Political News

ఎర్రకోటపై రైతు జెండా.. ఇది దేనికి సంకేతం?

ఎవరిని తప్పు పట్టాలి? ఎవరిని వేలెత్తి చూపించాలి? గెలుపోటములు పక్కన పెట్టేద్దాం. దేశ గణతంత్ర దినోత్సవం వేళ.. దేశ జాతీయ పతాకం పక్కగా.. నిరసన జెండా ఎగరటం దేనికి సంకేతం? ఎవరికి వారు తమ వాదనల్ని బలంగా వినిపించొచ్చు. కానీ.. ఒక్కటి మాత్రం నిజం. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సాక్షిగా ఎగిరిన రైతు జెండా.. మోడీ సర్కారు మొండితనానికి చెంపదెబ్బగా చెప్పక తప్పదు. అదే సమయంలో.. మరే ప్రదేశంలో …

Read More »

నిమ్మ‌గ‌డ్డ కొర‌డా.. అధికారుల ప‌రిస్థితి అల్ల‌క‌ల్లోలం!!

ఏది జ‌రుగుతుంద‌ని మాజీ ఐఏఎస్‌లు చెప్పారో.. ఏది జ‌రుగుతుంద‌ని ప్ర‌జాస్వామ్య వాదులు అనుకు న్నారో.. అదే జ‌రిగింది. రాజ్యాంగ బ‌ద్ధ‌మైన సంస్థ‌గా ఉన్న రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌ను ధిక్క‌రించ‌వ‌ద్ద‌ని, ఇష్టం ఉన్నా.. క‌ష్ట‌మే అయినా.. ఒక్క‌సారి ఎన్నిక‌ల కోడ్ అంటూ వ‌చ్చేశాక‌.. క‌మిష‌న‌ర్ సుప్రీం అవుతార‌ని.. రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉన్న అధికారులైనా.. ఎంత సీనియ‌ర్ల‌యినా.. క‌మిష‌న‌ర్ చెప్పిన‌ట్టు ఆయ‌న క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేయాల్సిందేన‌ని అనేక మంది నెత్తీనోరూ మొత్తుకున్నారు. అయినా.. …

Read More »

ఇంతమంది సలహాదారులు ఏమి చేస్తున్నారు ?

పరిపాలనలో ఒకనేతకు మంచి పేరొచ్చిందంటే అందుకు రెండు కారణాలుంటాయి. మొదటిదేమో సదరు పాలకుడు తెలివిగా సందర్భానికి తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకునే సమర్ధుడై ఉండటం. ఇక రెండో కారణం ఏమిటంటే స్వతహాగా తాను అంత సమర్ధుడు కాకపోయినా మంచి తెలివైన వాళ్ళని సలహాదారులుగా నియమించుకోవటం. ఇప్పుడిదంతా ఎందుకంటే తాజాగా పంచాయితీ ఎన్నికలకు సంబంధించి సుప్రింకోర్టులో ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది కాబట్టే. నిజానికి ఎన్నికలను వాయిదా వేయాలని ప్రభుత్వం కోరటంలో తప్పు …

Read More »

పద్మ పురస్కారాలకు రాజకీయ వాసనలా ?

రాను రాను పద్మ పురస్కారాలకు విలువ తగ్గిపోతోందా ? జరుగుతున్నది చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పద్మ పురస్కారాలు అంటే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటివి ఏదైనా ఒక రంగంలో నిష్ణాతులైన వారికి, పర్టిక్యులర్ రంగంలో విశేషంగా సేవలు చేసిన వారికి దక్కాల్సిన పురస్కారాలు. నిజానికి ఈ పురస్కారాలను ప్రారంభించింది కూడా ఇదే స్పూర్తితో. కానీ రాను రాను ప్రభుత్వ పెద్దల ప్రాపకం ఉంటే చాలు పురస్కారాలు దక్కుతాయనే …

Read More »

కొత్త రాజ‌కీయ పార్టీ.. ష‌ర్మిల ఏమందంటే?

గ‌త రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారిన అంశం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సోద‌రి ష‌ర్మిలా రెడ్డి అన్న‌కు పోటీగా కొత్త‌గా రాజ‌కీయ పార్టీ పెట్ట‌బోతోంద‌న్న ప్ర‌చారం. త‌నను రాజ‌కీయంగా, ఆర్థికంగా ఎద‌గ‌నీయ‌కుండా చేశాడ‌ని తీవ్ర అసంతృప్తితో ఉన్న షర్మిల సొంతంగా పార్టీ పెట్ట‌బోతోంద‌ని ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నం సంచ‌లనం రేపింది. ఇదెంత వ‌ర‌కు నిజం అన్న‌ది పక్క‌న పెడితే.. దీని మీద …

Read More »

సుప్రీం తీర్పు.. స్థానికానికి ఓకే.. అయితే.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రాష్ట్రంలో స్థానిక ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై ఇప్ప‌టి వ‌ర‌కు ముసురుకున్న మేఘాలు తొలిగిపోయాయి. ఎన్నిక‌లు నిర్వ‌హించి తీరాల్సిందేన‌ని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. పైగా.. ఇప్ప‌టికే హైకోర్టు ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం ఇచ్చిన తీర్పులో తాము వేలు పెట్టేది లేద‌ని కూడా స్ప‌ష్టం చేసింది. ఇక్క‌డ ప్ర‌ధానంగా రెండు విష‌యాలు గ‌మ‌నించాల్సిన అవ‌స‌రం ఉంది. ఒకటి ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వ‌డం. రెండు రాజ్యాంగ బ‌ద్ధ సంస్థ‌కు అంద‌రూ స‌మానులే.. అనే వ్యాఖ్య …

Read More »

గెలుపుకు ప్రణాళికలు రెడీ అయ్యాయట

ఆలూ లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్న సామెతలాగుంది సోమువీర్రాజు, పవన్ కల్యాణ్ ప్రకటన. ఆదివారం హైదరాబాద్ లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను బీజేపీ చీఫ్ సోమువీర్రాజు భేటి అయ్యారు. చాలాసేపు జరిగిన భేటిపై వీర్రాజు ట్విట్టర్లో కొన్ని పాయింట్లను షేర్ చేశారు. తొందరలో జరగబోతున్న లోక్ సభ ఉపఎన్నికలో అభ్యర్ధి అంశంతో పాటు రాజకీయ పరిస్ధితులపై చర్చించినట్లు చెప్పారు. సరే ఇందులో ఎవరినీ …

Read More »

రాంబాబు సవాల్… పవన్ సైలెంట్

ప్రకాంశం జిల్లాలోని గిద్దలూరు వైసీపీ ఎంఎల్ఏ అన్నా రాంబాబు ఇచ్చిన కౌంటర్ కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నోరు పడిపోయిందా ? అనే డౌటు పెరుగుతోంది. గిద్దలూరులో ఎంఎల్ఏ+ మద్దతుదారుల వేధింపుల వల్లే తమ కార్యకర్త వెంగయ్యనాయుడు ఆత్మహత్య చేసుకున్నారంటూ పవన్ కల్యాణ్ పదే పదే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఒంగోలుకు వెళ్ళి కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా అనవసరమైన చాలెంజ్ చేశారు పవన్. వచ్చే ఎన్నికల్లో రాంబాబును …

Read More »

అందరిలోను పెరిగిపోతున్న టెన్షన్

రాష్ట్రంలో పంచాయితి ఎన్నికల నిర్వహణ విషయంపై అందరిలోను హై టెన్షన్ పెరిగిపోతోంది. ప్రభుత్వం-స్టేట్ ఎలక్షన్ కమీషన్ మధ్య మొదలైన పంచాయితి రోజుకో మలుపు తిరుగుతు అందరిలోను తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. సోమవారం నుండి పంచాయితి ఎన్నికల నామినేషన్లను తీసుకోవాల్సుంది. అయితే దీనికి 11 జిల్లాలో ఎక్కడా అందుకు తగ్గ ఏర్పాట్లు కాలేదు. ఏ జిల్లాలో కూడా రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకమే జరగలేదు. రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ …

Read More »

సంచ‌ల‌నం రేపుతున్న బాంబే హైకోర్టు తీర్పు

ఓ ప‌న్నెండేళ్ల బాలిక‌పై ఓ వ్య‌క్తి లైంగిక దాడికి పాల్ప‌డ్డ కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచ‌ల‌నం రేపుతోంది. బాధితురాలి వ‌క్షోజాల్ని నొక్కాడ‌న్న‌ది ఆ వ్య‌క్తిపై ఉన్న అభియోగం. ఐతే నేరుగా చేత్తో వ‌క్షోజాల్ని తాకితేనే (స్కిన్ టు స్కిన్) లైంగిక దాడికి పాల్ప‌డిన‌ట్లు అవుతుంద‌ని, ఒంటిపై టాప్ ఉండ‌గా ఇలా చేయ‌డం లైంగిక దాడి కిందికి రాద‌ని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. కేసుకు సంబంధించి పూర్తి …

Read More »

హ‌ద్దులు దాటిన… పెత్త‌నం.. ఉద్యోగుల‌కే న‌ష్ట‌మా?

మేం ఎన్నిక‌ల‌కు స‌హ‌క‌రించం. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ఎక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అవ‌స‌ర‌మైతే.. ఎంత‌కైనా వెళ్తాం -ఇదీ తాజా ఏపీ ఉద్యోగ సంఘాల నుంచి వ‌చ్చిన స‌మాధానం. తాజాగానే కాదు.. గ‌డిచిన వారం రోజులుగా ఎన్నిక‌ల సంఘంతో ప్ర‌భుత్వానికి వివాదం ముదిరిన నాటి నుంచి కూడా ఉద్యోగులు ఏక‌ప‌క్షంగా ప్ర‌భుత్వ పాట పాడుతున్నార‌నే అభిప్రాయం క‌లుగుతోంది. ఈ క్ర‌మంలో ఈ వివాదం, ఈ వ్యాఖ్య‌లు శ‌నివారం మ‌రింత ముదిరాయి. ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ …

Read More »

ఆర్కే ఉవాచ.. జగన్ స్వీయ విధ్వంసం ఇలా ఉందట

తెలుగు రాష్ట్రాల్లో బోలెడన్ని మీడియా సంస్థలు ఉన్నా.. కొన్ని మాత్రమే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అయితే.. ఏ మీడియా సంస్థ అధినేత కూడా స్వయంగా పెన్ను పెట్టి (కంప్యూటర్లు వచ్చినా.. ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే మాత్రం పేపరు మీద పెన్నుతోనే చిన్న చిన్న అక్షరాలు కలేసినట్లుగా.. అదేనండి కాసింత గొలుసుకట్టులో ఆయన అక్షరాలు ఉంటాయని చెబుతారు) రాసే ఏకైక యజమాని ఆంధ్రజ్యోతి ఆర్కే మాత్రమే. తొలి నుంచి పొలిటికల్ రిపోర్టర్ …

Read More »