన‌ని ప్ర‌తిజ్ఞ చేశారు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన ద‌స్త‌గిరి.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌డ‌ప …

Read More »