తెలంగాణ అసెంబ్లీలో మాటల తూటాలు పేటాయి. బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీ ఆర్ వర్సెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల మధ్య సంభాషణ హాట్ హాట్గా సాగింది. తాజాగా కేంద్ర ప్రవేశ పెట్టిన బడ్జెట్పై అసెంబ్లీలో చర్చ సాగింది. ఈ సందర్భంగా అసలు చర్చ పక్కకు పోయి.. అనవసర రచ్చ తెరమీదికి వచ్చింది. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కీలకమైన బడ్జెట్పై చర్చ జరుగుతున్నప్పుడు.. మాజీ సీఎం …
Read More »షర్మిలమ్మా ఇంత రిస్క్ అవసరమా
కాంగ్రెస్ పీసీసీ చీఫ్.. వైఎస్ షర్మిల.. ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెం, నందమూరు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. అయితే.. ఈ సమయంలో ఆమె నడుములోతు నీళ్లలోకి దిగి మరీ పంటలను పరిశీలించడం గమనార్హం. వాస్తవానికి అక్కడ నీరు తప్ప.. పంటలు లేవు. అంటే.. కొట్టుకుపోయాయి. అయినప్పటికీ.. రైతుల కోరిక మేరకు.. వరద నీటిలోకి దిగి.. ఆమె …
Read More »ఢిల్లీ ధర్నా: జగన్కు కలిసి వచ్చింది కేసీఆర్ మిత్రులేనా?
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టిన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు కలిసి వచ్చింది ఎవరు? ఎంత మంది ఆయన వెంట ఈ ధర్నాకు చేతులు కలిపారు? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. వాస్తవానికి వైసీపీలో ఉన్న వారంతా ఢిల్లీ బాట పట్టారు. పార్టీనే ఖర్చులు భరించి.. విమానాలు కూడా బుక్ చేయించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో సీనియర్లు, జూనియర్లు అందరూ కలిసి హస్తిన …
Read More »వైసీపీకి భారీ దెబ్బ.. కీలక నేత రాజీనామా?
ఏపీ విపక్ష పార్టీ వైసీపీకి వరుస దెబ్బలు తగులు తున్నాయి. పార్టీ ఇప్పుడు క్లిష్ట పరిస్థితిలో ఉన్నసమయం ఆదుకోవాల్సిన నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. రెండు రోజుల కిందట గుంటూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి పార్టీ రాజీనామా చేశారు. వాస్తవానికి ఆయన 2019లో టీడీపీ తరఫున విజయం దక్కించుకుని వైసీపీలోకి వచ్చారు. ఈ దఫా ఆయనకు టికెట్ ఇవ్వకపోయినా.. వైసీపీ ప్రబుత్వ ఆయనకు భారీగానే కాంట్రాక్టులు ఇచ్చింది. …
Read More »ఢిల్లీ ధర్నా: జగన్కు ఒరిగేదేంటి.. ?
ఢిల్లీలో ధర్నా చేస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఒరిగే ప్రత్యేకమైన ప్రయోజనం ఏమైనా ఉందా? అనే చర్చ తెరమీదికి వచ్చింది. ఎందుకంటే ఢిల్లీలో ధర్నా చేయడం తప్పు కాదు. గతంలో చంద్రబాబు కూడా చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఢిల్లీలో ధర్నా చేయటం తెలిసిందే. కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అంత అత్యవసరమైన అవకాశం, అవసరం ఏమొచ్చింది? అనేది ఇప్పుడు ప్రశ్న. నిజానికి ధర్నా చేయాలి అనుకుంటే …
Read More »పోలీసులకు ఝలక్ ఇచ్చిన కడప రెడ్డెమ్మ
కనీస సమాచారం ఇవ్వకుండా తనకున్న టు ప్లస్ టు గన్ మెన్లను ఒన్ ప్లస్ వన్ కు కుదించారు. తన భర్తకు ఉన్న వన్ ప్లస్ వన్ సెక్యూరిటీని పూర్తిగా తొలగించారు. దీంతో తనకు అసలు సెక్యూరిటీనే అవసరం లేదు అంటూ ఆ ఎమ్మెల్యే తిప్పిపంపిది. సెక్యూరిటీ కుదిస్తూ పోలీసు అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం కడప రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కడప శాసనసభ స్థానం నుండి …
Read More »ఆ పది చోట్లా ఉప ఎన్నికలు ఖాయమేనా ?!
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ విపక్ష బీఆర్ఎస్ పార్టీని బలహీన పర్చేందుకు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ లో ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. మరింత మందిని చేర్చుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలలో ఉండగా పార్టీ మారిన 10 మంది మీద అనర్హత వేటు వేయాలని ఇటు స్పీకర్, అటు కోర్టులను బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది. అదే సమయంలో ఈ పది స్థానాలలో …
Read More »చక్కటి అవకాశం మిస్ చేసుకున్న జగన్!
వైసీపీ అధినేత, విపక్ష నాయకుడు జగన్.. అసెంబ్లీలో చక్కటి అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. ఆయనకు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదన్న అక్కసుతో మంగళవారం సభ మొహం కూడా ఆయన చూడలేదు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వెళ్లినా.. ఆ వెంటనే బయటకు వచ్చేశారు. అయితే.. వాస్తవానికి మంగళవారం కనుక జగన్ కానీ, ఇతర వైసీపీ సభ్యులు కానీ.. సభలో ఉండి ఉంటే.. వారికి మాట్లాడేందుకు అవకాశం దక్కేది. ఎలాటంటే.. మంగళవారం.. సభలో గవర్నర్ …
Read More »ఒక్కొక్క ఎంపీని వెయ్యి కోట్లకు కొన్నారా?: షర్మిల
కేంద్ర బడ్జెట్లో ఏపీ రాజధాని అమరావతి కోసం రూ.15000 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామని కూడా.. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే.. ఈ బడ్జెట్పై కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైరయ్యారు. తనదైన శైలిలో ఆమె వ్యాఖ్యలు గుప్పించారు. “రాష్ట్ర రాజధాని కోసం 15000 కోట్లు అప్పుగా ఇచ్చారా? గ్రాంటుగా ఇచ్చారా?” అని ప్రశ్నించిన ఆమె.. …
Read More »బడ్జెట్ మీద వైసీపీ గప్చుప్
ఇవాళ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు. మామూలుగా అయితే ఏపీ వాళ్లకు పెద్దగా బడ్జెట్ మీద ఆశలుండేవి కావు. ఎన్నో ఏళ్ల నుంచి ఏపీకి బడ్జెట్లో రిక్త హస్తమే మిగులుతోంది. 2014-18 మధ్య కేంద్రంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉన్నా సరే.. చెప్పుకోదగ్గ స్థాయిలో కేటాయింపులు లేవు. ఆ తర్వాత వైసీపీ హయాంలో పరిస్థితి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. గత పదేళ్లు ఎవరి మీదా ఆధారపడకుండా …
Read More »మెడపై కత్తి పెట్టి భూములు రాయించుకున్నారు: చంద్రబాబు
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు మంగళవారం సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రాన్ని దారుణంగా మార్చారని తెలిపారు. మెడపై కత్తిపెట్టి భూములు రాయించుకున్నారని.. ప్రజలు భయాందోళనలతో పొరుగు రాష్ట్రాలకు తరలిపోయారని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో గత ఐదేళ్లు చీకటి రోజులుగా ఉన్నాయని తెలిపారు. ఎక్కడా భూముల్ని, ఆస్తులను వేటినీ వదల్లేదన్నారు. దౌర్జన్యాలు, విధ్వంసాలు, కబ్జాలు, దాడులు, …
Read More »జగన్ వార్నింగ్.. ఆయన పేరు అది కాదట
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తలో మోస్ట్ పవర్ ఫుల్ సీఎం అనే పేరుండేది. ఏకంగా 151 సీట్లతో అధికారంలోకి వచ్చి కొంత కాలం రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నట్లు కనిపించేవారాయన. కానీ తర్వాత ఆయన పాలన ఎలా తయారైందో, ఎన్ని విమర్శలు మూటగట్టుకున్నారో.. ఎంతటి అసమర్థ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారో తెలిసిందే. ఇక ఇటీవలి ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక ఎంత బలహీనంగా తయారయ్యారో చూస్తూనే ఉన్నాం. ఐతే ఓటమితో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates