జ‌గ‌న్ సెంటు-చంద్ర‌బాబు రెండు సెంట్లు!

ఏపీలో పేద‌ల‌కు గ‌త ప్ర‌భుత్వం ‘జ‌గ‌న‌న్న ఇళ్లు’ పేరుతో ప‌థ‌కాన్ని అమ‌లు చేసిన విష‌యం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్న‌ర‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో సెంటు భూమిని ఇచ్చింది. అయితే.. 30 ల‌క్ష‌ల మందికి అని చెప్పినా.. 20 ల‌క్ష‌ల మందికి మాత్ర‌మే ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. మిగిలిన వారికి ఇంకా ఇవ్వ‌లేదు. ఇదే విష‌యాన్ని ఎన్నికల ‌స‌మ‌యంలో జ‌గ‌న్ చెప్పారు. మిగిలిన వారికి కూడా ఇస్తామ‌న్నారు. అయితే.. ఆయ‌న స‌ర్కారు ప‌డిపోయింది. ఇక‌, ఎన్నిక‌ల స‌మ‌యంలో తాము అధికారం లోకి వ‌స్తే.. ప‌ట్ట‌ణ పేద‌ల‌కు రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లోని వారికి మూడు సెంట్ల చొప్పున భూములు ఇస్తామ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ఇప్పుడు దానిని అమ‌లు చేసేందుకు కార్యాచ‌ర‌ణ సిద్ధం చేశారు.

తాజాగా హౌసింగ్ పై జ‌రిపిన స‌మీక్ష‌లో ఎవ‌రెవ‌రికి ఎంతంత భూములు ఇవ్వాల‌నే అంశంపై చంద్ర‌బాబు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీ మేర‌కు.. ప‌ట్టణ పేద‌ల‌కు 2 సెంట్ల నివాస‌యోగ్య‌మైన‌ భూమిని, గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఏకంగా 3 సెంట్ల భూమిని ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. ఈ స‌దుపాయం కొత్తగా ద‌ర‌ఖాస్తు చేసుకునే లబ్ధిదారులకు మాత్ర‌మే వ‌ర్తించ‌నుంది. వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపింది. అయితే.. వాటిలో ‘లే ‘అవుట్లు వేయలేదు. అలాంటి స్థలాల్లోనూ పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. ప‌ట్ట‌ణాల్లో ఉంటే 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే 3 సెంట్ల చొప్పున ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు.

100 రోజుల ప్లాన్‌!

రాష్ట్ర వ్యాప్తంగా 100 రోజుల్లోనే పేద‌ల‌కు నివాస‌యోగ్య‌మైన భూముల‌ను ఇవ్వాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. కేవలం భూములు ఇవ్వ‌డ‌మే కాకుండా.. ఇళ్ల నిర్మాణం కూడా చేయించి ఇస్తామ‌న్నారు. తొలి 100 రోజుల్లో ల‌క్ష‌కుపైగా, త‌ర్వాత ఏడాది కాలంలో 8 ల‌క్ష‌ల మందికి ఇళ్లు క‌ట్టించి ఇస్తామ‌న్నారు. ల‌బ్ధిదారుల‌పై ఆర్థిక భారం ప‌డ‌కుండా.. కేంద్ర ప‌థ‌కాన్ని కూడా స‌మ‌న్వ‌యం చేసుకుని ముందుకు సాగ‌నున్న‌ట్టు తెలిపారు.

మ‌రికొన్ని వ‌ర్గాల‌కు కూడా..

  • రాష్ట్రంలోని మధ్య తరగతి ప్రజలకు ఎంఐజీ లే అవుట్లను ఏర్పాటు చేస్తారు.
  • అక్రిడేటెడ్‌ జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం చేపడ‌తారు. తక్కువ ధరలకు ఇళ్లను నిర్మించి ఇస్తారు.
  • పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల‌కు ఇళ్ల‌ను క‌ట్టించి ఇస్తారు.
  • వైసీపీ హ‌యాంలో చేప‌ట్టిన ఇళ్ల నిర్మాణాన్నికొన‌సాగిస్తారు.
  • జ‌గ‌న్ ఇచ్చిన ఇళ్ల‌కు విద్యుత్‌, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తారు.