బీజేపీతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు త్యాగాలకు సిద్ధమయ్యారా? బీజేపీ నేతలకు ఏపీలోనూ టికెట్లు ఇస్తున్నారా? అంటే. తాజాగా జరిగిన పరిణామం ఔననే అంటోంది. టీడీపీ శుక్రవారం ప్రకటించిన ఎంపీల జాబితాలో బాపట్ల(ఎస్సీ) అభ్యర్థిగా తెన్నేటి కృష్ణ ప్రసాద్ ను చంద్రబాబు ఎంపిక చేశారు. వాస్తవానికి బాపట్ల నుంచి ఉండవల్లి శ్రీదేవి(వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీకి జై కొట్టారు) పేరు ఎక్కువగా వినిపించింది. అయితే.. …
Read More »విజయం మాదే.. పిఠాపురంపై పవన్ మాస్టర్ ప్లాన్!
వచ్చే ఎన్నికల సమరంలో టీడీపీ – బీజేపీ – జనసేన కూటమిదే విజయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి చెప్పారు. ‘నేను పిఠాపురంలో పోటీ చేస్తుండడంతో వైసీపీ ఎన్నో పన్నాగాలు పన్నుతోంది. జనసేన శ్రేణులు ప్రతీ దశలోనూ అప్రమత్తంగా ఉండాలి. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. పిఠాపురం నుంచే ఎన్నికల శంఖం పూరిస్తున్నాం. ఎన్నికల కోడ్, ఈసీ నిబంధనలు పాటించడంపైనా జనసైనికులు పూర్తి అవగాహనతో ఉండాలి’ అని …
Read More »వసంత రాజకీయం అదరహో!
తాజాగా ప్రకటించిన టీడీపీ మూడో అభ్యర్థుల జాబితాలో మాజీ మంత్రి, సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. ఆయన ఊహించని విధంగా నిర్ణయం తీసుకున్నారు. మైలవరం సీటును ఉమాకు కరడు గట్టిన ప్రత్యిర్థిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే.. ఈ మధ్యే వైసీపీకి గుడ్బై చెప్పి టీడీపీలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్ కు కేటాయించారు. దీంతో దేవినేని ఉమాకు సీటు లేనట్లయింది. అయితే.. వసంత కూడా టీడీపీకి …
Read More »విశాఖ డ్రగ్స్ కేసు: బీజేపీని బరిలోకి లాగేసిన వైసీపీ
విశాఖపట్నం సముద్ర తీరంలో వెలుగు చూసిన 25 వేల కిలోల డ్రగ్స్ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో టీడీపీ వర్సెస్ వైసీపీల మధ్య తీవ్ర మాటల యుద్ధం సాగుతోంది. మీరంటే మీరేనని ఒకరిపై ఒకరు ఈ డ్రగ్స్ వివాదాన్ని రాజకీయంగా మార్చుకుని విమర్శలు చేసుకుంటున్నారు. అయితే.. ఇంతలోనే వైసీపీ మరో వ్యూహాత్మక విమర్శలను తెరమీదికి తెచ్చింది. ఈ డ్రగ్స్ కేసులో బీజేపీని కూడా లాగేసింది. బీజేపీఏపీచీఫ్ …
Read More »కేజ్రీవాల్ అరెస్టుపై కేసీఆర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే!
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై రాజకీయాలకు అతీతంగా పలువురు స్పందిస్తున్నారు. వీరిలో కేజ్రీవాల్ గురువు అన్నాహజారే కూడా ఉన్నారు. ఆయన భిన్నమైన వాదన వినిపించారు. అయితే.. రాజకీయ దురంధరు డిగా పేరొందిన తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం తొలిసారి స్పందించారు. కేజ్రీవాల్ అరెస్టును ఆయన ఖండించారు. దీనిని అప్రజాస్వామిక మని అన్నారు. అంతేకాదు.. కేజ్రీవాల్ అరెస్టు.. భారత …
Read More »ఎన్డీయేలో ఎందుకు చేరామో చెప్పిన చంద్రబాబు
ఏపీలో బీజేపీతో చంద్రబాబు చేతులు కలిపారు. జనసేన+టీడీపీ+బీజేపీ కలిసి సంయుక్తంగా ఎన్డీయే కూటమిగా ఏర్పడి.. అసెంబ్లీ , పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇప్పటికే సీట్లు కూడా పంచేసుకున్నారు. అయితే.. ఈ పొత్తుపై వైసీపీ నాయకులు తీవ్రస్తాయిలో ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో బీజేపీ నుంచి టీడీపీ బయటకు వచ్చినప్పుడు చంద్రబాబు చేసిన విమర్శలను సోషల్ మీడియాలో రోజు కోరకంగా ప్రచారం చేస్తున్నారు. ఇక, నరేంద్ర మోడీ చంద్రబాబుపై చేసిన విమర్శలను …
Read More »బీఆర్ఎస్ కీలక నేత కుమార్తె కాంగ్రెస్కు టచ్లోకి!
రాజకీయాల్లో భయంకరమైన మార్పులు.. పార్లమెంటు ఎన్నికలకు ముందు ఊపిరాడినవ్వని వైనం.. కేసీఆర్ను ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోంది. తెలంగాణ తెచ్చానని చెప్పుకొనే ఆయన నాయకత్వానికి ఇప్పుడు పెను సవాల్ ఎదురైంది. ఆయన మిత్రుడు, రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు కుమార్తె.. హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మి కూడా జంపింగ్ జాబితాలో చేరిపోయారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ బాట పట్టడం.. ఆయన ఏకంగా పార్లమెంటు టికెట్ కూడా దక్కించుకోవడం …
Read More »పెనమలూరు బోడేకే.. పట్టు బిగించిన చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీ అభ్యర్థులపై పట్టు బిగించారు. అనేక పర్యాయాలు సర్వేలు.. సంప్రదింపులు జరిపిన చంద్రబాబు పలు కీలక నియోజకవర్గాలకు పెను మార్పులు చేయకుండానే టికెట్లు ఇచ్చేశారు. దీనిలో భాగంగా కొన్నాళ్లుగా తీవ్ర ఉత్కంఠగా ఉన్న పెనమలూరు టికెట్ను మాజీ ఎమ్మెల్యే సిట్టింగ్ నాయకుడు బోడే ప్రసాద్కే చంద్రబాబు కట్టబెట్టారు. దీంతో పెను వివాదానికి తెరదించినట్టయింది. ఇక, ప్రస్తుతం పెండింగులో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 స్థానాలకు …
Read More »బీజేపీ మౌనగీతం.! ఏపీలో కూటమికి ఇబ్బందికరం.!
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులెవరు.? ఎప్పటినుంచి బీజేపీ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తారు.? అన్న ప్రశ్నలకు సరైన సమాధానం దొరకడంలేదు. కొద్ది రోజుల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు. టీడీపీ – జనసేన – బీజేపీ కలిసి నిర్వహించిన ‘ప్రజా గళం’ బహిరంగ సభలో పాల్గొన్నారు. నిజానికి, అది టీడీపీ …
Read More »వైజాగ్ డ్రగ్స్.! తెరవెనుక కథేంటి.?
ఆక్వా పరిశ్రమ ఒకటి బ్రెజిల్ నుంచి డ్రై ఈస్ట్ని తెప్పించుకుంది. అందులో నార్కోటిక్ ట్రేసెస్ వున్నాయని తేలింది. విశాఖ పోర్టులో సీబీఐ ఈ మేరకు సదరు కంటెయినర్ని సీజ్ చేసింది. ఇదీ అసలు విషయం.! పాతిక వేల కిలోల డ్రగ్స్.. అంటూ ప్రచారం తెరపైకొచ్చింది. అంతే, నానా పొలిటికల్ యాగీ షురూ అయ్యింది. సదరు డ్రై ఈస్ట్ని తెప్పించిన సంస్థకి వైసీపీతో సన్నిహిత సంబంధాలుండడంతో విషయాన్ని హైలైట్ చేసే ప్రయత్నం …
Read More »150 కోట్లు… బీజేపీకి ఇచ్చిన కంపెనీనే వైసీపీకీ ఇచ్చింది!
ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం ఎంత తవ్వుతుంటే అంత లోతుగా అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా వెలుగు చూసిన వ్యవహారం మరింత విస్మయానికి గురిచేస్తోంది. బీజేపీకి ఇచ్చిన ఓ కంపెనీనే.. వైసీపీకి కూడా రూ.150 కోట్లను విరాళంగా ఇవ్వడం సంచలనంగా మారింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సమాచారాన్ని ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో ఉంచింది. రాజకీయ పార్టీలకు ఏయే సంస్థలు ఎంతెంత విరాళం ఇచ్చాయి? బాండ్ల సీరియల్ …
Read More »జగన్ వాయిస్..ఓటర్లను ఎలా ఆకర్షిస్తున్నారంటే!
ఏపీ సీఎం జగన్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటికే వివిధ రూపాలను ఎంచుకున్నారు. సోషల్ మీడియాలో వైసీపీ పాటలు, ప్రసంగాలు, శపథాలు, జగన్ కామెంట్లు.. ఇలా ఒకటేమిటి.. వివిధ రూపాల్లో ప్రచారాన్ని తీవ్రస్తాయిలో చేస్తున్నారు. వీటికితోడు జగన్ ప్రభుత్వంపై సానుకూలంగా పేదల కామెంట్లతో కూడిన సమాచారాన్ని కూడా డిజిటల్ రూపంలో దంచి కొడుతున్నారు. అయితే.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక మరో రూపంలో ప్రచారాన్ని సీఎం జగన్ షురూ చేశారు. తాజాగా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates