కేసీఆర్ జాతీయ పార్టీ కలలేమో కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు, చోటామోటా నాయకులకు మాత్రం ఆదిలోనే జేబులు బాగా ఖాళీ అయ్యాయి. దిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభానికి ఎగురుకుంటూ వచ్చిన కార్యకర్తలు, చోటామోటా నాయకులు తిరుగు ప్రయాణంలో బుక్కయ్యారు. పార్టీ ఆఫీసు ప్రారంభం తరువాత గురువారం, శుక్రవారం హైదరాబాద్ తిరుగు ప్రయాణం కావాలనుకుని విమానం టిక్కెట్లు చెక్ చేస్తే వారకి గుండె గుబేల్మంది. నాన్ స్టాప్ ఫ్లైట్ చార్జీలు రూ. 25 …
Read More »కేవలం పవన్తో పని జరిగేనా?
ఏపీలో ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన జనసేన వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకుని వైసీపీ విముక్త ఏపీని సాధించాలనేది ఈ పార్టీ ప్రధాన లక్ష్యంగా ఉంది. అయితే.. ఈ క్రమంలో పార్టీకి పెద్దగా బలగం లేదు. ఉన్నదల్లా పార్టీ అదినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ మాత్రమే. నిజానికి టీడీపీని తీసుకున్నా.. చంద్రబాబు ఇమేజ్ ఇప్పటికీ తరిగిపోలేదు. అదేవిధంగా వైసీపీని తీసుకున్నప్పటికీ.. …
Read More »జగన్ ఎన్నికల వ్యూహం.. జనవరి నుంచి బూత్ కమిటీలు
ఏపీ అధికార పార్టీ వైసీపీ వ్యూహాలకు పదును పెడుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కి రికార్డు సృష్టించాలని భావిస్తున్న సీఎం జగన్.. దీనికి అనుగుణంగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా ఆయన మరో రెండు వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి ప్రచారం కల్పించేలా పదునైన అస్త్రాలను రెడీ చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా జనవరి నుంచి బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే సచివాలయ వ్యవస్థ, వలంటీర్ …
Read More »అమరావతి టు ఢిల్లీ: టార్గెట్ జగన్
నిద్రాహారాలు మాని ఉద్యమిస్తున్న అన్నదాతలు తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. అమరావతి ఉద్యమానికి మూడేళ్లు నిండుతున్న సందర్భంగా హస్తినలో హల్ చల్ చేయాలనుకుంటున్నారు. 1580 మంది రైతులు ఢిల్లీలో దిగుతారు. జంతర్ మంతర్ ఆందోళన, కిసాన్ ధర్నా కార్యక్రమం ఇవన్నీ బాగానే ఉన్నా…. రైతుల అసలు ఉద్దేశం ఏమిటనేది పెద్ద ప్రశ్న. అలాంటి ప్రశ్న వేసిన వారికి దిమ్మతిరిగే సమాధానం వస్తోంది… జగన్, మోదీ ఇద్దరూ తమ పాలిట శాపమేనని …
Read More »పవన్ తెలంగాణ, ఏపిని కలిపి దున్నేస్తాడా!
జనసేనా నాయకుడు పవన్ కల్యాణ్ రాజకీయాల్లో స్పీడ్ పెంచబోతున్నారు. సంక్రాంతి తర్వాత ఏపీలో బస్సు యాత్ర మొదలు పెడతారు. అందుకోసం వాహనాన్ని సిద్ధం చేశారు ఆయన వాహనం వారాహిపై వైసీపీ చేసిన ఆరోపణలన్నీ పటాపంచలైపోయాయి. తెలంగాణ ఆర్టీఏ రిజిస్ట్రేషన్ కూడా చేసింది. అయినా కొందరు ఏపీ మంత్రుల ఆరోపణలు మాత్రం ఆగడం లేదు. ఎవరేమనుకున్నా తాను ప్రజల కోసం పనిచేస్తున్నానని పవన్ చెబుతున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నానంటున్నారు. ఏర్పాట్లు చకచకా …
Read More »ఇది కేసీఆర్ మాయ.. జగన్నాటకమా?
విభజన జరిగి ఎనిమిదిన్నరేళ్లు కావొస్తోంది. ఉమ్మడిగా ఎన్ని ఏళ్లు ఉన్నప్పటికీ ఒకసారి విడిపోవాల్సి వస్తే.. లెక్కలు ఆటోమేటిక్ గా తెర మీదకు వస్తాయి. అది భార్యభర్తల బంధంలో కావొచ్చు. రాష్ట్రాల విషయంలో కావొచ్చు. సాధారణంగా విడిపోవటం అన్న ప్రక్రియ మొదలైనంతనే.. ఆస్తులు.. అప్పుల లెక్కలు రావటం.. ఎవరికేమిటి? అన్న పంచాయితీకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఏపీ ప్రజలు విడిపోయే ప్రసక్తే లేదన్న మాట …
Read More »హత్య కేసులో బయటికొస్తే విజయయాత్ర
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ అనంతబాబు బాబు.. కొన్ని నెలల కిందట ఒక హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తన దగ్గరే డ్రైవర్గా పని చేసి మానేసిన సుబ్రహ్మణ్యం అనే ఎస్సీ కుర్రాడిని కొట్టి చంపిన కేసులో బాబు ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొన్నారు. బాబునే స్వయంగా సుబ్రహ్మణ్యంను అతడి ఇంటి నుంచి తీసుకెళ్లడం.. తర్వాత తన శవాన్ని కార్లో …
Read More »అబ్బా…! ఏం ప్లాన్ వేశావ్ కన్నా… ?!
కన్నా లక్ష్మీ నారాయణ తెలుగు రాజకీయాల్లో అందరికీ తెలిసిన పేరు. ఉమ్మడి గుంటూరు జిల్లా పెద కూరపాటు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేసిన నేతగా ఆయన్ను ఓటర్లు నిత్యం గుర్తు చేసుకుంటారు. వైఎస్ హయాంలో మంత్రిగా ఆయన సేవలను ప్రస్తావిస్తుంటారు. ఆయన ముఖ్యమంత్రి అవుతారని కూడా చెప్పుకున్నారు. ఆ అవకాశం చేజారిన తర్వాత రాజకీయాల్లో కన్నా కొంచెం నిదానించినట్లే కనిపిస్తోంది. విభజన తర్వాత కొంతకాలానికి కాంగ్రెస్ ను వీడిన కన్నా… …
Read More »వస్తారా? రండి.. రండి.. జనసేన వలకు పెద్ద చేపలు!
ఏపీలో అధికారం దక్కించుకోవాలని భావిస్తున్న జనసేన.. పెద్ద చేపలు వల విసురుతోందనే వాదన వినిపి స్తోంది. పైకి ఎన్ని విధాలుగా ఆదర్శం ప్రదర్శించాలని అనుకున్నా.. రాజకీయాలు అలా లేవు. ప్రజలు కూడా అలా లేరు(ఇది.. నిజం!). మాకేంటి? అనుకునే వర్గాలు.. మా లాభమేంటి అని భావిస్తున్న ప్రజలు పెరిగిపోతున్నారనేది నిష్టుర సత్యం. ఈ నేపథ్యంలో ప్రజలకు డబ్బులు ఇవ్వకపోయినా.. కనీసం వారిని ప్రభావితం చేసే నాయకులు ఇప్పుడు జనసేనకు అవసరం. …
Read More »బీఆర్ఎస్ను చూసి సంబర పడుతున్న బీజేపీ
కేంద్రంలో మోదీని గద్దె దించుతానంటూ కేసీఆర్ తన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చి దేశవ్యాప్తంగా పోటీ చేస్తానంటున్నారు. ఈ రోజు దిల్లీలో పార్టీ ఆఫీసు కూడా ప్రారంభించబోతున్నారు. తాను ఒక్కో స్టెప్ వేస్తుంటే బీజేపీ భయపడుతుందని కేసీఆర్ అనుకుంటుంటే.. బీజేపీ పెద్దలు మాత్రం కేసీఆర్ ఒక్కో అడుగు చూసి సంబరపడుతున్నారు. తెలంగాణ దాటి కేసీఆర్ వేసే ప్రతి అడుగూ తమకు లాభదాయకమేనని వారు లోలోన సంతోషిస్తున్నారు. కేసీఆర్ అంటే ఎన్నికల …
Read More »కేసీఆర్ ఏపీకి వస్తే.. వీటికి సమాధానం ఏంటి?
తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. తన జాతీయ పార్టీని విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయడం ఖాయం. ఎందుకంటే.. ప్రస్తుతం డిల్లీలో ఈ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం కాగానే 2024 సార్వత్రిక సమరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన అన్ని రాష్ట్రాల్లోనూ కలియదిరుగుతారు. ఎక్కడ అవకాశం ఉంటే.. అక్కడ పార్టీని విస్తరించేందుకు ప్రయత్నిస్తారు. ముందుగా ఈ జాబితాలో ఏపీ ఉందని అంటున్నారు. పొరుగునే ఉన్నరాష్ట్రం.. పైగా తనకు తెలిసిన …
Read More »ఏపీకో దండం… ఇక మేం పోతాం…
విశాఖను ఎగ్జిక్యుటివ్ కేపిటల్ చేసేందుకు జగన్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. త్వరలో పాలనను సాగర నగరం నుంచి ప్రారంభిస్తానని చాలా రోజులుగా చెబుతున్నారు. ఆ నగరాన్ని అందమైన నందనవనంగా మార్చే ప్రయత్నం ఒక వంతయితే.. అన్ని రకాల వసతులు, కార్యాలయాలు, విద్యా సంస్థలు పెంచడం మరో వంతు అని వైసీపీ వర్గాలు బాకా ఊదుకుంటున్నాయి. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని తాజా పరిస్థితులు చెబుతూనే ఉన్నాయి. ఎంత దాచినా …
Read More »