రాబోయే ఎన్నికల్లో పోటీచేసే విషయమై కేసీయార్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటంటే రెండు నియోజకవర్గాల్లో పోటీచేసే విషయమై ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం కేసీయార్ గజ్వేల్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. గజ్వేల్ నుండి కాకుండా వచ్చే ఎన్నికల్లో మహబూబ్ నగర్, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పోటీచేస్తే ఎలాగుంటుందనే విషయాన్ని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. గజ్వేలుతో పాటు మరో కొత్త నియోజకవర్గమా ? లేకపోతే …
Read More »దేశాధినేతల్ని కలవొచ్చు.. కేసీఆర్ కలవలేం: గవర్నర్ సంచలనం
సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందరరాజన్. భారతదేశానికి వచ్చే దేశాధినేతల్ని కలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ.. తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రిని కలవలేం. ఇదో దురదృష్టకరమైన పరిస్థితి. కొన్ని దేశాలు దగ్గర కావొచ్చు. తెలంగాణలో రాజ్ భవన్.. ప్రగతిభవన్ మాత్రం దగ్గరకు కాలేవు. ఇటీవల పెద్ద సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. కానీ.. రాష్ట్ర ప్రథమ పౌరురాలికి మాత్రం ఆహ్వానం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా గవర్నర్ …
Read More »ఇక, జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ దూకుడు.. ఢిల్లీకి కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. గురువారం ఆయన ఢిల్లీకి చేరుకుని ఇక్కడ నిర్మించిన బీఆర్ ఎస్ జాతీయ భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు. జాతీయ రాజకీయాల్లో క్రీయాశీల పాత్ర పోషించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కేసీఆర్ దీనికి అనుగుణంగా ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి కార్యాలయ భవనాన్ని నిర్మించారు. ఇందుకోసం సీఎం గురువారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం తెలంగాణ భవన్(బీఆర్ఎస్ కార్యాలయం)ను ప్రారంభిస్తారు. తొలుత కార్యాలయంలో యాగం నిర్వహిస్తారు. …
Read More »సాధారణ మహిళకు ఉన్న జ్ఞానం.. జగన్కు లేదా? : చంద్రబాబు
ఏపీ సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఎటు పోతోందో? ఏమవుతోందో ప్రస్తుత సీఎం జగన్కు ఏమాత్రమైనా తెలుస్తోందా? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో సన్రైజ్ రాష్ట్రం గా ఉన్న ఏపీ.. ఇప్పుడు సన్ సెట్ రాష్ట్రంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణ మహిళకు ఉండే జ్ఞానం సీఎం జగన్కు కానీ, వైసీపీ పేటీఎం బ్యాచ్కు కానీ ఉందా? అని ప్రశ్నించారు. …
Read More »టీడీపీలో వైసీపీ కోవర్టులు
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు భారీ స్పందన వస్తోంది. యాత్ర 90వ రోజు దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. జగన్ ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతూ, టీడీపీ అధికారానికి వస్తే ప్రజా సంక్షేమానికి కృషి చేస్తామని జగన్ చెబుతున్నారు. యువగళానికి సీమ ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. లోకేష్ కు వచ్చిన ప్రజాదరణ ఓర్వలేక దాన్ని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కుయుక్తులు పన్నుతున్నారు. ప్రతీ నియోజకవర్గంలోనూ …
Read More »డీఎస్పీ నియామకమే అసలు వివాదం..
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అలిగి సమన్వయకర్త పదవికి రాజీనామా చేయడం వెనుక అసలు కారణాలు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. ఇంతకాలం మంత్రి ఆదిమూలపు సురేష్ వల్లే సమస్యలు వస్తున్నాయని భావించగా, ఇప్పుడు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ప్రకాశం జిల్లా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న అక్కసు బాలినేనికి ఉందని తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా బయట పడింది. వేర్వేరు శాఖల్లో తాను కోరుకున్న వారిని నియమించడం లేదని బాలినేని అలకపూనారు. …
Read More »ఇప్పుడు ఖమ్మం అంత వీజీ కాదు కేసీఆర్
వచ్చేఎన్నికల్లో ఎలాగైనా ఖమ్మం జిల్లాలోని అన్నీ సీట్లలో బీఆర్ఎస్ గెలవాలని కేసీయార్ పట్టుదలగా ఉన్నారు. జిల్లాలోని 10 సీట్లలో గడచిన రెండు ఎన్నికల్లోనో ఒక్కోసీటు మాత్రమే గెలుచుకుంది. అన్నీ సీట్లు లేదా కనీసం మెజారిటి నియోజకవర్గాలనైనా గెలవాలన్నది కేసీయార్ పట్టుదల. అయితే ఎంత ప్రయత్నిస్తున్నా కేసీయార్ టార్గెట్ మాత్రం రీచ్ కాలేకపోతున్నారు. గడచిన రెండు ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలు వచ్చేఎన్నికల్లో రిపీట్ కావద్దని బాగా పట్టుదలగా ఉన్నారు. అయితే …
Read More »పోకర్ టోర్నమెంట్ ఉందంటే థాయ్ లాండ్ కు వెళ్ళా!
అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే చీకోటీ ప్రవీణ్ వార్తల్లోకి రావటం తెలిసిందే. గత ఏడాది ఈడీ సోదాలతో అతడి పేరు మొదటిసారిగా మీడియాలో ప్రముఖంగా రావటం.. ఆ తర్వాత అతగాడి విలాసవంతమైన జీవితం గురించి.. అతడి క్యాసినో వ్యాపారం మీద బోలెడన్ని కథనాలు వచ్చాయి. అయితే.. గ్యాంబ్లింగ్ ను చట్టవిరుద్దమైన చర్యగా చూసే థాయ్ లాండ్ లో భారీ ఎత్తున నిర్వహించిన …
Read More »టీడీపీ-వైసీపీ: మేనిఫెస్టోలపై తర్జన భర్జన….
నవరత్నాలు అనే కీలకమైన అంశాన్ని తీసుకుని మేనిఫెస్టో రూపొందించింది ఇందులో పేర్కొన్న అంశాలను అమలు చేస్తున్నామని సంక్షేమ ప్రభుత్వం అని తరచుగా చెబుతున్నటు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నవరత్నాల్లో ఉన్నటువంటి చాలా అంశాల్లో వెనుకబాటు తనాన్ని అనుసరిస్తున్నారు. ముఖ్యంగా జగనన్న ఇళ్ల పథకంలో ఇప్పటికీ కూడా పునాదులు స్తాయి దాటినటు వంటి జిల్లాలు చాలానే ఉన్నాయి. వీటిని పరుగులు పెట్టించి పూర్తి చేయాలి.. అనుకున్నప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితులు సహకరించడం …
Read More »ఏపీలో బాబాయ్.. తెలంగాణలో అబ్బాయ్..
ఆంధ్రుల అభిమాన అన్న, యువగపురుషుడు నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నారు. ఏడాది పొడవునా వంద సభలు నిర్వహించిన టీడీపీ, ఎన్టీఆర్ కుటుంబం కలిసి నిర్ణయించారు. ఇటీవలే ఒక సభకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ను ఆహ్వానించారు. ఆ కార్యక్రమాలన్నింటినీ నందమూరి బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారు. కట్ చేసి చూస్తే ఇప్పుడు తెలంగాణలో కూడా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించబోతున్నారు. ఇందుకోసం ఖమ్మం నగరంలో ఎన్టీఆర్ విగ్రహం …
Read More »శరద్ పవార్కు ఏమైంది ?
రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పార్టీ అధ్యక్ష పదివికి రాజీనామా చేశారు. అయితే రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని, పార్టీ కార్యకర్తలకు అండగా వారికి మార్గదర్శిగా ఉంటానని ప్రకటించారు. 1999లో ఏర్పాటైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను మొదలు పెట్టాలని పవార్ తమ పార్టీ నేతలకు సూచించారు. ఆరు దశాబ్దాలుగా మహారాష్ట్ర ప్రజల సేవలో ఉన్నానని, ఆ అవకాశం కల్పించినందుకు …
Read More »తెలంగాణ కోసం కాంగ్రెస్ యువరాణి
కాంగ్రెస్ పార్టీకి అవసరమైన బూస్టప్ ఇవ్వటానికి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధి తెలంగాణాకు వస్తున్నారా ? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. ఈనెల 8వ తేదీన హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో జరగబోయే నిరుద్యోగ బహిరంగత సభకు ముఖ్యఅతిధిగా ప్రియాంక హాజరుకాబోతున్నట్లు నేతలు చెబుతున్నారు. మొన్ననే 28వ తేదీన నల్గొండలో జరిగిన మొదటి నిరుద్యోగ బహిరంగసభ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని కాంగ్రెస్ నేతలు ఫుల్లు జోష్ లో ఉన్నారు. …
Read More »