రాజకీయ చైతన్యం అన్నంతనే ఆంధ్రప్రదేశ్ గుర్తుకు వస్తుంది చాలామందిలో. పేరుకు పిల్లాడే కావొచ్చు కానీ.. రాజకీయ చైతన్యం ఆంధ్రా ప్రాంతంలోని ప్రతి సందులోనూ కనిపిస్తుందన్న మాట అందరి నోట వినిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆంధ్రప్రదేశ్ లో.. కరోనా కష్ట కాలంలో ప్రజలకు నేనున్నా అన్న ధీమా ఇచ్చే అధినేతే లేకుండా పోయారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు.. ఆ మధ్యన జరిగిన …
Read More »బ్లాక్ ఫంగస్ కు చెక్ పెట్టేలా జగన్ నిర్ణయం
కరోనా విసిరిన సవాలుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వారికి.. అది సరిపోదన్నట్లుగా బ్లాక్ ఫంగస్ వణికిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత బ్లాక్ ఫంగస్ బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురి కావటమే కాదు.. ప్రాణాలు పోతున్న వైనాలు పెరుగుతున్నాయి. ఇందుకోసం భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇప్పటికే కరోనా వైద్యం కారణంగా లక్షలాది కుటుంబాలు ఆర్థికంగా దెబ్బ తింటున్నాయి. బ్లాక్ ఫంగస్ లాంటిది ఎదురైతే.. ఆస్తులు అమ్ముకోవటం మినహా మరో …
Read More »రోజా పంతం ఈ సారి అయినా నెగ్గుతుందా ?
వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్, ఆ పార్టీ మహిళా ఎమ్మెల్యే ఆర్కే రోజా కల నెరవేరేనా ? ఆమె ఎప్పటి నుంచో కలలు పెట్టుకున్న మంత్రి పదవి వస్తుందా ? రాదా ? అన్నది సస్పెన్స్గా ఉంది. టీడీపీలో రెండు సార్లు ఓడిన రోజా వైసీపీలో నగరి నుంచే రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రోజా ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికార టీడీపీ వాళ్ల నుంచి అటు అసెంబ్లీలోనూ, …
Read More »బెంగాల్లో ఏం జరుగుతోంది?
దేశమంతా కరోనా మహమ్మారితో అల్లాడిపోతుంటే.. బెంగాల్లో మాత్రం ఈ వైరస్ కల్లోలం కంటే రాజకీయ పరమైన రగడే చర్చనీయాంశంగా మారుతోంది. ఎన్నికల సందర్భంగా దేశం దృష్టిని ఆకర్షించిన అక్కడి రాజకీయ వైరం.. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా సద్దుమణగలేదు. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మూడోసారి అధికారంలోకి రాగానే.. ప్రధాన ప్రతిపక్షం బీజేపీకి చెందిన కార్యకర్తలపై తీవ్ర స్థాయిలో దాడులు జరగడం.. ఆ పార్టీ వాళ్లు దాదాపు పదిమంది …
Read More »జగన్ నిర్ణయంతో ఆ ఎమ్మెల్యే ఉక్కిరి బిక్కిరి..!
సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో తూర్పు గోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం ఎమ్మెల్యే.. దాడిశెట్టి రాజా. ఈ నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు గట్టి పట్టుంది. అయితే.. దాడిశెట్టి ఎంట్రీతో ఇక్కడి పాలిటిక్స్ను తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్పై రాజా వరుస విజయాలు దక్కించుకున్నారు. ఇక్కడి ప్రజల ప్రధాన డిమాండ్ పరిష్కరిస్తామని.. గత ఎన్నికల సమయంలో …
Read More »టీడీపీలో ఇదో చిత్రం.. సఖ్యత లేని కీలక నేతలు..!
ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో చిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. గత ఎన్నికల్లో పార్టీ ఘోరంగా దెబ్బతింది. అయినప్పటికీ.. కొన్ని కొన్ని జిల్లాల్లో పార్టీ పేరు నిలబడింది. తూర్పుగోదావరి, విజయవాడ, ప్రకాశం.. విశాఖ.. వంటి జిల్లాల్లో పార్టీ విజయం దక్కించుకుంది. సీనియర్లు ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. కలివిడిగా ఉండి.. పార్టీని డెవలప్ చేయాలని.. చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అయితే.. ఎక్కడా కూడా నేతల మధ్య సఖ్యత కనిపించడం …
Read More »సామాజికవర్గంలోనే ఒంటరైపోయారా ?
మూడు రోజుల క్రితం అరెస్టయిన వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజు సొంత సామాజికవర్గంలోనే ఒంటరైపోయారు. గెలిచిన పార్టీ నేతలతోనే గొడవలు పెట్టుకోవటం వల్ల, ప్రభుత్వంతో పాటు జగన్మోహన్ రెడ్డిపై నోటకొచ్చినట్లు మాట్లాడటం వల్ల అధికారపార్టీ నేతలకు దూరమైపోయారు. ఇక అరెస్టు తర్వాత మరీ విచిత్రమైన పరిస్ధితులు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ చెప్పుకోవాల్సిన విచిత్రం ఏమిటంటే అధికారపార్టీ ఎంపికి ప్రతిపక్షాల నేతలందరు మద్దతుగా నిలబడటం. తిరుగుబాటు ఎంపి వైఖరి తప్పా …
Read More »రఘురామకు సోరియాసిస్ అట.. భార్య షాక్
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్టు వ్యవహారమే హాట్ టాపిక్. ఏడాదిగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ, ప్రభుత్వం మీదే తీవ్ర విమర్శలు చేస్తూ రెబల్గా మారిన రఘురామను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేయడం తెలిసిందే. రెండు రోజుల కిందట ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడం.. తర్వాతి రోజు కోర్టులో హాజరు పరిచిన సందర్భంగా ఆయన పాదాలు కమిలిపోయి కనిపించడం.. రఘురామను పోలీసులు కొట్టినట్లుగా …
Read More »ఇప్పుడు కానీ తిరుమలకు వెళ్తే..
ఎంత రద్దీ తక్కువున్న సమయంలో తిరుమలకు వెళ్లినా, ముందుగా దర్శనం టికెట్లు బుక్ చేసుకున్నా.. శ్రీవారి దర్శనం పూర్తి కావడానికి కొన్ని గంటల సమయం పడుతుంటుంది. గత కొన్నేళ్లలో పరిస్థితులు ఎంతో మెరుగు పడ్డాయి కానీ.. ఒకప్పుడు సర్వదర్శనం కోసం 10-20-30 గంటలు కూడా పట్టేసేది. తర్వాత పరిస్థఙతులు మారాయి. 300 రూపాయల టికెట్ బుక్ చేసుకుంటే గంటన్నర నుంచి నాలుగైదు గంటల వ్యవధిలో దర్శనం పూర్తవుతోంది. మరీ తక్కువ …
Read More »కోవాగ్జిన్ సూపరో సూపర్
మేడిన్ ఇండియా కోవాగ్జిన్ గురించి కొన్ని నెలల ముందు చాలామంది తక్కువ చేసి మాట్లాడారు. దాని నాణ్యతపై సందేహాలు వ్యక్తం చేశారు. బేసిగ్గా లోకల్ టాలెంట్ మీద మనకుండే చిన్న చూపు కూడా అందుకు కారణం కావచ్చు. మన వ్యాక్సిన్ మీద మన వాళ్లే సందేహాలు వ్యక్తం చేస్తున్న సమయంలో.. పరోక్షంగా కోవాగ్జిన్ను నీటితో పోలుస్తూ సీరం ఇన్స్టిట్యూట్ అధినేత అదార్ పూనవాలా చేసిన కామెంట్ దుమారం రేపడం.. దీనిపై …
Read More »వైసీపీ ఎమ్మెల్యేకు జేసీ సపోర్ట్ ?
టీడీపీకి గట్టి పట్టున్న అనంతపురం జిల్లాలో కీలకమైన నియోజకవర్గం అనంతపురం అర్బన్. ఇక్కడ టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. గత 2014 ఎన్నికల్లో ప్రభాకరచౌదరి టీడీపీ టికెట్పై విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ విజయం దక్కించుకుంది. 2012లో జరిగిన ఉప ఎన్నికలో కూడా వైసీపీ పాగా వేసినా.. 2014లో మాత్రం ఇక్కడ టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. అంటే.. జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నా..ఈ …
Read More »రఘురామ కేసులో ఉత్కంఠ రేపుతున్న ‘6 గంటలు’
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఆంధ్రప్రదేశ్ ఏపీ సీఐడీ పోలీసులు రెండు రోజుల కిందట హైదరాబాద్లో అరెస్టు చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచే ఎంపీగా గెలిచి, ఏడాది తిరక్కుండానే రెబల్గా మారిన రఘురామ.. గత ఏడాది కాలంలో ఎన్నోసార్లు ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు అధికార పార్టీ నేతలను …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates