చాలా రోజుల నుంచి ఈ మాట వింటున్నదే కదా… ఇప్పుడు ఇందులో కొత్తేముంది అంటారా? నిజమే… చాలా రోజులుగా ఈ మాట వినిపిస్తున్నదే. ఎక్కడైనా పెద్ద రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో అటు రవాణా అధికారులతో పాటు ఇటు పోలీసు శాఖ కూడా హడావిడి చేయడం మినహా… ఆ తర్వాత ఆ నిబంధనను అంతగా పట్టించుకోవడం లేదు. పెట్రోల్ పంపుల యాజమాన్యాలు దీనిపై పెద్దగా దృష్టే పెట్టడం లేదు కూడా. …
Read More »మూడు రోజుల పాటు పాలనంతా `నారా వారి పల్లె` నుంచే!
సోమవారం నుంచి మూడు రోజుల పాటు ప్రభుత్వ పాలన అంతా అమరావతి నుంచి కాకుండా.. సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. నారా వారి పల్లె నుంచే జరగనుంది. ఈ మేరకు అధికార వర్గాలు అనధికార ప్రకటన చేశాయి. ప్రస్తుతం చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్నారు. అయితే.. ప్రతి సంక్రాంతినీ ఆయన సొంత గ్రామం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం, నారావారి పల్లెలో నిర్వహించుకుంటున్నారు. యావత్ కుటుంబం అంతా కూడా.. …
Read More »ఇద్దరూ ఎమ్మెల్యేలే!…కొట్టుకోవడం ఒక్కటే తక్కువ!
పార్టీ పిరాయింపుల వ్యవహారం ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వావాదానికి దారి తీసింది. ముగ్గురు మంత్రులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లాకు చెందిన దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేల సమక్షంలోనే ఈ వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదానికి దిగిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరిని మరొకరు తోసుకున్నారు. పరస్పర దూషణలకు దిగారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య బూతుల పర్వం కూడా వినిపించింది. వెరసి సమావేశం రచ్చరచ్చగా మారింది. కరీంనగర్ జిల్లా సమీక్షా …
Read More »తిరుమల టికెట్లను అమ్ముకుని రోజా బెంజి కారు కొనుక్కుంది
తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అటు టీడీపీ, ఇటు వైసీపీకి చెందిన కీలక నేతలు పెద్దగా ఈ ఘటనపై మాట్లాడటం లేదు. అయితే మాజీ మంత్రి రోజా మాత్రం ఈ ఘటనపై నిత్యం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. కూటమి సర్కారు తప్పిదం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని, ఇందుకు చంద్రబాబు బాధ్యత వహించాలని …
Read More »రేపటి నుంచి మహా కుంభమేళా… భారీ ఏర్పాట్లు
ఉత్తరప్రదేశ్లోని పవిత్ర ప్రయాగ్రాజ్ జిల్లాలో సోమవారం(జనవరి 13) నుంచి 45 రోజుల పాటు జరగను న్న మహా కుంభమేళాకు సర్వం సిద్ధమయ్యాయి. ఈ క్రతువు.. 114 ఏళ్లకు ఒకసారి వస్తుందని పండితులు చెబుతున్నారు. అంతర్వాహినిగా ఉన్న సరస్వతి నది- గంగ, యమునలతో జతకలిసే చోటు ప్రయాగ్ రాజ్లో ఉంది. అక్కడే ఈ మహా కుంభమేళాను నిర్వహిస్తున్నారు. దీనికి దేశవ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా కూడా.. ప్రజలు హాజరవుతున్నారు. ఈ క్రతువును …
Read More »తిరుపతి తొక్కిసలాట: బాధితులకు పరిహారం అందించిన చైర్మన్
వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు టోకెన్ తీసుకోవాలని వచ్చి.. తిరుపతిలో జరిగిన తొక్కిస లాటలో ప్రాణాలు కోల్పోయిన వారిని దేవస్థానం పాలకమండలి ఆదుకుంది. ఈ ఘటనకు సంబంధించి అన్ని వైపుల నుంచి బోర్డుపై ఒత్తిళ్లు వచ్చిన విషయం తెలిసిందే. సర్కారు తరఫున ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా క్షమాపణలు చెప్పాలని పలు మార్లు డిమాండ్ చేశారు. ఇక, సీఎం చంద్రబాబు కూడా.. ఈ విషయాన్ని సీరియస్గా …
Read More »గడ్కరీ సాబ్… మరో మారు ఆలోచించండి…!
నితిన్ గడ్కరీ… కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిగా పదేళ్లకుపైగా కొనసాగుతున్నారు. మోదీ కేబినెట్ లో ఆ శాఖను గడ్కరీ తప్పించి ఇతర నేత చేపట్టనే లేదు. బీజేపీలో ఓ సీనియర్ మోస్ట్ నేతగానే కాకుండా… దేశ అభివృద్ధి విషయంలో ప్రత్యేకించి రోడ్డు రవాణా అభివృద్ధి విషయంలో గడ్కరీకి ఉన్నంత విజన్ మరే నేతకు లేదనే చెప్పాలి. ఫలితంగానే గడ్కరీ హయాంలో దేశంలో జాతీయ రహదారుల వృద్ధి పరుగులు …
Read More »పవన్ ను టచ్ చేయడం అసాధ్యం!
నటుడిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే విజయాలను ఎన్నింటినో సాధించారు. ఇప్పుడు అటు సినిమాలతో పాటుగా ఇటు రాజకీయాల్లోనూ ఆయన తన ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఏ రాజకీయ నేతకు అయినా… తన పరిధిలో, తన హయాంలో జరిగే అభివృద్ధే సదరు నేత పనితీరుకు కొలమానం. అది ఎమ్మెల్యేగా కావచ్చు, ఎంపీగా కావచ్చు…లేదంటే మంత్రిగానో, ముఖ్యమంత్రిగానో ఉప ముఖ్యమంత్రిగానో కావచ్చు… పరిధి మారుతుందే గానీ.. వారి పరిధిలో, …
Read More »సంక్రాంతి కైనా సొంత ఊర్లకు వెళ్ళమంటున్న సీఎం
సంక్రాంతిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు తెలుగు వారికి శుభాకాంక్షలు చెప్పారు. దేశంలోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తం గా తెలుగు వారు ఎక్కడ ఉన్నా.. ఆనందంగా ఈ పండుగను నిర్వహించుకోవాలన్నారు. ఇదేసమయంలో ఆయన సంక్రాంతికి-మానవ సంబంధాలకు కూడా లింకు పెట్టారు. నేటి కంప్యూటర్ యుగంలో పరుగులు పెడుతున్న జీవన శైలికి.. పండుగలు బ్రేకులు వేస్తాయని.. తద్వారా మనం ఏంటో తెలుసుకునేందుకు మనకు ఈ పండుగలు గొప్ప అవకాశం ఇస్తాయని ఆయన పేర్కొన్నారు. …
Read More »కష్టాల్లోనూ… కానుకలను ఆపని బాబు గారు!
ఏపీ అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం. రాష్ట్ర విభజనతో లోటు బడ్జెట్ తో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన ఏపీకి… కొత్తగా ఆదాయ మార్గాలు అంతగా లేవనే చెప్పాలి. అప్పటిదాకా ఉన్న ఆదాయాల్లో క్రమానుగత పెరుగుదల తప్పించి… కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం లేదు. ఫలితంగా నిత్యం రాష్ట్ర ప్రభుత్వం అప్పుల బాట పట్టాల్సి వస్తోంది. ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే బాండ్ల వేలంలో పాలుపంచుకుంటూ అప్పులను సమకూర్చుకుంటూ… కష్టాల …
Read More »పుస్తకాల కోసం 10 లక్షలు ఖర్చు పెట్టిన పవన్!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు పుస్తకాలంటే మహా ఇష్టమన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే పలు మార్లు చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ముందు చాలా పుస్తకాలు చదివానని.. దానివల్ల తనకు అన్ని విషయాల్లోనూ అవగాహ న ఉందని తెలిపారు. అయితే.. ఈ వ్యవహారం ట్రోల్స్కు కూడా దారితీసింది. అయినా.. పవన్ తగ్గలేదు. తాను చదివిన విషయాన్ని తనకు పుస్తకాల పట్ల ఉన్న ప్రేమను ఎక్కడ అవకాశం వచ్చినా …
Read More »లోకేష్ మనసులో మాట.. ఆటోమేటిక్గానే…!
ఒక వ్యూహం కొన్ని దారులు ఏర్పాటు చేస్తుంది. ఒక ప్రణాళిక వందల అవకాశాలు కల్పిస్తుంది. ఇప్పుడు ఏపీలోనూ ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది. మంత్రి నారా లోకేష్ మనసులోని మాట కూడా ఇదే. ఎన్నికలకు ముందు ఏటా 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ఆయన.. తాజాగా ఇదే విషయంపై అంతర్మథనం చెందుతున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని భావిస్తున్నారు. ఇదేసమయంలో వచ్చే మూడు మాసాల్లోనే స్పష్టమైన హామీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates