రాజకీయ పరిణామాలు ఎటు మలుపు తిరుగుతున్నాయో.. అర్ధం కాని పరిస్థితి నెలకొంది. దీంతో సంచలన వ్యవహారాలపై ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది. తాజాగా ఇలాంటి చర్చే తెరమీదికి వచ్చింది. జగన్ కన్నా షర్మిల బెటరా? అనేది ప్రధాన అంశం. ఎందుకంటే.. రాజకీయాలను ఎంత వరకు చేయాలో.. అంత వరకే చేయడం.. ఎక్కడ వరకు మాట్లాడాలో అక్కడితోనే సరిపుచ్చడం వంటివి షర్మిలకు తెలిసినంతగా జగన్ కు తెలియడం లేదని అంటున్నారు పరిశీలకులు. తాజాగా …
Read More »ఏపీలో లోకల్ వార్.. విక్టరీ కోసం జగన్ ఎత్తులు?
మరో ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలో కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. 2020లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా వ్యవహరించిందనే వాదన ఉంది. ప్రతిపక్షాలను కనీసం నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకున్నారనే వాదన ఉంది. నిజానికి ఇది కూడా స్థానికంగా వైసీపీకి వ్యతిరేకతను పెంచేసింది. అయినప్పటికీ.. తాడిపత్రి వంటి చోట్ల టీడీపీనే దక్కించుకుంది. ఇక, ఇప్పుడు మరో ఏడాదిన్నరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు కూటమి సర్కారు …
Read More »అన్న క్యాంటీన్ సూపర్ హిట్
ఏపీలో అన్న క్యాంటీన్ల జోరు కొనసాగుతోంది. ఒకేసారి శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను టీడీపీ నాయకులు, మంత్రులు ప్రారంభించారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు గుడివాడలో తొలి అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. అయితే..తొలి దశలో మొత్తం 100 క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పిన సర్కారు.. ఆమేరకు ఏర్పాట్లు చేసింది. అన్నీ గురువారమే ప్రారంభించాలని అనుకున్నా.. కొందరు మంత్రులు శ్రావణ శుక్రవారం సెంటిమెంటును కూడా …
Read More »మూడు రోజులు ఢిల్లీలోనే చంద్రబాబు.. జగన్పై చర్చ!?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం.. పలు వ్యాపార వేత్తలతో అమరావతిలోని సచివాలయంలో భేటీ అయిన చంద్రబాబు.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంపై వారితో చర్చించారు. వీరిలో ప్రఖ్యాత టాటా గ్రూపు చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ కూడా ఉండడం విశేషం. ఇక, ఈ కార్యక్రమాల అనంతరం.. చంద్రబాబు సాయంత్రం ఢిల్లీకి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. శుక్రవారం, శనివారం, ఆదివారం సాయంత్రం వరకు కూడా ఆయన ఢిల్లీలోనే …
Read More »కేసీఆర్కు గవర్నర్, కేటీఆర్కు కేంద్ర మంత్రి : రేవంత్రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని త్వరలోనే బీజేపీలో విలీనం చేస్తారని.. ఇది ఖాయమని చెప్పారు. ఆ వెంటనే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు బెయిల్ వస్తుందని తెలిపారు. అంతేకాదు.. పార్టీ పరంగా కూడా మార్పులు ఉంటాయని చెప్పారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిపోయిన తర్వాత.. ఆ వెంటనే హరీష్ రావుకు అసెంబ్లీలో అప్పోజిషన్ లీడర్ పదవిని అప్పగిస్తారని అన్నారు. ప్రస్తుతం …
Read More »చంద్రబాబుకు బాలయ్య విన్నపం.. !
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలు బావ, బావమరదులు అన్న విషయం తెలిసిందే. అంతేకాదు.. వీరు స్వయానా వియ్యంకులు కూడా. తాజాగా.. బావ చంద్రబాబును బాలయ్య.. ఓ కోరిక కోరారు. నిజానికి ఎప్పుడూ.. ఆయన చంద్రబాబును ఏమీ కోరినట్టు వార్తలు కానీ.. వ్యాఖ్యలు కానీ వినిపించలేదు. గతంలో పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా.. ఇది చేయండి.. అది చేయండి.. అని ఎప్పుడూ చంద్రబాబును కోరిన దాఖలా …
Read More »దాసోజు, కుర్రాలకు షాక్.. మండలికి కోదండరాం, అమీర్!
గవర్నర్ కోటాలో శాసన మండలికి ఎంపికైన ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్లు ఎమ్మెల్సీలుగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో బీఆర్ఎస్ నుంచి గవర్నర్ కోటాలో ఎంపికై.. న్యాయ పోరాటం చేస్తున్న దాసోజు శ్రవణ్కుమార్, కుర్రా సత్యనారాయణలకు భారీ షాక్ తగలినట్టయింది. అప్పటి గవర్నర్ తమిళిసై.. ఉన్న సమయంలో దాసోజు, కుర్రాలను బీఆర్ఎస్ అధినేత, అప్పటి సీఎం కేసీఆర్.. వీరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేశారు. కానీ, అప్పటి …
Read More »జోగి కొడుకు తప్పు చేశాడు.. వదిలేదే లేదు: నారా లోకేష్
ఏపీ మంత్రి నారా లోకేష్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను పోలీసులు అరెస్టు చేయడం, ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించిన నారా లోకేష్.. జోగి కొడుకు తప్పు చేశాడని.. అలాంటి వ్యక్తిని వదిలేయాలా? అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని ఏ ఒక్కరినీ వదిలి పెట్టేది లేదన్నారు. ఈ సందర్భంగా మరోసారి రెడ్బుక్గురించి ప్రస్తావించారు. …
Read More »విదేశాలకు పారిపోతున్న అవినాష్.. పట్టుకున్న పోలీసులు
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం విధ్వంసంలో పాత్ర ఉందని పోలీసులు కేసు నమోదు చేసిన వైసీపీ నాయకులు తలో దారి పడుతున్నారు. వీరిలో విజయవాడకు చెందిన దేవినేని అవినాష్ తాజాగా దుబాయ్ పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆయనను పట్టుకున్నారు. గురువారం అర్థరాత్రి హైదరాబాద్ నుంచి దుబాయ్ పారిపోయేందుకు దేవినేని అవినాష్ ప్రయత్నించినట్టు అధికారులు తెలిపారు. వాస్తవానికి వీరిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. దీంతో శంషాబాద్ పోలీసులు విమానాశ్రయంలో …
Read More »16 మంది ఐపీఎస్లకు మెమో వెనుక రీజన్ ఇదేనా?
ఏపీలో వైసీపీ హయాంలో అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాశారని, వారు చెప్పినట్టు వ్యవహరించి ప్రతిపక్షాల కీలక నాయకులపై కేసులు నమోదు చేశారని భావిస్తున్న 16 మంది ఐపీఎస్లకు ఇటీవల ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల మెమో జారీ చేశారు. వెయిటింగ్లో జాబితాలో ఉన్న మీరు ఎక్కడెక్కడో ఉంటే కుదరని, ఉదయం 10 గంటలకు ఆఫీసుకు వచ్చి రిజిస్టర్లో సంతకాలు చేయాలని.. ఆఫీసు పని వేళలు ముగిసిన తర్వాత.. తిరిగి …
Read More »‘ఎట్ హోం’కు ఎవరూ వెళ్లకపోతే ఎలా జగన్?
ఆట కావొచ్చు.. రాజకీయం కావొచ్చు. గెలుపు ఎంత ఖాయమో.. ఓటమి అంతే పక్కా. గెలుపునకు పొంగిపోవటం.. ఓటమికి కుంగిపోవటం అస్సలు ఉండొద్దు. ఈ విషయాన్ని గుర్తించి.. గెలుపోటముల్నిసమంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తీరుతో ఉన్నప్పుడు ఎదురయ్యే ఓటమిని తేలిగ్గా అధిగమించే వీలుంది. ఈ విషయాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిస్ అవుతున్నారా? అన్నది ప్రశ్న. పంద్రాగస్టు.. జనవరి 26న సంప్రదాయంలో భాగంగా గవర్నర్ ఎట్ హోం …
Read More »అమరావతికి దలైలామా సాయం.. నిజమేనా ..!
ఏపీ కలల రాజధాని అమరావతి నిర్మాణం.. మళ్లీ పట్టాలెక్కుతోంది. దీనిని వడివడిగా పూర్తి చేసేందుకు సీఎం చంద్రబాబు తన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రం నుంచి ఏదో ఒక రూపంలో నిధులు సమకూర్చుకునే ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి. త్వరలోనే రూ.15 వేల కోట్ల ను అప్పు రూపంలో కేంద్రం ఇప్పించేందుకు రెడీ అయింది. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వమే.. సొంతగా మరిన్ని నిధులు సమకూర్చుకునేందుకు ప్రణాళికలు రెడీ చేసుకుంది. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates